Matthew - మత్తయి సువార్త 26 | View All

1. యేసు ఈ మాటలన్నియు చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి

1. యేసు చెప్పటం ముగించాడు. ఆ తదుపరి శిష్యులతో

2. రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువవేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను.
నిర్గమకాండము 12:1-27

2. “రెండు రోజుల తర్వాత పస్కాపండుగ వస్తొందని మీకు తెలుసు. ఆ తర్వాత మనుష్య కుమారునికి శ్రమ సంభవిస్తుంది. తత్ఫలితంగా ఆయన శత్రువులు ఆయన్ని సిలువకు వేస్తారు” అని అన్నాడు.

3. ఆ సమయమున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోనికి కూడివచ్చి

3. ప్రధానయాజకులు, పెద్దలు, కయప అని పిలువబడే ప్రధాన యాజకుని యింటి ఆవరణంలో సమావేశమై

4. యేసును మాయోపాయముచేత పట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచన చేసిరి.

4. యేసును ఏదో ఒక కుట్రతో బంధించి చంపాలని పన్నాగం పన్నారు.

5. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండు నట్లుపండుగలో వద్దని చెప్పుకొనిరి.

5. ‘కాని పండుగ రోజుల్లో కాదు. అలా చేస్తే ప్రజల్లో అల్లర్లు చెలరేగవచ్చు’ అని అనుకొన్నారు.

6. యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట నున్నప్పుడు,

6. బేతనియ గ్రామంలో కుష్టురోగియగు సీమోను అని పిలువబడే ఒక వ్యక్తి యింట్లో యేసు ఉన్నాడు.

7. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను.

7. యేసు భోజనానికి కూర్చొని ఉండగా ఒక స్త్రీ చలువరాతి బుడ్డిలో అతి విలువైన అత్తరుతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన తలపై పోసింది.

8. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టమెందుకు?

8. ఇది చూసి శిష్యులకు కోపం వచ్చింది. “ఎందుకిలా వ్యర్థంచేయటం?

9. దీనిని గొప్ప వెలకు అమ్మి బీదల కియ్యవచ్చునే అనిరి.

9. ఈ అత్తరు పెద్ద మొత్తానికి అమ్మి ఆ డబ్బు పేదవాళ్ళ కివ్వవలసింది!” అని వాళ్ళన్నారు.

10. యేసు ఆ సంగతి తెలిసి కొనిఈ స్త్రీ నా విషయమై యొక మంచి కార్యము చేసెను; ఈమెను మీరేల తొందరపెట్టుచున్నారు?

10. యేసుకు ఈ విషయం తెలిసి, “ఆమెనెందుకంటున్నారు? ఆమె సరియైన పని చేసింది,

11. బీదలెల్లప్పుడు మీతోకూడ ఉన్నారు. గాని నేనెల్లప్పుడు మీతో కూడ ఉండను.
ద్వితీయోపదేశకాండము 15:11

11. పేద వాళ్ళు మీతో ఎప్పుడూ ఉంటారు. కాని నేను మీతో ఎల్లకాలం ఉండబోను.

12. ఈమె యీ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను.

12. ఆమె ఆ అత్తరు నా శరీరం మీద పోసి నన్ను సమాధి చెయ్యటానికి సిద్ధం చేసింది.

13. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా నని వారితో అనెను.

13. ఇది సత్యం - ఈ సువార్తను ప్రపంచంలో ఏ చోట ప్రకటించినా ఆమె జ్ఞాపకార్థం ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు.

14. అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులయొద్దకు వెళ్లి

14. ఆ తర్వాత పన్నెండుగురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు.

15. నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి.
నిర్గమకాండము 21:32, జెకర్యా 11:12

15. “ఆయన్ని మీ కప్పగిస్తే మీరు నాకేమివ్వాలనుకొన్నారు?” అని వాళ్ళనడిగాడు. వాళ్ళు ముప్పై వెండి నాణేలు లెక్క పెట్టి యిచ్చారు.

16. వాడప్పటినుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను.

16. అప్పటినుండి యూదా ఆయన్ని పట్టివ్వాలని అవకాశం కోసం ఎదురు చూడసాగాడు.

17. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు, శిష్యులు యేసునొద్దకు వచ్చిపస్కాను భుజించుటకు మేము నీకొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడి గిరి.
నిర్గమకాండము 12:14-20

17. పులియని రొట్టెలు తినే పండుగ రోజులు వచ్చాయి. మొదటి రోజు శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “పస్కా పండుగ భోజనం ఎక్కడ సిద్ధం చేయమంటారు?” అని అడిగారు.

18. అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యునియొద్దకు వెళ్లి - నా కాలము సమీపమైయున్నది; నా శిష్యులతో కూడ నీ యింట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను.

18. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “పట్టణంలోకి నేను చెప్పిన వ్యక్తి దగ్గరకు వెళ్ళండి. అతనితో ‘నా సమయం దగ్గరకొచ్చింది. నేను నా శిష్యులతో కలసి పస్కా పండుగ భోజనం మీ యింట్లో చెయ్యాలనుకొంటున్నానని మా ప్రభువు చెప్పమన్నారు’ అని చెప్పండి.”

19. యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి.

19. శిష్యులు యేసు సూచించిన విధంగా పస్కాపండుగ విందు సిద్దం చేసారు.

20. సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుం డెను.

20. సాయంత్రం కాగానే యేసు పన్నెండు మందితో కలసి భోజనానికి కూర్చున్నాడు.

21. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.

21. అంతా భోజనం చేస్తుండగా ఆయన, “ఇది సత్యం. మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.

22. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడునుప్రభువా, నేనా? అని ఆయన నడుగగా

22. వాళ్ళకు దుఃఖం కలిగింది. ప్రతి ఒక్కడు ఆయనతో, “ప్రభూ! నేను కాదు కదా!” అని అన్నాడు.

23. ఆయననాతోకూడ పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు.
కీర్తనల గ్రంథము 41:9

23. యేసు సమాధానం చెబుతూ, “నాతో కలసి గిన్నెలో చెయ్యి ఉంచిన వాడు నాకు ద్రోహం చేస్తాడు.

24. మనుష్యకుమా రునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్ప గింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను.
కీర్తనల గ్రంథము 22:7-8, కీర్తనల గ్రంథము 22:16-18, యెషయా 53:9

24. మనుష్యకుమారుడు లేఖనాల్లో వ్రాసినట్లు చనిపోతాడు. కాని ఆయనకు ద్రోహంచేసిన వానికి బహుశ్రమ కలుగుతుంది. వాడు జన్మించి ఉండక పోయినట్లయితే బాగుండేది” అని అన్నాడు.

25. ఆయనను అప్పగించిన యూదాబోధకుడా, నేనా? అని అడుగగా ఆయననీవన్నట్టే అనెను.

25. అప్పుడు ఆయనకు ద్రోహం చేయనున్న యూదా, “నేను కాదు కదా రబ్బీ” అని అన్నాడు. యేసు, “ఔను! నువ్వే!” అని సమాధానం చెప్పాడు.

26. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను.

26. వాళ్ళు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దాన్ని విరిచి శిష్యులకిస్తూ, “ఇది తీసుకొని తినండి! ఇది నా దేహం!” అని అన్నాడు.

27. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరు త్రాగుడి.

27. ఆ తర్వాత పాత్రను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి వాళ్ళకిస్తూ, “అందరూ ఈ పాత్రలోవున్న దాన్ని త్రాగండి.

28. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.
నిర్గమకాండము 24:8, యిర్మియా 31:31, జెకర్యా 9:11

28. ఇది నా ఒడంబడిక రక్తం. అనేకులకు పాప క్షమాపణ కలగాలని నేనీ రక్తాన్ని చిందించాను.

29. నా తండ్రి రాజ్యములో మీతోకూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్త దిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.

29. ఈ రోజు నుండి నా తండ్రి రాజ్యంలో మీతో కలసి ద్రాక్షారసాన్ని మళ్ళీ త్రాగే దాకా దీన్ని యిక మీదట త్రాగనని మీతో చెబుతున్నాను” అని అన్నాడు.

30. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి.
కీర్తనల గ్రంథము 113:8

30. వాళ్ళు కీర్తనను పాడాక ఒలీవ చెట్ల కొండ మీదికి వెళ్ళారు౤

31. అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగా గొఱ్ఱెల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱెలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది గదా.
జెకర్యా 13:7

31. ఆ తదుపరి యేసు వాళ్ళతో, “ఈ రాత్రి మీరు నా కారణంగా చెదరిపోతారు. ఎందుకంటే: ‘నేను గొఱ్ఱెల కాపరిని చంపుతాను అప్పుడా గొఱ్ఱెల మంద చెదరిపోతుంది’ అని వ్రాయబడివుంది. జెకర్యా 13:7

32. నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయకు వెళ్లెద ననెను.

32. “కాని దేవుడు నన్ను బ్రతికించాక నేను మీకన్నా ముందే గలిలయకు వెళ్తాను” అని అన్నాడు.

33. అందుకు పేతురునీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా

33. పేతురు, “అందరూ మిమ్మల్ని వదిలి వెళ్ళినా నేను మాత్రం మిమ్మల్ని వదలి వెళ్ళను” అని సమాధానం చెప్పాడు.

34. యేసు అతని చూచిఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

34. యేసు, “ఇది సత్యం. ఈ రాత్రి కోడి కూయక ముందే నేనెవరో తెలియదని మూడు సార్లు అంటావు” అని సమాధానం చెప్పాడు.

35. పేతురాయనను చూచినేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగ నని చెప్పననెను; అదేప్రకారము శిష్యులందరు అనిరి.

35. కాని పేతురు, “నేను మీతో కలసి మరణిస్తాను, కాని మీరెవరో నాకు తెలియదని అనను” అని అన్నాడు. శిష్యులందరూ అదే విధంగా అన్నారు.

36. అంతట యేసు వారితోకూడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చినేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి

36. ఆ తర్వాత యేసు శిష్యులతో కలసి గెత్సేమనే అనే ప్రదేశానికి వెళ్ళాడు. వాళ్ళతో, “ఇక్కడే కూర్చోండి. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తాను” అని అన్నాడు.

37. పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను.

37. యేసు పేతుర్ని, జెబెదయి యొక్క యిద్దరు కుమారుల్ని తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు దుఃఖం వచ్చింది. మనస్సు వ్యాకులం చెందింది.

38. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది;మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి
కీర్తనల గ్రంథము 42:5, కీర్తనల గ్రంథము 42:11, కీర్తనల గ్రంథము 43:5, యోనా 4:9

38. అప్పుడాయన వాళ్ళతో, “నా ఆత్మ మరణ వేదన పొందుతోంది. ఇక్కడే ఉండి నాతో సహా మేలుకొని ఉండండి” అని అన్నాడు.

39. కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.

39. యేసు యింకా కొంత దూరం వెళ్ళి సాష్టాంగపడి, “నా తండ్రి! వీలైతే దుఃఖంతో నిండిన ఈ పాత్రను నా నుండి తీసివేయి! అయినా నెరవేరవలసింది నా యిచ్ఛకాదు. నీది” అని అంటూ ప్రార్థించాడు.

40. ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచిఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా?

40. ఆ తర్వాత తిరిగి వచ్చి శిష్యులు నిద్రిస్తూ ఉండటం గమనించాడు. ఆయన, “నాతో సహా ఒక గంట సేవు మేలుకోలేక పొయ్యారా?” అని అన్నాడు.

41. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీన మని పేతురుతో చెప్పి

41. “మెలకువగా ఉండి ప్రార్థించండి! అప్పుడే మీరు దుష్ప్రేరేపణకు లోనైపోకుండా ఉంటారు. ఆత్మ సిద్ధంగా ఉంది కాని శరీరం బలహీనంగా ఉంది!” అని పేతురుతో అన్నాడు.

42. మరల రెండవమారు వెళ్లినా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగి పోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థించి

42. ఆయన రెండవసారి వెళ్ళి, “నా తండ్రీ! ఈ పాత్రలోవున్నది త్రాగితేగాని వీల్లేదంటే నేను దాన్ని త్రాగుతాను. నీ యిష్టమే నెరవేరు గాక!” అని ప్రార్ధించాడు.

43. తిరిగి వచ్చి, వారు మరల నిద్రించుట చూచెను; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను.

43. ఆయన తిరిగి వచ్చి తన శిష్యులు మళ్ళీ నిద్రిస్తుండటం గమనించాడు. కళ్ళు బరువెక్కటంవల్ల వాళ్ళు నిద్రనాపుకోలేక పోయారు.

44. ఆయన వారిని మరల విడిచి వెళ్లి, ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థనచేసెను.

44. ఆయన మూడవ సారి వాళ్ళను వదిలి వెళ్ళి ముందు ప్రార్థించినట్లే మళ్ళీ ప్రార్ధించాడు.

45. అప్పుడాయన తన శిష్యులయొద్దకు వచ్చిఇక నిద్రపోయి అలసట తీర్చు కొనుడి; ఇదిగో ఆ గడియవచ్చి యున్నది; మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు;

45. ఆ తదుపరి తన శిష్యుల దగ్గరకు వచ్చి, “మీరింకా నిద్రిస్తూ, విశ్రాంతి తీసుకొంటున్నారా. చూడండి! మనుష్యకుమారుడు పాపాత్ములకు అప్పగింపబడే ఘడియ దగ్గరకు వచ్చింది.

46. లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి యున్నాడని వారితో చెప్పెను.

46. వెళ్దాం, లేవండి. అదిగో! నాకు ద్రోహం చేయనున్నవాడు వస్తున్నాడు!” అని అన్నాడు.

47. ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితోకూడ బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకులయొద్దనుండియు ప్రజల పెద్దలయొద్ద నుండియు వచ్చెను.

47. ఆయనింకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండుగురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, ప్రజాప్రముఖులు పంపించిన పెద్ద ప్రజల గుంపు ఒకటి వాని వెంట ఉంది. వాళ్ళ చేతుల్లో కత్తులు, కర్రలు ఉన్నాయి.

48. ఆయనను అప్పగించువాడు నేనెవ రిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి

48. ఆ ద్రోహి, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు పెట్టుకుంటానో, ఆయన్ని బంధించండి!” అని ముందే ఒక ఏర్పాటు చేసుకొన్నాడు.

49. వెంటనే యేసు నొద్దకు వచ్చిబోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.

49. యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్ళి, “వందనాలు రబ్బీ!” అని ఆయన్ని ముద్దుపెట్టుకున్నాడు.

50. యేసు చెలికాడా, నీవు చేయవచ్చి నది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి.

50. యేసు, “మిత్రమా! నీవు చేయవచ్చిన పని చెయ్యి” అని అన్నాడు. వెంటనే కొందరు వ్యక్తులు ముందుకు వచ్చి ఆయన్ని బంధించారు.

51. ఇదిగో యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను.

51. యేసుతో ఉన్న వాళ్ళలో ఒకడు వెంటనే తన కత్తిని వరనుండి తీసి, ప్రధాన యాజకుని సేవకుని యొక్క చెవిని నరికి వేసాడు.

52. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.
ఆదికాండము 9:6

52. యేసు, “కత్తిని వరలో పెట్టెయి! కత్తినెత్తిన వాడు ఆ కత్తితోనే మరణిస్తాడు.

53. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొను చున్నావా?

53. నేను నా తండ్రిని సహాయం కావాలని అడగలేననుకొన్నావా? నేను అడిగిన వెంటనే పన్నెండు దళాలకంటే ఎక్కువ మంది దేవదూతల్ని పంపుతాడు.

54. నేను వేడుకొనిన యెడల ఈలాగు జరుగ వలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను.

54. నేను అలాచేస్తే ఈ విధంగా జరగాలని లేఖనాల్లో వ్రాసినవి ఎట్లా నెరవేరుతాయి?” అని అన్నాడు.

55. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచిబందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు.

55. ఆ తదుపరి యేసు వచ్చిన ప్రజలతో, “దోపిడి దొంగను పట్టుకోవటానికి వచ్చినట్లు కత్తులతో, కర్రలతో వచ్చారేం? మందిరావరణంలో కూర్చొని ప్రతిరోజు బోధించాను. కాని అప్పుడు మీరు నన్ను బంధించలేదు.

56. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి.
జెకర్యా 13:7

56. కాని, ప్రవక్తలు వ్రాసినవి నెరవేరాలని యివన్నీ జరిగాయి” అని అన్నాడు. వెంటనే ఆయన శిష్యులందరూ ఆయన్ని వదిలి వెళ్ళి పొయ్యారు.

57. యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి.

57. వాళ్ళు యేసును బంధించి ప్రధాన యాజకుడైన ‘కయప’ దగ్గరకు తీసుకు వెళ్ళారు. అక్కడ శాస్త్రులు, పెద్దలు ఇదివరకే సమావేశమై వున్నారు.

58. పేతురు ప్రధానయాజకుని యింటి ముంగిటివరకు, ఆయనను దూరమునుండి వెంబడించి లోపలికి పోయిదీని అంత మేమవునో చూడవలెనని బంట్రౌతులతోకూడ కూర్చుండెను.

58. కాని పేతురు కొంత దూరంలోవుండి యేసును ప్రధానయాజకుని యింటి దాకా అనుసరించాడు. ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలని భటుల్తో కలసి యింటి ముగింట్లో కూర్చున్నాడు.

59. ప్రధానయాజకులును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని

59. మరణ శిక్ష విధించాలనే ఉద్దేశ్యంతో ప్రధాన యాజకులు, మహాసభ సభ్యులు యేసుకు ప్రతికూలంగా, దొంగ సాక్ష్యం కొరకు చూసారు.

60. అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు.

60. 0చాలా మంది దొంగ సాక్ష్యం చెప్పటానికి ముందుకు వచ్చారు. కాని చంపడానికి సరైన కారణం లభించలేదు. చివరకు యిద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి

61. తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చివీడు దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో దానిని కట్ట గలనని చెప్పెననిరి.

61. ఈ విధంగా చెప్పారు, “ఈ వ్యక్తి ‘నేను దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో మళ్ళీ నిర్మించగలను’ అని అన్నాడు.”

62. ప్రధానయాజకుడు లేచినీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను.

62. అప్పుడు ప్రధాన యాజకుడు లేచి నిలబడి యేసుతో, “నీవు సమాధానం చెప్పవా? వీళ్ళు చేస్తున్న నేరారోపణలేమిటి?” అని అడిగాడు.

63. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచినీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు– నీవన్నట్టే.
యెషయా 53:7

63. కాని యేసు సమాధానం చెప్పలేదు. ప్రధాన యాజకుడు, “సజీవుడైన దేవునిపై ప్రమాణం చేసి చెప్పు, నీవు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువా?” అని అడిగాడు.

64. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వ శక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘా రూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా
కీర్తనల గ్రంథము 110:1-2, దానియేలు 7:13

64. యేసు సమాధానం చెబుతూ, “ఔను! మీరన్నది నిజం. అంతే. నేను మీతో చెప్పేదేమిటంటే యిక మీదటి నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిసంపన్నుని కుడివైపు కూర్చొని ఉండటం మీరు చూస్తారు. ఆయన మేఘాలపై రావటం మీరు చూస్తారు” అని అన్నాడు.

65. ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని - వీడు దేవ దూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు;
లేవీయకాండము 24:16, సంఖ్యాకాండము 14:6, 2 సమూయేలు 13:19, ఎజ్రా 9:3, యోబు 1:20, యోబు 2:12, యిర్మియా 36:24

65. ఇది విని ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని కోపాన్ని వ్యక్తపరుస్తూ, “ఇతను దైవదూషణ చేస్తున్నాడు. మనకింక ఇతర సాక్ష్యాలు ఎందుకు? చూడండి అతడు చేసిన దైవదూషణ విన్నారు కదా!

66. మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారువీడు మరణమునకు పాత్రుడనిరి.
లేవీయకాండము 24:16

66. మరి మీరేమంటారు?” అని అడిగాడు. “అతనికి మరణదండన విధించవలసిందే” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

67. అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి;
యెషయా 50:6, యెషయా 53:5

67. వాళ్ళలో కొందరు ఆయన ముఖంమ్మీద ఉమ్మేసి కొట్టారు. మరి కొందరు ఆయన చెంప మీద కొట్టి

68. కొందరు ఆయనను అర చేతులతో కొట్టిక్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపు మనిరి.

68. “ఓ క్రీస్తూ! నిన్నెవరు కొట్టారో చెప్పుకో!” అని అన్నారు.

69. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చినీవును గలిలయుడగు యేసుతో కూడ ఉంటివి గదా అనెను.

69. ఇక్కడ పేతురు బయట ముంగిట్లో కూర్చొని ఉండగా ఒక దాసీ పిల్ల అతని దగ్గరకు వచ్చి, ‘నీవు కూడా గలిలయ వాడైన యేసుతో ఉన్న వాడవే కదూ!’ అని అడిగింది.

70. అందుకతడు నేనుండలేదు; నీవు చెప్పుసంగతి నాకు తెలియదని అందరి యెదుట అనెను.

70. కాని అతడు వాళ్ళందరి ముందు, “నీవేం మాట్లాడుతున్నావో నాకు తెలియదు!” అని అంటూ ఆమె మాటను కాదన్నాడు.

71. అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి యొక చిన్నది అతనిని చూచివీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా

71. ఆ తదుపరి, అతడు అక్కడి నుండి ద్వారం దగ్గరకు వెళ్ళాడు. అక్కడతణ్ణి మరోదాసీ పిల్ల చూసి, అక్కడున్న ప్రజలతో, “ఈ వ్యక్తి, నజరేతు యేసుతో ఉన్నవాడే!” అని అన్నది.

72. అతడు ఒట్టుపెట్టుకొని నేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను.

72. పేతురు ఒట్టు పెట్టుకొని మళ్ళీ ఆమె మాటల్ని కాదంటూ, “నాకు ఆ మనిషి ఎవరో తెలియదు!” అని అన్నాడు.

73. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నదని అతనితో చెప్పిరి.

73. కొద్ది సేపయ్యాక అక్కడ నిలుచున్న వాళ్ళు పేతురు దగ్గరకు వచ్చి, “నీవు తప్పకుండా వాళ్ళలో ఒకడివి. నీ మాట తీరు చూస్తేనే తెలిసిపోతుంది!” అని అన్నారు.

74. అందుకు అతడు ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను

74. అప్పుడు పేతురు శపించుకోవటం మొదలు పెట్టాడు. అతడు ప్రమాణం చేస్తూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు!” అని అన్నాడు. వెంటనే కోడి కూసింది.

75. కనుకకోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప పడి యేడ్చెను.

75. అప్పుడు యేసు చెప్పిన ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి: “కోడి కూయక ముందే నేనెవరో తెలియదని మూడు సార్లంటావు” పేతురు బయటకు వెళ్ళి భోరున ఏడ్చాడు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 26 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible


పాలకులు క్రీస్తుకు వ్యతిరేకంగా కుట్ర చేస్తారు. (1-5) 
మన ప్రభువు తన బాధలను దూరమైనట్లుగా తరచుగా మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు వాటిని ఆసన్నమైనట్లుగా చర్చిస్తున్నాడు. అదే సమయంలో, యూదు కౌన్సిల్ అతన్ని రహస్యంగా ఎలా ఉరితీయాలనే దానిపై చర్చించింది. అయితే, వారి ప్రణాళికలను అడ్డుకోవడానికి దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆ ఖచ్చితమైన క్షణంలో, యేసు, నిజమైన పాస్చల్ గొఱ్ఱె, మన కోసం బలి ఇవ్వబడతాడు మరియు అతని మరణం మరియు పునరుత్థానం ప్రజలకు తెలియజేయబడ్డాయి.

బేతనియలో క్రీస్తు అభిషేకించబడ్డాడు. (6-13) 
లేపనంతో క్రీస్తు శిరస్సును అభిషేకించడం అత్యంత గౌరవానికి ప్రతీక. యేసు పట్ల నిజమైన ప్రేమ హృదయంలో ఉన్నప్పుడు, ఏ సంజ్ఞ కూడా అతనికి విలాసవంతమైనదిగా పరిగణించబడదు. క్రీస్తు అనుచరులు మరియు వారి ప్రయత్నాల పట్ల ఎంత ఎక్కువ విమర్శలు వస్తే, అతని ఆమోదం అంత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్యలో మేరీ యొక్క అసాధారణమైన విశ్వాసం మరియు ప్రేమ ప్రదర్శన చాలా ముఖ్యమైనది, ఇది భవిష్యత్ యుగాలలో మరియు సువార్త ప్రకటించబడే ప్రతి మూలలో శాశ్వత స్మారక చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ జోస్యం ఫలించింది.

జుడాస్ క్రీస్తుకు ద్రోహం చేయడానికి బేరసారాలు చేస్తాడు. (14-16) 
కేవలం పన్నెండు మంది మాత్రమే అపొస్తలులుగా ఎంపిక చేయబడ్డారు మరియు వారిలో ఒకరు దెయ్యాన్ని పోలి ఉన్నారు. స్వర్గానికి ఇటువైపున ఉన్న ఏ సంఘంలోనూ పరిపూర్ణతను ఊహించకూడదని స్పష్టమవుతుంది. వ్యక్తులు తమ మత విశ్వాసాలను ఎంత బహిరంగంగా ప్రకటిస్తారో, వారి హృదయాలు దేవునితో సరితూగకపోతే అల్లర్లు జరిగే అవకాశం ఎక్కువ. క్రీస్తు బోధలు, జీవన విధానం గురించి బాగా తెలిసిన ఆయన సొంత శిష్యుడు కూడా ఆయనపై ఎలాంటి తప్పు చేయలేదని, అలాంటి ఆరోపణ ఆయన చేసిన ద్రోహాన్ని సమర్థించేలా చేయడం గమనార్హం. జుడాస్ లో ఏమి లేదు? తన గురువు ఎక్కడికి వెళ్లినా అతనికి స్వాగతం లభించలేదా? అతను క్రీస్తు చేసినట్లుగా ఉండలేదా? ఇది లేకపోవడం కాదు, డబ్బుపై ప్రేమ అన్ని చెడులకు మూలంగా పనిచేస్తుంది. ఆ నీచమైన ఒప్పందాన్ని చేసుకున్న తర్వాత కూడా, జుడాస్‌కు పశ్చాత్తాపం చెందడానికి మరియు ఉపసంహరించుకునే అవకాశం లభించింది, అయితే చిన్న చిన్న నిజాయితీ లేని చర్యలు మనస్సాక్షిని కించపరిచినప్పుడు, వ్యక్తులు మరింత అవమానకరమైన చర్యలకు వెనుకాడకుండా ముందుకు సాగుతారు.

పాస్ ఓవర్. (17-25) 
పస్కాలో పాల్గొనడానికి క్రీస్తు శిష్యులను నిర్దేశించిన ప్రదేశానికి నడిపించాడని గమనించండి. అతను తన కారణానికి దాచిన మద్దతుదారులను గుర్తిస్తాడు మరియు తనను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్న వారందరినీ దయతో సందర్శిస్తాడు. శిష్యులు యేసు సూచనలను శ్రద్ధగా పాటించారు. సువార్త పాస్ ఓవర్లో క్రీస్తు ఉనికిని కోరుకునే వారు అతని మార్గదర్శకత్వానికి కట్టుబడి ఉండాలి. క్రీస్తు శిష్యులు తమను తాము అన్నివేళలా అప్రమత్తంగా ఉంచుకోవడం సముచితం, ప్రత్యేకించి సవాలుతో కూడిన పరిస్థితుల్లో. మనం ఎదుర్కొనే ప్రలోభాల బలం గురించి మరియు దేవుడు మనల్ని ఎంతవరకు పరీక్షించడానికి అనుమతించగలడనే దాని గురించి మనకు అనిశ్చితంగా ఉన్నందున, గర్వంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండటం తెలివైన పని. ప్రభువు రాత్రి భోజనంలో పాల్గొనే ముందు, క్షుణ్ణంగా స్వీయ-పరిశీలన మరియు హృదయపూర్వక ప్రార్థన ముఖ్యంగా సముచితం. క్రీస్తు, మన పస్కా, మన కోసం త్యాగం చేయబడినందున, మన పశ్చాత్తాపాన్ని పునరుద్ధరించడానికి, అతని రక్తంపై మన విశ్వాసాన్ని పునరుద్ఘాటించడానికి మరియు అతని సేవకు మనల్ని మనం కొత్తగా అంకితం చేసుకోవడానికి ఈ పండుగలో పాల్గొంటాము.

క్రీస్తు తన పవిత్ర విందును ఏర్పాటు చేశాడు. (26-30) 
లార్డ్స్ సప్పర్, ఒక శాసనం వలె, మన పాస్ ఓవర్ భోజనం వలె పనిచేస్తుంది, ఇది ఈజిప్టు నుండి ఇజ్రాయెల్ యొక్క నిర్వాసితుల కంటే చాలా గొప్ప విమోచనను జ్ఞాపకం చేసుకోవడానికి అనుమతిస్తుంది. తీసుకొని తినమని చెప్పినప్పుడు, క్రీస్తును అర్పించినట్లుగా అంగీకరించడం, ప్రాయశ్చిత్తం పొందడం, దానిని ఆమోదించడం మరియు అతని దయ మరియు పాలనకు సమర్పించడం. కేవలం ఆహారాన్ని చూడటం, ఎంత బాగా సిద్ధం చేసినా, పోషణను అందించదు-అలాగే ఇది క్రీస్తు సిద్ధాంతం; అది సమీకరించబడాలి. "ఇది నా శరీరం" అని క్రీస్తు చెప్పినప్పుడు, అది అతని శరీరాన్ని ఆధ్యాత్మిక కోణంలో సూచిస్తుంది మరియు సూచిస్తుంది. సూర్యుని కిరణాలను స్వీకరించడం ద్వారా మనం దానిలో పాలుపంచుకున్నట్లే, ఆయన దయ మరియు అతని త్యాగం యొక్క ఆశీర్వాద ఫలితాలను స్వీకరించడం ద్వారా మనం క్రీస్తులో పాలుపంచుకుంటాము. ద్రాక్షారసం క్రీస్తు రక్తాన్ని సూచిస్తుంది. శాసనం యొక్క ప్రతి అంశంలో దేవుణ్ణి గుర్తించమని బోధించడానికి క్రీస్తు కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన ఆ గిన్నెను శిష్యులకు అందజేసినప్పుడు, “మీరంతా త్రాగండి” అని ఆజ్ఞాపించాడు. పాప క్షమాపణ, పునాది ఆశీర్వాదం, ప్రభువు రాత్రి భోజనం సమయంలో నిజమైన విశ్వాసులందరికీ అందించబడుతుంది. క్రీస్తు ఈ కమ్యూనియన్‌కు వీడ్కోలు పలికాడు, అయితే భవిష్యత్తులో సంతోషకరమైన పునఃకలయిక గురించి వారికి హామీ ఇస్తాడు: "ఆ రోజు వరకు నేను దానిని మీతో కొత్తగా త్రాగే వరకు," సాధువులు ప్రభువైన యేసుతో పంచుకునే రాబోయే స్థితి యొక్క ఆనందాలు మరియు మహిమలను సూచిస్తుంది. అది అతని తండ్రి రాజ్యం అవుతుంది, అక్కడ ఓదార్పు ద్రాక్షారసం ఎప్పటికీ నూతనంగా ఉంటుంది. క్రీస్తు విరిగిన శరీరానికి సంబంధించిన బాహ్య చిహ్నాలను మనం పరిశీలిస్తున్నప్పుడు, మన పాప విముక్తి కోసం రక్తాన్ని చిందిస్తున్నప్పుడు, ఆయన తన మాంసాన్ని తినడానికి మరియు అతని రక్తాన్ని మన కోసం త్రాగడానికి ఇచ్చినంత ఖర్చవుతుందని గుర్తుంచుకోండి. .

అతను తన శిష్యులను హెచ్చరించాడు. (31-35) 
పీటర్‌కు సమానమైన అసమంజసమైన స్వీయ-హామీ పతనానికి ప్రారంభ మార్గాన్ని సూచిస్తుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం మనందరిలో సహజంగా ఉంటుంది. అయినప్పటికీ, చాలా స్వీయ-హామీ ఉన్నవారు తరచుగా వేగంగా మరియు అత్యంత తీవ్రమైన పతనాలను అనుభవిస్తారు. తమను తాము అత్యంత అగమ్యగోచరులుగా భావించే వారు తక్కువ సురక్షితమైనవారు. అలాంటి వ్యక్తులు తక్కువ అప్రమత్తంగా ఉన్నప్పుడు వారిని తప్పుదారి పట్టించేందుకు సాతాను చురుకుగా పనిచేస్తాడు మరియు వినయాన్ని పెంపొందించడానికి దేవుడు వారిని వారి స్వంత మార్గానికి వదిలివేయడానికి అనుమతించవచ్చు.

తోటలో అతని వేదన. (36-46) 
మానవత్వం యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం అందించిన వ్యక్తి, మానవత్వం మొదట తిరుగుబాటు చేసిన ఆనందపు తోటకి భిన్నంగా, బాధల తోటలో ఇష్టపూర్వకంగా దైవిక సంకల్పానికి లోనయ్యాడు. తోటలోని ఆ బాధాకరమైన భాగంలో, క్రీస్తు తన రూపాంతరం సమయంలో తన మహిమను చూసిన వారిని మాత్రమే ఎంచుకున్నాడు. విశ్వాసం ద్వారా, ఆయన మహిమను వీక్షించిన వారు క్రీస్తుతో బాధలను సహించడానికి ఉత్తమంగా సిద్ధంగా ఉన్నారు. అతని స్థితిని వర్ణించడానికి ఉపయోగించిన పదాలు పూర్తి నిస్పృహ, విస్మయం, వేదన మరియు మనస్సు యొక్క భయానకతను సూచిస్తాయి-ఇది దుఃఖంతో చుట్టుముట్టడం, కష్టాలచే మునిగిపోవడం మరియు దాదాపుగా భయాందోళనలు మరియు భయాందోళనలతో మునిగిపోతుంది. అతని దుఃఖం ఆ తోటలో ప్రారంభమైంది మరియు "ఇది పూర్తయింది" అని అతను ప్రకటించే వరకు ఆగలేదు. వీలైతే, బాధల కప్పును అతని నుండి తీసుకోమని అతను ప్రార్థించాడు. అయినప్పటికీ, మన విమోచనం మరియు మోక్షానికి ఇష్టపూర్వకంగా లొంగి, తన బాధల భారాన్ని మోయడానికి పరిపూర్ణ సంసిద్ధతను ప్రదర్శించాడు.
క్రీస్తు మాదిరిని అనుసరించి, మన స్వభావం ప్రతిఘటించినప్పటికీ, దేవుడు మన చేతుల్లో ఉంచిన చేదు కప్పు నుండి మనం త్రాగాలి. మన దృష్టి కష్టాలను తొలగించడం కంటే వాటిని పవిత్రం చేయడం మరియు వాటి క్రింద మన హృదయాలలో సంతృప్తిని కనుగొనడంపై ఉండాలి. అదృష్టవశాత్తూ, మన మోక్షం నిద్రపోని లేదా నిద్రపోని వ్యక్తి చేతిలో ఉంది. ప్రతి ఒక్కరూ టెంప్టేషన్‌ను ఎదుర్కొంటున్నప్పుడు, దానిలోకి ప్రవేశించకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. దీని నుండి జాగ్రత్తగా ఉండాలంటే, సురక్షితంగా ఉండటానికి మద్దతు కోసం మనం తప్పక చూడాలి, ప్రార్థించాలి మరియు నిరంతరం ప్రభువు వైపు చూడాలి.
నిస్సందేహంగా, మన ప్రభువు తాను అనుభవించబోయే బాధల గురించి స్పష్టమైన మరియు పూర్తి అవగాహన కలిగి ఉన్నాడు, అయినప్పటికీ అతను ఈ క్షణం వరకు చాలా ప్రశాంతంగా మాట్లాడాడు. క్రీస్తు, ష్యూరిటీగా, మన పాపాలకు జవాబుదారీగా ఉంటాడు, మన కోసం పాపంగా మార్చబడ్డాడు మరియు మన పాపాల కోసం బాధపడ్డాడు-అన్యాయానికి న్యాయమైనవాడు. స్క్రిప్చర్ అతని అత్యంత తీవ్రమైన బాధలను దేవుని చేతికి ఆపాదించింది. అతను పాపం యొక్క అనంతమైన చెడు గురించి పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, అతను ప్రాయశ్చిత్తం చేయాల్సిన అపరాధం యొక్క విస్తారమైన పరిధి మరియు దైవిక న్యాయం మరియు పవిత్రత గురించి లోతైన అవగాహన, మానవ పాపాలకు తగిన శిక్షతో పాటు, పదాలు వ్యక్తీకరించగల లేదా మనస్సు ఊహించగల దాని కంటే ఎక్కువ. . అదే సమయంలో, క్రీస్తు టెంప్టేషన్‌ను ఎదుర్కొన్నాడు, సాతాను సూచించిన భయంకరమైన ఆలోచనలను ఎదుర్కొంటాడు, అది చీకటి మరియు భయంకరమైన ముగింపులకు దారితీసింది, అతని పరిపూర్ణ పవిత్రత ద్వారా మరింత సవాలుగా మారింది. తన శక్తితో కూడిన మాట ద్వారా సమస్తాన్ని సమర్థించే వ్యక్తి యొక్క ఆత్మను ఆరోపించబడిన అపరాధ భారం మోపినట్లయితే, వారి పాపాలు తమ తలపైనే ఉండిపోయే వారు ఎంత దయనీయంగా ఉంటారు! ఇంత గొప్ప మోక్షాన్ని విస్మరించిన వారికి ఏ గతి ఎదురుచూస్తుంది?

అతను ద్రోహం చేయబడ్డాడు. (47-56) 
శిష్యరికమని చెప్పుకుంటూ, ముద్దుతో క్రీస్తుకు ద్రోహం చేసే వారి కంటే అసహ్యకరమైన శత్రువులు ఎవరూ లేరు. దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చడానికి మన సేవలను, మన పాపాలను మాత్రమే కోరుకోడు. క్రీస్తు బలహీనమైన స్థితిలో సిలువ వేయబడినప్పుడు, అది స్వచ్ఛంద బలహీనత; అతను ఇష్టపూర్వకంగా మరణానికి సమర్పించుకున్నాడు. అతను బాధలను భరించడానికి ఇష్టపడకపోతే, వారు అతనిని అధిగమించలేరు. యేసును వెంబడించడం సర్వస్వాన్ని విడిచిపెట్టిన వారు ఇప్పుడు తెలియని కారణాల వల్ల ఆయనను విడిచిపెట్టడం ఘోరమైన పాపం. మృత్యుభయంతో, జీవితానికి మూలం అని వారు గుర్తించి, అంగీకరించిన వ్యక్తి నుండి దూరంగా ఉండటం ఎంత మూర్ఖత్వం!

కైఫాకు ముందు క్రీస్తు. (57-68) 
యేసు తొందరగా యెరూషలేములోకి ప్రవేశించాడు, అతని చుట్టూ ముందస్తు వాతావరణం ఉంది. క్రీస్తు శిష్యులుగా ఉండాలనే ఆసక్తి ఉన్నవారు తమ విధేయతను బహిరంగంగా ప్రకటించడానికి ఇష్టపడనప్పుడు ఇది కలవరపెడుతుంది. ఇది పీటర్ యొక్క తిరస్కరణకు నాంది పలికింది, ఎందుకంటే క్రీస్తు నుండి తనను తాను దూరం చేసుకోవడం అనేది వెనుదిరగడానికి మొదటి అడుగు. ఫలితం యొక్క వివరాలను అబ్సెసివ్‌గా ఆలోచించే బదులు, మన దృష్టి రాబోయే దేనికైనా సిద్ధపడాలి. ఫలితం దేవునిది, కానీ బాధ్యత మనపై ఉంది.
ఈ సమయంలో, క్రీస్తుకు వ్యతిరేకంగా తప్పుడు సాక్షుల పెరుగుదలను ధృవీకరిస్తూ లేఖనాలు నెరవేరాయి. అతని ఆరోపణ మనలను శిక్ష నుండి తప్పించడానికి ఉపయోగపడింది. ఇలాంటి బాధల క్షణాలలో, మన విధి మన మాస్టర్ కంటే అనుకూలంగా ఉండకపోవచ్చని మనం గుర్తుంచుకోవాలి. క్రీస్తు మన పాపాలను భరించినప్పుడు, అతను నిశ్శబ్దాన్ని ఎంచుకున్నాడు, అతని రక్తాన్ని అతని కోసం మాట్లాడనివ్వండి.
ఇప్పటి వరకు, యేసు తనను తాను దేవుని కుమారుడైన క్రీస్తు అని చాలా అరుదుగా ప్రకటించుకున్నాడు. అతని బోధనలు మరియు అద్భుతాలు అంతర్లీనంగా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు, అతను ఇప్పుడు బహిరంగంగా దానిని ఒప్పుకున్నాడు, రాబోయే బాధలను తప్పించుకోవడానికి నిరాకరించాడు. ఈ ఒప్పుకోలు అతని అనుచరులకు ఒక ఉదాహరణగా పనిచేసింది, ప్రమాదాలు ఉన్నప్పటికీ అతనిని బహిరంగంగా గుర్తించమని వారిని ప్రోత్సహించింది. మహిమాన్వితుడైన ప్రభువును ధిక్కరించిన వారి నుండి గురువు బఫెటింగ్ మరియు ఎగతాళిని ఎదుర్కొన్నట్లే శిష్యుడు అసహ్యాన్ని, క్రూరమైన ఎగతాళిని మరియు అసహ్యాన్ని ఆశించాలి. ఈ సంఘటనలు యెషయా యాభైవ అధ్యాయంలోని అంచనాలతో సరిగ్గా సరిపోతాయి. మనం క్రీస్తు పేరును ధైర్యంగా ఒప్పుకుందాం, ఎలాంటి నిందలు వచ్చినా ఆలింగనం చేద్దాం, ఎందుకంటే అతను తన తండ్రి సింహాసనం ముందు మనల్ని అంగీకరిస్తాడు.

పీటర్ అతనిని తిరస్కరించాడు. (69-75)
పేతురు చేసిన పాపపు వృత్తాంతం లేఖనాలతో నమ్మకంగా సరిపోయింది. చెడు సాంగత్యంతో సహవాసం చేయడం పాపానికి దారితీయవచ్చు మరియు ఇష్టపూర్వకంగా అందులో మునిగిపోయేవారు పేతురు అనుభవంలో చూసినట్లుగా ప్రలోభాలను మరియు చిక్కులను ఊహించాలి. అటువంటి సంస్థ నుండి నిష్క్రమించడం తరచుగా అపరాధం లేదా దుఃఖంతో భారంగా ఉంటుంది, రెండూ కాకపోయినా. క్రీస్తును తప్పించడం ఒక ముఖ్యమైన తప్పు, మరియు అతనిని గుర్తించడానికి పిలిచినప్పుడు అతని గురించి తెలియనట్లు నటించడం, ముఖ్యంగా, తిరస్కరణ. పీటర్ పాపం తీవ్రమైనది అయినప్పటికీ, ఉద్దేశ్యంతో ద్రోహం చేసిన జుడాస్‌లా కాకుండా అది హఠాత్తుగా జరిగింది.
మరచిపోయిన పాపాలను గుర్తు చేస్తూ కోడి కూతలా మనస్సాక్షి పనిచేయాలి. పీటర్ పతనం అతని ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడానికి ఉపయోగపడింది, వినయం, కరుణ మరియు ఇతరులకు ఉపయోగకరం. విశ్వాసులు చరిత్రలో ఈ సంఘటన నుండి పాఠాలు నేర్చుకున్నారు. అవిశ్వాసులు, పరిసయ్యులు మరియు వేషధారులు వంటి పొరపాట్లు చేసేవారు లేదా దుర్వినియోగం చేసేవారు తమ స్వంత పూచీతో అలా చేస్తారు. సవాలుతో కూడిన పరిస్థితులలో, మనమే వదిలేస్తే మన స్వంత చర్యలను మనం తరచుగా తక్కువగా అంచనా వేస్తాము. కాబట్టి, తాము స్థిరంగా ఉన్నామని విశ్వసించే వారు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి; మనమందరం మన హృదయాలపై అపనమ్మకం కలిగి ఉండాలి మరియు పూర్తిగా ప్రభువుపై ఆధారపడాలి.
పేతురు మిక్కిలి ఏడుపు పాపానికి అవసరమైన దుఃఖాన్ని ప్రతిబింబిస్తుంది. అతని కన్నీటి తిరస్కరణ ఉన్నప్పటికీ, అతను మరలా క్రీస్తును తిరస్కరించలేదు మరియు ప్రమాదంలో కూడా ధైర్యంగా అతనిని ఒప్పుకున్నాడు. ఏదైనా పాపం పట్ల నిజమైన పశ్చాత్తాపం వ్యతిరేక ధర్మాలు మరియు కర్తవ్యాల ప్రదర్శనలో వ్యక్తమవుతుంది, ఇది చేదు మాత్రమే కాదు, హృదయపూర్వక దుఃఖాన్ని సూచిస్తుంది.



Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |