Acts - అపొ. కార్యములు 2 | View All

1. పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.
లేవీయకాండము 23:15-21, ద్వితీయోపదేశకాండము 16:9-11

1. పెంతెకొస్తు అనే పండుగ వచ్చింది. ఆ రోజు వాళ్ళంతా ఒక చోట సమావేశం అయ్యారు.

2. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.

2. తీవ్రమైన గాలి వీచినప్పుడు కలిగే ధ్వనిలాంటిది పరలోకంనుండి అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు కూర్చొన్న యింటినంతా నింపివేసింది.

3. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ

3. అప్పుడు వాళ్ళకు నాలుకల్లా అగ్ని జ్వాలలు కనిపించాయి. అవి విడిపోయి ప్రతి ఒక్కరి మీదా దిగినవి.

4. అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

4. అందరూ పవిత్రాత్మతో నిండిపోయి తమ భాషల్లో కాక యితర భాషల్లో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళిలా మాట్లాడటానికి పవిత్రాత్మ శక్తినిచ్చాడు.

5. ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి.

5. అప్పుడు ఈ యెరూషలేము పట్టణంలో అన్ని దేశాలకు చెందిన దైవభక్తిగల యూదులు ఉండినారు.

6. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి.

6. ఆ మాటల శబ్దం విని ఒక పెద్ద ప్రజల గుంపు అక్కడికి వచ్చింది. గుంపులోని ప్రతి ఒక్కడూ తన స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం విని దిగ్భ్రాంతి చెందాడు.

7. అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా?

7. వాళ్ళు దిగ్భ్రాంతి చెంది, “మాట్లాడుతున్న వాళ్ళందరూ గలిలయ ప్రాంతపు వాళ్ళే కదా?

8. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి?

8. అలాంటప్పుడు, మాలోని ప్రతి ఒక్కడూ, అతని స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం ఎలా వింటున్నాడు.

9. మేము, అంటే ‘పార్తి’ దేశం వాళ్ళు, ‘మాదీ’ దేశం వాళ్ళు, ‘ఏలామీ’ దేశం వాళ్ళు, ‘మెసొపొతమియ’ నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియ నివాసులు,

10. కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు,

10. ప్రుగియ, పంపులియ, ఈజిప్టు ప్రాంతాల వాళ్ళు, ‘లిబియ’ లోని ‘కురేనే’ దగ్గరున్న ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు, రోము నగరం నుండి వచ్చిన వాళ్ళు,

11. క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.

11. యూదులు, యూద మతంలో చేరిన వాళ్ళు, క్రేతీయులు, అరబీయులు, వాళ్ళు దేవుని మహిమల్ని గురించి మా స్వంత భాషలో చెప్పటం వింటున్నామే!” అని అన్నారు.

12. అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.

12. దిగ్భ్రాంతి చెందటం వల్ల, జరిగిన విషయాలు అర్థం కాకపోవటం వల్ల, “దీని అర్థమేమిటి” అని పరస్పరం ప్రశ్నించుకొన్నారు.

13. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి.

13. ‘బాగా మద్యం త్రాగి మత్తులో ఉన్నారు’ అని కొందరు వాళ్ళనెగతాళి చేసారు.

14. అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి.

14. ఇది విని పేతురు పదకొండుగురితో లేచి, పెద్ద గొంతుతో ప్రజల్ని సంబోధిస్తూ, “తోటి యూదా సోదరులారా! యెరూషలేంలో నివసిస్తున్న సమస్త ప్రజలారా! నన్ను దీన్ని గురించి మీకు చెప్పనివ్వండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.

15. మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు.

15. 5మీరనుకొన్నట్లు వీళ్ళు త్రాగలేదు. ఇప్పుడు ఇంకా ఉదయం తొమ్మిది గంటలే కదా!

16. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా

16. దీన్ని గురించి ప్రవక్త యోవేలు ఈ విధంగా వ్రాసాడు కనుక యివి జరుగుతున్నాయి:

17. అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ ¸యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు.
యోవేలు 2:28-32

17. ‘దేవుడు ఈ విధంగా అంటున్నాడు: ఈ చివరి దినాల్లో నా ఆత్మను అందరిపై కురిపిస్తాను! మీ కుమారులు, కుమార్తెలు, నా ప్రవచనాలు పలుకుతారు! మీ యువతరం దివ్యదర్శనాలు చూస్తుంది. వయస్సు మళ్ళిన మీ వాళ్ళు కలలుగంటారు.

18. ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.

18. ఆడా, మగా అనే భేదం లేకుండా నా సేవకులందరిపై ఆ దినాల్లో నా ఆత్మను కురిపిస్తాను. అప్పుడు వాళ్ళు నా ప్రవచనాలు చెబుతారు.

19. పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను.

19. పైన ఆకాశంలో నేను అద్భుతాలు చూపిస్తాను. క్రింద భూమ్మీద రుజువులు చూపిస్తాను. రక్తం, మంటలు, చిక్కటి పొగలు చెలరేగుతాయి.

20. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు.

20. సూర్యుణ్ణి చీకటిగా మారుస్తాను. చంద్రుణ్ణి ఎర్రటి రక్తంలా మారుస్తాను. ఉత్కృష్టమైనటువంటి, తేజోవంతమైనటువంటి ప్రభువు యొక్క దినం రాక ముందే యిది జరుగుతుంది.

21. అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.

21. అప్పుడు ఆయన నామంలో ప్రార్థించు ప్రతి ఒక్కణ్ణి ప్రభువు రక్షిస్తాడు.’ యోవేలు 2:28-32

22. ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందిన వానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు.

22. “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది వినండి. దేవుడు నజరేతు నివాసియైన యేసును, తాను ప్రత్యేకంగా నియమించాడన్న విషయం మీకు నిరూపించాలని ఆయన ద్వారా మహాత్యాలు, అద్భుతాలు మీకోసం చేసాడు. సూచనలు చూపాడు. ఈ మహాత్యాలు, అద్భుతాలు చేసినట్లు, సూచనలు చూపినట్లు మీకు ఇదివరకే తెలుసు.

23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి.

23. దైవ సంకల్పానుసారం ఆయన దివ్య జ్ఞానానుసారం యేసు మీకు అప్పగింపబడ్డాడు. ఆ తర్వాత మీరు దుర్మార్గుల సహాయంతో ఆయనను సిలువకు వేసి, మేకులు కొట్టి ఆయన్ని చంపారు.

24. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.
2 సమూయేలు 22:6, కీర్తనల గ్రంథము 18:4, కీర్తనల గ్రంథము 116:3

24. కాని దేవుడాయన్ని బ్రతికించాడు. ఆయనకు మరణ వేదన నుండి విముక్తి కలిగించాడు. మరణానికి ఆయన్ని బంధించి ఉంచటం చేతకాలేదు.

25. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను - నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను.
కీర్తనల గ్రంథము 16:8-11

25. దావీదు యేసును గురించి ఈ విధంగా అన్నాడు: ‘ప్రభువును, నేను నా ముందు అన్ని వేళలా చూసాను. నన్ను రక్షించటానికి ప్రభువు నా వెంట ఉన్నాడు!

26. కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును.

26. అందుకే నా మాటల్లో ఆనందం నిండి యున్నది. అందుకే నా దేహం ఆశతో జీవిస్తోంది.

27. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.

27. ఎందుకంటే, నా ఆత్మను నీవు చనిపోయిన వాళ్ళతో వదిలివేయవు నీవు నీ భక్తుని దేహాన్ని కుళ్ళనీయవు.

28. నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు

28. నాకు జీవపు దారుల్ని చూపావు! నా వెంటే ఉండి నాకు ఆనందం కలిగించావు!’ కీర్తన 16:8-11

29. సహోదరులారా, మూలపురుషుడగు దావీదునుగూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధిచేయబడెను;
1 రాజులు 2:10

29. “సోదరులారా! మన వంశీయుడైన దావీదును గురించి నేనిది ఖచ్చితంగా చెప్పగలను. అతడు చనిపొయ్యాడు. అతణ్ణి సమాధి చేసారు. ఆ సమాధి ఈ నాటికీ ఉంది.

30. అతని సమాధి నేటివరకు మన మధ్య నున్నది. అతడు ప్రవక్తయై యుండెను గనుక అతని గర్భఫలములోనుండి అతని సింహాసనముమీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరెగి,
2 సమూయేలు 7:12-13, కీర్తనల గ్రంథము 132:11, యిర్మియా 30:9

30. దావీదు ఒక ప్రవక్త. దావీదు వంశంలో పుట్టిన వాణ్ణొకణ్ణి సింహాసనంపై కూర్చోబెడ్తానని దేవుడు అతనికి ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసాడు. ఇది దావీదుకు తెలుసు.

31. క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను.
కీర్తనల గ్రంథము 16:10

31. ఈ జరుగనున్న దాన్ని గురించి దావీదుకు ముందే తెలుసు. అందువల్లే అతడు క్రీస్తు బ్రతికి రావటాన్ని గురించి ఈ విధంగా అన్నాడు: ‘దేవుడు ఆయన్ని సమాధిలో వదిలివేయ లేదు. ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు.’ క్రీస్తు సమాధినుండి లేచే విషయమై దావీదు మాటలాడుచూ ఉన్నాడు.

32. ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము.

32. కావున దేవుడు ఈ యేసునే మృత్యువు నుండి బ్రతికించినాడు. దీనికి మేమంతా సాక్ష్యము.

33. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి యున్నాడు.

33. యేసు పరలోకానికి ఎత్తబడినాడు. ఇప్పుడు యేసు దేవునితో ఆయన కుడిప్రక్కన ఉన్నాడు. తండ్రి పరిశుద్ధాత్మను యేసుకు ఇచ్చాడు. దేవుడు ఇస్తానని వాగ్దానము చేసినది పరిశుద్ధాత్మయే. యేసు ఇప్పుడాయాత్మను ఇస్తున్నాడు. ఇదే మీరు వింటున్నది, చూస్తున్నదీ.

34. దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను–నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠముగా ఉంచువరకు
కీర్తనల గ్రంథము 110:1

34.

35. నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.
కీర్తనల గ్రంథము 110:1

35.

36. మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.

36. “అందువల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ యిది ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు, మీరు సిలువకు వేసి చంపిన ఈ యేసును ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు.”

37. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా

37. ఇది విని ప్రజల హృదయాలు కదిలిపొయ్యాయి. వాళ్ళు పేతురు మరియు యితర అపొస్తలులను, “సోదరులారా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు.

38. పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.

38. పేతురు ఈ విధంగా జవాబు చెప్పాడు: “మీలో ప్రతి ఒక్కడూ పాప క్షమాపణ నిమిత్తం మారుమనస్సు కలిగి యేసు క్రీస్తు పేరిట బాప్తిస్మము పొందాలి. అప్పుడు మీ పాపాలు క్షమించబడ్తాయి. మీకు పవిత్రాత్మ వరం లభిస్తుంది.

39. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.
యోవేలు 2:32

39. దేవుడు ఈ వాగ్దానాన్ని మీకోసం, మీ సంతానాని కోసం, ప్రభువు ఆహ్వానించబోయే దూర ప్రాంతాల వాళ్ళకందరి కోసం చేసాడు.”

40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను.
ద్వితీయోపదేశకాండము 32:5, కీర్తనల గ్రంథము 78:8, కీర్తనల గ్రంథము 89:3-4

40. వాళ్ళకు అనేక మాటల ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. అంతేకాక, వాళ్ళతో ఈ విధంగా బ్రతిమిలాడాడు: “వక్రబుద్ధులున్న ఈ తరం వాళ్ళనుండి విడిపోయి రక్షణ పొందండి.”

41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.

41. అతని సందేశాన్ని అంగీకరించిన వాళ్ళు బాప్తిస్మము పొందారు. ఆ రోజు సుమారు మూడువేల మంది విశ్వాసులుగా చేరారు.

42. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.

42. వాళ్ళు అపొస్తలుల బోధను వింటూ సహవాసములోను, రొట్టె విరుచుటలోను పాలి భాగస్థులై; ప్రార్థన చేయుటలో నిమగ్నులై యుండేవాళ్ళు.

43. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములును సూచకక్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను.

43. దేవుడు అపొస్తలుల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసాడు. చిహ్నాలు చూపాడు. ప్రతి ఒక్కనిలో దైవ భీతి కలిగింది.

44. విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచు కొనిరి.

44. భక్తులంతా ఒకే చోట సమావేశమయ్యారు. తమ దగ్గరున్న ప్రతి వస్తువును అందరితో కలిసి పంచుకొనే వాళ్ళు.

45. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి.

45. తమ ఆస్తిని, వస్తువుల్ని అమ్మి అవసరమున్న వాళ్ళకు యిచ్చేవాళ్ళు.

46. మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై

46. ప్రతి రోజు మందిరావరణంలో ఒకే ఉద్దేశ్యంతో సమావేశమయ్యేవాళ్ళు. ఇండ్లలో సమావేశమై ఆహారాన్ని పంచుకొని తినేవాళ్ళు. మంచి మనస్సుతో అమితానందంగా భుజించే వాళ్ళు,

47. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువురక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను.

47. దేవుణ్ణి స్తుతించే వాళ్ళు. ప్రజలందరూ వాళ్ళను యిష్టపడేవాళ్ళు. ప్రభువు తాను రక్షించిన వాళ్ళను విశ్వాసులతో చేరుస్తూ వచ్చాడు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Acts - అపొ. కార్యములు 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ అవరోహణ. (1-4) 
వారి గురువు వారితో ఉన్నప్పుడు, గొప్పతనం కోసం పోటీ పడుతున్నప్పుడు శిష్యుల మధ్య తరచుగా జరిగే గొడవలను మనం విస్మరించకూడదు. అయితే ఈ వివాదాలు ఓ కొలిక్కి వచ్చాయి. ఇటీవల, వారు తరచుగా కలిసి ప్రార్థనలు చేశారు. పైనుండి ఆత్మ కుమ్మరించబడాలని మనం కోరుకుంటే, మనం పూర్తిగా సామరస్యంగా ఉండనివ్వండి. శిష్యుల మధ్య భిన్నాభిప్రాయాలు మరియు అభిరుచులు ఉన్నప్పటికీ, మనం ఒకరినొకరు ప్రేమించుకోవడానికి కట్టుబడి ఉందాం, ఎందుకంటే సోదరులు ఎక్కడ ఐక్యంగా జీవిస్తారో, ప్రభువు తన ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తాడు. శక్తివంతమైన, పరుగెత్తే గాలి ప్రజల మనస్సులపై మరియు తత్ఫలితంగా ప్రపంచంపై దేవుని ఆత్మ యొక్క శక్తివంతమైన ప్రభావం మరియు కార్యాచరణను సూచిస్తుంది. ఆత్మ యొక్క నమ్మకాలు అతని సుఖాలకు మార్గం సుగమం చేస్తాయి మరియు ఆశీర్వదించబడిన గాలి యొక్క బలమైన గాలులు ఆత్మను దాని సున్నితమైన మరియు ఓదార్పు గాలుల కోసం సిద్ధం చేస్తాయి.
క్రీస్తు గురించి జాన్ ది బాప్టిస్ట్ జోస్యం ప్రకారం, "అతను మీకు పరిశుద్ధాత్మతో మరియు అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు." అగ్ని వలె, ఆత్మ హృదయాన్ని కరిగిస్తుంది, మలినాలను ప్రక్షాళన చేస్తుంది మరియు ఆత్మలో భక్తి ప్రేమలను వెలిగిస్తుంది, ఇక్కడ బలిపీఠంపై ఉన్న అగ్ని వలె ఆధ్యాత్మిక త్యాగాలు అర్పిస్తారు. వారందరూ మునుపటి కంటే పరిశుద్ధాత్మతో సమృద్ధిగా నింపబడ్డారు, ఆత్మ యొక్క కృపతో సుసంపన్నం అయ్యారు మరియు అతని పవిత్రీకరణ ప్రభావాలలో ఎక్కువగా ఉన్నారు. వారు ఈ ప్రపంచం నుండి మరింత విడిపోయారు మరియు తదుపరి దానితో మరింత పరిచయం అయ్యారు. వారి హృదయాలు ఆత్మ యొక్క సౌఖ్యాలతో పొంగిపోయాయి, క్రీస్తు ప్రేమలో మరియు స్వర్గం యొక్క నిరీక్షణలో గతంలో కంటే ఎక్కువ ఆనందించారు. వారి బాధలు, భయాలు అన్నీ ఈ పొంగిపొర్లాయి. వారు కూడా పరిశుద్ధాత్మ యొక్క బహుమతులతో నింపబడ్డారు, సువార్తను ముందుకు తీసుకెళ్లే అద్భుత శక్తులను కలిగి ఉన్నారు. వారు ముందుగా ఆలోచించి మాట్లాడలేదు కానీ ఆత్మ వారి మాటలను నడిపించినట్లు.

అపొస్తలులు వివిధ భాషల్లో మాట్లాడతారు. (5-13) 
బాబెల్ వద్ద ఉద్భవించిన భాషల వైవిధ్యం జ్ఞానం మరియు మతం యొక్క వ్యాప్తికి గణనీయంగా ఆటంకం కలిగించింది. క్రైస్తవ విశ్వాసాన్ని ప్రచారం చేయడానికి ప్రభువు మొదట్లో సాధనంగా ఉపయోగించిన వ్యక్తులు భాషాపరమైన అవగాహన బహుమతి లేకుండా అధిగమించలేని సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ బహుమతి వారి అధికారం నేరుగా దేవుని నుండి వచ్చిందని ఒక ప్రదర్శనగా పనిచేసింది.

యూదులకు పీటర్ చిరునామా. (14-36) 
14-21
పీటర్ యొక్క ఉపన్యాసం అతని పూర్వపు తిరస్కరణ నుండి పూర్తిగా కోలుకోవడం మరియు దైవిక అనుగ్రహానికి పూర్తిగా పునరుద్ధరణను సూచిస్తుంది. ఒకప్పుడు క్రీస్తును నిరాకరించినవాడు ఇప్పుడు బహిరంగంగా ఆయనను ఒప్పుకున్నాడు. ఆత్మ యొక్క అద్భుత ప్రవాహానికి సంబంధించిన పీటర్ యొక్క కథనం శ్రోతలను క్రీస్తుపై విశ్వాసాన్ని స్వీకరించడానికి మరియు అతని చర్చితో ఏకం చేయడానికి కదిలించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది క్రీస్తు యొక్క పునరుత్థానం మరియు ఆరోహణ ఫలితంగా స్క్రిప్చర్ యొక్క నెరవేర్పు, రెండింటికీ సాక్ష్యంగా పనిచేసింది.
పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మ నిర్దేశించినట్లుగా మాతృభాషలో మాట్లాడినప్పటికీ, పేతురు లేఖనాలను విస్మరించలేదు. క్రీస్తు శిష్యులు తమ బైబిల్ బోధనలను ఎప్పటికీ అధిగమించరు, మరియు స్పిరిట్ లేఖనాలను అణగదొక్కడానికి కాదు, అవగాహన, ఆమోదం మరియు విధేయతను సులభతరం చేయడానికి మంజూరు చేయబడింది. నిస్సందేహంగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రభువు పేరును ప్రార్థించి, పాపుల రక్షకుడిగా మరియు సమస్త మానవాళికి న్యాయాధిపతిగా అంగీకరించేవారు మాత్రమే గొప్ప రోజున శిక్ష నుండి తప్పించుకుంటారు.

22-36
క్రీస్తు వృత్తాంతాన్ని వివరిస్తూ యేసుపై ఉపన్యాసం ఇచ్చేందుకు పీటర్ పరిశుద్ధాత్మ ప్రసాదించిన బహుమతిని ఉపయోగించుకున్నాడు. ఈ ప్రసంగం క్రీస్తు యొక్క ఇటీవలి మరణం మరియు బాధల వృత్తాంతాన్ని కలిగి ఉంది, ఇది అద్భుతమైన దయ మరియు జ్ఞానంతో కూడిన దేవుని చర్యగా భావించబడింది. దైవిక న్యాయం నెరవేరడం, దేవుడు మరియు మానవాళిని మళ్లీ ఏకం చేయడం మరియు చివరికి క్రీస్తును మహిమపరచడం-మార్పులేని శాశ్వతమైన ప్రణాళిక యొక్క అభివ్యక్తి కోసం ఇది చాలా అవసరం. దీనికి విరుద్ధంగా, ప్రజల దృక్కోణం నుండి, ఈ సంఘటనలలో వారి పాత్ర ఘోరమైన పాపం మరియు మూర్ఖత్వానికి సంబంధించిన చర్యగా పరిగణించబడింది.
పీటర్ క్రీస్తు యొక్క పునరుత్థానం యొక్క రూపాంతర ప్రాముఖ్యతపై విస్తృతంగా వివరించాడు, అతని మరణంతో సంబంధం ఉన్న అవమానాన్ని తొలగిస్తాడు. క్రీస్తు, దేవుని పవిత్రమైన మరియు నియమించబడిన పవిత్రుడిగా, విమోచన మిషన్‌కు అంకితమివ్వబడ్డాడు, అతని మరణం మరియు బాధలు విశ్వాసులందరికీ శాశ్వతమైన ఆశీర్వాద జీవితానికి ప్రవేశ ద్వారంగా ఉండేలా చూసుకున్నాడు. అపొస్తలులు సాక్షులుగా పని చేయడంతో, ఈ కీలకమైన సంఘటన ప్రవచనాలకు అనుగుణంగా జరిగింది.
ఇంకా, పునరుత్థానం ఏకైక పునాది కాదు; క్రీస్తు తన శిష్యులపై అద్భుతమైన బహుమతులు మరియు దైవిక ప్రభావాలను ప్రసాదించాడు, వారి స్పష్టమైన ప్రభావాలను చూశారు. రక్షకుని ద్వారా, సంపూర్ణమైన జీవితానికి మార్గాలు వెల్లడి చేయబడ్డాయి, దేవుని యొక్క శాశ్వతమైన ఉనికి మరియు అనుగ్రహంపై విశ్వాసాన్ని కలిగిస్తాయి. ఈ ఆశీర్వాదాలన్నీ యేసును ప్రభువుగా మరియు అభిషిక్త రక్షకునిగా దృఢంగా విశ్వసించడం నుండి ఉద్భవించాయి.

మూడు వేల మంది ఆత్మలు మారారు. (37-41) 
దైవిక సందేశం మొదటిసారిగా తెలియజేయబడిన క్షణం నుండి, అది దైవిక శక్తిని కలిగి ఉందని స్పష్టమైంది, వేలాది మంది విశ్వాస విధేయతను స్వీకరించేలా చేసింది. ఏదేమైనప్పటికీ, పేతురు యొక్క మాటలు లేదా ప్రత్యక్షమైన అద్భుతం మాత్రమే పరిశుద్ధాత్మ యొక్క ఉనికి లేకుండా అటువంటి లోతైన ప్రభావాలను తీసుకురాలేదు. పాపులు, వారి కళ్ళు తెరిచినప్పుడు, సహజంగానే వారి పాపాల గురించి లోతైన దృఢ విశ్వాసం మరియు అంతర్గత అశాంతిని అనుభవిస్తారు.
అపొస్తలుడు వారి పాపాల కోసం బహిరంగంగా పశ్చాత్తాపపడాలని మరియు ఆయన పేరులో బాప్టిజం పొందడం ద్వారా మెస్సీయగా యేసుపై వారి విశ్వాసాన్ని ప్రకటించమని ప్రోత్సహించాడు. విశ్వాసం యొక్క ఈ బహిరంగ ప్రకటన ద్వారా, వారు తమ పాపాల క్షమాపణను పొందుతారు మరియు పవిత్రాత్మ యొక్క బహుమతులు మరియు కృపలలో పాలుపంచుకుంటారు. దుష్ట వ్యక్తుల నుండి వేరు చేయవలసిన ఆవశ్యకత వారి ప్రభావం నుండి స్వీయ-సంరక్షణకు ప్రాథమిక సాధనంగా నొక్కి చెప్పబడింది. నిజంగా పశ్చాత్తాపపడి, యేసుక్రీస్తుకు లొంగిపోయేవారు, దుర్మార్గుల నుండి విడదీయడం ద్వారా వారి నిజాయితీని ప్రదర్శించాలి, విస్మయం మరియు భక్తి భావంతో చురుకుగా దూరంగా ఉండాలి.
దేవుని దయ ద్వారా, మూడు వేల మంది వ్యక్తులు సువార్త ఆహ్వానానికి ప్రతిస్పందించారు. పవిత్రాత్మ యొక్క బహుమతి, అందరిచే స్వీకరించబడింది మరియు ప్రతి నిజమైన విశ్వాసికి అందుబాటులో ఉంటుంది, దత్తత యొక్క ఆత్మగా గుర్తించబడింది-ఇది స్వర్గపు తండ్రి కుటుంబంలోని ప్రతి సభ్యునికి సుసంపన్నం, మార్గనిర్దేశం మరియు పవిత్రం చేసే దయ. పశ్చాత్తాపం మరియు పాప క్షమాపణ యొక్క ప్రకటన కొనసాగుతుంది, విమోచకుని పేరుతో అత్యంత ఘోరమైన నేరస్థులకు కూడా ఇది విస్తరిస్తుంది. పరిశుద్ధాత్మ విశ్వాసుల హృదయాలలో ఈ ఆశీర్వాదాలను ధృవీకరిస్తూనే ఉన్నారు మరియు ప్రోత్సాహం యొక్క వాగ్దానాలు ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు విస్తరించబడ్డాయి. ఆశీర్వాదాల ఆఫర్ సమీపంలో మరియు దూరంగా ఉన్న అందరికీ తెరిచి ఉంటుంది.

శిష్యుల భక్తి మరియు ఆప్యాయత. (42-47)
ఈ శ్లోకాలలో, ఆదిమ చర్చి యొక్క ప్రారంభ రోజుల వృత్తాంతాన్ని మనం కనుగొంటాము-ఈ కాలం దాని బాల్యం ద్వారా వర్ణించబడింది మరియు లోతైన అమాయకత్వంతో గుర్తించబడింది. ఈ కమ్యూనిటీ సభ్యులు పవిత్రమైన పద్ధతులకు దగ్గరగా కట్టుబడి, భక్తి మరియు భక్తి యొక్క సమృద్ధిని ప్రదర్శిస్తారు. నిజమైన క్రైస్తవం, దాని పరివర్తన శక్తితో స్వీకరించబడినప్పుడు, సహజంగానే ఆత్మను దేవునితో సహవాసం వైపు మళ్లిస్తుంది, అక్కడ ఆయన మనల్ని కలుస్తానని వాగ్దానం చేశాడు.
ఆవిష్కృతమైన సంఘటనల పరిమాణం విశ్వాసులను ప్రాపంచిక ఆందోళనల కంటే పైకి లేపింది మరియు పరిశుద్ధాత్మ వారిని ప్రేమతో నింపాడు, అది ప్రతి వ్యక్తి ఇతరులను తమలాగే ఉన్నతంగా భావించేలా చేస్తుంది. ఈ ప్రేమ వ్యక్తిగత యాజమాన్యాన్ని రద్దు చేయడం ద్వారా కాకుండా స్వార్థాన్ని నిర్మూలించడం మరియు దాతృత్వ స్ఫూర్తిని ప్రోత్సహించడం ద్వారా మతపరమైన భాగస్వామ్యం యొక్క భావాన్ని పెంపొందించింది. ఈ సామూహిక స్ఫూర్తిని ప్రేరేపించిన దేవుడు, ఈ విశ్వాసులు యూదయాలోని వారి ఆస్తుల నుండి రాబోయే స్థానభ్రంశం గురించి ముందుగానే చూశాడు.
ప్రతిరోజూ, ప్రభువు సువార్తను స్వీకరించడానికి మరిన్ని హృదయాలను ప్రభావితం చేసాడు, విశ్వాసాన్ని ప్రకటించేవారిని మాత్రమే కాకుండా, దేవునిచే యథార్థంగా ఆమోదించబడిన వారిని కూడా ఆకర్షించాడు, దయను పునరుత్పత్తి చేసే పరివర్తన శక్తిని అనుభవించాడు. దేవుడు శాశ్వతమైన మోక్షానికి ఉద్దేశించిన వారు, ఆయన మహిమను గూర్చిన జ్ఞానం మొత్తం భూమిని నింపేంత వరకు ఎదురులేని విధంగా క్రీస్తు వైపుకు ఆకర్షించబడతారు.



Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |