Galatians - గలతీయులకు 3 | View All

1. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువవేయబడినవాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా!

క్రీస్తు కారణం లేకుండా చనిపోయాడనుకోవడం బుద్ధిహీనత. అయితే కపట బోధకులు ఈ క్రైస్తవులను సరిగ్గా అలాంటి తెలివితక్కువ అభిప్రాయంలోకి నడిపించజూశారు. క్రీస్తు కారణం లేకుండా చనిపోయాడని వారెన్నడూ చెప్పి ఉండేవారు కాదు గానీ క్రీస్తు మరణంతో బాటు ధర్మశాస్త్రాన్ని పాటించడం కూడా అవసరమేనని బోధించడంలో వారు ఆయన మరణం అనవసరమన్నట్టు చెప్తున్నారు. పౌలు వారికి శుభవార్త ప్రకటించినప్పుడు వారికి కళ్ళకు కట్టినట్టుగా చెప్పిన సత్యానికి కూడా అది పూర్తిగా వ్యతిరేకం.

2. ఇది మాత్రమే మీవలన తెలిసికొనగోరుచున్నాను; ధర్మశాస్త్ర సంబంధ క్రియలవలన ఆత్మను పొందితిరా లేక విశ్వాస ముతో వినుటవలన పొందితిరా?

తాను సత్యం ప్రకటించాడన్న దానికి రుజువుగా వారి అనుభవాన్ని కూడా వారు పరిశీలించాలని చెప్తున్నాడు పౌలు. అతడు ప్రకటించిన శుభవార్తను నమ్మినప్పుడు వారు దేవుని ఆత్మను పొందారు (గలతియులకు 4:6; ఎఫెసీయులకు 1:13; అపో. కార్యములు 10:44; రోమీయులకు 8:15 పోల్చి చూడండి). దేవుడు తన ఆత్మను వారిలో నివసించేందుకు అనుగ్రహించాడు. దేనివల్లా? వారు ధర్మశాస్త్రాన్ని పాటించే ప్రయత్నాలు చేస్తున్నందువల్ల కాదు, వారు క్రీస్తును నమ్మినందువల్లే. ఎవరూ ఇంతవరకు మతాచారాలను, విధులను, నియమాలను పాటించడం ద్వారా దేవుని ఆత్మను ఎన్నడూ పొందలేదు. అందరిలోనూ స్వభావ సిద్ధంగా దేవుని ఆత్మ ఉండదని గమనించండి. ఎవరైనా క్రీస్తులో నమ్మకం మూలంగానే ఆ ఆత్మను పొందాలి. యోహాను 14:17 చూడండి.

3. మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీ రానుసారముగా పరిపూర్ణులగుదురా?

వారు నమ్మినప్పుడు దేవుడు తన కృపవల్ల ఏమి చేశాడో దాన్ని అనుభవించారు. ఇప్పుడు స్వప్రయత్నం, ధర్మశాస్త్ర నియమాలు, ఆచారాలు తమను ముందుకు తీసుకువెళ్ళగలవు అనుకోవడం తెలివితక్కువతనం కాదా? మనం అలా అనుకోవడం కూడా అంతే కదా.

4. వ్యర్థముగానేయిన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థ మగునా?

వారి గురించి అతడు సందేహపడుతున్నాడు. కపట బోధకుల ప్రయత్నాలు ఫలిస్తాయా? అక్కడి క్రైస్తవులు భిన్నమైన శుభవార్తను అంగీకరిస్తారా? ఒకవేళ వారి బాధలు వారికి సంపాదించి పెట్టిన ప్రతిఫలాన్ని వారు జారవిడుచుకుంటారా? వారి ప్రవర్తన అతనిలో సందేహాలు రేకెత్తించింది (గలతియులకు 4:11, గలతియులకు 4:20).

5. ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుత ములు చేయించువాడు ధర్మశాస్త్రసంబంధ క్రియలవలననా లేక విశ్వాసముతో వినుటవలననా చేయించుచున్నాడు?

వ 2లోని ప్రశ్ననే వేరే మాటల్లో తిరిగి వేస్తున్నాడు పౌలు. వారు కాస్త ఆలోచించి వారిలో సత్యం గురించి ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించి వారు విన్న అబద్ధ ఉపదేశాన్ని ఎదిరించాలని కోరుతున్నాడు.

6. అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచ బడెను.
ఆదికాండము 15:6

“అబ్రాహాము”– దేవుడు మనుషులను ధర్మశాస్త్ర క్రియలతో నిమిత్తం లేకుండా నమ్మకం మూలంగానే నిర్దోషులుగా తీరుస్తాడని లేఖనాల్లోనుంచి రుజువు చూపించడమే ఇక్కడ పౌలు ఉద్దేశం. “నిర్దోషత్వం”– ఆదికాండము 15:6; రోమీయులకు 4:3.

7. కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి.

రోమీయులకు 4:11-12, రోమీయులకు 4:16-17. “సంతానం” అంటే ఇక్కడ ఆధ్యాత్మిక సంతానం అని అర్థం.

8. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖ నము ముందుగా చూచినీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను.
ఆదికాండము 12:3, ఆదికాండము 18:18

“లేఖనం”– రోమీయులకు 3:10; రోమీయులకు 4:3. “నీ మూలంగా”– ఆదికాండము 12:3; ఆదికాండము 18:18; ఆదికాండము 22:18 చూడండి.

9. కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు.

మత నియమాలు, ఆచారాలు పాటించడం ద్వారా, దేవుడిచ్చాడని వారు భావించే శాసనాలకు లోబడి జీవించడానికి ప్రయత్నించడం ద్వారా దేవుని దీవెనలు సంపాదించుకోవచ్చునని అంతటా మనుషులు అనుకుంటారు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా దేవుని దీవెనలు సంపాదించుకోవచ్చునని యూదుల గట్టి నమ్మకం. అవి నమ్మకం ద్వారానే గాని స్వప్రయత్నాల మూలంగా రావని పౌలు చెప్తున్నాడు. దీవెనలు, ధన్యత గురించి నోట్స్ ఆదికాండము 12:1-3; సంఖ్యాకాండము 6:23-27; ద్వితీయోపదేశకాండము 28:3-14; కీర్తనల గ్రంథము 1:1; కీర్తనల గ్రంథము 119:1; మత్తయి 5:3-12; అపో. కార్యములు 3:26; ఎఫెసీయులకు 1:3.

10. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగాధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధులన్నియుచేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.
ద్వితీయోపదేశకాండము 27:26

ద్వితీయోపదేశకాండము 27:26. దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నించడం ద్వారా మనుషులు ఆశించిన దీవెనలు వారికి దొరకవు. అందుకు బదులు దేవుని శిక్షావిధి వారిపైకి వస్తుంది. ఇదెలా సాధ్యం? ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతిదాన్నీ పూర్తిగా, లోపం లేకుండా, ప్రతి క్షణమూ పాటించాలని ధర్మశాస్త్రం శాసిస్తున్నది. కానీ ఈ విధమైన విధేయత ఏ మనిషికీ సాధ్యం కాదు. నిర్గమకాండము 19:5-6, నిర్గమకాండము 19:8, నిర్గమకాండము 19:21-25 నోట్స్ చూడండి. ఫిలిప్పీయులకు 3:6 లో పౌలు “ధర్మశాస్త్రంలో ఉన్న నీతిన్యాయాల విషయంలో” తనపై ఎలాంటి నిందా లేదని చెప్పాడు. అయితే ధర్మశాస్త్రాన్ని మీరినవారిపై అది పంపించే శాపానికి అతడు కూడా లోనయ్యాడు. ఎందుకంటే అందులోని పదో ఆజ్ఞను పౌలు ఆచరించలేకపోయాడు (రోమీయులకు 7:7-14). దేవుని ధర్మశాస్త్రంలోని ఏ ఆజ్ఞనైనా ఎవరైనా మీరితే ఆ వ్యక్తి ధర్మశాస్త్రమంతటి విషయంలోనూ దోషి అవుతాడు (యాకోబు 2:10-11). అందువల్ల దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నించడం ద్వారా దేవునితో సఖ్యపడదామని చూచిన ప్రతి వ్యక్తి మీదికీ తీర్పు, శిక్షావిధి వచ్చింది.

11. ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.
హబక్కూకు 2:4

హబక్కూకు 2:4 క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఎత్తిరాసిన మూడు సందర్భాల్లో ఇదొకటి (రోమీయులకు 1:17; హెబ్రీయులకు 10:38). ఒక మనిషికి దేవునితో సరైన సంబంధం కలగాలంటే ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించాలన్న ప్రయత్నాల వల్ల అది సాధ్యం కాదు. నమ్మకం వల్లనే అది సాధ్యం.

12. ధర్మ శాస్త్రము విశ్వాససంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును.
లేవీయకాండము 18:5

లేవీయకాండము 18:5. ధర్మశాస్త్రం, నమ్మకం రెండూ పూర్తిగా వేరువేరు సిద్ధాంతాలు, నియమాలు. నమ్మకం దేవునిపై ఆధారపడి ఉచితమైన ఈవిగా పాపవిముక్తి, శాశ్వత జీవాన్ని స్వీకరిస్తుంది. ధర్మశాస్త్రం చట్టాల ప్రకారం చేసేవాడే బ్రతుకుతాడని ధర్మశాస్త్రం చెప్తున్నది, గాని ఊరకే అందుకు ప్రయత్నించేవాడు గానీ ఆ ప్రకారం చేస్తున్నానని చెప్పేవాడు గానీ కాదు. ఏ ఒక్కరూ కూడా లోపం లేని విధంగా, ఎడతెరిపి లేకుండా వాటిని చేయరు కాబట్టి ధర్మశాస్త్రం మరణాన్ని, శిక్షను మాత్రమే తెస్తుంది (వ 10; రోమీయులకు 3:19-20).

13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమో చించెను;
ద్వితీయోపదేశకాండము 21:23

పాపులైన మనుషుల కోసం యేసుప్రభువు ఏమి చెయ్యడానికి సిద్ధమయ్యాడో చూడండి. మన స్థానం తాను తీసుకున్నాడు, మనం ఆజ్ఞను మీరినందువల్ల వచ్చిన శాపాన్ని తనపై వేసుకున్నాడు. ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం చేసిన నేరాలకు ఆయన శిక్ష అనుభవించాడు. రోమీయులకు 5:6-8; 2 కోరింథీయులకు 5:21; 1 పేతురు 3:18 పోల్చి చూడండి. కీర్తనల గ్రంథము 78:35; మత్తయి 20:28 దగ్గర విమోచన గురించి నోట్స్ చూడండి. “మ్రాను”– ద్వితీయోపదేశకాండము 21:22-23. ఇస్రాయేల్ అధిపతులు మరణ శిక్షకు గురైన నేరస్థులను చెట్టుమ్రానుకు వేలాడదీసేవారు. వారి నేరాన్నీ, అవమానాన్నీ బహిరంగంగా ప్రదర్శించడమే దీని ఉద్దేశం. ఆ విధంగా మనం చేసిన నేరాలకు యేసు మరణించాడు. మన శిక్షను, అవమానాన్ని భరిస్తూ సిలువకు వ్రేలాడాడు (అపో. కార్యములు 5:30; అపో. కార్యములు 10:39; అపో. కార్యములు 13:29; 1 పేతురు 2:24 లో సిలువను మ్రాను అనడం చూడండి). అక్కడ వ్రేలాడవలసినది మనం.

14. ఇందునుగూర్చిమ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.

తన బాధల్లో ఆయన మన దీవెనల గురించి ఆలోచించాడు. ఆయనకు తాను శిక్షనుంచీ సిలువ మరణం నుంచీ తప్పించుకోవాలన్న కోరిక కంటే మనకు మేలు జరగాలన్న కోరికే ఎక్కువ తీవ్రంగా ఉండేది. ఇప్పుడు క్రీస్తులో విశ్వాసులంతా ధర్మశాస్త్రం శాపం నుంచి విముక్తులయ్యారు (రోమీయులకు 8:1). దేవుడు అబ్రాహాము ద్వారా వాగ్దానం చేసిన దీవెనలకు వారసులయ్యారు (వ 8,9). “ఆత్మను గురించిన వాగ్దానం”– లూకా 24:49; యోహాను 14:16-17; అపో. కార్యములు 1:4-5; అపో. కార్యములు 2:39. ఇక్కడి ఉపదేశాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుడిచ్చే ఈ దీవెనలు రావడం దేవుని ఆత్మను పొందినవారికే. దేవుని ఆత్మను మనం నమ్మకం ద్వారా పొందుతాము (వ 2,5; లూకా 11:13; ఎఫెసీయులకు 1:13). ఇదంతా వేరెవరివల్లా, దేనివల్లా కాదు, “క్రీస్తు యేసు” వల్లే జరిగేది.

15. సహోదరులారా, మనుష్యరీతిగా మాటలాడు చున్నాను; మనుష్యుడుచేసిన ఒడంబడికయైనను స్థిరపడిన తరువాత ఎవడును దాని కొట్టివేయడు, దానితో మరేమియు కలుపడు.

సాధారణంగా మనుషుల మధ్య ఒప్పందాలు ఇలా జరుగుతుంటాయి. ఒప్పందం జరిగిపోయిన తరువాత సంభవించేవి ఆ ఒప్పందాన్ని ఏమీ మార్చలేవు. అబ్రాహాముతో దేవుడు చేసిన ఒప్పందం విషయంలో కూడా ఇలానే ఉందని ఇక్కడ పౌలు ఉద్దేశం. ఒప్పందం జరిగాక కొన్ని శతాబ్దాల తరువాత వచ్చిన ధర్మశాస్త్రానికి దానిపై ఎలాంటి ప్రభావమూ లేదు.

16. అబ్రాహామునకును అతని సంతానము నకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టునీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టేనీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు.
ఆదికాండము 12:7, ఆదికాండము 13:15, ఆదికాండము 17:7, ఆదికాండము 22:18, ఆదికాండము 24:7

ఆదికాండము 12:7; ఆదికాండము 13:15; ఆదికాండము 24:7. దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాలకు క్రీస్తు వారసుడని పౌలు భావం. ఆయన అబ్రాహాము సంతానం (మత్తయి 1:1). క్రీస్తులో విశ్వాసులు క్రీస్తుతో జతగా ఉన్నారు, క్రీస్తుతో కూడా వారసులు కాబట్టే అబ్రాహాముకు వారసులు (వ 14,29; రోమీయులకు 4:13; రోమీయులకు 8:17).

17. నేను చెప్పునదేమనగానాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు.
నిర్గమకాండము 12:40

18. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రమూలముగా కలిగినయెడల ఇక వాగ్దానమూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహిం చెను.

నమ్మకం, ధర్మశాస్త్రం అనేవి భిన్నమైన సిద్ధాంతాలైనట్టే (వ 12), ధర్మశాస్త్రం, దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాలూ కూడా వేరు వేరు. అబ్రాహాము ద్వారా మనుషులందరినీ దీవిస్తానని దేవుడు చేసిన వాగ్దానానికి ధర్మశాస్త్రంతో ఎలాంటి నిమిత్తమూ లేదు. దేవుడొక వాగ్దానాన్ని ఇచ్చాడంటే మనుషులు దాన్ని కేవలం నమ్మి సంతోషించాలి గానీ తాము ఆచారాలూ నియమాలూ పాటించడం ద్వారా దేవుణ్ణి ఆ వాగ్దానం నెరవేర్చేలా చేయడానికి ప్రయత్నించకూడదు. “వారసత్వం”– రోమీయులకు 4:13-14; 1 కోరింథీయులకు 3:22; మత్తయి 5:5; హెబ్రీయులకు 11:8-10; 1 పేతురు 1:4. క్రీస్తువిశ్వాసులకు భూమి ఆకాశం కూడా వారసత్వంగా ఉంటాయి. క్రీస్తుకు లభించే దానంతట్లోనూ వారికి భాగం ఉంటుంది. అన్నీ క్రీస్తుకే లభిస్తాయి (హెబ్రీయులకు 1:2).

19. ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? ఎవనికి ఆ వాగ్దా నము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతి క్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను.

ధర్మశాస్త్రం కింద ఉన్నవారికి అది శాపాన్ని తెచ్చింది. మనుషుల్ని దీవించాలనుకునే దేవుడు మరి ధర్మశాస్త్రాన్ని ఎందుకిచ్చాడు? రోమీయులకు 3:20; రోమీయులకు 4:15; రోమీయులకు 5:20; రోమీయులకు 7:7 చూడండి. పాపాన్ని బయట పెట్టేందుకూ, దాని తీరునూ దాని శక్తినీ వెల్లడి చేసేందుకూ దేవుడు ధర్మశాస్త్రాన్ని వాడుకున్నాడు. ఈ పద్ధతి ద్వారా మనుషులకు యేసు క్రీస్తు అవసరాన్ని వారికి తెలిసేలా చేస్తున్నాడు. క్రీస్తు మనకు అవసరమని గుర్తించడం, ఆయన్ను స్వీకరించడం అన్ని దీవెనల్లోకీ అత్యంత శ్రేష్ఠమైనది. “వచ్చేంత వరకే”– దేవుడు పాత ఒడంబడిక ధర్మశాస్త్రం ఏలుబడికి ఒక సమయాన్ని నియమించాడు. “సంతానం” (క్రీస్తు) వచ్చి మనుషులకు పాపవిముక్తిని సిద్ధం చేసేవరకే ధర్మశాస్త్రం ఏలేది. “దేవదూతలు”– హెబ్రీయులకు 2:2; అపో. కార్యములు 7:38, అపో. కార్యములు 7:53. ఎవరి ద్వారా ధర్మశాస్త్రం వచ్చిందో ఆ మధ్యవర్తి మోషే.

20. మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే.

దీనికి రాగల ఒక అభ్యంతరాన్ని పౌలు విశదపరుస్తున్నాడు – దేవుడొక్కడే గదా. అయితే అబ్రాహాముకు తన వాగ్దానం ఇచ్చి దానికి విరుద్ధమైన ధర్మశాస్త్రాన్ని తరువాత ఎందుకిచ్చాడు? ఇది అపార్థం అంటున్నాడు పౌలు. దీవెనలిస్తానన్న దేవుని వాగ్దానానికీ ధర్మశాస్త్రం వ్యతిరేకం కాదు. కానీ మనుషులు ధర్మశాస్త్రంపై ఆధారపడినంత కాలం దేవుని వాగ్దానాల నెరవేర్పు అసాధ్యం. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవం ఇవ్వడానికీ మనుషులను నిర్దోషులుగా తీర్చడానికీ ధర్మశాస్త్రానికి చేతగాదు (రోమీయులకు 7:14; రోమీయులకు 8:3 చూడండి).

21. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి యున్నయెడల వాస్తవముగా నీతిధర్మశాస్త్రమూలముగానే కలుగును గాని

22. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు, లేఖనము అందరిని పాపములో బంధించెను.

రోమీయులకు 3:19-24 పోల్చి చూడండి. ధర్మశాస్త్రం మనుషులపై నేరం మోపి, వారు స్వయంగా కోరుకున్న చెరసాలలో బంధించడం మాత్రమే చెయ్యగలదు. ఆ చెరసాల పాపమే. క్రీస్తు వచ్చి పాపవిముక్తిని సిద్ధం చేసి నమ్మకమనే మార్గాన్ని నేర్పించకముందు ధర్మశాస్త్రం చెరసాల అధికారి వంటిది. క్రీస్తుకు వేరుగా ఎంత ఉత్తములైనప్పటికీ ఈ జైల్లో ఉన్నవారే. దేవుని దృష్టిలో తన ఆజ్ఞలను మీరినవారు నేరస్థులే. శిక్షకోసం ఉంచబడ్డవారే. వారికి యేసు క్రీస్తు లేకుండా ఆధ్యాత్మిక స్వతంత్రత, విడుదల ఏమాత్రం కలగవు. ఎవరూ సొంత ప్రయత్నం వల్ల, సత్‌క్రియల వల్ల, ధర్మశాస్త్రాన్నీ మత నియమాలనూ ఆచారాలనూ పాటించడం వల్ల, వారు చేయగలిగిన మరి దేని వల్ల కూడా ఈ చెరసాల నుంచి తప్పించుకోలేరు. పాపవిముక్తి, విడుదల, ఆధ్యాత్మిక స్వతంత్రత, దేవుని శాశ్వత దీవెనలు దేవుడు నియమించిన మార్గం ద్వారా మాత్రమే కలుగుతాయి – అది క్రీస్తులో నమ్మకముంచడమనే మార్గం (వ 9,14,26; రోమీయులకు 1:16-17; రోమీయులకు 3:22, రోమీయులకు 3:28; యోహాను 3:16, యోహాను 3:36; యోహాను 5:24; ఎఫెసీయులకు 2:8-9).

23. విశ్వాసము వెల్లడికాకమునుపు, ఇక ముందుకు బయలు పరచబడబోవు విశ్వాసమవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతివిు.

24. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతి మంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడి పించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.

ధర్మశాస్త్రం మనుషులకు పాపవిముక్తిని కలిగించడం అసాధ్యం గాని క్రీస్తుద్వారా కలిగే పాపవిముక్తి మార్గం వెల్లడయ్యేంత వరకూ వారిని క్రమశిక్షణలో ఉంచేందుకు దేవుడు దాన్ని వాడుకున్నాడు.

25. అయితే విశ్వాసము వెల్లడియాయెను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము.

తనలో నమ్మకం ఉంచడమనే మార్గాన్ని క్రీస్తు తెలియజేసినప్పటినుంచి, పాపవిముక్తి కోసం మనుషులు ఆయనలో నమ్మకం పెట్టుకున్న తరువాత మోషే ధర్మశాస్త్రానికి వారిపై ఏ అధికారమూ లేదు (రోమీయులకు 6:14).

26. యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు.

స్వభావసిద్ధంగా మనుషులు దేవుని సంతానం కాదు. అందరికీ సృష్టికర్త దేవుడే అయినప్పటికీ ఆయన మనుషులందరి ఆధ్యాత్మికమైన తండ్రి కాడు (యోహాను 8:44 పోల్చి చూడండి). క్రీస్తులో నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే మనుషులు దేవుని సంతానం కాగలుగుతారు – యోహాను 1:12-13.

27. క్రీస్తు లోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.

“క్రీస్తులోకి బాప్తిసం”– రోమీయులకు 6:3 నోట్స్ చూడండి. మనల్ని దేవుని పిల్లలుగా చేసేది నమ్మకమే (వ 26), నీటి బాప్తిసం కాదు. ఆత్మ సంబంధమైన లోపలి మార్పుకు నీటి బాప్తిసం ఒక బయటి చిహ్నం మాత్రమే. “క్రీస్తును ధరించుకొన్నారు”– అంటే విశ్వాసులు క్రీస్తులో దేవుని ఎదుట నిలుస్తున్నారు, ఆయన నీతిన్యాయాలను ధరించుకున్నారు. క్రీస్తు స్వయంగా దేవునికి ఎంత అంగీకారమో వారూ అంతే.

28. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

“ఒక్కటి”– 1 కోరింథీయులకు 12:13; యోహాను 17:20-23; కొలొస్సయులకు 3:11. క్రీస్తులో మనుషుల మధ్య దేవుడు ఎలాంటి తేడా చూపడు. వారి చరిత్ర, పుట్టుపూర్వోత్తరాలు, సాంఘిక హోదా, కులం మొదలైన వాటికి ఆయన దృష్టిలో ఎలాంటి విలువా లేదు. మనుషుల దృష్టిలో నిరుపేదలు, అతి హీనులు అయిన క్రీస్తువిశ్వాసులను దేవుడు అందరిలాగానే స్వీకరిస్తాడు. ఆయనకు గొప్ప విశ్వాసులు ఎంత అంగీకారమో వారూ అంత అంగీకారమే.

29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.

వ 7,14,18.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Galatians - గలతీయులకు 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

క్రీస్తుపై విశ్వాసం ద్వారా సమర్థన అనే గొప్ప సిద్ధాంతం నుండి తప్పుకున్నందుకు గలతీయులు మందలించారు. (1-5) 
గలతీయుల క్రైస్తవుల మూర్ఖత్వం అనేక కారణాల వల్ల తీవ్రమైంది. వారు సిలువ సిద్ధాంతంపై సమగ్రమైన బోధలను పొందారు మరియు ప్రభువు రాత్రి భోజనం వారి మధ్య నిర్వహించబడింది. రెండు సందర్భాలు క్రీస్తు యొక్క సిలువ మరణాన్ని మరియు అతని బాధల సారాంశాన్ని పూర్తిగా ప్రకాశవంతం చేశాయి. క్లిష్టమైన ప్రశ్న తలెత్తింది: వారు ధర్మశాస్త్రానికి కట్టుబడి లేదా దానికి విధేయత చూపడం ద్వారా పరిశుద్ధాత్మను పొందారా లేదా సమర్థించడం కోసం మాత్రమే క్రీస్తుపై విశ్వాసం యొక్క సిద్ధాంతాన్ని వారు శ్రద్ధగా అంగీకరించడం ద్వారా పొందారా? దేవుని అఖండమైన అనుగ్రహం మరియు ఆమోదం మునుపటి వారికి కాదు, తరువాతి వారికి ప్రసాదించబడ్డాయి. ఆధ్యాత్మికంగా ప్రయోజనకరంగా నిరూపించబడిన పరిచర్య మరియు బోధనల నుండి తమను తాము మళ్లించుకోవడానికి వ్యక్తులు అనుమతించడం గొప్ప అవివేకానికి చిహ్నం. విచారకరంగా, కొందరు సిలువ వేయబడిన క్రీస్తు యొక్క కీలకమైన సిద్ధాంతాన్ని విడిచిపెట్టి ఖాళీ వ్యత్యాసాలు, కేవలం నైతిక ప్రసంగం లేదా నిరాధారమైన ఊహలకు అనుకూలంగా ఉంటారు. ఈ ప్రపంచంలోని దేవుడు, వివిధ వ్యక్తులను మరియు పద్ధతులను ఉపయోగించి, ఉద్దేశపూర్వకంగా వ్యక్తుల దృష్టిని మరుగుపరిచాడు, సిలువ వేయబడిన రక్షకునిపై వారి నమ్మకాన్ని ఉంచకుండా వారిని నిరోధించాడు. మనం ధైర్యంగా విచారించవచ్చు: పరిశుద్ధాత్మ ఫలాల యొక్క అత్యంత స్పష్టమైన అభివ్యక్తిని మనం ఎక్కడ గమనించవచ్చు? ఇది చట్టం యొక్క పనులకు కట్టుబడి ఉండటం ద్వారా సమర్థనను సమర్థించేవారిలో లేదా విశ్వాస సిద్ధాంతాన్ని ప్రకటించేవారిలో ఉందా? నిస్సందేహంగా, ఇది తరువాతి వాటిలో ఒకటి.

ఈ సిద్ధాంతం అబ్రహం ఉదాహరణ నుండి స్థాపించబడింది. (6-9)  చట్టం యొక్క నియమావళి మరియు దాని శాపం యొక్క తీవ్రత నుండి. (10-14) 
అపొస్తలుడు గతంలో గలతీయులను నిర్లక్ష్యం చేసినందుకు దూషించిన సిద్ధాంతాన్ని స్థాపించాడు, ఇది ధర్మశాస్త్రం యొక్క పనులకు కట్టుబడి ఉండటమే కాకుండా విశ్వాసం ద్వారా సమర్థించబడుతోంది. దేవుని వాక్యం మరియు వాగ్దానాలపై విశ్వాసం కేంద్రీకృతమై ఉన్న అబ్రాహాము ఉదాహరణను ఉటంకిస్తూ అతను ఈ వాదనకు మద్దతు ఇచ్చాడు. అతని నమ్మకంపై, దేవుడు అతన్ని నీతిమంతుడిగా గుర్తించి అంగీకరించాడు. స్క్రిప్చర్ దీనిని ముందే ఊహించిందని చెప్పబడింది, ఎందుకంటే ఇది ముందుగా చూసిన లేఖనాన్ని ప్రేరేపించిన పరిశుద్ధాత్మ. అబ్రాహాము ఆశీర్వాదం దేవుని వాగ్దానాన్ని విశ్వసించడం ద్వారా వచ్చింది మరియు ఈ ఆధిక్యత ఇతరులకు కూడా అదే విధంగా లభిస్తుంది. కాబట్టి, అబ్రహం విశ్వాసం యొక్క వస్తువు, స్వభావం మరియు ప్రభావాలను పరిశీలిద్దాం, ఎందుకంటే పవిత్ర చట్టం యొక్క శాపం నుండి తప్పించుకోవడానికి ఇదే ఏకైక మార్గం. శాపం అన్ని పాపులకు వర్తిస్తుంది, ఇది మానవాళిని కలిగి ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుని ముందు దోషిగా నిలబడతారు. ఉల్లంఘించిన వారిగా చట్టం ద్వారా న్యాయాన్ని కోరడం వ్యర్థం. మరణము మరియు క్రోధము నుండి విముక్తి పొంది, దేవుని అనుగ్రహంతో జీవిత స్థితికి పునరుద్ధరించబడి, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మారిన వారు మాత్రమే న్యాయంగా పరిగణించబడతారు. విశ్వాసం ద్వారా జస్టిఫికేషన్ అనేది ఒక నవల భావన కాదు కానీ సువార్త యుగానికి చాలా కాలం ముందు దేవుని చర్చిలో బోధించబడింది. నిజానికి పాపులెవరైనా ఉండే లేదా సమర్థించబడే ఏకైక మార్గం ఇది.
చట్టం నుండి విమోచనను ఆశించలేనప్పటికీ, శాపం నుండి తప్పించుకోవడానికి మరియు దేవుని అనుగ్రహాన్ని తిరిగి పొందడానికి ఒక మార్గం ఉంది-క్రీస్తుపై విశ్వాసం ద్వారా. క్రీస్తు మన కోసం పాపంగా లేదా పాపపరిహారార్థంగా మారడం ద్వారా ధర్మశాస్త్ర శాపం నుండి మనలను విమోచించాడు, కొంతకాలం దైవిక శిక్షకు లోనయ్యాడు కానీ దేవుని నుండి వేరు చేయలేదు. దేవుని కుమారుని యొక్క ప్రగాఢమైన బాధలు పాపులు రాబోయే కోపం నుండి పారిపోవడానికి బలవంతపు హెచ్చరికగా పనిచేస్తాయి, చట్టం యొక్క అన్ని శాపాల ప్రభావాన్ని అధిగమించాయి. మన పాపాలు అతనిపై మోపబడినప్పుడు దేవుడు తన స్వంత కుమారుడిని విడిచిపెట్టకపోతే, పాపంలో మిగిలిపోయిన ఎవరినైనా ఆయన ఎలా రక్షించగలడు? అదే సమయంలో, క్రీస్తు, సిలువ నుండి, పాపులు తనను ఆశ్రయించమని ఉచిత ఆహ్వానాన్ని అందజేస్తాడు.

వాగ్దానాల ఒడంబడిక నుండి, చట్టం రద్దు చేయలేనిది. (15-18) 
అబ్రాహాముతో దేవుడు స్థాపించిన ఒడంబడిక మొజాయిక్ ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టడంతో వాడుకలో లేదు. అబ్రాహాము మరియు అతని సంతానంతో చేసిన ఈ ఒడంబడిక ఇప్పటికీ అమలులో ఉంది. విశ్వాసం ద్వారా తన ఆధ్యాత్మిక వారసులతో పాటు తన వ్యక్తిత్వంలో శాశ్వతంగా ఉండే క్రీస్తు, ఈ ఒడంబడిక యొక్క శాశ్వతమైన చెల్లుబాటును నిర్ధారిస్తాడు. ఈ వ్యత్యాసం చట్టం యొక్క వాగ్దానాలకు మరియు సువార్త యొక్క వాగ్దానాల మధ్య వ్యత్యాసాన్ని గురించి మనకు బోధిస్తుంది. చట్టం యొక్క వాగ్దానాలు ప్రతి వ్యక్తికి నిర్దేశించబడతాయి, అయితే సువార్త యొక్క వాగ్దానాలు మొదట క్రీస్తుకు మరియు తరువాత విశ్వాసం ద్వారా క్రీస్తులోకి అంటుకట్టబడిన వారికి విస్తరించబడ్డాయి. సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, వాగ్దానం మరియు చట్టం మధ్య అంతర్గత ప్రేమ మరియు మొత్తం జీవిత ప్రవర్తన పరంగా స్పష్టమైన వ్యత్యాసం చేయాలి. వాగ్దానం చట్టంతో చిక్కుకున్నప్పుడు, అది తప్పనిసరిగా చట్టం తప్ప మరేమీ కాదు. మానవ నీతి కంటే అతనిపై మన ఆధారపడటాన్ని నొక్కి చెబుతూ, విశ్వాసాన్ని రక్షించడంలో బలవంతపు వాదనగా క్రీస్తు ఎల్లప్పుడూ మన దృష్టిలో ఉండనివ్వండి.

వారిని క్రీస్తు దగ్గరకు నడిపించడానికి చట్టం ఒక పాఠశాల మాస్టర్. (19-25) 
19-22
మోక్షానికి వాగ్దానం మాత్రమే సరిపోతే, చట్టం ఏ ప్రయోజనం కోసం ఉపయోగపడుతుంది? దేవుని విభిన్న ప్రజలుగా ఎంపిక చేయబడినప్పటికీ, ఇశ్రాయేలీయులు ఇతరులలాగే పాపులుగా ఉన్నారు. చట్టం యొక్క ఉద్దేశ్యం ప్రత్యామ్నాయ సమర్థన పద్ధతిని బహిర్గతం చేయడం కాదు, పాపం యొక్క పాపాన్ని బహిర్గతం చేయడం ద్వారా ప్రజలు వాగ్దానంపై ఆధారపడటాన్ని గుర్తించేలా చేయడం. ఇది వారిని క్రీస్తు వైపుకు నడిపించడం లక్ష్యంగా పెట్టుకుంది, దీని ద్వారా వారు క్షమాపణ మరియు సమర్థనను పొందగలరు. వాగ్దానం నేరుగా దేవుని నుండి వచ్చింది, అయితే ధర్మశాస్త్రం దేవదూతలు మరియు మధ్యవర్తి అయిన మోషే ద్వారా తెలియజేయబడింది. కాబట్టి, హామీని రద్దు చేయడానికి చట్టం ఉద్దేశించబడలేదు. మధ్యవర్తి, నిర్వచనం ప్రకారం, రెండు వైపుల మధ్య తటస్థ పార్టీ, కేవలం ఒకరి తరపున పనిచేయడం కాదు. యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా వాగ్దానాన్ని అందజేయడం చట్టం యొక్క ప్రాథమిక లక్ష్యం, వ్యక్తులు తమ నేరాన్ని మరియు ధర్మాన్ని స్థాపించడానికి చట్టం యొక్క అసమర్థతను గుర్తించి, క్రీస్తును విశ్వసించడానికి మరియు వాగ్దాన ప్రయోజనాలను పొందేందుకు మొగ్గు చూపేలా చేయడం. దేవుని యొక్క పవిత్రమైన, న్యాయమైన మరియు మంచి నియమం, సార్వత్రిక విధి ప్రమాణంగా పనిచేస్తుంది, ఇది క్రీస్తు సువార్తకు విరుద్ధంగా లేదు; వాస్తవానికి, ఇది దాని ప్రచారానికి అన్ని విధాలుగా తోడ్పడుతుంది.

23-25
చట్టం ప్రాణాలను రక్షించే జ్ఞానాన్ని అందించలేదు, బదులుగా, దాని ఆచారాలు మరియు వేడుకల ద్వారా, ప్రత్యేకించి దాని త్యాగాల ద్వారా, ఇది విశ్వాసం ద్వారా సమర్థించడాన్ని లక్ష్యంగా చేసుకుని క్రీస్తు వైపు దృష్టిని మళ్లించింది. దాని నిజమైన సారాంశంలో, చట్టం ప్రాథమిక అవగాహనను అందించే ఉద్దేశ్యంతో పిల్లలను పాఠశాలకు నడిపించే సేవకుడిలాగా మార్గదర్శకంగా పనిచేసింది. ఈ పునాది క్రీస్తు ద్వారా నిర్మించబడుతుంది, అతను సమర్థన మరియు మోక్షానికి నిజమైన మార్గాన్ని బోధిస్తాడు, అతనిపై విశ్వాసం ద్వారా మాత్రమే కనుగొనబడుతుంది.
యూదుల కాలంతో పోలిస్తే దైవిక దయ మరియు దయ యొక్క స్పష్టమైన ద్యోతకాన్ని అందించడం ద్వారా సువార్త యుగం గణనీయంగా ప్రయోజనకరమైనదిగా హైలైట్ చేయబడింది. చాలా మంది వ్యక్తులు తమ పాపాలచే బంధింపబడి, ప్రాపంచిక ఆనందాలు, ఆసక్తులు మరియు ప్రయత్నాల ద్వారా సాతానుచే ఆత్మసంతృప్తి చెంది, రూపక చీకటి చెరసాలలో బంధించబడ్డారు. అయినప్పటికీ, వారి పాపపు స్థితికి మేల్కొన్న వారికి, వారి ఏకైక ఆశ దేవుని దయ మరియు దయపైనే ఉందని గ్రహించారు. నేరాన్ని నిర్ధారించే ఆత్మ చేత అమలు చేయబడిన చట్టం యొక్క భయాలు, క్రీస్తు కోసం పాపుల యొక్క తీరని అవసరాన్ని ప్రకాశవంతం చేయడానికి ఉపయోగపడతాయి, విశ్వాసం ద్వారా సమర్థించబడటానికి అతని బాధలు మరియు అర్హతలపై ఆధారపడేలా ప్రేరేపిస్తుంది.
ఈ సమయంలో, చట్టం, పవిత్రాత్మ యొక్క మార్గదర్శకత్వంలో, విధి కోసం ప్రతిష్టాత్మకమైన ప్రమాణంగా మరియు రోజువారీ స్వీయ-పరిశీలనకు ప్రమాణంగా మారుతుంది. ఈ సామర్థ్యంలో, ఇది వ్యక్తికి రక్షకునిపై మరింత గాఢంగా ఆధారపడటానికి ఒక సాధనంగా మారుతుంది, క్రీస్తుపై సరళమైన మరియు అచంచలమైన ఆధారపడటాన్ని ప్రోత్సహిస్తుంది.

సువార్త రాజ్యంలో నిజమైన విశ్వాసులందరూ క్రీస్తులో ఒక్కటే. (26-29)
క్రీస్తు యొక్క నిజమైన అనుచరులు సువార్త యుగంలో గొప్ప అధికారాలను అనుభవిస్తారు, సేవకుల హోదాను అధిగమించి కుమారులుగా గుర్తించబడతారు. యూదుల వలె కాకుండా, వారు ఇకపై దూరం వద్ద ఉంచబడరు లేదా అదే పరిమితులచే నిర్బంధించబడరు. క్రీస్తు యేసును తమ ప్రభువుగా మరియు రక్షకునిగా స్వీకరించి, సమర్థన మరియు మోక్షం కోసం ఆయనపై మాత్రమే ఆధారపడిన తర్వాత, వారు దేవుని కుమారులుగా గౌరవనీయమైన స్థానానికి చేరుకుంటారు. కేవలం బాహ్య రూపాలు లేదా వృత్తులు ఈ ఆశీర్వాదాలకు హామీ ఇవ్వలేవని గుర్తించడం చాలా ముఖ్యం; క్రీస్తు ఆత్మ లేకుండా, అతనికి చెందినవాడు కాదు.
బాప్టిజం చర్యలో, విశ్వాసులు తమ శిష్యత్వాన్ని బహిరంగంగా ప్రకటిస్తూ క్రీస్తును ధరించుకుంటారు. క్రీస్తులోనికి బాప్టిజం పొందడం ద్వారా, వారు అతని మరణంలో పాలుపంచుకుంటారు, పాపానికి చనిపోవాలనే నిబద్ధతను సూచిస్తూ, ఆయన పునరుత్థానానికి అద్దం పట్టేలా పునరుద్ధరించబడిన మరియు పవిత్రమైన జీవితంలో నడవాలి. సువార్త ప్రకారం, క్రీస్తు యొక్క నిజమైన స్వరూపం కేవలం అనుకరణ కాదు, గాఢమైన పరివర్తన-కొత్త పుట్టుకను కలిగి ఉంటుంది.
విశ్వాసులను వారసులుగా నియమించినవాడు వారి ఏర్పాటును నిర్ధారిస్తాడు. కాబట్టి, మన ప్రాథమిక దృష్టి మన బాధ్యతలను నెరవేర్చడం, ఇతర ఆందోళనలన్నింటినీ దేవునికి అప్పగించడం. భూసంబంధమైన పనుల యొక్క తాత్కాలిక స్వభావాన్ని గుర్తిస్తూ, మన ప్రధానమైన శ్రద్ధ పరలోక విషయాల వైపు మళ్లించాలి. దేవుని ఖగోళ నగరం అంతిమ వారసత్వం, నిజమైన భాగం లేదా పిల్లల వాటాను సూచిస్తుంది. ఆ పరలోక వారసత్వం యొక్క హామీని కోరడం అన్నిటికంటే మన అత్యధిక ప్రాధాన్యతగా ఉండాలి.



Shortcut Links
గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |