Matthew - మత్తయి సువార్త 27 | View All

1. ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును, ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచనచేసి

1. తెల్లవారాక ప్రధాన యాజకులు, పెద్దలు అంతా సమావేశమై యేసును చంపటానికి నిశ్చయించారు.

2. ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి.

2. వాళ్ళాయన్ని బంధించి తీసుకెళ్ళి రాష్ట్ర పాలకుడైన పిలాతుకు అప్పగించారు.

3. అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి

3. యేసుకు ద్రోహం చేసిన యూదా యేసుని చంపటానికి నిశ్చయించారని విని చాలా బాధ పడ్డాడు. తాను తీసుకొన్న ముప్పై వెండి నాణాల్ని ప్రధాన యాజకులకు, పెద్దలకు తిరిగి యిచ్చేస్తూ

4. నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారుదానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా

4. “‘నేను పాపం చేసాను. ఆ అమాయకుణ్ణి చావుకు అప్పగించాను” అని అన్నాడు. వాళ్ళు, “అది నీ గొడవ. మాకు సంబంధం లేదు” అని సమాధానం చెప్పారు.

5. అతడు ఆ వెండి నాణ ములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టు కొనెను.

5. యూదా ఆ డబ్బును దేవాలయంలో పారవేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు.

6. ప్రధానయాజకులు ఆ వెండి నాణములు తీసికొని ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి.

6. ప్రధానయాజకులు నాణాల్ని తీసికొని, “ఇది రక్తాని కోసం చెల్లించిన డబ్బు కనుక ఈ డబ్బును ధనాగారంలో ఉంచటం మంచిది కాదు” అని అన్నారు.

7. కాబట్టి వారు ఆలోచనచేసి వాటినిచ్చి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి.

7. వాళ్ళు ఆలోచించి ఆ ధనంతో విదేశీయుల్ని సమాధి చెయ్యటానికి ఉపయోగపడేటట్లు ఒక కుమ్మరి వాని పొలాన్ని కొన్నారు.

8. అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది.

8. అందువల్లే ఈ నాటికీ ఆ పొలాన్ని ‘రక్తపు భూమి’ అని అంటారు.

9. అప్పుడువిలువ కట్టబడినవాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది
యిర్మియా 32:6-9, జెకర్యా 11:12-13

9.

10. వెండి నాణములు తీసికొని ప్రభువు నాకు నియ మించినప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున కిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడినమాట నెరవేరెను.
యిర్మియా 32:6-9, జెకర్యా 11:12-13

10.

11. యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతియూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచినీవన్నట్టే అనెను

11. యేసు రాష్ట్రపాలకుని ముందు నిల్చున్నాడు. ఆ రాష్ట్రపాలకుడు, “నీవు యూదులకు రాజువా?” అని యేసును అడిగాడు. “ఔను! నీవన్నది నిజం!” అని యేసు సమాధానం చెప్పాడు.

12. ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.
యెషయా 53:7

12. ప్రధాన యాజకులు, పెద్దలు ఆయనపై నేరారోపణలు చేస్తూ పోయారు. కాని ఆయన సమాధానం చెప్పలేదు.

13. కాబట్టి పిలాతు నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను.

13. అప్పుడు పిలాతు, “వాళ్ళు నీైపె యిన్ని నేరాలు మోపుతున్నారు కదా! నీవు వినటం లేదా?” అని అడిగాడు.

14. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.
యెషయా 53:7

14. యేసు ఒక్క నేరారోపణకు కూడా సమాధానం చెప్పలేదు. రాష్ట్రపాలకునికి చాలా ఆశ్చర్యం వేసింది.

15. జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక.

15. పండుగ రోజుల్లో ప్రజలు కోరిన ఒక నేరస్తుణ్ణి విడుదల చేసే ఆచారాన్ని ఆ రాష్ట్రపాలకుడు ఆచరిస్తూ ఉండేవాడు.

16. ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ చెరసాలలో ఉండెను.

16. ఆ రోజుల్లో బరబ్బ అనే ప్రసిద్ధిగాంచిన ఒక నేరస్తుడు కారాగారంలో ఉన్నాడు.

17. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవనిని

17. అందువల్ల ప్రజలు సమావేశమయ్యాక పిలాతు, “ఎవర్ని విడుదల చెయ్యమంటారు? బరబ్బనా లేక క్రీస్తు అని పిలువబడే యేసునా?” అని వాళ్ళనడిగాడు.

18. విడుదలచేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి యుండెను

18. అసూయవల్ల వాళ్ళు యేసుని తనకప్పగించారని పిలాతుకు తెలుసు.

19. అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య - నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయ ననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను.

19. పిలాతు న్యాయపీఠంపై కూర్చోబోతుండగా అతని భార్య, “ఆ నీతిమంతుని విషయంలో జోక్యం కలిగించుకోకండి. నిన్న రాత్రి ఆయన గురించి కలగన్నాను. ఆ కలలో ఎన్నో కష్టాలను అనుభవించాను” అన్న సందేశాన్ని పంపింది.

20. ప్రధానయాజకులును పెద్దలును, బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి

20. బరబ్బాను విడుదల చేసి యేసుకు మరణ దండన విధించేటట్లు కోరుకోమని ప్రధాన యాజకులు, పెద్దలు ప్రజల్ని ప్రోద్బలం చేసారు.

21. అధిపతి ఈ యిద్దరిలో నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారినడుగగా వారు బరబ్బనే అనిరి.

21. 1”ఇద్దర్లో నన్ను ఎవర్ని విడుదల చెయ్యమంటారు?” అని రాష్ట్రపాలకుడు అడిగాడు. “బరబ్బను” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

22. అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారినడుగగా సిలువవేయుమని అందరును చెప్పిరి.

22. “మరి ‘క్రీస్తు’ అని పిలువబడే ఈ యేసును నన్నేమి చెయ్యమంటారు?” అని పిలాతు అడిగాడు. అంతా, “సిలువకు వెయ్యండి!” అని సమాధానం చెప్పారు.

23. అధిపతి ఎందుకు? ఇతడు ఏ దుష్కా ర్యము చేసెనని అడుగగా వారుసిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.

23. “ఆయనేం తప్పు చేసాడు?” అని పిలాతు అడిగాడు. కాని వాళ్ళు, “అతన్ని సిలువకు వెయ్యండి” అని యింకా బిగ్గరగా కేకలు వేసారు.

24. పిలాతు అల్లరి ఎక్కువగు చున్నదే గాని తనవలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొనిఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను.
ద్వితీయోపదేశకాండము 21:6-9, కీర్తనల గ్రంథము 26:6

24. లాభం కలగటానికి మారుగా అల్లర్లు మొదలవటం పిలాతు గమనించాడు. తరువాత అతడు నీళ్ళు తీసుకొని ప్రజలముందు ఆ నీళ్ళను చేతులు మీదుగా వదుల్తూ, “ఈయన రక్తానికి నేను బాధ్యుణ్ణికాను. ఇది మీ బాధ్యత!” అని అన్నాడు.

25. అందుకు ప్రజ లందరువాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.
యెహెఙ్కేలు 33:5

25. ప్రజలు, “అతని రక్తానికి మేము, మా సంతానము బాధ్యత వహిస్తాము!” అని సమాధానం చెప్పారు.

26. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.

26. ఆ తర్వాత పిలాతు బరబ్బను విడుదల చేసాడు. కాని యేసును కొరడా దెబ్బలు కొట్టించి సిలువకు వేయటానికి అప్పగించాడు.

27. అప్పుడు అధిపతియొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసికొనిపోయి, ఆయనయొద్ద సైనికుల నందరిని సమకూర్చిరి.

27. ఆ తర్వాత రాష్ట్రపాలకుని సైనికులు యేసును కోటకు తీసుకు వెళ్ళారు. దళానికి చెందిన సైనికులందరూ ఆయన చుట్టూ చేరారు.

28. వారు ఆయన వస్త్రములు తీసి వేసి, ఆయనకు ఎఱ్ఱని అంగీ తొడిగించి

28. ఆయన దుస్తుల్ని విప్పి, ఎఱ్ఱ రంగుగల ఒక పొడుగాటి వస్త్రాన్ని ఆయనకు తొడిగించారు.

29. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి

29. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలపై పెట్టారు. ఆయన కుడి చేతికి ఒక బెత్తాన్నిచ్చారు. ఆయన ముందు మోకరిల్లి నమస్కరిస్తూ, “యూదుల రాజా! జయము” అని హేళన చేసారు.

30. ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి.
యెషయా 50:6

30. ఆయన మీద ఉమ్మివేసారు. బెత్తాన్ని తీసుకొని దాంతో ఆయన తలపై కొట్టారు.

31. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రము లాయనకు తొడిగించి, సిలువ వేయుటకు ఆయనను తీసికొని పోయిరి.

31. ఆయన్ని హేళన చేసాక ఆ పొడుగాటి వస్త్రాన్ని తీసేసి ఆయన దుస్తుల్ని ఆయనకు తొడిగించారు. ఆ తదుపరి ఆయన్ని సిలువకు వెయ్యటానికి తీసుకెళ్ళారు.

32. వారు వెళ్లుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువమోయుటకు అతనిని బలవంతము చేసిరి.

32. వాళ్ళు బయటికి వెళ్తూండగా కురేనే పట్టణానికి చెందిన సీమోను అనేవాడు కనిపించాడు. అతణ్ణి బలవంతం చేసి యేసు సిలువను మొయ్యమన్నారు.

33. వారు కపాలస్థలమను అర్థమిచ్చు గొల్గొతా అన బడిన చోటికి వచ్చి

33. వాళ్ళు గొల్గొతా అనే స్థలాన్ని చేరుకున్నారు. గొల్గొతా అంటే “పుర్రెలాంటి స్థలం” అని అర్థం.

34. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.
కీర్తనల గ్రంథము 69:21, కీర్తనల గ్రంథము 69:26

34. అక్కడ చేదుకలిపిన ద్రాక్షరసాన్ని యేసుకు త్రాగటానికి యిచ్చారు. కాని రుచి చూసాక దాన్ని త్రాగటానికి ఆయన నిరాకరించాడు.

35. వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి.
కీర్తనల గ్రంథము 22:18

35. ఆయన్ని సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని చీట్లువేసి పంచుకున్నారు.

36. అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి యుండిరి.

36. సైనికులు కూర్చొని ఆయనకు కాపలా కాశారు.

37. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి.

37. ఆయనపై ఆరోపించిన, “ఇతడు యూదుల రాజు” అన్న నేరాన్ని వ్రాసి ఆయన తల పై భాగాన ఉంచారు.

38. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడ సిలువవేయ బడిరి.
యెషయా 53:12, కీర్తనల గ్రంథము 69:21

38. ఆ తదుపరి ఆయనతో పాటు దోపిడి దొంగలిద్దర్ని ఒకణ్ణి కుడివైపు, మరొకణ్ణి ఎడమ వైపు సిలువకు వేసారు.

39. ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు
కీర్తనల గ్రంథము 22:7, కీర్తనల గ్రంథము 109:25, విలాపవాక్యములు 2:15

39. ఆ దారిన వెళ్ళిన వాళ్ళు తమ తలలాడిస్తూ ఆయన్ని దూషిస్తూ

40. దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి

40. “దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో పునర్నిర్మాణం చేయగల వాడివి! నిన్ను నీవు రక్షించుకో. నీవు దేవుని కుమారుడవైతే ఆ సిలువ నుండి దిగిరా!” అని అన్నారు.

41. ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు

41. ప్రధానయాజకులు శాస్త్రులతో, పెద్దలతో కలసి ఆయన్ని అదే విధంగా హేళన చేస్తూ,

42. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము.

42. అతడు యితరులను రక్షిస్తాడు. కాని తనను తాను రక్షించుకోలేడు. అతడు ఇశ్రాయేలు ప్రజలకు రాజైనట్లయితే ఆ సిలువ నుండి క్రిందికి దిగిరానీ. అప్పుడతణ్ణి విశ్వసిస్తాము.

43. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.
కీర్తనల గ్రంథము 22:8

43. అతడు దేవుణ్ణి విశ్వసిస్తాడు, ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని అన్నాడు. దేవునికి కావలసివస్తే అతణ్ణి రక్షించుకోమనండి” అని అన్నారు.

44. ఆయనతో కూడ సిలువవేయబడిన బందిపోటు దొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.

44. ఆయనతో సహా సిలువకు వేయబడిన దోపిడి దొంగలు కూడా ఆయన్ని అదేవిధంగా అవమానించారు.

45. మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను.
ఆమోసు 8:9

45. మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది.

46. ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.
కీర్తనల గ్రంథము 22:1

46. సుమారు మూడు గంటలప్పుడు యేసు బిగ్గరగా, “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ?” అని కేక వేసాడు. అంటే, “నా దైవమా! నా దైవమా! నన్నెందుకు ఒంటరిగా ఒదిలివేసావు!’ అని అర్థం.

47. అక్కడ నిలిచియున్నవారిలో కొందరా మాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి.

47. అక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు ఇది విని, “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అని అన్నారు.

48. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని పోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను;

48. ఒకడు వెంటనే పరుగెత్తుకొంటూ వెళ్ళి ఒక ‘స్పాంజి’ తెచ్చాడు. దాన్ని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక బెత్తానికి పెట్టి యేసుకు త్రాగటానికి యిచ్చాడు.

49. తక్కినవారు ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూత మనిరి.

49. కాని యితర్లు, “ఆగండి! అతణ్ణి రక్షించటానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం!” అని అన్నారు.

50. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.

50. యేసు మళ్ళీ ఒక మారు పెద్ద కేక వేసి తన ప్రాణం వదిలి వేసాడు.

51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను;
నిర్గమకాండము 26:31-35

51. అదే క్షణంలో దేవాలయంలోని తెర పైనుండి క్రింది దాకా చినిగి పోయింది. భూకంపం వచ్చి బండలు పగిలి పొయ్యాయి.

52. సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను.
యెహెఙ్కేలు 37:12

52. సమాధులు తెరుచుకొన్నాయి. దేవుడు చనిపోయిన పరిశుద్ధులను అనేకుల్ని బ్రతికించాడు.

53. వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.
యెహెఙ్కేలు 37:12

53. వాళ్ళు సమాధులనుండి వెలుపలికి వచ్చారు. యేసు బ్రతికి వచ్చాక వాళ్ళు పవిత్ర నగరాన్ని ప్రవేశించి చాలా మందికి కనిపించారు.

54. శతాధిపతియు అతనితో కూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడినిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పు కొనిరి.

54. యేసును కాపలా కాస్తున్న శతాధిపతి, సైనికులు భూకంపాన్ని, జరిగిన మిగతా సంఘటల్ని చూసి చాలా భయపడిపోయి, “ఈయన నిజంగా దేవుని కుమారుడే!” అని అన్నారు.

55. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరమునుండి చూచుచుండిరి.

55. చాలా మంది స్త్రీలు కొంత దూరం నుండి చూస్తూ ఉన్నారు. వీళ్ళు యేసుకు ఉపచారాలు చెయ్యటానికి గలిలయ నుండి ఆయన్ని అనుసరిస్తూ వచ్చినవాళ్ళు.

56. వారిలో మగ్దలేనే మరియయు యాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి.

56. వాళ్ళలో మగ్దలేనే గ్రామస్తురాలైన మరియ, యాకోబు, యోసేపు అనువారి తల్లి మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు.

57. యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి
ద్వితీయోపదేశకాండము 21:22-23

57. సాయంత్రం అయ్యింది. యోసేపు అనే ధనవంతుడు అరిమతయియ గ్రామం నుండి వచ్చాడు. యోసేపు కూడా యేసు శిష్యుల్లో ఒకడు

58. పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను.
ద్వితీయోపదేశకాండము 21:22-23

58. అతడు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని యివ్వమని కోరాడు. పిలాతు యివ్వమని ఆజ్ఞాపించాడు.

59. యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి

59. యోసేపు ఆ దేహాన్ని తీసుకొని ఒక క్రొత్త గుడ్డలో చుట్టాడు.

60. తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.

60. ఒక పెద్ద రాయిని తొలిచి తన కోసం నిర్మించుకొన్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచాడు. ఒక రాయిని ఆ సమాధి ద్వారానికి అడ్డంగా దొర్లించి వెళ్ళి పొయ్యాడు.

61. మగ్దలేనే మరియయు, వేరొక మరి యయు, అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి.

61. మగ్దలేనే మరియ, యింకొక మరియ ఆ సమాధికి ఎదురుగా అక్కడే కూర్చొని ఉన్నారు.

62. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి

62. అది విశ్రాంతికి సిద్ధమయ్యే రోజు. మరుసటి రోజు పరిసయ్యులు పిలాతు సమక్షంలో సమావేశమయ్యారు,

63. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది.

63. “అయ్యా! ఆ మోసగాడు బ్రతికి ఉండగా ‘మూడు రోజుల్లో నేను తిరిగి బ్రతికి వస్తాను’ అని అనటం మాకు జ్ఞాపకం ఉంది.

64. కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి.

64. అందువల్ల మూడవ రోజు వరకు ఆ సమాధిని జాగ్రత్తగా కాపలా కాయమని ఆజ్ఞాపించండి. అలా చెయ్యకపోతే అతని శిష్యులు వచ్చి అతని దేహాన్ని దొంగిలించి, ‘అతడు బ్రతికాడు’ అని ప్రజలతో చెప్పవచ్చు. ఈ చివరి మోసం మొదటి మోసం కన్నా ఘోరంగా ఉంటుంది” అని అన్నారు.

65. అందుకు పిలాతు కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను.

65. పిలాతు, “భటుల్ని తీసుకు వెళ్ళండి. వాళ్ళు సమాధిని జాగ్రత్తగా కాపలా కాయటం మీ బాధ్యత” అని చెప్పాడు.

66. వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి.

66. వాళ్ళు వెళ్ళి రాతికి ముద్రవేసి భటుల్ని ఆ సమాధికి కాపలా ఉంచి దాన్ని భద్రం చేసారు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 27 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible


క్రీస్తు పిలాతుకు అప్పగించాడు, జుడాస్ యొక్క నిరాశ. (1-10) 
దుర్మార్గులు తరచూ తమ నేరాలకు పాల్పడే సమయంలో వాటి యొక్క పూర్తి పరిణామాలను గ్రహించడంలో విఫలమవుతారు, అయినప్పటికీ వారు చివరికి జవాబుదారీగా ఉంటారు. జుడాస్ తన తప్పును ప్రధాన పూజారులకు బహిరంగంగా అంగీకరించాడు, ఒక అమాయక వ్యక్తికి ద్రోహం చేశాడని అంగీకరిస్తూ, క్రీస్తు పాత్రకు స్పష్టమైన సాక్ష్యాన్ని అందించాడు. ఇంత జరుగుతున్నా నేతలు మాత్రం నిక్కచ్చిగా ఉన్నారు. నిరాశతో మరియు దైవిక కోపం యొక్క భయాన్ని భరించలేక, జుడాస్ డబ్బును కిందకు విసిరి, వెళ్లి, ఉరి వేసుకున్నాడు. జుడాస్ మరణం జీసస్ మరణానికి ముందే జరిగి ఉండవచ్చు, కానీ నాయకులు యేసు రక్తం కోసం దాహం వేయడం, అతనికి ద్రోహం చేయడానికి జుడాస్‌ను నియమించడం మరియు అన్యాయంగా అతనికి మరణశిక్ష విధించడంలో వారి పాత్ర పట్ల ఉదాసీనంగా కనిపించారు. ఇది పాపాన్ని చిన్నచూపు చూసే మూర్ఖత్వాన్ని మరియు ఇతరుల తప్పులపై దృష్టి సారించడం ద్వారా తమ సొంత పాపాలను తక్కువ చేసి చూపే ధోరణిని ఎత్తిచూపుతుంది. దేవుని తీర్పు సత్యం మీద ఆధారపడి ఉంటుంది. జెకర్యా 11:12లోని ప్రవచనాన్ని నెరవేర్చడం ద్వారా క్రీస్తు రక్తం ద్వారా అపరిచితులకు మరియు అన్యజాతి పాపులకు అందించిన దయకు చిహ్నంగా జుడాస్ తిరిగి వచ్చిన డబ్బుతో భూమిని కొనుగోలు చేయడం కొందరు వ్యాఖ్యానిస్తారు. జుడాస్ పశ్చాత్తాపం వైపు అడుగులు వేసాడు కానీ మోక్షానికి దూరమయ్యాడు. "నేను స్వర్గానికి వ్యతిరేకంగా పాపం చేసాను, తండ్రీ" అని చెప్పి దైవిక క్షమాపణను పొందడంలో అతను విఫలమైనందున అతని ఒప్పుకోలు దేవునికి కాదు, అధికారుల వైపు మళ్ళింది. అహంకారం, శత్రుత్వం మరియు తిరుగుబాటుతో సహజీవనం చేసే అసంపూర్ణ నేరారోపణలను పరిష్కరించకుండా ఇది హెచ్చరిక రిమైండర్‌గా పనిచేస్తుంది.

పిలాతు ముందు క్రీస్తు. (11-25) 
పిలాతు యేసు పట్ల ఎలాంటి ద్వేషాన్ని కలిగి ఉండనప్పటికీ, అతను అతనిని నిర్దోషిగా చేయడానికి ప్రయత్నించాడు మరియు అతనిని విడుదల చేయమని కోరాడు. పిలాతు భార్య నుండి వచ్చిన హెచ్చరిక హెచ్చరిక సూచనగా పనిచేసింది. పాపులను వారి తప్పుడు పనులలో నిరోధించడానికి దేవుడు వివిధ మార్గాలను ఉపయోగిస్తాడు, అంటే ప్రొవిడెన్స్ నుండి జోక్యం, దృఢమైన స్నేహితులు మరియు మన స్వంత మనస్సాక్షి. "ప్రభువు అసహ్యించుకునే ఈ హేయమైన పనిలో పాల్గొనవద్దు!" అనే ఉపదేశాన్ని మనం విన్నప్పుడు. మనం టెంప్టేషన్‌ను సమీపిస్తున్నప్పుడు, దానిని గమనించడం తెలివైన పని. పూజారుల ప్రభావంతో ప్రజలు బరబ్బాను ఎంచుకున్నారు. దేవుని కంటే ప్రపంచాన్ని తమ పాలకుడిగా మరియు వారసత్వంగా ఎంచుకునే చాలా మంది, సారాంశంలో, వారి స్వంత భ్రమలను ఎంచుకుంటున్నారు. క్రీస్తు మరణం పట్ల యూదుల అచంచలమైన దృఢ నిశ్చయం పిలాతుకు కట్టుబడి ఉండవలసిందిగా భావించి, అత్యంత కఠినంగా ఉన్న వ్యక్తులపై కూడా మనస్సాక్షి ప్రభావాన్ని వెల్లడి చేసింది. అయినప్పటికీ, క్రీస్తు తన తప్పు కోసం కాకుండా తన ప్రజల పాపాల కోసం సహించాడని నొక్కిచెప్పడానికి ప్రతి వివరాలు విప్పబడ్డాయి. అమాయక రక్తం యొక్క అపరాధం నుండి తనను తాను రక్షించుకోవడానికి పిలేట్ చేసిన వ్యర్థమైన ప్రయత్నం స్పష్టంగా కనిపించింది. యూదులు స్వయంగా విధించుకున్న శాపం వారి దేశం యొక్క బాధలలో దాని భయంకరమైన నెరవేర్పును కనుగొంది. పాపం లేనివాడు మాత్రమే ఇతరుల పాపాలను భరించగలడు. మనమందరం చిక్కుకోలేదా? పాపులు తమ ప్రియమైన పాపాలను అంటిపెట్టుకుని ఉండటానికి మోక్షాన్ని తిరస్కరించినప్పుడు, తద్వారా దేవుని మహిమను దోచుకుని, వారి ఆత్మలను ప్రమాదంలో పడవేసినప్పుడు, వారు యేసు కంటే బరబ్బను ఎన్నుకోవడం లేదా? యూదుల తిరస్కరణ పర్యవసానంగా క్రీస్తు రక్తం ఇప్పుడు మన ప్రయోజనం కోసం మనపై ఉంది. అందుచేత మనం దానిని శరణు వేడుకుందాం.

బరబ్బా వదులుకున్నాడు, క్రీస్తు వెక్కిరించాడు. (26-30) 
సిలువ వేయడం, రోమన్‌లకు ప్రత్యేకమైన మరణశిక్ష, అనూహ్యంగా భయంకరమైనది మరియు వేదన కలిగించేది. ఈ ప్రక్రియలో నేలపై శిలువను వేయడం, చేతులు మరియు కాళ్ళను గోళ్ళతో భద్రపరచడం, ఆపై దానిని పైకి లేపడం మరియు నిటారుగా అమర్చడం వంటివి ఉన్నాయి. మరణం సంభవించే వరకు వారి శరీర బరువు గోళ్లపై వేలాడదీయడం వల్ల వ్యక్తి విపరీతమైన నొప్పిని భరిస్తాడు. ఈ విధంగా, క్రీస్తు ఒక స్తంభంపై పెరిగిన ఇత్తడి పాము యొక్క ప్రతీకాత్మకతను నెరవేర్చాడు. మనకు నిత్యజీవం, ఆనందం మరియు కీర్తిని పొందేందుకు ఆయన ఇష్టపూర్వకంగా చిత్రీకరించబడిన దుఃఖాన్ని మరియు అవమానాన్ని అనుభవించాడు.

క్రీస్తు శిలువ వేయబడటానికి దారితీసింది. (31-34) 
క్రీస్తు ఒక గొఱ్ఱెపిల్ల వలె వధకు నడిపించబడ్డాడు, బలిపీఠానికి బలి అర్పించాడు. దుర్మార్గుల దయ కూడా నిజంగా క్రూరంగా ఉంటుంది. వారు అతని నుండి సిలువను తీసుకున్నారు మరియు దానిని మోయమని సైమన్‌ను బలవంతం చేశారు. ప్రభూ, నీవు మాకు అప్పగించిన శిలువలను భరించేందుకు మమ్మల్ని సిద్ధం చేయి, మేము నిన్ను వెంబడిస్తున్నప్పుడు సంతోషంతో ప్రతిరోజూ వాటిని ఇష్టపూర్వకంగా తీసుకుంటాము. అతనితో పోల్చదగిన దుఃఖం ఎప్పుడైనా ఉందా? ఆయన మరణించిన తీరును మనం చూసినప్పుడు, మనపట్ల ఆయనకున్న అసాధారణ ప్రేమను అందులో చూద్దాం. బాధాకరమైన మరణం సరిపోదన్నట్లుగా, వారు దాని చేదును మరియు భయాన్ని వివిధ మార్గాల్లో తీవ్రతరం చేశారు.

అతను సిలువ వేయబడ్డాడు. (35-44) 
తప్పు చేసేవారిని వారి నేరాల గురించి వ్రాతపూర్వక నోటీసును ప్రదర్శించడం ద్వారా బహిరంగంగా అవమానించడం ఆచారం, మరియు వారు క్రీస్తు తలపై అదే చేశారు. నిందగా భావించినప్పటికీ, దేవుడు దానిని తిప్పికొట్టాడు, తద్వారా ఆ నింద కూడా అతనికి గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఇద్దరు దొంగలు అతనితో పాటు సిలువ వేయబడ్డారు, మన మరణాలలో, మనం పరిశుద్ధులలో లెక్కించబడటానికి, అతిక్రమించినవారిలో అతని మరణాన్ని సూచిస్తారు. అతను అనుభవించిన అవమానాలు మరియు అవహేళనలు ఇక్కడ నమోదు చేయబడ్డాయి. క్రీస్తు విరోధులు మతం గురించి మరియు దేవుని ప్రజల గురించి ఇతరులను మోసం చేయడానికి ప్రయత్నిస్తారు, అసత్యమని తమకు తెలిసిన అబద్ధాలను ప్రచారం చేస్తారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు మరియు పెద్దలు యేసును ఇశ్రాయేలు రాజుగా అభివర్ణించారు. ఇజ్రాయెల్ రాజు సిలువ నుండి దిగివస్తే, అవసరమైన కష్టాలు లేకుండా తన రాజ్యాన్ని కోరుకుంటూ చాలా మంది సంతోషంగా అంగీకరిస్తారు. అయితే, సిలువ లేకుండా, క్రీస్తు లేడు, కష్టాలను భరించకుండా, కిరీటం లేదు. అతనితో కలిసి రాజ్యమేలాలని కోరుకునే వారు అతనితో బాధపడడానికి సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా, యేసు, దేవుని న్యాయాన్ని సంతృప్తి పరచాలనే తన నిబద్ధతను నెరవేర్చడంలో, మానవత్వంలోని చెత్తగా విధించిన శిక్షను స్వీకరించాడు. క్రీస్తు బాధలకు సంబంధించిన ప్రతి వివరాలు, నమోదు చేయబడినట్లుగా, ప్రవక్తలు లేదా కీర్తనలలో కనిపించే అంచనాలతో సరితూగుతాయి.

క్రీస్తు మరణం. (45-50) 
చీకటిలో ఉన్న మూడు గంటలలో, యేసు తీవ్రమైన వేదనను అనుభవించాడు, చీకటి శక్తులతో పోరాడాడు మరియు మానవాళి పాపాల పట్ల తన తండ్రి యొక్క అసంతృప్తిని భరించాడు. ఈ తరుణంలో, అతను తన ఆత్మను త్యాగం చేశాడు. మానవాళిని సృష్టించినప్పటి నుండి ఇంత లోతైన మరియు అరిష్ట కాలం ఎప్పుడూ లేదు; ఇది విముక్తి మరియు మోక్షం యొక్క గొప్ప పథకంలో కీలకమైన క్షణాన్ని గుర్తించింది. యేసుకీర్తనల గ్రంథము 22:1 నుండి ఒక విలాపాన్ని వినిపించాడు, ప్రార్థనకు మార్గనిర్దేశం చేయడంలో మరియు మన ప్రార్థనలలో లేఖనాలను ఉపయోగించడాన్ని సమర్థించడంలో దేవుని వాక్యం యొక్క ప్రయోజనాన్ని ప్రదర్శిస్తుంది.
విశ్వాసులు కొంత చేదును రుచి చూసినప్పటికీ, వారు క్రీస్తు బాధల పరిమాణంలో కొంత భాగాన్ని మాత్రమే గ్రహించగలరు. దీని ద్వారా, వారు పాపుల పట్ల రక్షకుని ప్రేమను, పాపం యొక్క క్రూరమైన స్వభావం గురించి లోతైన అవగాహనను మరియు రాబోయే కోపం నుండి వారిని విడిపించినందుకు క్రీస్తుకు ప్రగాఢమైన కృతజ్ఞత గురించి అంతర్దృష్టిని పొందుతారు. అతని శత్రువులు అతని విలాపాన్ని ఎగతాళి చేశారు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మరియు దాని అనుచరులకు వ్యతిరేకంగా ఎన్ని నిందలు అపోహల నుండి ఉత్పన్నమవుతున్నాయో ఉదాహరించారు.
తన తుది శ్వాసకు ముందు, క్రీస్తు తన జీవితాన్ని బలవంతంగా తీసుకోలేదని, తన తండ్రికి ఇష్టపూర్వకంగా లొంగిపోయాడని నొక్కి చెప్పాడు. అతను మరణం యొక్క అధికారాలను ధిక్కరించాడు, పూజారి మరియు త్యాగం వలె, అతను బిగ్గరగా కేకలు వేయడంతో శాశ్వతమైన ఆత్మ ద్వారా తనను తాను సమర్పించుకున్నాడని ధృవీకరించాడు. అప్పుడు, అతను తన ఆత్మను విడిచిపెట్టాడు. సిలువపై, దేవుని కుమారుడు నిజంగా మరణించాడు, అతనికి కలిగించిన బాధ యొక్క తీవ్రతకు లొంగిపోయాడు. అతని ఆత్మ అతని శరీరం నుండి విడిపోయింది, మరియు అతని నిర్జీవమైన శరీరం అతని మరణాన్ని నిస్సందేహంగా ధృవీకరించింది. క్రీస్తు మరణం పాపం కోసం అర్పణగా మారడానికి అతని నిబద్ధతకు అవసరమైన నెరవేర్పు, ఈ ప్రయోజనం కోసం తన జీవితాన్ని ఇష్టపూర్వకంగా అప్పగించింది.

సిలువలో జరిగిన సంఘటనలు. (51-56) 
ముసుగును చింపివేయడం క్రీస్తు మరణం ద్వారా దేవునికి మార్గం తెరవబడిందని సూచిస్తుంది. క్రీస్తుకు కృతజ్ఞతలు, భవిష్యత్తులో మనకు కృపా సింహాసనం, కరుణాపీఠం మరియు కీర్తి సింహాసనానికి అపరిమితమైన ప్రాప్యత ఉంది. క్రీస్తు మరణాన్ని ధ్యానించడం మన కఠినమైన మరియు లొంగని హృదయాలను విడదీయడానికి దారి తీస్తుంది, ఎందుకంటే ఇది హృదయాన్ని విచ్ఛిన్నం చేయాలి, బట్టలు మాత్రమే కాదు. ఏసుక్రీస్తు శిలువను ఎదుర్కొన్నప్పుడు లొంగని మరియు కదలకుండా ఉండే హృదయం రాయి కంటే కఠినమైనది.
సమాధులు తెరుచుకున్నాయి, నిద్రిస్తున్న సాధువుల అనేక శరీరాలు లేచాయి. వారు ఎలా కనిపించారు, ఏ పద్ధతిలో మరియు ఎలా అదృశ్యమయ్యారు అనే వివరాలు బహిర్గతం చేయబడవు మరియు బహిర్గతం చేయబడిన దానికంటే ఎక్కువ జ్ఞానం పొందాలని మనం కోరుకోకూడదు. శతాధిపతి మరియు రోమన్ సైనికులను పట్టుకున్న భీభత్సంలో కనిపించే విధంగా, అతని ప్రొవిడెన్స్‌లో దేవుని విస్మయం కలిగించే వ్యక్తీకరణలు పాపులను దోషులుగా నిర్ధారించడానికి మరియు మేల్కొల్పడానికి రహస్యమైన మార్గాల్లో పని చేస్తాయి.
యేసు పాత్రను ధృవీకరిస్తున్న సమృద్ధిగా ఉన్న సాక్ష్యాలలో మనం ఓదార్పుని పొందవచ్చు. మనము ఆయన కొరకు జీవించినట్లయితే, మనము మన పాత్రలను సమర్థించుటకు ప్రభువును విశ్వసించడం ద్వారా నేరానికి సరైన కారణం ఇవ్వకుండా తప్పించుకోవడం ద్వారా, మనం ఈ సాక్ష్యాలను ఓదార్పుతో ప్రతిబింబించవచ్చు. విశ్వాసం యొక్క కటకం ద్వారా, క్రీస్తు మరియు అతని సిలువ మరణాన్ని మనం దర్శిద్దాం, అతను మన కోసం బాధలు అనుభవించడానికి దారితీసిన ప్రగాఢమైన ప్రేమతో కదిలిపోతాము. అతని స్నేహితులు అతనికి సహాయం చేయలేకపోయారు, పాపం యొక్క భయానక స్వభావం మరియు పరిణామాలు స్పష్టంగా వెల్లడయ్యాయి, తండ్రి ప్రియమైన కుమారుడు సిలువపై వేలాడదీసిన రోజున, అన్యాయానికి న్యాయంగా బాధలను భరిస్తూ, మమ్మల్ని దగ్గరికి తీసుకువచ్చాడు. దేవునికి. ఆయన సేవకు మనల్ని మనం మనస్ఫూర్తిగా అంకితం చేద్దాం.

క్రీస్తు సమాధి. (57-61)
క్రీస్తు సమాధిలో ఎటువంటి వైభవం లేదా వేడుక లేదు. క్రీస్తుకు తన భూజీవితంలో తన స్వంత ఇల్లు లేనట్లే, మరణంలో అతని శరీరానికి వ్యక్తిగత సమాధి కూడా లేదు. మన ప్రభువైన యేసు, పాపం నుండి విముక్తుడు, అంకితమైన విశ్రాంతి స్థలం లేదు. అతను సిలువ వేయబడిన దొంగలతో పాటు అతనిని దుష్టుల మధ్య పాతిపెట్టాలని యూదులు ఉద్దేశించారు, కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు, యెషయా 53:9 లోని ప్రవచనాన్ని నెరవేర్చాడు.
అంత్యక్రియలకు సాక్ష్యమివ్వడం ద్వారా మానవుల దృష్టిలో భయాన్ని కలిగించవచ్చు, క్రీస్తు తన ఖననం ద్వారా విశ్వాసులకు సమాధి యొక్క స్వభావాన్ని ఎలా మార్చాడో ప్రతిబింబిస్తుంది. మన పాపాల ఆధ్యాత్మిక సమాధిలో స్థిరంగా నిమగ్నమవ్వడం ద్వారా క్రీస్తు సమాధిని అనుకరించడానికి మనం పిలువబడ్డాము.

 సమాధి సురక్షితం. (62-66)
యూదుల సబ్బాత్ రోజున, ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు తమ ఆరాధనలలో నిమగ్నమై ఉండకుండా, సమాధి రక్షణ గురించి పిలాతుతో చర్చిస్తున్నారు. మన ప్రభువు పునరుత్థానానికి కాదనలేని సాక్ష్యాలను నిర్ధారించడానికి ఇది అనుమతించబడింది. సమాధిని వీలైనంత జాగ్రత్తగా భద్రపరచడానికి పిలాతు వారికి అనుమతి ఇచ్చాడు. వారు రాయిని మూసివేశారు, ఒక గార్డును నియమించారు మరియు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని వారు విశ్వసించారు. ఏది ఏమైనప్పటికీ, బలహీనమైన శిష్యుల నుండి సమాధిని రక్షించడానికి ప్రయత్నించడం అనవసరం మరియు మూర్ఖత్వం, అయితే దేవుని శక్తికి వ్యతిరేకంగా దానిని రక్షించాలని ఆలోచించడం వ్యర్థం మాత్రమే కాదు, అర్ధంలేనిది కూడా. వారు తెలివిగా వ్యవహరిస్తున్నారని వారి నమ్మకం ఉన్నప్పటికీ, ప్రభువు వారి కుటిల ప్రణాళికలను వారిపైకి తిప్పాడు. చివరికి, క్రీస్తు శత్రువుల ఆవేశం మరియు పథకాలన్నీ ఆయన మహిమను పెంపొందించడానికి ఉపయోగపడతాయి.



Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |