Matthew - మత్తయి సువార్త 26 | View All

1. యేసు ఈ మాటలన్నియు చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి

2. రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువవేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను.
నిర్గమకాండము 12:1-27

“పస్కా”– లేవీయకాండము 23:5; నిర్గమ 12వ అధ్యాయం. పాపుల కోసం తన కుమారుడు మరణించేందుకు దేవుడు పస్కా పండుగ సమయాన్ని ఎన్నుకున్నాడు. ఆయన మరణంలోని అర్థాన్ని సూచించేందుకు ఈ సమయం ఎంతైనా తగినది. ఈజిప్ట్‌లో ఇస్రాయేల్‌వారిని సంరక్షించడానికి బలిగా అర్పించబడినది పస్కా గొర్రెపిల్ల. యేసు లోక పాపాలను తీసివేసి, పాపానికి వ్యతిరేకంగా దేవుని తీర్పునుంచి వారికి తప్పించుకునే మార్గం కల్పించిన దేవుని గొర్రెపిల్ల (యోహాను 1:29; 1 కోరింథీయులకు 5:7).

3. ఆ సమయమున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోనికి కూడివచ్చి

వారు దేవుణ్ణి ఎరగనందువల్లా, సత్యాన్ని ద్వేషించినందువల్లా, యేసుప్రభువు వారి పాపభరిత స్థితిని బట్టబయలు చేసినందువల్లా, మొత్తంమీద దుర్మార్గులు ఎప్పుడూ న్యాయవంతులకు విరోధంగానే ఉంటారు కాబట్టీ వారు ఇలా కుట్ర పన్నారు (కీర్తనల గ్రంథము 37:12; యోహాను 3:19-20; యోహాను 7:7; యోహాను 8:40; యోహాను 15:18-21; 1 యోహాను 3:12).

4. యేసును మాయోపాయముచేత పట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచన చేసిరి.

5. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండు నట్లుపండుగలో వద్దని చెప్పుకొనిరి.

పస్కా పండుగ సమయంలో ఇస్రాయేల్ దేశమంతటినుంచీ ప్రజలు పెద్ద పెద్ద గుంపులుగా జెరుసలం చేరుకునేవారు. వారిలో చాలమందికి యేసంటే అభిమానమని శత్రువులకు తెలుసు. ఆ సమయంలో యేసును మట్టుపెడితే ప్రజలు కొందరు తిరగబడగలరని వారు భయపడ్డారు.

6. యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట నున్నప్పుడు,

గతంలో ఎప్పుడో బహుశా ఈ సీమోనును యేసు బాగుచేసి ఉంటాడు. పరలోకంనుంచి వచ్చిన యేసురాజు (మత్తయి 2:2; మత్తయి 27:11) జెరుసలంకు, అంటే మహారాజ నగరానికి (మత్తయి 5:35), వచ్చినప్పుడు ఎక్కడ బస చేశాడో చూడండి. ఏ ధనికుడి శ్రేష్ఠమైన నివాసంలోనో, భవనంలోనో, సౌఖ్యవంతమైన హోటల్లోనో కాక ఒకప్పుడు వెలివేయబడిన దరిద్రుని ఇంటిని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన్ను అనుసరించేవారమని చెప్పుకునే వారందరికీ ఇలాంటి మనసు కలిగితే ఎంత బాగుండేది (ఫిలిప్పీయులకు 2:5-7).

7. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను.

యోహాను 12:2 చూడండి.

8. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టమెందుకు?

ఈ మాటలకు మూలం ద్రోహి అయిన యూదా ఇస్కరియోతు అనుకోవచ్చు (యోహాను 12:4-6). ఇతర శిష్యులు కూడా ఈ మాటలతో ఏకీభవించినట్టున్నారు. ఆ అత్తరు చాలా ఖరీదైనది. మార్కు 14:5 లో (గ్రీకులో) 300 దేనారాల ఖరీదు చేసేది అని రాసివుంది. ఆ కాలంలో ఒక మనిషికి ఒక రోజు కూలి ఒక దేనారం (మత్తయి 20:2).

9. దీనిని గొప్ప వెలకు అమ్మి బీదల కియ్యవచ్చునే అనిరి.

10. యేసు ఆ సంగతి తెలిసి కొనిఈ స్త్రీ నా విషయమై యొక మంచి కార్యము చేసెను; ఈమెను మీరేల తొందరపెట్టుచున్నారు?

ఈమె చేసినది “మంచి పని” ఎందుకంటే అది ఆమె ప్రేమను వెల్లడి చేస్తున్నది. దేవునిపట్ల తీవ్రమైన ప్రేమ గలవారు తమకున్నదంతా ఆయన పాదాలమీద పోసేందుకు సిద్ధంగా ఉంటారు. దానివల్ల తమకు కలిగే నష్టాన్ని గానీ ఇతరులేమంటారో అని గానీ వారు పట్టించుకోరు.

11. బీదలెల్లప్పుడు మీతోకూడ ఉన్నారు. గాని నేనెల్లప్పుడు మీతో కూడ ఉండను.
ద్వితీయోపదేశకాండము 15:11

శిష్యులు పేదలపట్ల తమ ప్రేమను, శ్రద్ధను చూపించాలంటే ఆ అవకాశం వారికెప్పుడూ ఉంటుంది. అయితే యేసుప్రభువు కొద్దికాలంలో మరణించనున్నాడు. ఆ స్త్రీకి ఈ సంగతి తెలిసినట్టుంది. ఆ రోజుల్లో మృత దేహాన్ని సమాధి చేసేముందు అత్తరుతో సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచడం వాడుక (లూకా 23:55; యోహాను 19:39-40).

12. ఈమె యీ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను.

13. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా నని వారితో అనెను.

నీచమైన ఈ ద్రోహం వెనుక ఉన్న ఉద్దేశం ఒక్కటే బైబిల్లో రాయబడింది. యూదాకు డబ్బు కావాలి. యోహాను 12:6 లో డబ్బుకోసం అతడు చేయబూనుకున్న ఒక పని కనిపిస్తున్నది. యేసుప్రభువు దాని గురించి చేసిన ఉపదేశాలు తేటతెల్లంగా ఉన్నా (మత్తయి 6:19-21, మత్తయి 6:24; లూకా 6:20; లూకా 12:15-21; లూకా 14:33) అతనిలోని ధనాశను అతడు జయించలేదు, బహుశా ఎదిరించలేదు కూడా. అది అతని గుణాన్ని పూర్తిగా పాడు చేసేసింది. అతణ్ణి పిశాచంగా మార్చివేయడానికి దోహదం చేసింది (యోహాను 6:70-71). చివరికి దేవుని కుమారుణ్ణి అమ్మడానికి అతడు తెగించేలా చేసింది. కాబట్టి 1 తిమోతికి 6:8-10 చూడండి. ముప్ఫయి వెండి నాణేలు సాధారణంగా ఒక బానిసకోసం చెల్లించే ధర. నిర్గమకాండము 21:32; జెకర్యా 11:12 చూడండి.

14. అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులయొద్దకు వెళ్లి

15. నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి.
నిర్గమకాండము 21:32, జెకర్యా 11:12

16. వాడప్పటినుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను.

ఉన్నట్టుండి కలిగే దుష్‌ప్రేరణకు యూదా లొంగిపోయాడనుకోకూడదు. యేసుకు ద్రోహం చేయడం గురించి అతడు బుద్ధిపూర్వకంగా జాగ్రత్తగా పన్నాగం పన్నాడు.

17. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు, శిష్యులు యేసునొద్దకు వచ్చిపస్కాను భుజించుటకు మేము నీకొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడి గిరి.
నిర్గమకాండము 12:14-20

లేవీయకాండము 23:5-6 నోట్ చూడండి. ఏడు రోజులు ఆచరించే పొంగని రొట్టెల పండుగలో పస్కా మొదటి రోజు.

18. అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యునియొద్దకు వెళ్లి - నా కాలము సమీపమైయున్నది; నా శిష్యులతో కూడ నీ యింట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను.

మొదటినుంచీ యేసుకు తాను ఎప్పుడు, ఎలా, ఎందుకు చనిపోవాలో తెలుసు (మత్తయి 16:21; మత్తయి 20:28; యోహాను 7:30; యోహాను 10:17-18; యోహాను 12:23).

19. యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి.

20. సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుం డెను.

21. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.

మొదటి నుంచీ యేసుకు ఇది కూడా తెలుసు.

22. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడునుప్రభువా, నేనా? అని ఆయన నడుగగా

ప్రతి ఒక్కరికీ తమ తమ పాపభరిత స్థితి, బలహీనత తెలుసు గానీ (యూదా తప్ప) ఎవరూ కూడా ఈ అతి నీచమైన పాపం చేయగలనని భావించలేదేమో. వ 33-35 పోల్చి చూడండి.

23. ఆయననాతోకూడ పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు.
కీర్తనల గ్రంథము 41:9

24. మనుష్యకుమా రునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్ప గింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను.
కీర్తనల గ్రంథము 22:7-8, కీర్తనల గ్రంథము 22:16-18, యెషయా 53:9

యేసును శత్రువులకు పట్టివ్వడంలో యూదా తెలియకుండానే లేఖనాలను నెరవేరుస్తున్నాడు (యోహాను 13:18; కీర్తనల గ్రంథము 41:9). అయితే యూదా స్వతంత్రుడు, తన చర్యలకు తానే బాధ్యుడు. దాన్ని అతడు చేస్తాడని దేవునికి ముందుగానే తెలియడం అన్నది అతడు ఆ చర్య గానీ మరే చర్య గానీ జరిగించేందుకు అతని స్వేచ్ఛపై ఎలాంటి ప్రభావమూ చూపలేదు. క్రీస్తుకు ద్రోహం చేస్తూ, ఆయన్ను నిరాకరిస్తూ, త్రోసిపుచ్చుతూ ఉన్నవారందరి విషయంలో కూడా వారు పుట్టకపోయి ఉంటే వారికి మంచిది అన్న సంగతి వర్తిస్తుంది.

25. ఆయనను అప్పగించిన యూదాబోధకుడా, నేనా? అని అడుగగా ఆయననీవన్నట్టే అనెను.

ఇతర శిష్యుల్లాగా యూదాకు దుఃఖం కలిగిందని రాసిలేదు (వ 22). తాను కూడా వారిలాగా కనిపించాలన్న ప్రయత్నంలో వారు అడిగిన ప్రశ్నే తానూ అడిగాడు గానీ దానికి జవాబు అతనికి బాగా తెలుసు.

26. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను.

“దీవించి”– మత్తయి 14:19 చూడండి. ఈ సందర్భంలో దీవించి అంటే కృతజ్ఞత చెల్లించి అని అర్థం. “నా శరీరం”– ఆ రొట్టె తన శరీరం అయిందని యేసు చెప్పడం లేదు. ఆయన వారి కళ్ళెదుటే శరీరంతో ఉన్నాడు గనుక ఇది అసాధ్యం. ఆ రొట్టె తన దేహానికి సూచన, చిహ్నం అని ఆయన ఉద్దేశం. యోహాను 6:53-58 నోట్స్ చూడండి. ఆయన శరీరం త్వరలో సిలువ మరణానికి గురి కాబోతుంది. ఇలా జరగడం వల్ల కలిగే ఫలితం ఏమంటే ఆయన్ను ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించేవారందరికీ శాశ్వతజీవం, ఆథ్యాత్మిక ఆహారం. ఆయన మాంసాన్ని అక్షరాల తినడం ఎవరికైనా ఆధ్యాత్మిక జీవాన్ని, ఆహారాన్ని ఇవ్వడం అసాధ్యం. బైబిల్లో పోలికలూ, చిహ్నాలూ, అలంకారిక భాషా పుష్కలంగా ఉంది. దీన్ని మనం గుర్తించకపోతే చాలా పొరపాట్లలో పడుతాం. మత్తయి 16:6-12; యోహాను 6:35, యోహాను 6:53-58; మొ।।.

27. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరు త్రాగుడి.

గిన్నెలోని ద్రాక్షరసం త్వరలో సిలువపై చిందబోయే యేసు రక్తాన్ని సూచిస్తున్నది. ఇలా రక్తం కార్చడం ఆయనకు వేదనలు, యాతనలతో కూడిన సంగతి. అయినా మనుషులను విమోచించి రక్షించడానికీ, దేవునికి మహిమ కలిగించడానికీ తండ్రి అయిన దేవుడు నియమించిన విధానం ఇదే అని యేసుకు తెలుసు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాడు. శిష్యులు ఆ ద్రాక్షరసాన్ని తాగినప్పుడు అది అక్షరాలా ఆయన రక్తంగా మారిపోలేదు. ఆయన రక్తం ఇంకా ఆయన రక్తనాళాల్లో ప్రవహిస్తూనే ఉంది. దాన్ని తాగడం ఎవరికీ ఏ మేలూ చెయ్యదు కూడా. పాపంనుంచి విముక్తికోసం మనుషులకు భౌతికమైనదేదీ అవసరం లేదు. అంతరంగంలో ఆథ్యాత్మిక జీవమే కావాలి (యోహాను 1:12-13; యోహాను 3:3-8). యేసు ప్రభువుపై నమ్మకం ఉంచి ఆయన రక్తం మన పాపాలను తీసివేసేందుకు కార్చబడిందని నమ్మడం ద్వారా ఇది లభిస్తుంది (యోహాను 3:16, యోహాను 3:36; యోహాను 6:47, యోహాను 6:63; రోమీయులకు 3:22-25; ఎఫెసీయులకు 1:7; 1 పేతురు 1:18-19; 1 యోహాను 1:7). తన రక్తంద్వారా యేసుప్రభువు క్రొత్త ఒడంబడికను స్థాపించాడు. సీనాయి కొండపై ఇస్రాయేల్‌వారితో దేవుడు చేసిన పాత ఒడంబడికతో పోలిస్తే ఇది కొత్తది. నిర్గమకాండము 19:5-6 నోట్స్ చూడండి. క్రొత్త ఒడంబడిక గురించి హీబ్రూ 8వ అధ్యాయం, యిర్మియా 31:31-34 చూడండి. పాత ఒడంబడిక క్రియలకు సంబంధించినది. క్రొత్త ఒడంబడిక కృపకు సంబంధించినది. యేసుప్రభువుమీద నమ్మకం ఉంచినవారందరికీ దేవుడు క్షమాపణ కలుగజేస్తానని ఇందులో వాగ్దానం చేస్తున్నాడు (లూకా 24:46-47; అపో. కార్యములు 13:38-39). “అనేకులకోసం” అంటే యేసును ప్రభువుగా రక్షకుడుగా ఎంతమంది స్వీకరిస్తారో వారందరికోసం. పాప క్షమాపణ గురించి మత్తయి 6:12; మత్తయి 9:5-7; మత్తయి 12:31; మత్తయి 18:23-35; ఎఫెసీయులకు 1:7 చూడండి.

28. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.
నిర్గమకాండము 24:8, యిర్మియా 31:31, జెకర్యా 9:11

29. నా తండ్రి రాజ్యములో మీతోకూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్త దిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.

“రాజ్యం”– మత్తయి 4:17.

30. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి.
కీర్తనల గ్రంథము 113:8

ఇస్రాయేల్‌లో పస్కా సమయంలో 118వ కీర్తన పాడడం వాడుక.

31. అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగా గొఱ్ఱెల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱెలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది గదా.
జెకర్యా 13:7

వ 56; జెకర్యా 13:7.

32. నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయకు వెళ్లెద ననెను.

మత్తయి 16:21; యోహాను 10:17-18. చనిపోకముందు యేసు తిరిగి సజీవంగా లేస్తానని చెప్పాడు. మరణం తరువాత అలానే సజీవుడయ్యాడు. ఆయన దేవుని కుమారుడనడానికి అవసరమైన అత్యంత అమోఘమైన రుజువు ఇదే – రోమీయులకు 1:4.

33. అందుకు పేతురునీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా

ఇవి తనపై తనకు అతి నమ్మకం ఉన్న వ్యక్తి చెప్పుకునే గొప్పలు. లేక ఆయనను ఎరగనని తనచేత అనిపించే విషమ పరీక్షను జయించేటంతగా తాను యేసును ప్రేమిస్తున్నానని పేతురు అనుకుని ఉండవచ్చు. లేక తనలోని పాపం, బలహీనతల విషయం అతనికింకా పూర్తిగా అర్థం కాలేదేమో. లేక వీటన్నిటి కలయిక అతణ్ణి ఇలా మాట్లాడేలా చేసి ఉండవచ్చు. 1 కోరింథీయులకు 10:12 పోల్చి చూడండి. మన గురించి మనకు తెలియకపోవడం, మన స్వభావంపై, బలంపై నమ్మకం పెట్టుకోవడం పతనానికి దారితీయవచ్చు.

34. యేసు అతని చూచిఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

35. పేతురాయనను చూచినేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగ నని చెప్పననెను; అదేప్రకారము శిష్యులందరు అనిరి.

ఇలా తనను తాను నమ్ముకోవడంలో పొరపాటు చేసినది పేతురొక్కడే కాదు. శిష్యులంతా కూడా. కేవలం దేవుని శక్తిపైనే ఆధారపడి తమ స్వంత బలాన్ని వదిలెయ్యాలంటే మరింత అనుభవం వారికి అవసరం. యేసు మాటలపై పేతురుకు నమ్మకం లేకపోవడం, తానేం మాట్లాడుతున్నదీ యేసుకు తెలియదని పేతురు సూటిగా చెప్పడం గమనించండి. క్రీస్తు శిష్యులు అప్పుడప్పుడూ కనపరచిన అపనమ్మకమనే మూర్ఖత్వానికీ ఇది మరో మచ్చుతునక. యేసు మాటల్లో ఏ ఒక్కటి కూడా నెరవేరకుండా పోదని మనం ఎప్పుడు నేర్చుకుంటాం?

36. అంతట యేసు వారితోకూడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చినేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి

జెరుసలం ప్రాకారం బయట కొద్ది దూరంలో ఆలీవ్‌కొండ దిగువన గెత్‌సేమనే తోట ఉంది.

37. పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను.

జెబెదయి ఇద్దరు కొడుకులు యాకోబు, యోహాను (మత్తయి 4:21).

38. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది;మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి
కీర్తనల గ్రంథము 42:5, కీర్తనల గ్రంథము 42:11, కీర్తనల గ్రంథము 43:5, యోనా 4:9

ఆ భారం, ఆ శోకం ఎంత దుర్భరమయ్యాయంటే అవి ఆయన ప్రాణాన్ని పిండివేస్తున్నాయి. ఇంత దుఃఖానికి కారణం ఏమిటి? ఆ పరిపూర్ణ పవిత్రుడు సిలువపై లోక పాపాలన్నీ భరించబోతున్నాడు. ఆ పాపానికి శిక్షను అనుభవించి, తండ్రియైన దేవునికి దూరం కాబోతున్నాడు (మత్తయి 27:46; యోహాను 1:29; 2 కోరింథీయులకు 5:21). తన శిష్యులు కూడా తనతోబాటు మేల్కొని ఉండాలని కోరాడు. ఈ బాధ ఘడియలో ఆయన మానవ స్వభావం తోడు కోరిందా? కావచ్చు. నిస్సందేహంగా ఈ సంఘటనకు సాక్షులు ఉండాలని ఆయన కోరాడు.

39. కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.

ఇలా సాగిలపడడం గొప్ప మనోవేదనకూ, గండం గురించిన అనుభూతి, కంగారుకూ, సహాయం కోరి మనసుపెట్టే పొలి కేకకూ గుర్తు. హెబ్రీయులకు 5:7 పోల్చి చూడండి. ఆయన ముందున్న భయానకమైన క్రూర అనుభవాలకు సూచన ఈ గిన్నె. మానవ పాపానికి వ్యతిరేకంగా చెలరేగే దేవుని ఆగ్రహమనే గిన్నెలోది ఆయన తాగబోతున్నాడు. దేవుడాయన్ను పాపంగా చేయబోతున్నాడు (వ 38; 2 కోరింథీయులకు 5:21). ఆయన వచ్చినది ఇందుకే (యోహాను 12:27; యోహాను 18:11). అయితే ఇప్పుడు ఆ క్షణం దగ్గరైంది కాబట్టి అది ఇంత వికృతంగా బీకరంగా అనిపించి ఆయన పవిత్ర స్వభావం కంపరంతో దానినుంచి వైదొలగాలని చూస్తున్నది. మనుషులపట్ల దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకునేందుకు ఒకవేళ వేరొక మార్గమేదైనా చూడగలిగితే, తాను ఆ గిన్నెలోది తాగవలసిన అవసరం లేకపోతే అలా చెయ్యమని ప్రార్థించాడు. అయితే అలాంటిది సాధ్యం కాదు కాబట్టి తన ఆత్మ అంత వేదనలో ఉండి కూడా (లూకా 22:44) యేసు తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని అంగీకరించాడు. మనుషులంతా నేర్చుకోవలసిన ప్రార్థన యేసు ఇక్కడ చెప్తున్నాడు. దేవుని మార్గమే, సంకల్పమే ఎప్పుడూ అతి శ్రేష్ఠమైనది. దాన్ని అంగీకరించడంవల్ల కొద్ది కాలం బాధ, నష్టం వాటిల్లినప్పటికీ, ఎక్కువ విధేయతతో అంగీకరించినవారే ఎక్కువ ధన్యులు.

40. ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచిఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా?

వ 38. యేసుప్రభువు తన బ్రతుకులో అంతిమ పోరాటంలో ఉన్నాడు. ఎప్పటిలాగానే ఆయనకు మనుషులనుంచి ఎలాంటి సహాయమూ దొరకలేదు. కీర్తనల గ్రంథము 22:11 పోల్చి చూడండి.

41. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీన మని పేతురుతో చెప్పి

శిష్యులు గొప్ప పరీక్ష సమయాన్ని ఎదుర్కో బోతున్నారు. దానికి సిద్ధపడేందుకు సరైన పద్ధతి నిద్రపోవడం కాదు. విషమ పరీక్ష, దుష్‌ప్రేరేపణ సమయంలో శరీరస్వభావం ఎప్పుడూ మనకు అండగా నిలవదు. మన కౌగిట్లోనే ఉన్న ద్రోహి వంటిది శరీర స్వభావం. విషమ పరీక్ష, దుష్‌ప్రేరేపణలపై మన ఆత్మలు విజయం సాధించాలంటే మనకు రెండు విషయాలు ఎంతగానో అవసరం. అవి మెళుకువగా కనిపెట్టడం, ప్రార్థన (ఎఫెసీయులకు 6:10-11, ఎఫెసీయులకు 6:18).

42. మరల రెండవమారు వెళ్లినా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగి పోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థించి

వ 39. ఒక విషయం గురించి యేసు మూడు సార్లు ప్రార్థించి చాలించాడు. 2 కోరింథీయులకు 12:7-8 పోల్చి చూడండి. దేవుడు మూడు సార్లు కాదన్నదాన్ని గురించి అదేపనిగా అడుగుతూ ఉండడం వివేకం కాదు.

43. తిరిగి వచ్చి, వారు మరల నిద్రించుట చూచెను; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను.

44. ఆయన వారిని మరల విడిచి వెళ్లి, ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థనచేసెను.

45. అప్పుడాయన తన శిష్యులయొద్దకు వచ్చిఇక నిద్రపోయి అలసట తీర్చు కొనుడి; ఇదిగో ఆ గడియవచ్చి యున్నది; మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు;

తనకు రానున్న ఎలాంటి నొప్పినైనా, వేదననైనా ఎదుర్కొనేందుకు యేసు పూర్తిగా సంసిద్ధుడయ్యాడు. పాపుల స్థానంలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని సంకల్పాన్ని ఎరిగి దాన్ని అంగీకరించడమే ఈ సిద్ధబాటు. అందువల్ల ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నం గానీ, హింస, బాధ, మరణం రాకూడదన్న ఆయన మానవ స్వభావం యొక్క సహజమైన కోరికను సంతృప్తి పరిచే ప్రయత్నం గానీ ఆయన ఏమీ చెయ్యలేదు. దేవుని చిత్తాన్ని ఎరిగి దాన్ని తలవాల్చడమే ఎవరైనా దేన్నైనా ఎదుర్కొనేందుకు గొప్ప సిద్ధబాటు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడమెలా? ఆయన వాక్కును చదవడం ద్వారానూ, యేసుప్రభువు చేసినట్టుగా మనల్ని మనం ఆయనకు పూర్తిగా సమర్పించుకోవడం ద్వారానూ (రోమీయులకు 12:1-2; కొలొస్సయులకు 3:16).

46. లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి యున్నాడని వారితో చెప్పెను.

47. ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితోకూడ బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకులయొద్దనుండియు ప్రజల పెద్దలయొద్ద నుండియు వచ్చెను.

యూదుల నాయకులు ప్రజలకు భయపడ్డారు. యేసు మాటలు వినేందుకు జనం ఆత్రుతగా ఆయనచుట్టూ మూగివుండే పగటి సమయంలో ఆయన్ను బంధించదలచుకో లేదు. అందువల్ల వారు యూదాకు లంచమిచ్చి రాత్రిపూట రహస్యంగా ఆయన్ను పట్టుకునేందుకు కూలికి మనుషుల్ని నియమించారు. ఆ మనుషులకు యేసు ఎక్కడ ఉంటాడో తెలిసే అవకాశం లేదు. చీకట్లో ఆయనెవరో గుర్తుపట్టడం కూడా వారికి చేత కాదు. అందువల్ల యేసు అలవాట్లు తెలిసిన యూదా వాళ్ళను అక్కడికి తీసుకువచ్చి వారికో గుర్తు చెప్పాడు. మరి ఇక ఏ గుర్తూ ఇంతకన్నా కపటమైనది ఉండదు. యూదాలోని భ్రష్టత్వం, మోస బుద్ధి, నీతికి విరుద్ధమైన మనస్తత్వం దీనికన్నా స్పష్టంగా మరి ఏదీ తేటతెల్లం చేయడం అసాధ్యం. యూదా యేసును “బోధకుడా!” అంటున్నాడు గానీ ఇలాంటి ప్రవర్తన అతడు యేసుదగ్గర నేర్చుకోలేదు.

48. ఆయనను అప్పగించువాడు నేనెవ రిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి

49. వెంటనే యేసు నొద్దకు వచ్చిబోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.

50. యేసు చెలికాడా, నీవు చేయవచ్చి నది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి.

“మిత్రుడా”అనే పిలుపును గమనించండి (కీర్తనల గ్రంథము 41:9). కొంతమంది యేసును ద్వేషించారు గాని ఆయన ఎవర్నీ ద్వేషించలేదు.

51. ఇదిగో యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను.

యోహాను 18:10.

52. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.
ఆదికాండము 9:6

మత్తయి 5:9-10, మత్తయి 5:39.

53. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొను చున్నావా?

రోమ్ సైన్యంలో సేనావాహిని అంటే 3 నుంచి 6 వేల వరకు సైనికులుండే ఒక దళం. యేసు గనుక ఆ విధంగా ప్రార్థించివుంటే పరలోకం సైన్యాలన్నీ ఆయనకు అండ నిలిచేవి ఆయనకు దేవదూతల సహాయం అవసరమని కాదు (యోహాను 10:17-18).

54. నేను వేడుకొనిన యెడల ఈలాగు జరుగ వలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను.

“లేఖనం”– అంటే పాత ఒడంబడిక గ్రంథం (యోహాను 2:22; యోహాను 10:35; 2 తిమోతికి 3:16). ఆయన బాధలు, మరణం విషయం వివరించిన లేఖనాల గురించి మాట్లాడు తున్నాడు. ఉదాహరణకు యెషయా 53వ అధ్యాయం చూడండి.

55. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచిబందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు.

56. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి.
జెకర్యా 13:7

మత్తయి 5:17; లూకా 24:25-26, లూకా 24:44-46. “శిష్యులంతా... పారిపోయారు”– వ 31,35.

57. యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి.

“ప్రముఖయాజి”– నిర్గమకాండము 28:1. ఇస్రాయేల్‌ను రోమ్‌వారు పరిపాలిస్తున్నారు కాబట్టి యూదులకు స్వంతగా రాజంటూ లేడు. ప్రజల నాయకుడు, న్యాయాధిపతి ప్రముఖయాజే.

58. పేతురు ప్రధానయాజకుని యింటి ముంగిటివరకు, ఆయనను దూరమునుండి వెంబడించి లోపలికి పోయిదీని అంత మేమవునో చూడవలెనని బంట్రౌతులతోకూడ కూర్చుండెను.

అతణ్ణి అలా దూరం ఉంచింది బహుశా అతని భయమే.

59. ప్రధానయాజకులును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని

“యూద సమాలోచన సభ”– మత్తయి 5:22. ఇస్రాయేల్ నాయకుల భ్రష్టత్వాన్ని ఇది తెలియజేస్తున్నది. వారు తమ సొంత ఉద్దేశాలను నెరవేర్చుకోవాలని ఉన్నారు. సత్యం, న్యాయాల గురించి ఎంతమాత్రం లెక్క చెయ్యలేదు. తాము ఏ ధర్మశాస్త్రాన్ని అభిమానిస్తూ పాటిస్తూ ఉన్నామని వారు చెప్పుకున్నారో ఆ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞను చూడండి – నిర్గమకాండము 20:16; నిర్గమకాండము 23:1, నిర్గమకాండము 23:7. 1 రాజులు 21:1-16 పోల్చి చూడండి. ఇస్రాయేల్‌ప్రజల నాయకులు ఇస్రాయేల్‌వారి గొప్ప శత్రువుల్లో ఒకడు చేసిన పాపాన్నే మళ్ళీ చేస్తున్నారు.

60. అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు.

ఇది యేసు జీవితం ఎంత నిష్కళంకమైనదో పవిత్రమైనదో తెలియజేస్తున్నది. ఆయన్ను మనసారా ద్వేషించిన శత్రువులే ఆయనపై నేరం మోపడానికి కారణమేమీ కనిపెట్టలేకపోయారు. మత్తయి 27:19; లూకా 23:4; యోహాను 19:6; 2 కోరింథీయులకు 5:21; హెబ్రీయులకు 4:15; హెబ్రీయులకు 7:26; 1 పేతురు 2:22 కూడా చూడండి.

61. తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చివీడు దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో దానిని కట్ట గలనని చెప్పెననిరి.

62. ప్రధానయాజకుడు లేచినీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను.

63. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచినీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు– నీవన్నట్టే.
యెషయా 53:7

యెషయా 53:7; 1 పేతురు 2:23. జరుగుతున్న దేమిటో అందరికీ తెలుసు. ఏదైనా మాట్లాడవలసిన అవసరం యేసుకు లేదు. ఎవరైనా మనపై తప్పుడు నేరాలు మోపినప్పుడు ఎలా ప్రవర్తించాలో దీనిద్వారా ఆయన మనకు తెలియజేస్తున్నాడు (మత్తయి 5:11; 1 పేతురు 2:21). ప్రముఖ యాజికి సత్యం తెలుసుకుందామన్న ఉద్దేశం లేదు. యేసు మానవమాత్రుడే అనుకున్నాడు. యేసు గనుక తాను దేవుని కుమారుణ్ణి అంటే ఆయనపై నేరం మోపడానికి ఆధారం దొరుకుతుందను కున్నాడు. “దేవుని కుమారుడా”– మత్తయి 3:16-17; మత్తయి 11:27; యోహాను 3:16; యోహాను 5:18-23.

64. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వ శక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘా రూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా
కీర్తనల గ్రంథము 110:1-2, దానియేలు 7:13

తన స్వభావం, దేవుడు తనకు అప్పగించిన పదవి గురించిన ప్రశ్నలకు యేసు ఆ కాలం నాటి భాషారీతిలో అవునని జవాబిచ్చాడు. తరువాత తనకు తాను పెట్టుకున్న పేరును (“మానవ పుత్రుడు”– మత్తయి 8:20) పాత ఒడంబడిలో అభిషిక్తుణ్ణి గురించిన వాక్యాలతో ముడిపెట్టాడు (దానియేలు 7:13-14. అక్కడ నోట్స్ చూడండి).

65. ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని - వీడు దేవ దూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు;
లేవీయకాండము 24:16, సంఖ్యాకాండము 14:6, 2 సమూయేలు 13:19, ఎజ్రా 9:3, యోబు 1:20, యోబు 2:12, యిర్మియా 36:24

యేసు మాటల్లోని అర్థమేమిటో ప్రముఖయాజికి తు.చ. తప్పకుండా తెలిసిపోయింది. తన వస్త్రాన్ని చింపుకోవడం అతనికి కలిగిన కంగారుకు (లేదా కలిగినట్టు నటించిన దానికి) గుర్తు. యేసుప్రభువు జీవితం, ఉపదేశాలు, అద్భుత కార్యాల మూలమైన రుజువులు అన్నిటినీ పెడ చెవినబెట్టి యేసు మానవ మాత్రుడు కాదని నమ్మేందుకు నిరాకరించాడు. అందువల్ల యేసు తాను దేవుని కుమారుణ్ణి అనడం ప్రముఖయాజి దృష్టిలో దేవదూషణ నేరం క్రిందికి వస్తుంది. యోహాను 5:17-18; యోహాను 8:58; యోహాను 10:31-33 కూడా చూడండి.

66. మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారువీడు మరణమునకు పాత్రుడనిరి.
లేవీయకాండము 24:16

మోషే ధర్మశాస్త్రం ప్రకారం మరణశిక్ష విధించవలసిన నేరాలు చాలా ఉన్నాయి. నిర్గమకాండము 21:36 నోట్ చూడండి. యేసు అవేమీ చెయ్యలేదు. లేవీయకాండము 24:16 ను వారు అర్థం చెప్పుకున్నదానిపై ఆధారపడి తమ నిర్ణయానికి వచ్చారు.

67. అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి;
యెషయా 50:6, యెషయా 53:5

పతనమైన మానవ స్వభావం పవిత్ర దేవునిపై కురిపించిన ద్వేషాగ్ని చూడండి (యోహాను 3:19; యోహాను 7:7; యోహాను 15:18, యోహాను 15:24; రోమీయులకు 1:30; రోమీయులకు 8:7). ఇది సత్యంపై అసత్యానికి ఉండే ద్వేషం, మంచితనంపై చెడుతనానికి ఉండే ద్వేషం, న్యాయంపై అన్యాయానికీ, పవిత్రతపై పాపానికీ ఉండే ద్వేషం. వారికన్నా స్వభావరీత్యా మనం మంచివారమని అనుకోకూడదు (రోమీయులకు 3:9, రోమీయులకు 3:19; ఎఫెసీయులకు 2:3). వారు ఆయనమీద ఉమ్మివేయడం యెషయా 50:6 ను నెరవేర్చింది.

68. కొందరు ఆయనను అర చేతులతో కొట్టిక్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపు మనిరి.

వారు ఆయన కళ్ళకు గంతలు కట్టాక ఇలా అన్నారు (మార్కు 14:65). ప్రజలు ఆయన్ను ప్రవక్తగా భావించారు (మత్తయి 21:11, మత్తయి 21:46). ఈ నాయకులు దాన్ని అవహేళన చేస్తున్నారు.

69. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చినీవును గలిలయుడగు యేసుతో కూడ ఉంటివి గదా అనెను.

వ 34లో యేసు చెప్పిన మాటలు ఇక్కడ నెరవేరుతున్నాయి. బైబిలు మనుషులను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది. దేవుని సేవకుల పొరపాటులను, పాపాలను కప్పిపుచ్చదు. ఆదికాండము 9:21; ఆదికాండము 27:18-26; నిర్గమకాండము 32:2-4; సంఖ్యాకాండము 20:12; 2 సమూయేలు 11:1.

70. అందుకతడు నేనుండలేదు; నీవు చెప్పుసంగతి నాకు తెలియదని అందరి యెదుట అనెను.

71. అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి యొక చిన్నది అతనిని చూచివీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా

72. అతడు ఒట్టుపెట్టుకొని నేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను.

73. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నదని అతనితో చెప్పిరి.

పేతురు గలలీ ప్రాంతంవాడు. అతని మాట జెరుసలం నివాసుల మాట తీరుకు భిన్నంగా ఉండేది.

74. అందుకు అతడు ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను

75. కనుకకోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప పడి యేడ్చెను.

తన ప్రవర్తన పేతురుకు గుండెలో బాకుతో పొడిచినట్టయింది. అది తనకు శోకాన్ని, తాను ఓడిపోయానన్న బాధను కలిగించింది. ఇది పశ్చాత్తాపానికి దారి తీసింది. మత్తయి 27:3-5; 2 కోరింథీయులకు 7:10 పోల్చి చూడండి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 26 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible


పాలకులు క్రీస్తుకు వ్యతిరేకంగా కుట్ర చేస్తారు. (1-5) 
మన ప్రభువు తన బాధలను దూరమైనట్లుగా తరచుగా మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు వాటిని ఆసన్నమైనట్లుగా చర్చిస్తున్నాడు. అదే సమయంలో, యూదు కౌన్సిల్ అతన్ని రహస్యంగా ఎలా ఉరితీయాలనే దానిపై చర్చించింది. అయితే, వారి ప్రణాళికలను అడ్డుకోవడానికి దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆ ఖచ్చితమైన క్షణంలో, యేసు, నిజమైన పాస్చల్ గొఱ్ఱె, మన కోసం బలి ఇవ్వబడతాడు మరియు అతని మరణం మరియు పునరుత్థానం ప్రజలకు తెలియజేయబడ్డాయి.

బేతనియలో క్రీస్తు అభిషేకించబడ్డాడు. (6-13) 
లేపనంతో క్రీస్తు శిరస్సును అభిషేకించడం అత్యంత గౌరవానికి ప్రతీక. యేసు పట్ల నిజమైన ప్రేమ హృదయంలో ఉన్నప్పుడు, ఏ సంజ్ఞ కూడా అతనికి విలాసవంతమైనదిగా పరిగణించబడదు. క్రీస్తు అనుచరులు మరియు వారి ప్రయత్నాల పట్ల ఎంత ఎక్కువ విమర్శలు వస్తే, అతని ఆమోదం అంత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్యలో మేరీ యొక్క అసాధారణమైన విశ్వాసం మరియు ప్రేమ ప్రదర్శన చాలా ముఖ్యమైనది, ఇది భవిష్యత్ యుగాలలో మరియు సువార్త ప్రకటించబడే ప్రతి మూలలో శాశ్వత స్మారక చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ జోస్యం ఫలించింది.

జుడాస్ క్రీస్తుకు ద్రోహం చేయడానికి బేరసారాలు చేస్తాడు. (14-16) 
కేవలం పన్నెండు మంది మాత్రమే అపొస్తలులుగా ఎంపిక చేయబడ్డారు మరియు వారిలో ఒకరు దెయ్యాన్ని పోలి ఉన్నారు. స్వర్గానికి ఇటువైపున ఉన్న ఏ సంఘంలోనూ పరిపూర్ణతను ఊహించకూడదని స్పష్టమవుతుంది. వ్యక్తులు తమ మత విశ్వాసాలను ఎంత బహిరంగంగా ప్రకటిస్తారో, వారి హృదయాలు దేవునితో సరితూగకపోతే అల్లర్లు జరిగే అవకాశం ఎక్కువ. క్రీస్తు బోధలు, జీవన విధానం గురించి బాగా తెలిసిన ఆయన సొంత శిష్యుడు కూడా ఆయనపై ఎలాంటి తప్పు చేయలేదని, అలాంటి ఆరోపణ ఆయన చేసిన ద్రోహాన్ని సమర్థించేలా చేయడం గమనార్హం. జుడాస్ లో ఏమి లేదు? తన గురువు ఎక్కడికి వెళ్లినా అతనికి స్వాగతం లభించలేదా? అతను క్రీస్తు చేసినట్లుగా ఉండలేదా? ఇది లేకపోవడం కాదు, డబ్బుపై ప్రేమ అన్ని చెడులకు మూలంగా పనిచేస్తుంది. ఆ నీచమైన ఒప్పందాన్ని చేసుకున్న తర్వాత కూడా, జుడాస్‌కు పశ్చాత్తాపం చెందడానికి మరియు ఉపసంహరించుకునే అవకాశం లభించింది, అయితే చిన్న చిన్న నిజాయితీ లేని చర్యలు మనస్సాక్షిని కించపరిచినప్పుడు, వ్యక్తులు మరింత అవమానకరమైన చర్యలకు వెనుకాడకుండా ముందుకు సాగుతారు.

పాస్ ఓవర్. (17-25) 
పస్కాలో పాల్గొనడానికి క్రీస్తు శిష్యులను నిర్దేశించిన ప్రదేశానికి నడిపించాడని గమనించండి. అతను తన కారణానికి దాచిన మద్దతుదారులను గుర్తిస్తాడు మరియు తనను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్న వారందరినీ దయతో సందర్శిస్తాడు. శిష్యులు యేసు సూచనలను శ్రద్ధగా పాటించారు. సువార్త పాస్ ఓవర్లో క్రీస్తు ఉనికిని కోరుకునే వారు అతని మార్గదర్శకత్వానికి కట్టుబడి ఉండాలి. క్రీస్తు శిష్యులు తమను తాము అన్నివేళలా అప్రమత్తంగా ఉంచుకోవడం సముచితం, ప్రత్యేకించి సవాలుతో కూడిన పరిస్థితుల్లో. మనం ఎదుర్కొనే ప్రలోభాల బలం గురించి మరియు దేవుడు మనల్ని ఎంతవరకు పరీక్షించడానికి అనుమతించగలడనే దాని గురించి మనకు అనిశ్చితంగా ఉన్నందున, గర్వంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండటం తెలివైన పని. ప్రభువు రాత్రి భోజనంలో పాల్గొనే ముందు, క్షుణ్ణంగా స్వీయ-పరిశీలన మరియు హృదయపూర్వక ప్రార్థన ముఖ్యంగా సముచితం. క్రీస్తు, మన పస్కా, మన కోసం త్యాగం చేయబడినందున, మన పశ్చాత్తాపాన్ని పునరుద్ధరించడానికి, అతని రక్తంపై మన విశ్వాసాన్ని పునరుద్ఘాటించడానికి మరియు అతని సేవకు మనల్ని మనం కొత్తగా అంకితం చేసుకోవడానికి ఈ పండుగలో పాల్గొంటాము.

క్రీస్తు తన పవిత్ర విందును ఏర్పాటు చేశాడు. (26-30) 
లార్డ్స్ సప్పర్, ఒక శాసనం వలె, మన పాస్ ఓవర్ భోజనం వలె పనిచేస్తుంది, ఇది ఈజిప్టు నుండి ఇజ్రాయెల్ యొక్క నిర్వాసితుల కంటే చాలా గొప్ప విమోచనను జ్ఞాపకం చేసుకోవడానికి అనుమతిస్తుంది. తీసుకొని తినమని చెప్పినప్పుడు, క్రీస్తును అర్పించినట్లుగా అంగీకరించడం, ప్రాయశ్చిత్తం పొందడం, దానిని ఆమోదించడం మరియు అతని దయ మరియు పాలనకు సమర్పించడం. కేవలం ఆహారాన్ని చూడటం, ఎంత బాగా సిద్ధం చేసినా, పోషణను అందించదు-అలాగే ఇది క్రీస్తు సిద్ధాంతం; అది సమీకరించబడాలి. "ఇది నా శరీరం" అని క్రీస్తు చెప్పినప్పుడు, అది అతని శరీరాన్ని ఆధ్యాత్మిక కోణంలో సూచిస్తుంది మరియు సూచిస్తుంది. సూర్యుని కిరణాలను స్వీకరించడం ద్వారా మనం దానిలో పాలుపంచుకున్నట్లే, ఆయన దయ మరియు అతని త్యాగం యొక్క ఆశీర్వాద ఫలితాలను స్వీకరించడం ద్వారా మనం క్రీస్తులో పాలుపంచుకుంటాము. ద్రాక్షారసం క్రీస్తు రక్తాన్ని సూచిస్తుంది. శాసనం యొక్క ప్రతి అంశంలో దేవుణ్ణి గుర్తించమని బోధించడానికి క్రీస్తు కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన ఆ గిన్నెను శిష్యులకు అందజేసినప్పుడు, “మీరంతా త్రాగండి” అని ఆజ్ఞాపించాడు. పాప క్షమాపణ, పునాది ఆశీర్వాదం, ప్రభువు రాత్రి భోజనం సమయంలో నిజమైన విశ్వాసులందరికీ అందించబడుతుంది. క్రీస్తు ఈ కమ్యూనియన్‌కు వీడ్కోలు పలికాడు, అయితే భవిష్యత్తులో సంతోషకరమైన పునఃకలయిక గురించి వారికి హామీ ఇస్తాడు: "ఆ రోజు వరకు నేను దానిని మీతో కొత్తగా త్రాగే వరకు," సాధువులు ప్రభువైన యేసుతో పంచుకునే రాబోయే స్థితి యొక్క ఆనందాలు మరియు మహిమలను సూచిస్తుంది. అది అతని తండ్రి రాజ్యం అవుతుంది, అక్కడ ఓదార్పు ద్రాక్షారసం ఎప్పటికీ నూతనంగా ఉంటుంది. క్రీస్తు విరిగిన శరీరానికి సంబంధించిన బాహ్య చిహ్నాలను మనం పరిశీలిస్తున్నప్పుడు, మన పాప విముక్తి కోసం రక్తాన్ని చిందిస్తున్నప్పుడు, ఆయన తన మాంసాన్ని తినడానికి మరియు అతని రక్తాన్ని మన కోసం త్రాగడానికి ఇచ్చినంత ఖర్చవుతుందని గుర్తుంచుకోండి. .

అతను తన శిష్యులను హెచ్చరించాడు. (31-35) 
పీటర్‌కు సమానమైన అసమంజసమైన స్వీయ-హామీ పతనానికి ప్రారంభ మార్గాన్ని సూచిస్తుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం మనందరిలో సహజంగా ఉంటుంది. అయినప్పటికీ, చాలా స్వీయ-హామీ ఉన్నవారు తరచుగా వేగంగా మరియు అత్యంత తీవ్రమైన పతనాలను అనుభవిస్తారు. తమను తాము అత్యంత అగమ్యగోచరులుగా భావించే వారు తక్కువ సురక్షితమైనవారు. అలాంటి వ్యక్తులు తక్కువ అప్రమత్తంగా ఉన్నప్పుడు వారిని తప్పుదారి పట్టించేందుకు సాతాను చురుకుగా పనిచేస్తాడు మరియు వినయాన్ని పెంపొందించడానికి దేవుడు వారిని వారి స్వంత మార్గానికి వదిలివేయడానికి అనుమతించవచ్చు.

తోటలో అతని వేదన. (36-46) 
మానవత్వం యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం అందించిన వ్యక్తి, మానవత్వం మొదట తిరుగుబాటు చేసిన ఆనందపు తోటకి భిన్నంగా, బాధల తోటలో ఇష్టపూర్వకంగా దైవిక సంకల్పానికి లోనయ్యాడు. తోటలోని ఆ బాధాకరమైన భాగంలో, క్రీస్తు తన రూపాంతరం సమయంలో తన మహిమను చూసిన వారిని మాత్రమే ఎంచుకున్నాడు. విశ్వాసం ద్వారా, ఆయన మహిమను వీక్షించిన వారు క్రీస్తుతో బాధలను సహించడానికి ఉత్తమంగా సిద్ధంగా ఉన్నారు. అతని స్థితిని వర్ణించడానికి ఉపయోగించిన పదాలు పూర్తి నిస్పృహ, విస్మయం, వేదన మరియు మనస్సు యొక్క భయానకతను సూచిస్తాయి-ఇది దుఃఖంతో చుట్టుముట్టడం, కష్టాలచే మునిగిపోవడం మరియు దాదాపుగా భయాందోళనలు మరియు భయాందోళనలతో మునిగిపోతుంది. అతని దుఃఖం ఆ తోటలో ప్రారంభమైంది మరియు "ఇది పూర్తయింది" అని అతను ప్రకటించే వరకు ఆగలేదు. వీలైతే, బాధల కప్పును అతని నుండి తీసుకోమని అతను ప్రార్థించాడు. అయినప్పటికీ, మన విమోచనం మరియు మోక్షానికి ఇష్టపూర్వకంగా లొంగి, తన బాధల భారాన్ని మోయడానికి పరిపూర్ణ సంసిద్ధతను ప్రదర్శించాడు.
క్రీస్తు మాదిరిని అనుసరించి, మన స్వభావం ప్రతిఘటించినప్పటికీ, దేవుడు మన చేతుల్లో ఉంచిన చేదు కప్పు నుండి మనం త్రాగాలి. మన దృష్టి కష్టాలను తొలగించడం కంటే వాటిని పవిత్రం చేయడం మరియు వాటి క్రింద మన హృదయాలలో సంతృప్తిని కనుగొనడంపై ఉండాలి. అదృష్టవశాత్తూ, మన మోక్షం నిద్రపోని లేదా నిద్రపోని వ్యక్తి చేతిలో ఉంది. ప్రతి ఒక్కరూ టెంప్టేషన్‌ను ఎదుర్కొంటున్నప్పుడు, దానిలోకి ప్రవేశించకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. దీని నుండి జాగ్రత్తగా ఉండాలంటే, సురక్షితంగా ఉండటానికి మద్దతు కోసం మనం తప్పక చూడాలి, ప్రార్థించాలి మరియు నిరంతరం ప్రభువు వైపు చూడాలి.
నిస్సందేహంగా, మన ప్రభువు తాను అనుభవించబోయే బాధల గురించి స్పష్టమైన మరియు పూర్తి అవగాహన కలిగి ఉన్నాడు, అయినప్పటికీ అతను ఈ క్షణం వరకు చాలా ప్రశాంతంగా మాట్లాడాడు. క్రీస్తు, ష్యూరిటీగా, మన పాపాలకు జవాబుదారీగా ఉంటాడు, మన కోసం పాపంగా మార్చబడ్డాడు మరియు మన పాపాల కోసం బాధపడ్డాడు-అన్యాయానికి న్యాయమైనవాడు. స్క్రిప్చర్ అతని అత్యంత తీవ్రమైన బాధలను దేవుని చేతికి ఆపాదించింది. అతను పాపం యొక్క అనంతమైన చెడు గురించి పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, అతను ప్రాయశ్చిత్తం చేయాల్సిన అపరాధం యొక్క విస్తారమైన పరిధి మరియు దైవిక న్యాయం మరియు పవిత్రత గురించి లోతైన అవగాహన, మానవ పాపాలకు తగిన శిక్షతో పాటు, పదాలు వ్యక్తీకరించగల లేదా మనస్సు ఊహించగల దాని కంటే ఎక్కువ. . అదే సమయంలో, క్రీస్తు టెంప్టేషన్‌ను ఎదుర్కొన్నాడు, సాతాను సూచించిన భయంకరమైన ఆలోచనలను ఎదుర్కొంటాడు, అది చీకటి మరియు భయంకరమైన ముగింపులకు దారితీసింది, అతని పరిపూర్ణ పవిత్రత ద్వారా మరింత సవాలుగా మారింది. తన శక్తితో కూడిన మాట ద్వారా సమస్తాన్ని సమర్థించే వ్యక్తి యొక్క ఆత్మను ఆరోపించబడిన అపరాధ భారం మోపినట్లయితే, వారి పాపాలు తమ తలపైనే ఉండిపోయే వారు ఎంత దయనీయంగా ఉంటారు! ఇంత గొప్ప మోక్షాన్ని విస్మరించిన వారికి ఏ గతి ఎదురుచూస్తుంది?

అతను ద్రోహం చేయబడ్డాడు. (47-56) 
శిష్యరికమని చెప్పుకుంటూ, ముద్దుతో క్రీస్తుకు ద్రోహం చేసే వారి కంటే అసహ్యకరమైన శత్రువులు ఎవరూ లేరు. దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చడానికి మన సేవలను, మన పాపాలను మాత్రమే కోరుకోడు. క్రీస్తు బలహీనమైన స్థితిలో సిలువ వేయబడినప్పుడు, అది స్వచ్ఛంద బలహీనత; అతను ఇష్టపూర్వకంగా మరణానికి సమర్పించుకున్నాడు. అతను బాధలను భరించడానికి ఇష్టపడకపోతే, వారు అతనిని అధిగమించలేరు. యేసును వెంబడించడం సర్వస్వాన్ని విడిచిపెట్టిన వారు ఇప్పుడు తెలియని కారణాల వల్ల ఆయనను విడిచిపెట్టడం ఘోరమైన పాపం. మృత్యుభయంతో, జీవితానికి మూలం అని వారు గుర్తించి, అంగీకరించిన వ్యక్తి నుండి దూరంగా ఉండటం ఎంత మూర్ఖత్వం!

కైఫాకు ముందు క్రీస్తు. (57-68) 
యేసు తొందరగా యెరూషలేములోకి ప్రవేశించాడు, అతని చుట్టూ ముందస్తు వాతావరణం ఉంది. క్రీస్తు శిష్యులుగా ఉండాలనే ఆసక్తి ఉన్నవారు తమ విధేయతను బహిరంగంగా ప్రకటించడానికి ఇష్టపడనప్పుడు ఇది కలవరపెడుతుంది. ఇది పీటర్ యొక్క తిరస్కరణకు నాంది పలికింది, ఎందుకంటే క్రీస్తు నుండి తనను తాను దూరం చేసుకోవడం అనేది వెనుదిరగడానికి మొదటి అడుగు. ఫలితం యొక్క వివరాలను అబ్సెసివ్‌గా ఆలోచించే బదులు, మన దృష్టి రాబోయే దేనికైనా సిద్ధపడాలి. ఫలితం దేవునిది, కానీ బాధ్యత మనపై ఉంది.
ఈ సమయంలో, క్రీస్తుకు వ్యతిరేకంగా తప్పుడు సాక్షుల పెరుగుదలను ధృవీకరిస్తూ లేఖనాలు నెరవేరాయి. అతని ఆరోపణ మనలను శిక్ష నుండి తప్పించడానికి ఉపయోగపడింది. ఇలాంటి బాధల క్షణాలలో, మన విధి మన మాస్టర్ కంటే అనుకూలంగా ఉండకపోవచ్చని మనం గుర్తుంచుకోవాలి. క్రీస్తు మన పాపాలను భరించినప్పుడు, అతను నిశ్శబ్దాన్ని ఎంచుకున్నాడు, అతని రక్తాన్ని అతని కోసం మాట్లాడనివ్వండి.
ఇప్పటి వరకు, యేసు తనను తాను దేవుని కుమారుడైన క్రీస్తు అని చాలా అరుదుగా ప్రకటించుకున్నాడు. అతని బోధనలు మరియు అద్భుతాలు అంతర్లీనంగా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు, అతను ఇప్పుడు బహిరంగంగా దానిని ఒప్పుకున్నాడు, రాబోయే బాధలను తప్పించుకోవడానికి నిరాకరించాడు. ఈ ఒప్పుకోలు అతని అనుచరులకు ఒక ఉదాహరణగా పనిచేసింది, ప్రమాదాలు ఉన్నప్పటికీ అతనిని బహిరంగంగా గుర్తించమని వారిని ప్రోత్సహించింది. మహిమాన్వితుడైన ప్రభువును ధిక్కరించిన వారి నుండి గురువు బఫెటింగ్ మరియు ఎగతాళిని ఎదుర్కొన్నట్లే శిష్యుడు అసహ్యాన్ని, క్రూరమైన ఎగతాళిని మరియు అసహ్యాన్ని ఆశించాలి. ఈ సంఘటనలు యెషయా యాభైవ అధ్యాయంలోని అంచనాలతో సరిగ్గా సరిపోతాయి. మనం క్రీస్తు పేరును ధైర్యంగా ఒప్పుకుందాం, ఎలాంటి నిందలు వచ్చినా ఆలింగనం చేద్దాం, ఎందుకంటే అతను తన తండ్రి సింహాసనం ముందు మనల్ని అంగీకరిస్తాడు.

పీటర్ అతనిని తిరస్కరించాడు. (69-75)
పేతురు చేసిన పాపపు వృత్తాంతం లేఖనాలతో నమ్మకంగా సరిపోయింది. చెడు సాంగత్యంతో సహవాసం చేయడం పాపానికి దారితీయవచ్చు మరియు ఇష్టపూర్వకంగా అందులో మునిగిపోయేవారు పేతురు అనుభవంలో చూసినట్లుగా ప్రలోభాలను మరియు చిక్కులను ఊహించాలి. అటువంటి సంస్థ నుండి నిష్క్రమించడం తరచుగా అపరాధం లేదా దుఃఖంతో భారంగా ఉంటుంది, రెండూ కాకపోయినా. క్రీస్తును తప్పించడం ఒక ముఖ్యమైన తప్పు, మరియు అతనిని గుర్తించడానికి పిలిచినప్పుడు అతని గురించి తెలియనట్లు నటించడం, ముఖ్యంగా, తిరస్కరణ. పీటర్ పాపం తీవ్రమైనది అయినప్పటికీ, ఉద్దేశ్యంతో ద్రోహం చేసిన జుడాస్‌లా కాకుండా అది హఠాత్తుగా జరిగింది.
మరచిపోయిన పాపాలను గుర్తు చేస్తూ కోడి కూతలా మనస్సాక్షి పనిచేయాలి. పీటర్ పతనం అతని ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడానికి ఉపయోగపడింది, వినయం, కరుణ మరియు ఇతరులకు ఉపయోగకరం. విశ్వాసులు చరిత్రలో ఈ సంఘటన నుండి పాఠాలు నేర్చుకున్నారు. అవిశ్వాసులు, పరిసయ్యులు మరియు వేషధారులు వంటి పొరపాట్లు చేసేవారు లేదా దుర్వినియోగం చేసేవారు తమ స్వంత పూచీతో అలా చేస్తారు. సవాలుతో కూడిన పరిస్థితులలో, మనమే వదిలేస్తే మన స్వంత చర్యలను మనం తరచుగా తక్కువగా అంచనా వేస్తాము. కాబట్టి, తాము స్థిరంగా ఉన్నామని విశ్వసించే వారు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి; మనమందరం మన హృదయాలపై అపనమ్మకం కలిగి ఉండాలి మరియు పూర్తిగా ప్రభువుపై ఆధారపడాలి.
పేతురు మిక్కిలి ఏడుపు పాపానికి అవసరమైన దుఃఖాన్ని ప్రతిబింబిస్తుంది. అతని కన్నీటి తిరస్కరణ ఉన్నప్పటికీ, అతను మరలా క్రీస్తును తిరస్కరించలేదు మరియు ప్రమాదంలో కూడా ధైర్యంగా అతనిని ఒప్పుకున్నాడు. ఏదైనా పాపం పట్ల నిజమైన పశ్చాత్తాపం వ్యతిరేక ధర్మాలు మరియు కర్తవ్యాల ప్రదర్శనలో వ్యక్తమవుతుంది, ఇది చేదు మాత్రమే కాదు, హృదయపూర్వక దుఃఖాన్ని సూచిస్తుంది.



Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |