Romans - రోమీయులకు 8 | View All

1. కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.

ఈ వచనంలోని “కాబట్టి” అనే మాట దీన్ని ఇంతకుముందు వచనాలతో ముడిపెడుతున్నది. రోమీయులకు 7:14-25 లోని వ్యక్తి క్రీస్తుయేసులో ఉన్నవాడనేందుకు ఇది మరో సూచన. “క్రీస్తు యేసులో” అంటే ఆయనతో ఐక్యమై ఆయన ఆధ్యాత్మిక దేహంలో అవయవంగా ఉండడం – రోమీయులకు 6:3-5. “శిక్షావిధి అంటూ ఏమీ లేదు” అంటే న్యాయవంతుడుగా ఎంచబడడమే, లేక నిర్దోషుల లెక్కలోకి రావడమే (రోమీయులకు 3:24; రోమీయులకు 4:7-8; రోమీయులకు 5:1).యోహాను 5:24 కూడా చూడండి. శిక్షావిధి లేకపోవడానికి మరో కారణమేమంటే క్రీస్తులో ఈ విశ్వాస మార్గం పాపం, మరణాల నియమంనుంచి విశ్వాసుల్ని విడుదల చేస్తుంది (వ 2). దేవుడు తన ప్రజలను వారి పాపాలనుంచి, పాప స్వభావం శక్తినుంచి కూడా రక్షిస్తాడు. తానెవరిని న్యాయవంతులుగా ఎంచాడో వారిని శుద్ధుల్ని చేస్తాడు కూడా. నమ్మకం మూలంగా న్యాయవంతులుగా లెక్కలోకి రావడం అన్నది ఒక్కటే శరీరం మీద, లోకం మీద, సైతాను మీద విజయానికి మార్గం.

2. క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.

ఈ అధ్యాయమంతటికీ రోమీయులకు 7:14-25 కూ ఎంతో తేడా ఉంది. దీనికి కారణమేమంటే, ఆ వచనాల్లో ఒక విశ్వాసి తన భ్రష్ట స్వభావమనే భయంకరమైన వాస్తవాన్ని ఎదుర్కొన్నప్పుడు తనలో తాను ఏమిటో వర్ణించబడింది. కానీ ఈ అధ్యాయంలో మనం “క్రీస్తులో” ఏమిటో వర్ణిస్తున్నాడు పౌలు. 7వ అధ్యాయంలోని పాప మరణాల నియమంకన్న ఉన్నతమైన, ఉత్తమమైన, బలమైన నియమం ఉంది. ఇది జీవమిచ్చే ఆత్మ నియమం. విశ్వాసుల్లో నివసించే పవిత్రాత్మ వారు తమంతట తామే ఎన్నటికీ చేయలేని దాన్ని చేయగలిగేవారినిగా చేస్తాడు. 8వ అధ్యాయంలో పౌలు క్రీస్తును, దేవుని ఆత్మను ఉద్దేశించి దాదాపు 30 సార్లు రాశాడు (రోమీయులకు 7:14 నోట్ చూడండి). ఇక్కడ విశ్వాసుల శరీరాల్లో నివసించేందుకు దేవుడు తన ఆత్మను ఇచ్చాడన్న అద్భుత సత్యాన్ని పౌలు గట్టిగా నొక్కి చెప్తున్నాడు. జయించడానికి వారికున్న బలం ఆయన మాత్రమే (వ 4,13) ఆయన జీవాన్ని, శాంతిని ఇస్తాడు (వ 6) వారిని నడిపిస్తాడు (వ 14) వారు దేవుని పిల్లలని వారు గ్రహించేలా చేస్తాడు (వ 15,16) ఆయన వారిలో ఉండి వారికోసం ప్రార్థన చేస్తున్నాడు (వ 26,27) పవిత్రాత్మను గురించి నోట్ యోహాను 14:16-17 చూడండి.

3. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము

“ధర్మశాస్త్రం”– అంటే మోషేద్వారా దేవుడిచ్చినది. మనుషులను విముక్తుల్ని చేసి రక్షించేందుకూ, వారి పాపాలమీదా భ్రష్ట స్వభావంమీదా విజయం సాధించేలా వారికి సహాయ పడేందుకూ ధర్మశాస్త్రానికి శక్తి లేదు (రోమీయులకు 3:19-20; రోమీయులకు 4:15; రోమీయులకు 7:5, రోమీయులకు 7:7, రోమీయులకు 7:14). పాపులకు తప్పించుకునే మార్గం కల్పించేందుకు దేవుడు తన కుమారుణ్ణే పంపవలసి వచ్చింది (యోహాను 3:14-16). కుమారుడైన యేసు భ్రష్ట స్వభావమున్న మనిషిగా రాలేదు (2 కోరింథీయులకు 5:21; హెబ్రీయులకు 4:15; హెబ్రీయులకు 7:26; 1 పేతురు 2:22). శరీర స్వభావమున్న మనుషుల “పోలిక”తో వచ్చాడు. అంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆకారం ఇతరులందరి ఆకారంగానే ఉందన్నమాట. ఆయనకు పాపంలేని మానవ స్వభావం, శరీరం ఉన్నాయి. “పాపాలకోసం బలిగా” ఆయన వచ్చాడు. మనుషుల పాపమనే సమస్య అంతటినీ పరిష్కరించేందుకు ఆయన వచ్చాడు. ఆ పాపాన్ని కడతేర్చి దానికోసం చనిపోయాడు (రోమీయులకు 3:24-25).

4. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.

దానంతటిలో దేవుని మహా సంకల్పం మనుషులను పాప దోషం నుంచీ శిక్షనుంచీ దాని శక్తినుంచీ విడిపించి వారిని తనకోసం పవిత్ర ప్రజగా చేయాలనే. అలాంటివారిని పవిత్రమైన, ఆధ్యాత్మికమైన ధర్మశాస్త్రంలోని నీతిన్యాయాలనూ నెరవేర్చగలిగే ఆధ్యాత్మిక వ్యక్తులుగా చేయడమే ఆయన ఉద్దేశం (రోమీయులకు 7:12, రోమీయులకు 7:14). హెబ్రీయులకు 8:10 కూడా చూడండి. విశ్వాసులు ధర్మశాస్త్రం కింద లేరు (రోమీయులకు 6:14; రోమీయులకు 7:4). వారు దాని ప్రత్యేక దినాలు, కర్మకాండలు, ఆహార నియమాలు ఇలాంటివాటిని ఆచరించనక్కరలేదు. కానీ ధర్మశాస్త్రంలోని నీతి సంబంధమైన న్యాయ సమ్మతమైన నియమాలు వారిలో నెరవేరాలని దేవుని కోరిక. ఈ నియమాలు రెండు ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నాయి – రోమీయులకు 13:8-10; మత్తయి 22:37-40 చూడండి. వీటిని నెరవేర్చాలంటే ఒకటి అత్యంత అవసరం – “ఆత్మను అనుసరించి ప్రవర్తించాలి”. గలతియులకు 5:16-18 కూడా చూడండి. దీనికి అర్థమేమిటంటే, ఆయన మనలో నివసిస్తున్నాడని గుర్తించాలి (వ 9,15) మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి (రోమీయులకు 6:13) ఆయన మాటకు లోబడాలి (వ 14; గలతియులకు 5:25) ఆయన మనకు బలప్రభావాలను ఇస్తాడని నమ్మి వాటిని ఉపయోగించుకోవాలి (వ 13) ఆయన అదుపులో ఉండాలి (వ 9; ఎఫెసీయులకు 5:18).

5. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;

“శరీర స్వభావం”– గ్రీకు పదం “సార్క్స్” (రోమీయులకు 7:5; గలతియులకు 5:17). పౌలు ఇక్కడ రెండు రకాల వ్యక్తులను వర్ణిస్తున్నాడు. ఈ భూమిపై ఉన్న వారంతా ఈ రెండు గుంపులకే చెందుతారు. ఒక రకంవారు ఒక విధంగా ఆలోచిస్తారు. రెండో రకం వారు అందుకు పూర్తి వ్యతిరేకంగా ఆలోచిస్తారు. అవిశ్వాసుల మనస్సుల్లోకి శరీర స్వభావం తన కోరికలన్నిటినీ ప్రవేశపెడుతుంది. వారు వాటివెంట వెళ్తారు. దేవుని ఆత్మ తన కోరికలను విశ్వాసుల మనస్సుల్లోకి తెస్తాడు. ఆయన వారికోసం ఆశించే విషయాలతో వారి మనస్సు నిండి ఉంటే వారు వాటివెంట వెళ్తారు. ఒక వ్యక్తి ఆలోచించే విధానం అతని జీవిత విధానంపై ఎంతో ప్రభావం చూపుతుంది (అందువల్ల 2 కోరింథీయులకు 10:5; ఫిలిప్పీయులకు 4:8; కొలొస్సయులకు 3:16; కీర్తనల గ్రంథము 1:2 లోని సంగతులు మనకు చాలా ప్రాముఖ్యమైనవి). శరీర స్వభావానికి సంబంధించిన విషయాల్లో కొన్ని మనుషులకు పాపభరితమైనవిగా అనిపించకపోవచ్చు. అవి మత సంబంధమైన, బుద్ధిసంబంధమైన విషయాలు కూడా అయి ఉండవచ్చు. అయితే అవి దేవునికి సంబంధించినవి కావు (మత్తయి 16:23), భూసంబంధమైనవే (ఫిలిప్పీయులకు 3:19) గానీ పరలోక సంబంధమైనవి కావు (కొలొస్సయులకు 3:2). దేవుని ఆత్మలేని మనుషులకు అవి సహజంగా సబబయినవిగా అనిపిస్తాయి. వ 6లో “మరణం” అంటే అర్థం ఆత్మ సంబంధమైన మరణం, దేవుని సన్నిధినుంచి వేరైపోవడం (యెషయా 59:2; ఎఫెసీయులకు 2:1; ఎఫెసీయులకు 4:18). క్రీస్తులో లేని ప్రతి వ్యక్తి సహజ మనస్సు తనకేవి ప్రియంగా సంతోషకరంగా అనిపిస్తాయో వాటిమీదే ఉంటుంది. అయితే అవి ఏకైక నిజ దేవునితో ఎలాంటి సంబంధమూ లేనివి, ఆయనకు వ్యతిరేకమైనవి (వ 7). అలాంటి మనిషి తాను దేవుని పక్షానే ఉన్నానని తలంచవచ్చు. ఆయన్ను ప్రేమిస్తున్నానని కూడా చెప్పవచ్చు. కానీ ఇది కేవలం భ్రమ. పాపాత్ముడి మనసు తనకు తాను ఎన్నడూ మారదు, దేవునికి లోబడదు. అలాంటిది దానికి అసాధ్యం. ఒక మనిషి దేవునికి లోబడడం ఆరంభించాలంటే మౌలికమైన గొప్ప మార్పు అవసరం. దేవుని ఆత్మ అతనిలో ప్రవేశించి అతనికి నూతన జీవాన్నిచ్చి అతడు ఆలోచించే విధానాన్ని మార్చివేయాలి. ఇది జరగకుండా ఎవరూ దేవునికి ఆనందం కలిగించేవాడుగా ఉండలేడు. ఒక వ్యక్తి చాలా మత నిష్ఠగలవాడై ఉండవచ్చు. చాలా నీతిగలవాడై, బాగా చదువుకున్నవాడై, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. కానీ దేవుని ఆత్మ లేకుండా ఇదంతా పాపమే, మరణమే. దేవునికి ఇలాంటిది ఎన్నటికీ అంగీకారం కానేరదు. యోహాను 3:3-8 పోల్చి చూడండి. ఒక మనిషిలోని భ్రష్ట స్వభావం మతం, నైతిక వర్తన అనే ముసుగులో ఉన్నంత మాత్రాన అది దేవునికి ఇష్టమౌతుందని మనం అనుకోకూడదు. దేవుడు మతం పొరలు తొలగించి హృదయాన్ని ఉన్నది ఉన్నట్టుగానే చూస్తాడు (హెబ్రీయులకు 4:12-13). పాపులైన మనుషుల మత సంబంధమైన ఆలోచనలూ అనుభూతులూ అతనిలోని ఇతర విషయాలన్నిటి లాగే పాపంతో కూడినవని ఆయనకు తెలుసు.

6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.

7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.

8. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.

9. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

“ఆ ఆత్మలోనే ఉన్నారు”– 5-8 వచనాల్లో పౌలు వర్ణించిన రెండు రకాల మనుషులు రెండు వేరువేరు ప్రపంచాల్లో ఉన్నారు. దేవుని ఆత్మ లేనివారు తమ శరీర స్వభావానికి చెందినవారు. దాని ప్రకారం జీవిస్తుంటారు. దేవుని ఆత్మ ఉన్నవారు పాపాన్నీ, తమ భ్రష్ట స్వభావాన్నీ పరిత్యజించినవారు. వారు దేవుని ఆత్మకు చెందినవారు. ఆయన వారిలో నివసిస్తూ వారిలో పని చేస్తూ ఉంటాడు. ఈ వచనంలో దేవుని ఆత్మను క్రీస్తు ఆత్మ అనడం చూడండి. క్రీస్తు దేవుడే అని గాక దీనికి వేరే అర్థం ఏముంది? ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీయులకు 2:6; లూకా 2:11 చూడండి. క్రీస్తు ఆత్మ లేకుంటే ఎవరూ క్రీస్తుకు, దేవునికి చెందినవారు కారు, పాపవిముక్తీ నిర్దోషుల లెక్కలోకి రావడమూ ఉండవు. అలాంటివారికి క్రైస్తవులని పేరు ఉండవచ్చు. అయితే వారు క్రీస్తుకు చెందినవారు కారు. క్రీస్తు ఆత్మను పొందడమెలా? క్రీస్తులో నమ్మకం ఉంచడం ద్వారానే. దేవుడు విశ్వాసులకు తన ఆత్మను ఉచితంగా ఇస్తాడు (రోమీయులకు 5:5).

10. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.

వ 9లో దేవుని ఆత్మ విశ్వాసుల్లో నివసిస్తున్నాడని పౌలు చెప్తున్నాడు. ఇక్కడ క్రీస్తు తానే వారిలో ఉంటున్నాడని చెప్తున్నాడు (యోహాను 17:23; 2 కోరింథీయులకు 13:5; కొలొస్సయులకు 1:27; ప్రకటన గ్రంథం 3:20 చూడండి). ఆయన తన ఆత్మ ద్వారా వారిలో ఉన్నాడు. ఈ వచనాల్లో దేవుడు, క్రీస్తు, ఆత్మలమధ్య ఉన్న ఏకత్వం కనిపిస్తుంది. అలాగని ఈ ముగ్గురూ ఒకే వ్యక్తి అని కాదు. మత్తయి 3:16; యోహాను 17:1; 2 యోహాను 1:3 మొ।। చోట్ల నోట్స్ చూడండి. విశ్వాసి దేహం మృతం అని గమనించండి. రోమీయులకు 7:24 పోల్చి చూడండి. అందరిలో లాగానే క్రీస్తుకు చెందినవారిలో కూడా మరణం పని చేస్తూనే ఉంది. క్రీస్తు మన జీవిత కాలంలో తిరిగి రాకపోతే మనమంతా కూడా చనిపోతాం. పాపమే దీనికి కారణం. కానీ జీవమిచ్చే ఆత్మ (వ 2) విశ్వాసుల్లో ఉంటున్నాడు. ఆయన మూలంగా వారి ఆత్మలు సజీవంగా ఉన్నాయి.

11. మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.

ఇక్కడ రెండు సత్యాలున్నాయి – క్రీస్తు మరణించి తిరిగి సజీవంగా లేవడం (రోమీయులకు 1:4; మత్తయి 28:6), భవిష్యత్తులో విశ్వాసులు మరణం నుంచి సజీవంగా లేవడం (వ 23; యోహాను 6:39; 1 కోరింథీయులకు 15:52; 1 థెస్సలొనీకయులకు 4:16). క్రీస్తు శుభవార్త ప్రకారం ఒక విశ్వాసి శరీరం అతని ఆత్మ జీవించే ఇల్లు మాత్రమే కాదు, తరువాత దేవుడు శాశ్వతంగా తీసిపారేసేది కాదు. మన ఆత్మలు తమను వెల్లడి చేసుకునే అతి ప్రాముఖ్యమైన సాధనం శరీరం. అది చివరికి మరణం నుంచి సజీవంగా లేచి క్రీస్తు దేహం లాగా దివ్య శరీరం అవుతుంది (ఫిలిప్పీయులకు 3:21).

12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము.

పౌలు ద్వారా దేవుడు ఇంతవరకు వెల్లడించిన దివ్య సత్యాలను విని విశ్వాసులు ఏమి అనుకోవాలి? ఏం చేయాలి? దేవుని అద్భుత కృప వెలుగులో విశ్వాసుల బాధ్యత ఏమిటి? పౌలు రోమీయులకు 6:11-13,రోమీయులకు 6:19 లో ఈ విషయం కొంత రాశాడు. స్వార్థ త్యాగం చేసుకుని, తమ శరీర స్వభావానికి లోబడక “శరీర క్రియలను చావుకు గురి చేసేందుకు” దేవుని ఆత్మ ఇచ్చే బలప్రభావాలను ఉపయోగించుకోవాలి (కొలొస్సయులకు 3:5-10 చూడండి. మత్తయి 5:29-30; గలతియులకు 5:24 పోల్చి చూడండి). ఎప్పుడూ చేస్తూ ఉండవలసిన పని ఇది. ప్రతి చెడ్డ పనినీ విసర్జించి, దాన్ని చంపేసేందుకు దేవుని ఆత్మకు దాన్ని అప్పగించాలి – మన జీవితాల్లో పాపాన్ని చంపేసే బలప్రభావాలు ఆయనవే, మనవి కాదు. కానీ మనం ఆయనతో సహకరించి ఆయన మనకిచ్చే శక్తిని ఉపయోగించాలి (ఫిలిప్పీయులకు 2:12-13 పోల్చి చూడండి). మన ఇళ్ళల్లో విష సర్పాలను ఎలా ఉంచుకోమో అదే విధంగా చెడ్డ క్రియలు, ప్రవర్తన, పాపమైన తలంపులూ ఆశలూ మన బ్రతుకుల్లో ఉండనీయకూడదు. నిజ విశ్వాసి తన పాపాల విషయం పశ్చాత్తాప పడ్డాడు, తన జీవితంలోని పాపాలకు విరోధంగా పోరాడుతూ, వాటిపై దేవుని ఆత్మ బలాన్ని ప్రయోగించడం నేర్చుకుంటూ ఉన్నాడు. అతడు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఇదంతా చేయాలని నిర్ణయించు కున్నాడు. అది అప్పటికప్పుడు హఠాత్తుగా చేసుకున్న నిర్ణయం. అయితే దాన్ని నెరవేర్చడం మాత్రం మెల్లగా చాలా కష్టతరంగా జరగవచ్చు. బహుశా కొద్దిమందే నిలకడగా సంపూర్ణంగా దీన్ని చేయగలుగుతారేమో. అయితే విశ్వాసులందరి జీవితాల్లోనూ ఇలా చెయ్యాలన్న మనస్తత్వం, ధోరణి ఉంటుంది. “సోదరుడు” అని పిలవబడిన వాడెవడైనా శరీర క్రియలను చావుకు గురి చేస్తూ ఉండకపోతే తనలో జీవమిచ్చే ఆత్మ లేడనీ, పని చేయడం లేదనీ బయట పెట్టుకుంటున్నాడన్నమాట (1 యోహాను 3:6, 1 యోహాను 3:9). ఎవరైనా సరే ఎప్పుడూ శరీరానుసారంగా జీవిస్తూ ఉండడం ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ నివసించడం లేదనేదానికి రుజువు. అలా జీవించడం మరణమే, మరణానికే దారి తీస్తుంది (వ 6; రోమీయులకు 6:16, రోమీయులకు 6:23).

13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.

14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.

దేవుని సంతానమంటే ఏమిటో వివరించే వచనం ఇది. దేవుని సంతానమంటే ఆయన ఆత్మమూలంగా పుట్టినవారు (యోహాను 1:12-13). అంతేకాదు, దేవుని ఆత్మ దారి చూపుతూ ఉండగా వారు అనుసరిస్తారు (యోహాను 10:27 పోల్చి చూడండి). ఆత్మ వారిని తమ శరీర క్రియలను చావుకు గురిచేసేలా నడిపిస్తాడు. దేవుని ఆత్మ ఎప్పుడూ విశ్వాసులను స్వార్థం నుంచీ పాపం నుంచీ దూరంగా నడిపిస్తాడు. ఈ అనుభవం లేని వ్యక్తిలో నిజమైన పశ్చాత్తాపం, నమ్మకం లేవన్నమాట. అతడు పాపవిముక్తి, రక్షణ పొందలేదన్నమాట (1 యోహాను 2:4-6; 1 యోహాను 3:3, 1 యోహాను 3:7-10; యోహాను 14:23-24). పౌలు విశ్వాసులను దేవుని సంతానం అంటున్నాడు. రోమీయులకు 6:16-22 లో వారిని బానిసలు అన్నాడు. ఈ రెండూ పరస్పర విరుద్ధ భావాలేమీ కావు. బానిసత్వం అనడంలో బలవంతంగా దాస్యంలో ఉండడమని అతని ఉద్దేశం కాదు. సమ్మతించి ఆనందంగా దేవుణ్ణి సేవించడమే. సంతోషంగా దేవునికి బానిసలు కావడంద్వారా విశ్వాసులు తాము దేవుని సంతానమని రుజువు పరచుకుంటారు. దేవుని దాసులుగా ఉండేందుకు వారికి ఇష్టం లేకపోతే ఆయన సంతానంగా ఉండేందుకు వారు అర్హులు కాదని తమంతట తామే బయట పెట్టుకుంటున్నారన్నమాట. నిజానికి అలాంటివారు దేవుని సంతానం కారు.

15. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము.

విశ్వాసులు ఎవరి బలవంతం లేకుండా తమకు తామే దేవునికి దాసులైనవారు. భయానికి అయిష్టంగా దాసులైనవారు కాదు (హెబ్రీయులకు 2:14-15). వారిలో నివసిస్తున్న దేవుని ఆత్మమూలంగా (వ 9) వారు తమకు తామే దేవుణ్ణి తమ తండ్రిగా తలంచి అలా సంబోధిస్తారు.

16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.

దేవుని ఆత్మ వేరు, విశ్వాసుల ఆత్మ వేరు అని జాగ్రత్తగా గమనించండి. అద్వైత వేదాంతం బోధిస్తున్నది తప్పు. దేవుని ఆత్మ, విశ్వాసి ఆత్మ ఒకటి కాదు. యోహాను 14:16-17 కూడా చూడండి. విశ్వాసుల హృదయాల్లో వారు దేవుని ఆత్మ ప్రకారం నడుస్తూ శరీర క్రియల్ని చావుకు గురి చేస్తూ ఉంటే (వ 13,14), వారి ఆత్మలకూ దేవుని ఆత్మకూ మధ్య ఆనందకరమైన సమ్మతి, అంగీకారం ఉంటుంది. దేవుని ఆత్మ వారు దేవుని పిల్లలన్న నిశ్చయతలోకి వారిని నడిపిస్తూ ఉంటాడు (1 యోహాను 3:24; 1 యోహాను 4:13). విశ్వాసుల హృదయాల్లో దేవుని ఆత్మ ఏ విధంగా ఈ సాక్ష్యం చెప్తాడో ఇక్కడ పౌలు వివరించలేదు. అయితే అది ఒక వ్యక్తిగత అంతరంగ అనుభవమన్నది స్పష్టమే. అంతరంగంలో ఆత్మ సాక్ష్యం, బయటనుంచి బైబిలు సాక్ష్యం ఒకదానికొకటి పూర్తిగా ఏకీభవిస్తాయని మనం నిస్సందేహంగా నమ్మవచ్చు. ఒక విషయం సత్యం కాదని దేవుని వాక్కు చెప్తుంటే అది సత్యమేనని దేవుని ఆత్మ ఎప్పటికీ చెప్పడు. దేవుని ఆత్మ దేవుని వాక్కును విశ్వాసుల హృదయాలకు వ్యక్తిగతమైనదానిగా, వాస్తవంగా, సజీవంగా అయ్యేలా చేస్తాడు. విశ్వాసులకు లభించగల జ్ఞానం, నిశ్చయత గురించి రోమీయులకు 5:5; 1 యోహాను 5:10, 1 యోహాను 5:20; 1 కోరింథీయులకు 2:9-12; యోహాను 16:13-15 కూడా చూడండి. ఒక విశ్వాసి పాపం చేస్తే పవిత్రాత్మను దుఃఖపెట్టి, నిశ్చయత నిచ్చే ఆయన మాటలను ఆపివేసిన వాడౌతాడేమో (ఎఫెసీయులకు 4:30).

17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.

“వారసులు”– అన్నిటికీ వారసుడు క్రీస్తు (హెబ్రీయులకు 1:2). కాబట్టి ఆయనతో వారసులు కావడమంటే అన్నిటినీ ఆస్తిగా స్వీకరించడమన్నమాట. రోమీయులకు 4:13; 1 కోరింథీయులకు 3:21-23; ఎఫెసీయులకు 1:14; కొలొస్సయులకు 1:12; ప్రకటన గ్రంథం 21:7; మత్తయి 5:5 చూడండి. “మహిమ”– రోమీయులకు 5:2; రోమీయులకు 9:23; యోహాను 17:22, యోహాను 17:24; కొలొస్సయులకు 1:27; కొలొస్సయులకు 3:4; 1 థెస్సలొనీకయులకు 2:12; హెబ్రీయులకు 2:10; 1 పేతురు 4:13-14; 1 పేతురు 5:10. “ఆయనతోపాటు బాధలు”– మొదట బాధలు, తరువాత మహిమ – ఇదే దేవుడు తన కుమారుడైన యేసును నడిపించిన మార్గం (లూకా 24:26). తన పిల్లలను కూడా ఆయనిప్పుడు నడిపించే మార్గం ఇదే (యోహాను 16:33; అపో. కార్యములు 14:22; 1 పేతురు 4:1, 1 పేతురు 4:12). క్రీస్తుతోకూడా బాధలు అనుభవించడ మంటే క్రీస్తు విశ్వాసి అయినా కాకపోయినా ప్రతి ఒక్కరికీ వచ్చే కష్టాలు, బాధలు, వేదనలు భరించడం కాదు. మనం క్రీస్తుకు చెందినవారమన్న కారణాన్ని బట్టే బాధలు అనుభవించడ మన్నమాట. ఆయన్ను తిరస్కరించి ద్వేషించిన లోకంలో (యోహాను 15:18-21) విశ్వాసులైన మనం ఉన్నందుకూ, అనేక విషమ పరీక్షలకు గురి అవుతున్నందుకూ, మనలోనూ, మన చుట్టూరా ఉన్న పాపంతో మనం పోరాడుతూ ఉన్నందుకూ, సత్యం, న్యాయం కోసం మనం స్థిరంగా నిలబడుతున్నందుకూ మనం బాధలు అనుభవించడమన్నమాట. అలాంటి వారందరికీ హింసలు తప్పవు (2 తిమోతికి 3:12). మనం క్రీస్తుతో కలిసి బాధలు అనుభవించేందుకు ఇష్టపడకపోతే, ఇకపైన ఆయనతో కలిసి మహిమలోనూ వారసత్వంలోనూ భాగస్వాములవుతామని ఆలోచించే హక్కు మనకు లేదు. మనం ఆయనతో బాధలు పడుతున్నప్పుడు మనకెందుకీ బాధలు? అనుకోకూడదు. నిజానికి ఆయనతో మనం బాధలు అనుభవించకుండా ఉంటుంటే ఎందుకు అలా అనుభవించడం లేదని ప్రశ్నించుకోవాలి.

18. మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచు చున్నాను.

పౌలు చాలా బాధలు పడ్డాడు (2 కోరింథీయులకు 11:23-29). అయితే రాబోయే శాశ్వత మహిమతో పోల్చుకుంటే ఆ బాధలు చాలా చులకనైనవని అతడు భావించాడు – 2 కోరింథీయులకు 4:17. తనకు ఆ మహిమలో భాగం ఉందని అతనిలో ఉన్న నిశ్చయతే తన బాధలన్నిటినీ ఓపికతో ఆనందంతో కూడా సహించేలా చేసింది (రోమీయులకు 5:3).

19. దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.

“దేవుని సంతానం బయలుపడే”– వ 23; కొలొస్సయులకు 3:4; 1 పేతురు 1:5; 1 యోహాను 3:1-2.

20. ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై,
ఆదికాండము 3:17-19, ఆదికాండము 5:29, ప్రసంగి 1:2

మొదటి మనిషి పాపంలో పడిపోవడంవల్ల భూమి మొత్తం బాధల పాలైంది – ఆదికాండము 3:14-19. మొదట్లో దేవుడు చేసినదంతా మంచిదే (ఆదికాండము 1:31). కానీ పాపం వల్ల ఈ మంచి సృష్టికి వినాశం, మరణం ప్రాప్తించాయి. ఇప్పుడు ఇలా చెరలో ఉండి మూలుగుతూ ఉన్న ఈ సృష్టే విడుదల పొంది రాబోయే మహిమలో భాగం పంచుకుంటుంది. యెషయా 11:6-9; యెషయా 25:6-8; యెషయా 35:1-10; యెషయా 49:8-13 పోల్చి చూడండి. సృష్టి మొదట్లో ఎలా ఉందో అలా ఇప్పుడు లేదు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు అది ఇప్పటిలాగా ఉండదు. మానవజాతి పాపంలో పడిపోయినదాని ఫలితాన్ని భూమి ఎలా పంచుకుందో, క్రీస్తు మానవజాతిని పాపం నుంచి విమోచించిన ఫలితాన్ని కూడా అది పంచుకుంటుంది.

21. స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను.

22. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము.

23. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము

రోమీయులకు 7:24; 2 కోరింథీయులకు 5:4. విశ్వాసుల విముక్తి, రక్షణలో ఆఖరి మెట్టు పునర్జీవితం, మహిమ స్థితిని పొందడం (వ 30). వారు ఆ సమయం కోసం ఆశతో ఎదురుచూస్తూ మూలుగుతూ ఉన్నారు. ఇక్కడ దీన్ని శరీర విమోచనం అంటున్నాడు పౌలు. 1 కోరింథీయులకు 15:51-54; ఫిలిప్పీయులకు 3:21 చూడండి. యోహాను 5:28-29 కూడా చూడండి. ఇక్కడ “దత్త స్వీకారం” అంటే పూర్తిగా, శాశ్వతంగా విమోచన అనుభవించి, శరీరం, మనసు, ఆత్మలో క్రీస్తు పోలికలోకి మార్చబడిన విశ్వాసులు, రూపాంతరం పొందిన సృష్టిలో దేవుని సంతానంగా తమ స్థానాలను అలంకరించడం.

24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితివిు. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును?

“ఆశాభావం”– రోమీయులకు 5:2. పౌలు, ఇతర కొత్త ఒడంబడిక గ్రంథం రచయితలు ఇక్కడ వాడిన గ్రీకు పదానికి ఆశాభావం అనే తెలుగు పదంకన్నా మరింత బలమైన అర్థం ఉంది. భవిష్యత్తులో వస్తుందని దేవుడు వెల్లడి చేసినది తప్పక వస్తుందని దృఢ విశ్వాసంతో కూడిన నిబ్బరంతో ఎదురు చూడడం అనే అర్థం ఇందులో వస్తుంది. ఒకటే నాణేనికి నమ్మకం, ఆశాభావం బొమ్మా బొరుసూ. తీతుకు 1:2; 1 పేతురు 1:21; మొ।। చూడండి.

25. మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము.

26. అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు.

విశ్వాసుల ఆధ్యాత్మిక జీవితం, వారి అంతిమ ముక్తి, రక్షణ గురించిన అద్భుతమైన సత్యాలు ఈ అధ్యాయమంతటా వెల్లడి అయ్యాయి. అయినా దీని కేంద్ర స్థానంలో మూడు మూలుగులు ఉన్నాయి – ఈ వచనంలో ఒకటి, వ 22, వ 23. సృష్టి, విశ్వాసులు, దేవుని ఆత్మ అందరూ ఒకే సమయంలో మూలుగుతున్నారు. విశ్వాసులమైన మనలో దేవుని ఆత్మ ఎందుకు మూలుగుతున్నాడు? మన ఆధ్యాత్మిక సంక్షేమం గురించిన భారం ఆయనపై ఉంది. పవిత్రతలో జ్ఞానంలో మనం ఎదగాలనీ, యేసుప్రభువులాగా మరీ మరీ కావాలనీ ఆయన ఎంతో ఆశిస్తున్నాడు. చెప్పడానికి వీలుకానంత ఆశతో మనల్ని పాప కూపం నుంచి, సైతాను ప్రభావంనుంచి తప్పించేందుకు ఆయన శ్రమిస్తున్నాడు. మనల్ని దేవునికోసం బలవంతమైన, ఫలవంతమైన సంతానంగా చేసేందుకు పాటుపడుతున్నారు. కొలొస్సయులకు 1:9-12 లో దేవుని ఆత్మమూలంగా పౌలు చేసిన ప్రార్థనను పోల్చి చూడండి. విశ్వాసులు తమలో తాము పూర్తిగా బలహీనులు (రోమీయులకు 7:14-25), వారికి ఎలా ప్రార్థించాలో, దేనికోసం ప్రార్థించాలో కూడా వారికి తెలియదు గనుక దైవాత్మ సహాయం, విన్నపాలు ఎంతో అవసరం. మన బలహీనతలను బలంగా మార్చివేయడానికి దేవుని ఆత్మ మనలో పని చేస్తున్నాడని చెప్పవచ్చు (2 కోరింథీయులకు 12:9-10).

27. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్దులకొరకు విజ్ఞాపనము చేయు చున్నాడు.
కీర్తనల గ్రంథము 139:1

విశ్వాసుల పక్షంగా సమస్తమూ తెలిసిన ఇద్దరు విన్నపాలు చేస్తూ ఉన్నారు (వ 34). ఈ ఇద్దరి ప్రార్థనలు వినే సర్వశక్తిమంతుడు వారికి ఉన్నాడు. కుమారుడు, పవిత్రాత్మ ఎల్లప్పుడూ దేవుని సంకల్పం ప్రకారమే ప్రార్థిస్తుంటారు. అందువల్ల పరమ తండ్రి ఎప్పుడూ వారి ప్రార్థనలు వింటాడు (1 యోహాను 5:14-15 పోల్చి చూడండి). విశ్వాసుల బలహీనతలో సహాయం చేసేందుకు, లోకాన్నీ శరీరాన్నీ, సైతానునూ జయించేందుకు త్రిత్వమంతా పని చేస్తూ ఉన్నారు.

28. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.

బైబిల్లోని గొప్ప వచనాల్లో ఇదొకటి. చాలామంది క్రైస్తవులు ఇలాంటి వచనాలను ఇతరులకు వినిపిస్తుంటారు గానీ వారిలో కొద్దిమంది మాత్రమే ఇందులోని సత్యం తమ సొంత పరిస్థితులకు వర్తిస్తుందని గుర్తించ గలుగుతున్నట్టుంది. ఈ వచనంలోని మాటలు నమ్మి ఇవి తమ విషయంలో ఎప్పుడూ నిజమని తెలిసినవారికి మాత్రం వేడిమి, అలసట ఉన్న ఎడారి భూమిలో గొప్ప బండ చాటున ఉండే చల్లని నీడలాంటి వచనం ఇది. ఇది నిజం కావడం అసాధ్యం అనిపించినప్పటికీ ఇది ఎప్పుడూ నిజమే (వ 35-39లో విశ్వాసులకు కలిగే కొన్ని అనుభవాలు చూడండి). తమ అనుదిన జీవితాల్లో తమకెదురయ్యే సంఘటనలన్నిటికీ ఈ సత్యాన్ని వర్తింపజేసుకోగలిగినవారు ధన్యులు. పౌలు ఏమంటున్నాడో చూడండి. “మనకు ఎక్కడో కొద్దిగా ఆశ ఉంది”, లేదా “ఇది నిజమేమో అని ఊహిస్తున్నాం” అనడం లేదు పౌలు. “మనకు తెలుసు” అంటున్నాడు. దేవుడు దీన్ని ఇలా వెల్లడించాడు కాబట్టి, బైబిల్లో అనేక చోట్ల ఇది సత్యమని ఆధారాలు చూపించాడు కాబట్టి ఇది సత్యమని మనం తెలుసుకోగలం (ఉదాహరణకు ఆదికాండము 50:20 చూడండి). “దేవుణ్ణి ప్రేమించేవారికి” అనేది, “ఆయన...పిలిచిన వారికి” అనే ఈ రెండు వేరు వేరు మాటలు నిజ విశ్వాసులందరినీ సూచించే మాటలు. వారంతా దేవుణ్ణి ప్రేమించేవారే, తన ఉద్దేశాలు నెరవేర్చుకునేందుకు వారందరినీ ఆయన పిలిచాడు (వ 30; రోమీయులకు 1:5-6; 1 కోరింథీయులకు 16:22; 1 యోహాను 4:8, 1 యోహాను 4:16). విశ్వాసులను దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకువచ్చినా అందులో మేలే చేకూరుస్తున్నాడు. వాటన్నిటి ద్వారా వారు ఆధ్యాత్మికంగా ఎదిగి మరింతగా క్రీస్తులాగా మారాలని ఆయన ఉద్దేశం. జరిగిన కొన్ని విషయాలద్వారా తమకు ఏ మేలు జరిగిందో విశ్వాసులు ప్రతి సారీ గ్రహించలేకపోవచ్చు. కానీ గ్రహించవలసిన అవసరమే లేదు, నమ్మకమే చాలు.

29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.

వ 28లో దేవుని ఉద్దేశం ఇది: విశ్వాసులను క్రీస్తు స్వరూపంలోకి మార్చడం (హెబ్రీయులకు 2:10-11; 1 యోహాను 3:1-2). ఇంతకన్నా ఉన్నతమైన ఉద్దేశం, గొప్ప లక్ష్యం వేరొకటి ఉండబోదు. ఈ ఉద్దేశం నెరవేరడానికి అవసరమైన ఐదు మెట్లను పౌలు ఇక్కడ చెప్తున్నాడు. వీటిలో రెండు లోక సృష్టికి ముందున్నవి. రెండు క్రీస్తులో విశ్వాసి జీవితం ఆరంభంలో ఉన్నవి. ఒకటి ఇకముందు రాబోయేది. వీటిలో ప్రతి మెట్టుకూ మిగతా నాలుగింటితో సంబంధం ఉంది. అన్ని మెట్లూ దేవుడు వాటినెంత ఖచ్చితంగా చేయగలడో అంత ఖచ్చితమైనవి. “ముందుగానే...తనకు తెలిసిన తనవారు”– విశ్వాసులు తన కుమారుని పోలికలోకి రావాలని దేవుడు ముందుగా నిర్ణయించడం వారిని గురించి ఆయనకున్న భవిష్యత్ జ్ఞానంపై ఆధారపడిన సంగతి. 1 పేతురు 1:2 కూడా చూడండి. ఈ భవిష్యత్ జ్ఞానం ఏమిటో పౌలు ఇక్కడ వివరించడం లేదు. దీనికీ దేవుడు విశ్వాసులను ముందుగానే నిర్ణయించడానికీ గల సంబంధమేమిటో చెప్పలేదు (ఈ అంశంపై నోట్ ఈ లేఖ చివర్లో చూడండి). “ముందుగానే నిర్ణయించాడు”– గ్రీకు క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఈ పదం ఆరు సార్లు మాత్రమే కనిపిస్తున్నది (ఇక్కడ, వ 30; అపో. కార్యములు 4:28; 1 కోరింథీయులకు 2:7; ఎఫెసీయులకు 1:5, ఎఫెసీయులకు 1:11). దీనికీ కర్మ సిద్ధాంతానికీ ఏ సంబంధమూ లేదు. జరిగేదానంతటికీ అదృష్టమే కారణమనే భావనకూ దీనికీ ఏ పోలికా లేదు. ఏమి జరగాలో ముందుగానే తెలిసిన దేవుడు అలా జరగాలని నియమించాడని దీని అర్థం. సర్వజ్ఞాని, సర్వశక్తి మంతుడు అయిన దేవుడు పూర్వ నిర్ణయం ప్రకారం ఏమి జరగాలని నియమిస్తాడో అది తప్పక జరిగి తీరుతుందని ఏమీ అనుమానం లేకుండా నమ్మవచ్చు. ఒక సంఘటన గురించి చెప్పిన అపో. కార్యములు 4:28 మినహా క్రొత్త ఒడంబడిక గ్రంథమంతట్లో దేవుని పూర్వ నిర్ణయాన్ని గురించిన మాటలు విశ్వాసుల విషయంలో మాత్రమే కనిపిస్తున్నవి. దేవుడు ఎవరినైనా శాశ్వత నరక శిక్షకు పూర్వమే నిర్ణయించినట్టు ఎక్కడా చెప్పలేదు. కొత్త ఒడంబడికలో పూర్వ నిర్ణయం సిద్ధాంతం విశ్వాసులకు గొప్ప ఆదరణను, గొప్ప ఆశాభావాన్ని ఇవ్వాలి. తనను పాపవిముక్తికి దేవుడు ముందుగా నిర్ణయించాడో లేదోనని ఎవరూ భయ సందేహాలకు తావియ్యనక్కర లేదు. యోహాను 6:37, యోహాను 6:44 దగ్గర నోట్స్ చూడండి. ఇష్టమున్న వారెవరైనా క్రీస్తు దగ్గరికి రావచ్చు (ప్రకటన గ్రంథం 22:17). ఆయన చెంతకు రావడం, ఆయనలో నమ్మకముంచడం అన్న చర్యలే దేవుడు ఆ వ్యక్తిని పూర్వం ఎన్నుకున్నాడని రుజువు.

30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

“పిలిచాడు”– వ 28; రోమీయులకు 1:5. అంటే క్రీస్తుదగ్గరకు వచ్చి ఆయన్ను నమ్ముకునేలా పిలవడం. దేవుని పిలుపు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలంటే ఈ క్రింది రిఫరెన్సులు చూడండి: గలతియులకు 1:6; గలతియులకు 5:13; 1 కోరింథీయులకు 1:9, 1 కోరింథీయులకు 1:24; కొలొస్సయులకు 3:15; 2 థెస్సలొనీకయులకు 2:14; 1 తిమోతికి 6:12; 2 తిమోతికి 1:9; హెబ్రీయులకు 3:1; 1 పేతురు 2:9, 1 పేతురు 2:20-21; 1 పేతురు 3:9; యూదా 1:1; రోమీయులకు 11:29. దేవుడు తమను పిలిచాడని ఖచ్చితంగా తెలుసుకోవలసిన బాధ్యత విశ్వాసులది – 2 పేతురు 1:10-11. దేవుడు తమను ఎన్నుకున్నాడని, పిలిచాడని, నిర్దోషులుగా తీర్చాడని విశ్వాసులు తెలుసుకోగలగడం సాధ్యమే. వారు అలా తెలుసుకోవాలి. “నిర్దోషులుగా ఎంచాడు”– దేవుని పిలుపు అనే పదాన్ని ఉపయోగించడంలో పౌలు ఉద్దేశాన్ని బట్టి చూస్తే దేవుడు పిలిచినవారంతా దేవుని చెంతకు వచ్చి యేసుప్రభువులో నమ్మకం ఉంచుతారు. వెంటనే దేవుడు వారి పాపాలన్నిటినీ క్షమించి వారిని లోపం లేని న్యాయవంతులుగా ఎంచుతాడు. రోమీయులకు 1:16-17; రోమీయులకు 3:21-28; రోమీయులకు 4:5; రోమీయులకు 5:1; రోమీయులకు 10:10 చూడండి. “మహిమపరచాడు”– వ 17,18,23. దేవుని ప్రజల విముక్తిలోని ఈ అంతిమ దశ ఇతర దశల్లాగానే భూతకాలంలోనే చెప్పబడింది. వేరే మాటల్లో చెప్పాలంటే దేవుడు ముందుగా ఎరగడం, పూర్వ నిర్ణయం చేయడం ఎంత ఖాయమో ఆయన దృష్టిలో ఇది కూడా అంతే ఖాయం. అది అసలు జరిగి పోయిందన్నంత నిశ్చయం (రోమీయులకు 4:17 పోల్చి చూడండి). పూర్వ నిర్ణయం ప్రకారం పిలుపు అందుకొని నిర్దోషులుగా తీర్చబడినవారే మహిమ పరచబడినవారు – అలాంటి ప్రతి ఒక్కరూ మహిమ స్థితిలో కనిపిస్తారు. ఎవరూ మిగిలిపోరు. నిజానికి ఇది ఒక విధంగా క్రీస్తులో ఇప్పటికే జరిగిపోయింది – యోహాను 17:22; ఎఫెసీయులకు 2:6; కొలొస్సయులకు 3:3-4. ఇదంతా తన కుమారునిలో నమ్మకముంచేలా దేవుడు పిలిచినవారందరి అంతిమ విముక్తి, రక్షణ ఎంత నిశ్చయమో తెలియజేస్తున్నది. యోహాను 6:37-40; యోహాను 10:27-29 లో యేసుప్రభువే ఈ సత్యాన్ని వెల్లడించాడు.

31. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?
కీర్తనల గ్రంథము 118:6

మనం ఏమనాలి? దేవుడు తన ప్రజలకు చేస్తాననుకునే వాటినీ, చేసేవాటినీ గురించిన మన మాటలన్నీ నమ్మకం, స్తుతి, గొప్ప నిశ్చయతతో కూడినవై ఉండాలి. వాటిల్లో ఏ ఒక్కటైనా నిజమా కాదా అన్న సందేహాన్ని మన మాటలేవీ బయట పెట్టకూడదు. దేవుడు ఆయనను నమ్ముతున్న మన పక్షాన ఉన్నాడు. మనతో, మనలో ఉన్నాడు. లోపల గానీ బయట గానీ ఉండే ఏ శత్రువైనా మనకోసం దేవునికున్న ఉద్దేశాలను ఓడించలేడు – వ 37; హెబ్రీయులకు 13:6; యోహాను 10:29.

32. తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు?

దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి ఇవ్వడమంటే ఆయనకు మహా ప్రీతి (1 యోహాను 4:8; 2 పేతురు 1:3; 2 కోరింథీయులకు 9:15; అపో. కార్యములు 14:17; మత్తయి 5:45; మత్తయి 7:10; కీర్తనల గ్రంథము 145:9). ఆయన సర్వ కృపానిధి అయిన దేవుడు (1 పేతురు 5:10). ఆయన కూర్చుని ఉన్నది కృపా సింహాసనం. ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన ప్రజలపై ఆయన కృప ఏలుతున్నది (రోమీయులకు 5:21). వారి అన్ని బలహీనతలపై, వారి భ్రష్ట స్వభావమంతటిపై కృప విజయం సాధిస్తుంది. దేవుడు అన్ని బహుమతులకంటే అతి శ్రేష్ఠమైనదిగా తన కుమారుణ్ణి ఇచ్చాడు. విశ్వాసుల అంతిమ విముక్తిని ఖాయం చేసేదాన్ని దేన్నైనా ఆయన దయ చేయకుండా దాచుకుంటాడా?

33. దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే;
యెషయా 50:8

తన ప్రజలకు వ్యతిరేకంగా ఏ నేరారోపణనూ దేవుడు అంగీకరించడు. రోమీయులకు 4:8 చూడండి. వారి విముక్తిని, రక్షణను వారినుంచి దోచుకోగలిగినది పాపం మాత్రమే. అయితే దేవుడు వారి పాపాల్ని వారి లెక్కలో చేర్చడు. అంటే పాపం చెయ్యడానికి వారిక స్వేచ్ఛ ఉందనా? ఏ మాత్రం కాదు – రోమీయులకు 6:1, రోమీయులకు 6:15; రోమీయులకు 8:4, రోమీయులకు 8:12-14.

34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే; అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే
కీర్తనల గ్రంథము 110:1, యెషయా 59:16, యెషయా 50:8

నేరారోపణను దేవుడు అంగీకరించే విధంగా ఒక్క విశ్వాసి మీదైనా నేరం మోపగలిగినది ఎవరు? ఎవరూ లేరు. సైతాను గానీ ఇతర మనుషులు గానీ ఆ విశ్వాసి తానే గానీ అలా చెయ్యలేరు. క్రీస్తు దేవుని కుడివైపున ఉండి తన ప్రజల పక్షంగా ప్రతి నేరారోపణకూ లేక శిక్షావిధి తెచ్చే ప్రతి ప్రయత్నానికీ జవాబు ఇస్తూ ఉన్నాడు. ఆయన జీవం, ఆయన చేస్తున్న విన్నపాలు వారిని శాశ్వతంగా క్షేమంగా భద్రంగా ఉంచుతాయి (రోమీయులకు 5:9-10; హెబ్రీయులకు 7:25; 1 యోహాను 2:1).

35. క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?

ఇక్కడ “క్రీస్తు ప్రేమ” అంటే విశ్వాసుల పట్ల ఆయనకున్న ప్రేమ. వారికి ఆయనపై ఉన్న ప్రేమ కాదు. వారి పాపం మూలంగా క్రీస్తుకు వారిపట్ల ఉన్న ప్రేమ తొలగిపోతే అప్పుడెలా? ఆయన ప్రేమ ఎన్నటికీ తొలగిపోదు. అది శాశ్వతమైన ప్రేమ (యిర్మియా 31:3). వారు ఈ భూమిపై ఉనికిలోకి రాకముందే అది ప్రారంభమైంది. వారిక్కడ జీవిస్తున్నంత కాలం, ఆ పైన శాశ్వతంగానూ అది సాగుతూనే ఉంటుంది. వారి భ్రష్ట స్వభావమూ పాపాలూ ముందుగానే ఆయనకు తెలిసి కూడా వారిపై తన ప్రేమను నిలిపాడు. క్రీస్తు ప్రేమ జ్ఞానానికి మించినది (ఎఫెసీయులకు 3:19). అది ఆటంకాలన్నిటినీ దాటుకుని ఆయన వారందరినీ చివరికి తన ప్రేమభరితమైన సన్నిధికి తీసుకువస్తుంది (పరమగీతము 8:6-7 పోల్చి చూడండి). పౌలు ఇక్కడ బాధలు, అపాయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే అవి దేవుని ప్రజలకు సామాన్యంగా సంభవించేవే (యోహాను 16:33; అపో. కార్యములు 14:22; మొ।।) కాబట్టి, విశ్వాసులను లొంగదీసే ప్రయత్నంలో సైతాను వాటిని వాడుకుంటాడు కాబట్టి, వాటి మూలంగా విశ్వాసులు ఒక్కోసారి క్రీస్తు తమను ప్రేమిస్తున్నాడా లేదా అనీ సందేహం రావచ్చు కాబట్టి, వాటి మూలంగా కొన్ని సార్లు పాపం చేసి తాత్కాలికంగా అపనమ్మకంలో పడిపోవచ్చు కాబట్టి పౌలు వాటిని గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఇది జరిగితే క్రీస్తు వారిని విడిచిపెడతాడా? ఆయన వారిని ఇంకా ప్రేమించడా? అలా ఎన్నటికీ కాదు. వారికి సంభవించగల జీవిత అనుభవాలన్నిటిలో నుంచీ వారిని క్షేమంగా పరలోకంలో చేర్చుకుంటాడు.

36. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము.
కీర్తనల గ్రంథము 44:22

కీర్తనల గ్రంథము 44:22.

37. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.

ప్రత్యేక వ్యక్తులైన పౌలులాంటి వారికే గాక విశ్వాసు లందరికీ క్రీస్తు అత్యధిక విజయం లభించేలా చేస్తాడు. వారిని అపరాజితులుగా చేస్తాడు. “మనకు” అనే మాటను గమనించండి. “అత్యధిక విజయం” అంటే ఏమిటి? అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు. ఏ పద్ధతి ఉపయోగించి అయినా సరే అతణ్ణి చివరకు ఓడించడం అనేది అసాధ్యం. పౌలు అంటున్నాడు – “అత్యధిక విజయం కలుగుతూ ఉంది”, గానీ “కలగవచ్చునేమో” అని కాదు, “కలిగే అవకాశం ఉంది” అని కాదు. పాపం, సైతాను, లోకం, శరీర స్వభావం విశ్వాసులను గాయపరచవచ్చు, కొద్ది కాలానికి వారిని నేలకూల్చవచ్చు. కానీ వారిపై అంతిమ విజయం సాధించలేవు. అత్యధిక విజయం పొందుతున్నవారిని ఓడించడం అసాధ్యం. వారికి నమ్మకాన్ని ఇచ్చిన దేవుడు అంతంవరకు వారిని ఆ నమ్మకంలో ఉంచుతాడు. క్రీస్తులోకి వారిని తెచ్చినవాడు అంతంవరకు క్రీస్తులో వారిని ఉంచుతాడు. అంతిమ శాశ్వత విజయం వారికిస్తాడు. విశ్వాసులకు అత్యధిక విజయం కలగడానికి కారణం ఒక్కటే – పాపం, సైతాను, మరణంపై మహా ఘనమైన విజయం సాధించిన క్రీస్తుతో వారు ఐక్యంగా ఉన్నారు. ఆయన విజయంలో వారు భాగస్వాములు.

38. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను,

నిజ విశ్వాసులు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రేమభరితమైన ఆలన పాలనలో భద్రంగా ఉన్నారన్న విషయాన్ని పౌలు ఇంతకన్నా గట్టిగా నొక్కి ఎలా చెప్పగలడు? విషమ పరీక్షలు, దుష్‌ప్రేరేపణలతో నిండిన ప్రపంచ జీవితం వారిని ఆయన నుంచి వేరుచేయలేదు. భవిష్యత్తులో వారికి తెలియని సంభవాలేవీ అలా చెయ్యలేవు. జీవితాంతంలో వారికెలాంటి మరణం వచ్చినా అది వారిని క్రీస్తు నుంచి వేరుచేయడం అసాధ్యం. ఏ దుష్ట శక్తి గానీ మంచి శక్తి గానీ వారినలా చెయ్యలేవు. కానీ ఎవరైనా “ఇక్కడ పాపం అనే మాట లేదు గదా” అనవచ్చు. అయితే జీవితంలో ఇప్పటి విషయాలైనా తరువాత వచ్చే విషయాలైనా అనడంలో పాపం కూడా ఉన్నట్టుంది. అంతేగాక విశ్వాసుల పాపం గురించి దేవుడు చెప్పిన మాటలను ఇంతకుముందే చూశాం గదా – వ 33,34; రోమీయులకు 4:8. కృప రాజ్యమేలుతున్నది (రోమీయులకు 5:21)!

39. మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Romans - రోమీయులకు 8 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఖండించడం నుండి విశ్వాసుల స్వేచ్ఛ. (1-9) 
విశ్వాసులు ప్రభువు నుండి క్రమశిక్షణను అనుభవించవచ్చు, అయినప్పటికీ వారు ప్రపంచంతో పాటు ఖండించబడరు. విశ్వాసం ద్వారా క్రీస్తుతో వారి కనెక్షన్ ద్వారా, వారి హామీ స్థాపించబడింది. వారి ప్రవర్తనలో నిర్ణయించే అంశం ఏమిటంటే, వారు శరీరాన్ని లేదా ఆత్మను అనుసరిస్తారా, పాత లేదా కొత్త స్వభావం, అవినీతి లేదా దయ. ప్రశ్న తలెత్తుతుంది: మనం దేనికి సంబంధించిన నిబంధనలను చేస్తాము మరియు దేని ద్వారా మనం పాలించబడతాము? పునరుత్పత్తి చేయని సంకల్పం ఏ ఆజ్ఞను పూర్తిగా పాటించలేకపోతుంది మరియు చట్టం, బాహ్య విధులకు మించి, అంతర్గత విధేయతను కోరుతుంది.
దేవుడు తన కుమారుని శరీర బాధల ద్వారా పాపం పట్ల తనకున్న అసహ్యాన్ని వ్యక్తపరిచాడు, విశ్వాసి వ్యక్తికి క్షమాపణ మరియు సమర్థనను అందించాడు. ఈ చర్య దైవిక న్యాయాన్ని సంతృప్తిపరిచింది, పాపుల మోక్షానికి మార్గం సుగమం చేసింది. ఆత్మ ద్వారా, ప్రేమ యొక్క నియమం హృదయంపై వ్రాయబడింది మరియు మనం ధర్మశాస్త్రం యొక్క నీతిని నెరవేర్చలేకపోయినా, అది మనలో నెరవేరుతుంది. నిజమైన విశ్వాసులు చట్టం యొక్క ఉద్దేశ్యానికి అనుగుణంగా ఉండే లక్షణాలను కలిగి ఉంటారు. ఆత్మ యొక్క ఆందోళనలు-దేవుని అనుగ్రహం, ఆత్మ యొక్క శ్రేయస్సు మరియు శాశ్వతమైన విషయాలు-ఆత్మను అనుసరించే వారి దృష్టి.
మన ఆలోచనల దిశను మరియు మన ప్రణాళికల మూలాన్ని పరిగణించండి. మనం ప్రపంచానికి లేదా మన ఆత్మలకు ప్రాధాన్యత ఇస్తున్నామా? ప్రాపంచిక ఆనందంలో మునిగి ఉన్నవారు ఆత్మీయంగా మరణించారు 1 తిమోతికి 5:6. పవిత్రమైన ఆత్మ జీవాత్మ, మరియు అలాంటి జీవితం శాంతితో కూడి ఉంటుంది. శరీరానికి సంబంధించిన మనస్సు కేవలం దేవునికి శత్రువు కాదు; అది శత్రుత్వమే. దైవిక దయ ద్వారా శరీరానికి సంబంధించిన మనిషిని దేవుని చట్టం క్రిందకు తీసుకురాగలిగినప్పటికీ, శరీరానికి సంబంధించిన మనస్సును విచ్ఛిన్నం చేయాలి మరియు బహిష్కరించాలి.
మనము దేవుని మరియు క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉన్నామో లేదో పరిశోధించడం ద్వారా మన నిజమైన స్థితిని గుర్తించవచ్చు (వచనం 9). "మీరు శరీరములో లేరు కానీ ఆత్మలో ఉన్నారు" అనేది క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉండటాన్ని సూచిస్తుంది, ఇది క్రీస్తు యేసుకు సమానమైన మనస్తత్వం, అతని బోధనలు మరియు ఉదాహరణలతో కూడిన జీవనశైలిలో స్పష్టంగా కనిపిస్తుంది.

దేవుని పిల్లలుగా వారి అధికారాలు. (10-17) 
ఆత్మ మనలో నివసించినట్లయితే, క్రీస్తు మనలో ఉన్నాడు, విశ్వాసం ద్వారా హృదయంలో నివసిస్తున్నాడు. ఆత్మలోని దయ యొక్క కొత్త స్వభావం శాశ్వతంగా ఉండే పవిత్రమైన ఆనందానికి నాందిని సూచిస్తుంది, ఎందుకంటే క్రీస్తు యొక్క ఆరోపించబడిన నీతి మరణం నుండి ఆత్మ యొక్క భద్రతకు హామీ ఇస్తుంది. ఇది శరీర మార్గాలలో కాకుండా ఆత్మ యొక్క మార్గాలలో నడవడం మన కర్తవ్యాన్ని నొక్కి చెబుతుంది.
భ్రష్టమైన కోరికలతో నిరంతరం మునిగిపోయే వారు తమ విశ్వాసాలతో సంబంధం లేకుండా వారి పాపాలలో అనివార్యంగా నశిస్తారు. తులనాత్మకంగా, మన స్వర్గపు పిలుపు అనే గొప్ప బహుమతికి వ్యతిరేకంగా ఒక్క క్షణం కూడా ఆలోచించదగిన ప్రాపంచిక జీవితం ఏమి అందించగలదు? కావున, మనము ఆత్మచేత నడిపించబడి, శరీర కోరికలను అణచివేయుటకు మనస్ఫూర్తిగా కృషి చేద్దాము.
పరిశుద్ధాత్మ ద్వారా పునర్జన్మ అనేది పెళుసైన స్థితిలో ఉన్నప్పటికీ, ఆత్మకు కొత్త మరియు దైవిక జీవితాన్ని అందిస్తుంది. దేవుని కుమారులు తమలో పనిచేసే ఆత్మను అనుభవిస్తారు, పిల్లల స్వభావాన్ని పెంపొందించుకుంటారు. వారు పాత నిబంధన చర్చి యొక్క అస్పష్టత సమయంలో ఆ బంధన స్ఫూర్తికి లోబడి లేరు. దత్తత యొక్క ఆత్మ అప్పుడు సమృద్ధిగా కురిపించబడలేదు మరియు ఇది చాలా మంది సాధువుల మార్పిడి సమయంలో ప్రబలంగా ఉన్న బంధన స్ఫూర్తిని కూడా సూచిస్తుంది.
చాలామంది తమకు తాము శాంతిని ప్రకటించుకోవచ్చు, కానీ దేవుడు ఆ శాంతిని ధృవీకరించకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ, పరిశుద్ధపరచబడినవారు వారి ఆత్మలతో దేవుని ఆత్మ సాక్ష్యమిచ్చును, దేవుడు వారి ఆత్మలకు శాంతిని తెలియజేస్తాడు. క్రీస్తు కొరకు, మనం ఇప్పుడు నష్టపోతున్నట్లు కనిపించినప్పటికీ, చివరికి, అతని కారణంగా మనం ఓడిపోము మరియు ఉండలేము.

కష్టాల క్రింద వారి ఆశాజనకమైన అవకాశాలు. (18-25) 
సాధువులు అనుభవించే పరీక్షలు తాత్కాలిక విషయాల కంటే లోతుగా చొచ్చుకుపోవు, ప్రస్తుత కాలానికి పరిమితమైన నశ్వరమైన వ్యవధిని కలిగి ఉంటాయి మరియు ఒక క్షణం మాత్రమే శాశ్వతమైన బాధలను కలిగి ఉంటాయి. ఈ వర్తమాన కాల బాధలకు సంబంధించి వాక్యం మరియు ప్రపంచం యొక్క దృక్కోణం మధ్య అసమానత అద్భుతమైనది. దేవుని పిల్లలు వారి కోసం సిద్ధం చేయబడిన మహిమలో వెల్లడి చేయబడే క్షణం కోసం మొత్తం సృష్టి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తుంది. మనిషి పతనం వల్ల జీవి అపరిశుభ్రత, వైకల్యం మరియు బలహీనతతో కలుషితమైంది. జీవులు ఒకదానికొకటి శత్రుత్వాన్ని ప్రదర్శిస్తాయి, తరచుగా మానవులు పాప సాధనంగా తారుమారు చేస్తారు. ఈ విచారకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ, ఆశ ఉంది. దేవుడు సృష్టిని మానవ దుర్మార్గపు బానిసత్వం నుండి విముక్తి చేస్తాడు.
మానవాళికి వారి స్వంత దుర్మార్గం మరియు ఇతరుల బాధలు ప్రపంచం దాని ప్రస్తుత స్థితిలో నిరవధికంగా ఉండదని సూచిస్తున్నాయి. ఆత్మ యొక్క మొదటి ఫలాలను మనం స్వీకరించడం మన కోరికలను పెంచుతుంది, మన ఆశలను బలపరుస్తుంది మరియు మన అంచనాలను పెంచుతుంది. దేవుని సృష్టిలోని అన్ని బాధలకు పాపమే కారణమని, భూసంబంధమైన బాధలకు దారితీసి నరకంలోని మంటలను రేకెత్తిస్తుంది. శరీరంలో లేదా మనస్సులో పడే ప్రతి కన్నీటి కన్నీరు, పలికే ప్రతి మూలుగు, మరియు అనుభవించే ప్రతి బాధను పాపంలో గుర్తించవచ్చు. వ్యక్తులపై తక్షణ ప్రభావానికి మించి, పాపాన్ని దేవుని మహిమపై దాని ప్రభావం దృష్ట్యా చూడాలి-ఈ దృక్కోణం తరచుగా మెజారిటీచే విస్మరించబడుతుంది.
విశ్వాసులు తమను తాము సురక్షిత స్థితిలో కనుగొంటారు, అయినప్పటికీ వారి సౌలభ్యం ప్రస్తుత ఆస్వాదన కంటే ఎక్కువ ఆశతో ఉంటుంది. ఈ ఆశ స్థిరంగా ఉంటుంది, సమయం మరియు ఇంద్రియాల యొక్క క్షణికమైన ఆనందాలలో నెరవేర్పును కనుగొనే వ్యర్థమైన నిరీక్షణకు లోనవుతుంది. ప్రయాణం కష్టతరమైనది మరియు సుదీర్ఘమైనది కాబట్టి సహనం అవసరం. ఏది ఏమైనప్పటికీ, వాగ్దానం చేసిన రాక ఆలస్యమైనట్లు అనిపించినా కూడా జరుగుతుంది.

ప్రార్థనలో ఆత్మ నుండి వారి సహాయం. (26,27) 
క్రైస్తవులు అనేక మరియు ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, వారి స్వంత విధానానికి వదిలేస్తే వారు నిష్ఫలంగా ఉంటారు. అయినప్పటికీ, పరిశుద్ధాత్మ అవసరమైన మద్దతును అందిస్తుంది. జ్ఞానోదయమైన ఆత్మగా పనిచేస్తూ, పరిశుద్ధాత్మ విశ్వాసులకు ఏమి ప్రార్థించాలో బోధిస్తుంది. పవిత్రం చేసే ఆత్మగా, అది ప్రార్థన యొక్క కృపలను సక్రియం చేస్తుంది మరియు కదిలిస్తుంది. ఓదార్పునిచ్చే ఆత్మగా దాని పాత్రలో, ఇది భయాలను తొలగిస్తుంది మరియు నిరుత్సాహాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది. పవిత్రాత్మ దేవుని వైపు మళ్లించే అన్ని కోరికలకు మూలంగా పనిచేస్తుంది, తరచుగా మౌఖిక వ్యక్తీకరణ యొక్క పరిమితులను అధిగమిస్తుంది. హృదయాలను శోధించే సామర్థ్యంతో, ఆత్మ పునరుద్ధరించబడిన ఆత్మ యొక్క మనస్సు మరియు చిత్తాన్ని అర్థం చేసుకుంటుంది, దాని తరపున వాదిస్తుంది. దేవునికి మధ్యవర్తిత్వం ద్వారా, ప్రత్యర్థి విజయం సాధించకుండా ఆత్మ నిర్ధారిస్తుంది.

దేవుని ప్రేమ పట్ల వారి ఆసక్తి. (28-31) 
సాధువుల ఆత్మలకు ఏది మేలు చేస్తుందో అది మంచిగా పరిగణించబడుతుంది. ప్రతి ప్రొవిడెన్స్ దేవుణ్ణి ప్రేమించే వారి ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. ఇది వారిని పాపం నుండి దూరం చేయడానికి, దేవునికి దగ్గరయ్యేలా చేయడానికి, ప్రాపంచిక విషయాల నుండి వారిని దూరం చేయడానికి మరియు స్వర్గానికి సిద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది. సాధువులు వారి పాత్ర నుండి తప్పుకున్నప్పుడు, వారిని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి దిద్దుబాట్లు అమలు చేయబడతాయి. మన మోక్షానికి కారణాలు సురక్షితమైన మరియు విడదీయరాని క్రమాన్ని అనుసరిస్తాయి-ఒక బంగారు గొలుసు.
1. దేవుడు ముందుగా ఎరిగిన వారిని, ఆయన తన కుమారుని స్వరూపమునకు అనుగుణముగా ఉండుటకు ముందుగా నిర్ణయించెను. దేవుడు మహిమ మరియు ఆనందాన్ని అంతిమ లక్ష్యంగా ఉద్దేశించిన ప్రతిదీ, అతను దయ మరియు పవిత్రత ద్వారా సాధించాలని నిర్ణయించాడు. మొత్తం మానవ జాతి వినాశనానికి అర్హమైనప్పటికీ, దేవుడు, మనకు పూర్తిగా తెలియని కారణాల వల్ల, పునరుత్పత్తి మరియు అతని దయ యొక్క శక్తి ద్వారా కొందరిని విమోచించాలని ఎంచుకున్నాడు. అతను వారిని తన కుమారుని ప్రతిరూపానికి అనుగుణంగా ఉండేలా ముందుగా నిర్ణయించాడు, ఈ ప్రక్రియ ఈ జీవితంలో ప్రారంభించబడింది, ఎందుకంటే వారు పాక్షికంగా పునరుద్ధరించబడ్డారు మరియు అతని అడుగుజాడల్లో నడుస్తారు.
2. ఆయన ముందుగా నిర్ణయించిన వారిని కూడా పిలిచాడు. ఇది ప్రభావవంతమైన పిలుపు, వ్యక్తులను స్వీయ మరియు భూసంబంధమైన అన్వేషణల నుండి దేవుడు, క్రీస్తు మరియు స్వర్గం అంతిమ గమ్యస్థానంగా ఆకర్షిస్తుంది. ఇది పాపం మరియు వ్యర్థం నుండి దయ మరియు పవిత్రతకు ఎంచుకున్న మార్గంగా పిలుపు. ఇది సువార్త పిలుపు యొక్క సారాంశం. దేవుని ప్రేమ, ఒకప్పుడు ఆయనకు శత్రువులుగా ఉన్నవారి హృదయాలలో రాజ్యమేలుతూ, ఆయన ఉద్దేశం ప్రకారం వారు పిలువబడ్డారని ధృవీకరిస్తుంది.
3. ఆయన పిలిచిన వారిని కూడా నీతిమంతులుగా తీర్చాడు. ప్రభావవంతంగా పిలువబడే వారు మాత్రమే ఈ సమర్థనను అనుభవిస్తారు. సువార్త పిలుపును ఎదిరించే వారు అపరాధం మరియు కోపంలో ఉంటారు.
4. ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చారో వారిని మహిమపరచెను. ప్రభావవంతమైన పిలుపులో విచ్ఛిన్నమైన అవినీతి శక్తి మరియు సమర్థనలో పాపం యొక్క అపరాధం తొలగించబడినప్పుడు, ఆ ఆత్మను కీర్తి నుండి ఏదీ వేరు చేయదు. ఈ వాస్తవం మన విశ్వాసాన్ని మరియు నిరీక్షణను బలపరుస్తుంది ఎందుకంటే, దేవునికి, ఆయన మార్గం మరియు పని పరిపూర్ణమైనవి. అపొస్తలుడు ఆశ్చర్యాన్ని మరియు ప్రశంసలను వ్యక్తం చేస్తాడు, జ్ఞానాన్ని మించిన క్రీస్తు యొక్క అపారమైన ప్రేమను చూసి ఆశ్చర్యపోతాడు. మనం సువార్త రహస్యాలను ఎంత లోతుగా పరిశోధిస్తామో, అంత లోతుగా వాటి ద్వారా మనం కదిలిపోతాము. దేవుడు మన కోసం ఉన్నంత కాలం, మరియు మనం అతని ప్రేమలో ఉన్నంత వరకు, చీకటి యొక్క అన్ని శక్తులను మనం ధైర్యంగా ధిక్కరిస్తాము.

క్రీస్తు ద్వారా వారి చివరి విజయం. (32-39)
దేవుని స్వేచ్ఛా ప్రేమ యొక్క గొప్ప అభివ్యక్తి, స్వర్గం మరియు భూమిలో ఉన్న అన్నిటినీ అధిగమించింది, మానవాళి యొక్క పాపాలకు సిలువపై ప్రాయశ్చిత్తంగా సేవ చేయడానికి అతని సహసమాన కుమారుని బహుమతిలో కనిపిస్తుంది. అన్ని తదుపరి ఆశీర్వాదాలు ఆయనతో మన ఐక్యత మరియు అతని ఉద్దేశ్యానికి మన కనెక్షన్ నుండి ప్రవహిస్తాయి. నమ్మకమైన క్రైస్తవునికి నిజమైన మేలు చేసే కారణం లేదా సాధనంగా ఉపయోగపడే ప్రతిదీ ఈ ఆశీర్వాదాలలో చేర్చబడింది. మన కోసం ఒక కిరీటాన్ని మరియు రాజ్యాన్ని సిద్ధం చేసినవాడు మన ప్రయాణంలో అవసరమైనవన్నీ సమకూరుస్తాడు. ఆరోపణలు ఎదురైనప్పుడు వ్యక్తులు తమను తాము సమర్థించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, దైవిక సమర్థన అంతిమ సమాధానం. క్రీస్తు ద్వారా మనకు భద్రత లభిస్తుంది. ఆయన మరణం మన ఋణాన్ని తీర్చింది, మరియు ఆయన పునరుత్థానం దైవిక న్యాయం సంతృప్తి చెందిందనడానికి నిశ్చయాత్మక సాక్ష్యం. మా తరపున మధ్యవర్తిత్వం వహించే శక్తివంతమైన న్యాయవాది దేవుని కుడి వైపున ఉన్నాడు. మీ ఆత్మ ఆయనకు చెందాలని కోరుకుంటే మరియు అతని కోసం దయచేసి జీవించాలని కోరుకుంటే, అంతులేని సందేహాలతో మిమ్మల్ని మీరు హింసించకండి. మీ భక్తిహీనతను గుర్తించండి మరియు భక్తిహీనులను సమర్థించే వ్యక్తిని విశ్వసించండి. ఖండించినప్పటికీ, క్రీస్తు చనిపోయి లేచాడు, ఈ విధంగా ఆయన వైపు తిరిగే వారికి ఆశ్రయం ఇస్తున్నాడు.
దేవుడు తన స్వంత కుమారుని మన కొరకు ఇవ్వడం ద్వారా తన ప్రేమను ప్రదర్శించాడని పరిగణనలోకి తీసుకుంటే, ఆ ప్రేమను ఏదైనా తగ్గించగలదా లేదా రద్దు చేయగలదా? కష్టాలు అతని ప్రేమను తగ్గించవు; నిజానికి, వారు దానిలో ఎలాంటి తగ్గుదలకు కారణం లేదా బహిర్గతం చేయరు. విశ్వాసులు వివిధ విషయాల నుండి వేరు చేయబడినప్పటికీ, తగినంత మిగిలి ఉంటుంది. క్రీస్తును విశ్వాసి నుండి తీసుకోలేము మరియు విశ్వాసిని అతని నుండి తీసుకోలేము-అది సరిపోతుంది. ఇతర ప్రమాదాలు మరియు నష్టాలు అంతిమంగా ఎటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉండవు. క్రీస్తు లేని వారికి, ప్రాపంచిక ఆస్తులు, ఎంత సమృద్ధిగా ఉన్నా, చివరికి వ్యర్థమే. ఆహ్లాదకరమైన నివాసాలు, స్నేహితులు మరియు ఎస్టేట్‌ల నుండి విడిపోయే అవకాశం ఎదురైనప్పుడు లేదా మరణం యొక్క నిశ్చయతను ఎదుర్కొన్నప్పుడు, ప్రపంచం అత్యంత విలువైనవన్నీ అసంబద్ధం అవుతాయి. క్రీస్తు లేని ఆత్మకు మిగిలేది దాని పాపాలన్నిటికీ అపరాధాన్ని ఖండించడం.
అయితే, క్రీస్తులో ఉన్న ఆత్మ, ఇతర విషయాల నుండి తీసివేయబడినప్పుడు, అతనితో అనుబంధంలో స్థిరంగా ఉంటుంది మరియు అలాంటి విభజనలు శాశ్వత బాధను కలిగించవు. ఆత్మ మరియు శరీరంతో సహా అన్ని ఇతర సంఘాలను విచ్ఛిన్నం చేసే మరణం యొక్క ముఖంలో కూడా, విశ్వాసి యొక్క ఆత్మ తన ప్రియమైన ప్రభువైన యేసుతో అత్యంత సన్నిహితంగా మరియు ఆయనను నిత్యమైన ఆనందానికి గురి చేస్తుంది.



Shortcut Links
రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |