John - యోహాను సువార్త 7 | View All

1. అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకి నందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను.

వ 32; యోహాను 5:16, యోహాను 5:18; యోహాను 8:37, యోహాను 8:40; యోహాను 10:31. చావంటే యేసుప్రభువుకు భయం లేదు. అసలు ఆయన వచ్చినదే అందుకు (యోహాను 3:15; యోహాను 10:17-18; యోహాను 12:27; యోహాను 18:11; మత్తయి 20:28). కానీ అందుకు తగిన సమయం ఇంకా రాలేదు (వ 30).

2. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక
లేవీయకాండము 23:34

లేవీయకాండము 23:33-43 నోట్స్. ఈ పండుగ జెరుసలంలో ఏటేటా జరిగేది.

3. ఆయన సహోదరులు ఆయనను చూచినీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము.

ఆయన అద్భుతాలు చేయగలడని వారికి తెలుసు. అయితే ఆయన దేవుని కుమారుడనీ అభిషిక్తుడనీ వారింకా నమ్మలేదు. కాబట్టి ఆయనకు తాము సలహాలు ఇవ్వగలం అని వ్యర్థంగా అనుకున్నారు. ఆయన యూదుల మత జీవనానికి కేంద్ర స్థానమైన యూదయలోని జెరుసలం వెళ్ళి, బహిరంగంగా యూదులపై నాయకత్వం వహించడానికి ప్రయత్నించాలన్నదే ఆ సలహా. ఆ సమయంలో వారు ఆయన ఉద్దేశాలనూ, పనినీ పూర్తిగా అపార్థం చేసుకున్నారు. తరువాతి కాలంలో వారిలో కనీసం ఇద్దరు యాకోబు, యూదా (మత్తయి 13:55) యథార్థంగా ఆయనను అనుసరించారు (అపో. కార్యములు 1:14; యాకోబు 1:1; యూదా 1:1).

4. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కనబరచుకొనుమని చెప్పిరి.

5. ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.

6. యేసు నా సమయ మింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది.

పండుగకు వారు ఏ సమయంలో వెళ్ళినా ఫర్వాలేదు గాని తాను మాత్రం మరి కొంత కాలం ఆగడం మంచిదని యేసు మాటలకు అర్థం (వ 8).

7. లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.

ఇక్కడ మొట్టమొదటి సారి యేసు ఈ లోకం (నమ్మకం లేని మనుషులు) తనను ద్వేషిస్తారని చెప్తున్నాడు (యోహాను 15:18, యోహాను 15:23-24 కూడా చూడండి. 3:20లో ఈ విషయాన్ని సూచించాడు). ఈ ద్వేషానికి కారణం కూడా ఇక్కడ చెప్తున్నాడు. మనుషులకు వారి క్రియలు చెడ్డవని చెప్తే ఇష్టం ఉండదు. వారి నిజ స్థితిని ఎవరన్నా బయటపెడితే వారికి కోపం. యేసుప్రభువు తమ్ముళ్ళను లోకం ద్వేషించదు, ఎందుకంటే అప్పటికి వారింకా లోకానికి చెందినవారే కాబట్టి దాన్ని వ్యతిరేకించరు. యోహాను శుభవార్తలో “లోకం” అనే మాట 70 కంటే ఎక్కువ సార్లు కనిపిస్తుంది. బైబిలులో మరి ఏ పుస్తకంలోనూ ఇన్ని సార్లు కనిపించదు. లోకం నశించిన స్థితిలో ఉన్నదనీ (యోహాను 3:16), చీకటిలో ఉన్నదనీ (యోహాను 3:19), దేవుణ్ణి ద్వేషిస్తున్నదనీ (యోహాను 7:7; యోహాను 15:18, యోహాను 15:23), సైతాను పరిపాలనలో ఉన్నదనీ (యోహాను 8:44; యోహాను 12:31), దేవుని ఆత్మను స్వీకరించలేని స్థితిలో ఉన్నదనీ (యోహాను 14:17), పాపభరితంగా, అపనమ్మకంగా ఉన్నదనీ (యోహాను 16:8-11) దాని గురించి యేసు చెప్పాడు. యోహాను తన మొదటి లేఖలో రెండు వచనాల్లో లోకాన్ని వర్ణించాడు (1 యోహాను 2:16; 1 యోహాను 5:10). రోమీయులకు 12:2; యాకోబు 4:4; 1 యోహాను 2:16 నోట్స్ కూడా చూడండి.

8. మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను.

9. ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను.

10. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయనకూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను.

ఒక పనిని సరిగ్గా ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో యేసుకు చక్కగా తెలుసు.

11. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి.

క్రీస్తు జెరుసలంకు వస్తాడని ఆయన శత్రువులు ఎదురు చూశారు. ఆయన కనిపించకపోవడం వారికి తికమక పెట్టింది.

12. మరియు జనసమూహములలో ఆయననుగూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొందరాయన మంచివాడనిరి; మరికొందరుకాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి;

యేసును గురించి పరస్పరం పూర్తి విరుద్ధమైన రెండు అభిప్రాయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆయన మంచివాడైతే ప్రజలను మోసగించడు. అలా మోసగిస్తూ ఉంటే ఆయన మంచివాడు కాదన్నమాట. ఆయన మంచివాడై, ప్రజలను మోసగించకుండా ఉన్న పక్షంలో ఆయన ఉపదేశాలు సత్యమన్న మాట. ఆయన శత్రువులు ఆయన్ను మోసగాడన్నారు (మత్తయి 27:63). కానీ దానికి సాక్ష్యాధారాలూ రుజువులూ ఏవీ వారు చూపించలేకపోయారు. ఆయన మంచివాడనీ, మోసగాడు కాదనీ నిరూపించే ఆధారాలూ రుజువులూ ఎన్నో ఉన్నాయి (యోహాను 5:31-40 పోల్చి చూడండి).

13. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి యెవడును బహిరంగముగా మాటలాడలేదు.

మరి కొందరు కూడా (క్రీస్తు శిష్యులు సైతం) కొన్ని సార్లు ఇదే భయాన్ని కనపరిచారు (యోహాను 9:22; యోహాను 12:42; యోహాను 19:38; యోహాను 20:19). ఇలాంటి భయమే బానిసత్వం. సామెతలు 29:25 పోల్చి చూడండి.

14. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను.

సరైన సమయం వచ్చినట్టు గ్రహించగానే ఆయన బహిరంగంగా వారికి ఉపదేశించసాగాడు.

15. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి.

మత్తయి 7:28-29; లూకా 2:47. అంటే ఆయన యూద మత పాఠశాలల్లో మతోపదేశకుల దగ్గర చదువుకోలేదని వారి భావం. వారు ఆయన్ను (ఆ దేవుని కుమారుణ్ణి, వాక్కును, విశ్వానికి సృష్టికర్తను) ఒక చదువు లేనివాడుగా భావించారు. ఎంత విచిత్రం! అపో. కార్యములు 4:13 పోల్చి చూడండి.

16. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.

యేసు తన ఉపదేశాలను తానే కల్పించలేదు. అది ఇతర మనుషుల నుంచి రాలేదు. అది తండ్రి అయిన దేవుని నుంచే వచ్చింది. యోహాను 12:49; యోహాను 17:8 కూడా చూడండి. యేసు యథార్థవంతుడు కాబట్టి దీని విషయంలో ఆయన మాటలు నమ్మాలి. ఆయన ఉపదేశాలను సాక్షాత్తూ దేవుని వాక్కులుగా స్వీకరించాలి. ఈ శుభవార్తలో 40 సార్లు యేసు తాను తండ్రి అయిన దేవుని దగ్గరనుంచి ఈ లోకానికి వచ్చిన సంగతిని నొక్కి చెప్పాడు (యోహాను 3:16-17; యోహాను 4:34; యోహాను 5:24, యోహాను 5:37; యోహాను 6:39, యోహాను 6:44, యోహాను 6:57; మొ।।).

17. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించు చున్నానో, వాడు తెలిసికొనును.

యేసు దేవుని సత్యాన్ని పలికాడో లేదో ఎవరైనా విచారించి చూడగల ఒక మార్గాన్ని ఆయన చూపుతున్నాడు. నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే విశ్వాన్ని సృష్టించిన దేవుని సంకల్పం ప్రకారం చేయాలన్న హృదయ పూర్వకమైన నిర్ణయం చేసుకోవడం ఒక్కటే మార్గం. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే అలా చేస్తే యేసు సాక్షాత్తూ దేవుని సత్యాన్ని నేర్పించాడని తప్పక తెలుసుకొంటారు. ఇన్ని వివిధ మతాలూ, శాఖలూ, వేదాంతాలూ ఈ ప్రపంచంలో ఉన్నాయి గదా సత్యమేమిటో తెలిసేదెలా అని కొన్ని సార్లు ప్రశ్న వస్తుంది. ఈ వచనంలో ఈ మార్గం వెల్లడి అయింది. మత్తయి 6:22 పోల్చి చూడండి. మనుషులతో వచ్చిన సమస్య వారి బుద్ధికి సంబంధించిన అడ్డంకి కాదు గాని వారి సంకల్పం, ఉద్దేశాలకు సంబంధించిన అడ్డంకే. దేవుని సంకల్పం ప్రకారం చెయ్యడం వారికి ఇష్టం లేదు గనుకనే వారు సత్యం తెలియకుండా ఉండిపోతారు (యోహాను 3:19-20). దేవుని సంకల్పం ఏదైనా సరే నిజంగా దాని ప్రకారం చెయ్యడానికి మనం సిద్ధమేనా? కాదు అని దీనికి జవాబైతే మనకు సత్యం తెలియకపోవడం ఆశ్చర్యమేమీ లేదు.

18. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహి మను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియులేదు.

యేసు ఇక్కడ రెండు వేరువేరు రకాల మతోపదేశకుల గురించి మాట్లాడుతున్నాడు. తమకే గౌరవ ప్రతిష్ఠలు కలగాలని చూచేవారు తమ ఉపదేశం సత్యమో కాదో దాని గురించి పట్టించుకోరు. మనుషులకు నచ్చి, తద్వారా వారు తమను గౌరవిస్తారనుకుంటే మనుషులు కల్పించిన సిద్ధాంతాలను నేర్పించేందుకు వారు సిద్ధమే. కానీ దేవునికే ఘనత కలగాలని చూచేవారికి ఆ సత్య దేవునికి సత్యమే ఘనత కలిగించగలదని తెలుసు (కీర్తనల గ్రంథము 31:5). మనుషులకు నచ్చినా నచ్చకపోయినా దేవుని సత్యాన్ని నేర్పించాలనే నిర్ణయం వారు తీసుకుంటారు (గలతియులకు 1:10). యేసుప్రభువుకు తాను ఈ రెండో కోవకు చెందిన ఉపదేశకుణ్ణని తెలుసు (యోహాను 8:49-50).

19. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్ర మును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను.

తాము మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని ఈ యూదులకు గర్వం. అయితే వారిలో ఏ ఒక్కడు కూడా నిజంగా దాన్ని పాటించలేదు. యేసుప్రభువును చంపాలని కుట్ర పన్నడం ద్వారా వారు దాన్ని పాటించలేదని రుజువౌతున్నది. ఇది ధర్మశాస్త్రంలోని ముఖ్యమైన ఆజ్ఞల్లో ఒకదాన్ని మీరడం (నిర్గమకాండము 20:13). తాను నేర్పిన సత్యాన్ని వారు అంగీకరించకపోవడానికి కారణం అతి ప్రాథమికమైన విషయాల్లో కూడా దేవుని సంకల్పం ప్రకారం చేయడం వారికి ఇష్టం లేకపోవడమేనని యేసు అంటున్నాడు.

20. అందుకు జనసమూహము నీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా

ఇక్కడ వీరు అబద్ధమాడుతున్నారు. తాము ఆయన్ను చంపడానికి చూస్తున్నామని వారికి బాగా తెలుసు (వ 32; యోహాను 5:18). దేవుని కుమారునికి విరుద్ధంగా అతి హీనమైన దూషణ పాపాన్ని వారిక్కడ మూట గట్టుకొంటున్నారు (యోహాను 8:48; యోహాను 10:20 కూడా చూడండి). మత్తయి 12:24, మత్తయి 12:31-32 నోట్స్ చూడండి.

21. యేసు వారిని చూచి నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడు చున్నారు.

యోహాను 5:1-9 లో రాసివున్న అద్భుతాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన విశ్రాంతి దినాన ఒక మనిషిని బాగు చేశాడని ఈ యూదులు ఆయనకు వ్యతిరేకంగా తీవ్రంగా ఫిర్యాదు చేశారు (యోహాను 5:10, యోహాను 5:16. మత్తయి 12:9-14 కూడా చూడండి). అయితే ఒక పిల్లవాడు పుట్టిన తరువాత అతనికి సున్నతి సంస్కారం జరిగించవలసిన దినం విశ్రాంతి దినాన వస్తే వారు విశ్రాంతి దినాన్నే దాన్ని జరిగించేవారు (ఆదికాండము 17:9-14; లేవీయకాండము 12:3 చూడండి). విశ్రాంతి దినాన గాయం చెయ్యడం ఫర్వాలేదు గాని బాగు చేస్తే వారికి కోపం!

22. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు, పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయు చున్నారు.
ఆదికాండము 17:10-13, లేవీయకాండము 12:3

23. మోషే ధర్మ శాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడు చున్నారేమి?

24. వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.
లేవీయకాండము 19:15, యెషయా 11:3, యెషయా 11:4

వారి నిర్ణయాలు చేసే సామర్థ్యంలో లోపాలున్నాయి కాబట్టి ఎవరికైనా శిక్ష విధించడానికి వారు ఉరకలు వేసేవారు.

25. యెరూషలేమువారిలో కొందరు వారు చంప వెదకు వాడు ఈయనే కాడా?

ఈ సామాన్య ప్రజలు యేసుప్రభువును గురించి ఎటూ తేల్చుకోలేక పోయేవారు. ఆయన ఉపదేశాలు వారి మీద ప్రభావితం చేశాయి. యూదుల అధికారులు ఆయన్ను చంపుదామన్న ఆలోచన మానుకుని ఇస్రాయేల్ అభిషిక్తునిగా ఆయన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారేమోనని ప్రజలకు అనిపించింది. అయితే యేసు గలలీ నుంచి వచ్చాడు కాబట్టీ, అభిషిక్తుడు ఎక్కడనుంచి వస్తాడో ఎవరికీ తెలిసే అవకాశం లేదని వారు అనుకున్నారు కాబట్టీ వారే ఈ సంగతి నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈ విషయంలో వారనుకునేది పొరపాటు (మీకా 5:2; మత్తయి 2:1-6).

26. ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా?

27. అయినను ఈయన ఎక్కడి వాడో యెరుగుదుము; క్రీస్తు వచ్చునప్పుడు ఆయన యెక్కడివాడో యెవడును ఎరుగడని చెప్పుకొనిరి.

28. కాగా యేసు దేవాలయములో బోధించుచుమీరు నన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు.

ఈ అవకాశాన్ని పురస్కరించుకుని తాను ఎక్కడనుంచి వచ్చాడో ఆ సత్యాన్ని వారికి చెప్తున్నాడు యేసు. ఆయన గలలీనుంచి లేదా నజరేతునుంచి వచ్చాడని వారు చెప్పి ఉంటారు. యేసు మరో సారి తాను దేవుని నుంచి వచ్చిన సంగతిని నొక్కి చెప్తున్నాడు. వారు దేవుణ్ణెరిగి ఉంటే దీన్ని గుర్తించగలిగేవారు. అయితే వారు దేవుణ్ణి ఎరిగినవారు కారు.

29. నేను ఆయన యొద్దనుండి వచ్చితిని;ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను.

30. అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టు కొనలేదు.

యేసు మరణించేందుకు, మనుషుల పాపాలకోసం తనను తాను అర్పించుకునేందుకూ పరలోకంనుండి వచ్చాడు. అంతేగాక ఆయన అలా చెయ్యవలసిన ఘడియ కూడా నిర్ణయమైపోయింది. ఆ ఘడియ ఇంకా రాలేదు.

31. మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిక్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటి కంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి.

“అద్భుతాలు”– యోహాను 2:11. కొంతమంది కనిపిస్తున్న సాక్ష్యాధారాలూ రుజువుల కారణంగా యేసుప్రభువుపై నమ్మకం ఉంచారు.

32. జనసమూహము ఆయనను గూర్చి యీలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి.

“పరిసయ్యులు”– మత్తయి 3:7.

33. యేసు ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును;

వ 16.

34. మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను.

వారి అవకాశం చెయ్యి దాటిపోతుంది. సామెతలు 1:24-28; హోషేయ 5:6, హోషేయ 5:15; ఆమోసు 8:11-12 పోల్చి చూడండి. తాను పరలోకంలో ఉంటాననీ వారు అక్కడికి రాలేరనీ ఆయన మాటలకు అర్థం.

35. అందుకు యూదులుమనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీసుదేశస్థులలో చెదరిపోయిన వారియొద్దకు వెళ్లి గ్రీసుదేశస్థులకు బోధించునా?

ఎప్పటిలాగానే నమ్మకం లేనివారికి ఆయన మాటలు అర్థం కాలేదు. ఇహలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించడం మాత్రమే వారికి చేతనైంది.

36. నన్ను వెదకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన యీ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి.

37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.
లేవీయకాండము 23:36, యెషయా 55:1

యోహాను 4:10, యోహాను 4:13-14 పోల్చి చూడండి. ఈ అద్భుతమైన వాగ్దానం అందరికోసం. యేసు బిగ్గరగా దృఢంగా ఖచ్చితంగా ఈ మాటలు చెప్పాడు. వ 37ను వ 38తో పోల్చి చూస్తే “దప్పి తీర్చుకోవడం” అంటే క్రీస్తులో నమ్మకం ఉంచడమని అర్థం అవుతుంది (ఇది యోహాను 6:53-56 విషయంలో కూడా నిజమని గ్రహించండి).

38. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.
సామెతలు 18:4, యెషయా 58:11, జెకర్యా 14:8

“లేఖనాలు”– యెషయా 44:3; యెషయా 55:1-2; యెషయా 58:11 లో ఈ సత్యం సూచించబడింది. అపొ కా గ్రంథంలో యేసు క్రీస్తు రాయబారులనుంచి సేవకులనుంచి ఈ జీవజల ప్రవాహాలు రావడం కనిపిస్తున్నది. క్రీస్తు సంఘ చరిత్రలో ఈ ప్రవాహాల గురించి మనం చదవవచ్చు. మనం క్రీస్తు దగ్గరికి వెళ్ళి దప్పితీర్చుకుంటే ఈ ప్రవాహాలు మనలోనుంచి కూడా పారడం అనుభవించనారంభిస్తాం. లూకా 11:13; అపో. కార్యములు 5:32; ఎఫెసీయులకు 5:18 చూడండి.

39. తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.
యెషయా 44:3

యోహాను 14:16-17 మొదలైన చోట్ల పవిత్రాత్మను గురించి నోట్స్. ఇది ఆయన పట్ల నమ్మకం గల హృదయాలనుంచి ప్రవహించే ఆధ్యాత్మిక జీవం. పాత ఒడంబడిక కాలంలోను, క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడూ పవిత్రాత్మ చురుకుగా పని చేస్తూనే వచ్చాడు (ఆదికాండము 1:2; నిర్గమకాండము 31:3; సంఖ్యాకాండము 11:25; సంఖ్యాకాండము 24:2; న్యాయాధిపతులు 3:10; న్యాయాధిపతులు 6:34; న్యాయాధిపతులు 11:29; 1 సమూయేలు 16:12; 2 సమూయేలు 23:2). క్రీస్తు మరణం, పునర్జీవితం, ఆరోహణం తరువాత తండ్రి, కుమారుడు కలిసి ఆయన్ను ఆయన సంపూర్ణతతో ఈ లోకానికి పంపించారు (యోహాను 14:16-17, యోహాను 14:26; అపో. కార్యములు 1:4-5; అపో. కార్యములు 2:1-4). క్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఉన్న ఈ యుగానికి మనం “పవిత్రాత్మ యుగం” అని పేరు పెట్టవచ్చు. “మహిమాస్థితి”– మహిమ అని తర్జుమా చేసిన గ్రీకు పదం ఈ శుభవార్తలో 23 సార్లు ఉంది. క్రొత్త ఒడంబడిక గ్రంథంలోని మరి ఏ పుస్తకంలోనూ ఇన్ని సార్లు కనిపించదు. అన్ని చోట్లా ఇది యేసుప్రభువుకు, తండ్రి అయిన దేవునికి మాత్రమే వర్తిస్తున్నది. యేసు తన మరణం, పునర్జీవితం జరిగిన తరువాతే పవిత్రాత్మను పంపాడు. కల్వరిలో జరిగిన కార్యం లేకపోతే పెంతెకొస్తు సంఘటన ఉండేది కాదు. దేవుని ఆత్మయొక్క జీవప్రదమైన ప్రవాహాలు పారగలిగేది సిలువ మూలంగానే.

40. జనసమూహములో కొందరు ఈ మాటలు వినినిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి;
ద్వితీయోపదేశకాండము 18:15

ద్వితీయోపదేశకాండము 18:15-18.

41. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి; మరికొందరుఏమి? క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా?

“అభిషిక్తుడు”– మత్తయి 1:1.

42. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి.
2 సమూయేలు 7:12-13, కీర్తనల గ్రంథము 89:3-4, యెషయా 11:1, యిర్మియా 23:5-6, యిర్మియా 33:15, మీకా 5:2

వారు అన్నది నిజమే (మీకా 5:2). కానీ యేసు ప్రభువు జన్మించినది అక్కడ అన్న విషయం వారికి తెలియదు (మత్తయి 2:1; లూకా 2:4-7).

43. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను.

ఎక్కడ చూచినా ఇప్పటికీ యేసుప్రభువు మనుషుల మధ్య విభేదాలకు కారణం. ఆయనపై నమ్మకం పెట్టుకున్నవారు అలా నమ్మనివారికి వేరైపోతారు. మత్తయి 10:34-36 పోల్చి చూడండి.

44. వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని యెవడును ఆయనను పట్టుకొనలేదు.

45. ఆ బంట్రౌతులు ప్రధానయాజకులయొద్దకును పరిసయ్యులయొద్దకును వచ్చినప్పుడు వారుఎందుకు మీ రాయ నను తీసికొని రాలేదని అడుగగా

వ 32లో ఈ భటులను పంపడం ఉంది. వారు క్రీస్తు ఉపదేశంలోని ప్రభావానికి తబ్బిబ్బైపోయారు గనుక పరిసయ్యుల ఆదేశాల ప్రకారం చేయలేకపోయారు. మత్తయి 7:28-29 పోల్చి చూడండి.

46. ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాట లాడలేదనిరి.
కీర్తనల గ్రంథము 45:2

47. అందుకు పరిసయ్యులు మీరుకూడ మోస పోతిరా?

వ 12.

48. అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా?

తమ అపనమ్మకమే యేసు మోసగాడనేందుకు రుజువు అని ఈ బండబారిపోయిన అపనమ్మకస్థులు నమ్మారు! ఆయన మాటలపై తమ ఆమోద ముద్ర లేదు గనుక యేసు సత్యం చెప్పడం లేదు అని వారి ఉద్దేశం!

49. అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి.

మోషే ధర్మశాస్త్రంతో సరిగా పరిచయం లేనివారే యేసును నమ్మగలరని వారనుకున్నారు! ఆ ధర్మశాస్త్రం, మొత్తం పాత ఒడంబడిక గ్రంథమంతా యేసువైపుకు చూపిస్తున్నదని వారికి తెలియదు (యోహాను 5:39, యోహాను 5:46; యోహాను 1:45; లూకా 24:27, లూకా 24:45-46). అసలు ఆ మాటకొస్తే మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినదీ, పాత ఒడంబడిక గ్రంథం మొత్తాన్నీ వ్రాయించినదీ ఆయనే. అసలు తెలియని మూకంటే ఆ పరిసయ్యులే.

50. అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు.

ఏ పరిసయ్యుడు గానీ యూద నాయకుడు గానీ యేసుపై నమ్మకం ఉంచలేదనుకున్నారు వారు. ఇందులో కూడా వారిది పొరపాటే. అలా నమ్మిన ఒక వ్యక్తి వారి మధ్యలోనే ఉన్నాడు. యోహాను 19:39-42 చూడండి (యోహాను 12:42 కూడా చూడండి). నీకొదేము ధైర్యంగా బయటికి సాక్ష్యం చెప్పకపోయినందువల్ల ఇతర పరిసయ్యులకు ఇది తెలియదు.

51. అతడు ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా
ద్వితీయోపదేశకాండము 1:16

ఇది బుద్ధికి అనుగుణమైన ప్రశ్నే. ధర్మశాస్త్రానికి అనుగుణమే. నీకొదేము ధైర్యంగా నిలబడకపోయినప్పటికీ మొత్తానికి వారికి వ్యతిరేకంగా నిలబడగలిగాడు, ఒంటరిగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇది ఆ గర్విష్ఠులైన అపనమ్మకస్థుల అజ్ఞాన పూరితమైన తిరస్కారాన్నే రేకెత్తించగలిగింది.

52. వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.

53. అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి.

అప్పటికీ యేసును ఏమీ చెయ్యలేమని గ్రహించి వారంతా వెళ్ళిపోయారు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 7 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

క్రీస్తు గుడారాల పండుగకు వెళ్తాడు. (1-13) 
యేసు నుండి ప్రాపంచిక లాభాలు ఏమీ లేవని తెలుసుకున్నప్పుడు అతని బంధువులు అసంతృప్తి చెందారు. అప్పుడప్పుడు, మతం లేని వ్యక్తులు దేవుని పనిలో నిమగ్నమైన వారికి సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు, కానీ వారి సలహాలు ప్రస్తుత క్షణంలో ప్రయోజనకరంగా అనిపించే వాటిపై మాత్రమే దృష్టి పెడతాయి. అతని బోధనలు మరియు అద్భుతాల గురించి ప్రజలలో అభిప్రాయాలు విభజించబడ్డాయి మరియు అతనికి మద్దతు ఇచ్చే వారు తమ నమ్మకాలను బహిరంగంగా వ్యక్తీకరించడానికి వెనుకాడారు. మరోవైపు, సువార్త బోధకులను మోసగాళ్లుగా ముద్ర వేసే వారు వారి సందేహాల గురించి గళం విప్పారు, అయితే చాలా మంది మద్దతుదారులు నిందలకు భయపడి తమ విధేయతను ప్రకటించడానికి ఇష్టపడరు.

విందులో అతని ఉపన్యాసం. (14-39) 
14-24
ప్రతి భక్తుడైన మంత్రి క్రీస్తు మాటలను వినయంగా స్వీకరించగలరు. అతని బోధనలు వ్యక్తిగత ఆవిష్కరణ నుండి ఉద్భవించలేదు కానీ పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వం ద్వారా దేవుని వాక్యం నుండి ఉద్భవించాయి. ప్రపంచాన్ని అశాంతికి గురిచేసే వివాదాల మధ్య, ఎవరైనా, ఏ దేశానికి చెందిన వారైనా, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకునేవారు, ఆ సిద్ధాంతం దేవునికి సంబంధించినదా లేక కేవలం మానవుడిదేనా అని వివేచించుకుంటారు. సత్యం పట్ల ద్వేషాన్ని పెంచుకునే వారు విధ్వంసకర దోషాలకు లొంగిపోతారు. నిశ్చయంగా, బాధితులకు ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం అనేది సబ్బాత్ యొక్క ఉద్దేశ్యంతో బాహ్య ఆచారాన్ని నిర్వహించడం వలె సమానంగా ఉంటుంది. దైవిక చట్టం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఆధారంగా తన చర్యలను అంచనా వేయమని యేసు వారిని ప్రోత్సహించాడు. మనం ఇతరులను వారి బాహ్య రూపాన్ని బట్టి మాత్రమే తీర్పు చెప్పడం మానుకోవాలి మరియు బదులుగా వారి సద్గుణం మరియు వారిలోని దేవుని ఆత్మ యొక్క బహుమతులు మరియు దయల ద్వారా వారిని అంచనా వేయాలి.

25-30
క్రీస్తు తన మూలాన్ని గురించి వారి అవగాహన తప్పు అని ధైర్యంగా ప్రకటించాడు. తాను దేవునిచే పంపబడ్డానని, తన వాగ్దానాలకు నమ్మకంగా ఉన్నానని అతను నొక్కి చెప్పాడు. దేవుని గురించిన వారి జ్ఞానాన్ని సవాలు చేస్తూ, ఆయన విశిష్టమైన అంతర్దృష్టిని నొక్కి చెప్పే ఈ ప్రకటన శ్రోతలకు కోపం తెప్పించింది. వారు అతనిని పట్టుకోవడానికి ప్రయత్నించారు, కానీ వారి హృదయాలు మారకుండా ఉన్నప్పటికీ భౌతికంగా ప్రజలను నిరోధించే శక్తి దేవునికి ఉంది.

31-36
యేసు బోధలు ఆయన మెస్సీయ అని చాలా మంది వ్యక్తులను ఒప్పించాయి, అయినప్పటికీ చాలా మందికి దానిని బహిరంగంగా అంగీకరించే ధైర్యం లేదు. ప్రపంచంలో ఉనికిలో ఉండి, దాని విలువలతో పొత్తుపెట్టుకోని, తత్ఫలితంగా ఇష్టపడని మరియు అలసిపోయిన వారికి, దానిలో వారి సమయం శాశ్వతంగా ఉండదని తెలుసుకోవడంలో ఓదార్పు ఉంటుంది. చెడుతో కలుషితమైన ప్రపంచాన్ని నావిగేట్ చేసే వారికి ఇక్కడ వారి నివాసం క్లుప్తంగా ఉండటం ఒక వరం. జీవితం మరియు దయ రెండింటి యొక్క రోజులు నశ్వరమైనవి, మరియు అతిక్రమించినవారు, ప్రతికూలతను ఎదుర్కొన్నప్పుడు, వారు ఒకసారి విస్మరించిన సహాయాన్ని కోరుకుంటారు. ప్రజలు అలాంటి వ్యక్తీకరణలను చర్చించినప్పటికీ, ముగుస్తున్న సంఘటనలు చివరికి వాటి అర్థాన్ని స్పష్టం చేస్తాయి.

37-39
గుడారాల విందు యొక్క చివరి రోజున, యూదుల సంప్రదాయంలో నీటిని లాగడం మరియు ప్రభువు ముందు పోయడం వంటివి ఉన్నాయి, ఇది క్రీస్తుచే సూచించబడిందని నమ్ముతారు. ఎవరైనా నిజమైన మరియు శాశ్వతమైన ఆనందాన్ని పొందాలనుకుంటే, వారు క్రీస్తు వైపు మళ్లాలి మరియు అతని మార్గదర్శకత్వానికి లోబడి ఉండాలి. పేర్కొన్న దాహం ఆధ్యాత్మిక ఆశీర్వాదాల కోసం తీవ్రమైన కోరికలను సూచిస్తుంది, అది మరేదైనా సంతృప్తి చెందదు. ప్రవహించే జలాల వలె చిత్రీకరించబడిన పరిశుద్ధాత్మ యొక్క పవిత్రీకరణ మరియు ఓదార్పు ప్రభావాలను సూచిస్తూ, తన వద్దకు వచ్చి త్రాగమని యేసు ప్రజలను ఆహ్వానించాడు.
ఈ దైవిక సౌలభ్యం సమృద్ధిగా మరియు స్థిరంగా ఉంది, ఇది నదిని పోలి ఉంటుంది, సందేహాలు మరియు భయాలను అధిగమించేంత శక్తివంతమైనది. క్రీస్తులో, కృపపై కృప యొక్క సంపూర్ణత ఉంది. ఆత్మ, విశ్వాసులలో నివసిస్తుంది మరియు చురుకైనది, జీవన, ప్రవహించే నీటి ఫౌంటెన్‌గా పనిచేస్తుంది, దాని నుండి సమృద్ధిగా ప్రవాహాలు ఉద్భవించి, శీతలీకరణ మరియు ప్రక్షాళన ప్రభావాలను అందిస్తాయి. పరిశుద్ధాత్మ యొక్క అద్భుత బహుమతులను మనం ఊహించలేకపోయినా, మనం అతని మరింత సాధారణమైన ఇంకా అమూల్యమైన ప్రభావాలను పొందవచ్చు. ఈ ఆధ్యాత్మిక ప్రవాహాలు, మన మహిమాన్వితమైన విమోచకుని నుండి ఉద్భవించాయి, యుగాల ద్వారా ప్రవహించాయి మరియు భూమి యొక్క సుదూర మూలలకు చేరుకున్నాయి. ఈ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి మనం ఉత్సాహం చూపుదాం.

ప్రజలు క్రీస్తును గూర్చి వివాదం చేస్తున్నారు. (40-53)
క్రీస్తు విరోధుల పట్ల నిర్దేశించిన శత్రుత్వం స్థిరంగా అహేతుకంగా ఉంటుంది మరియు కొన్ని సమయాల్లో, దాని నిలకడ వెనుక కారణాలు వివరించలేనివిగా ఉంటాయి. క్రీస్తు చేసినంత జ్ఞానం, శక్తి, దయ, బలవంతపు స్పష్టత మరియు మాధుర్యం యొక్క సమ్మేళనంతో ఏ వ్యక్తి కూడా కమ్యూనికేట్ చేయలేదు. చాలా మంది, మొదట్లో సంయమనం పాటించి, యేసు బోధలను బాహాటంగా ఆరాధించేవారు, తమ నమ్మకాలను త్వరగా విడిచిపెట్టి, తమ పాపపు మార్గాల్లో కొనసాగడం నిరుత్సాహపరుస్తుంది. దురదృష్టవశాత్తూ, ప్రజలు తరచుగా తమ నిర్ణయాలను శాశ్వతమైన ప్రాముఖ్యత కలిగిన విషయాలలో మార్గనిర్దేశం చేసేందుకు మిడిమిడి ప్రభావాలను అనుమతిస్తారు, సామాజిక పోకడల కోసం నిందను స్వీకరించడానికి సుముఖతను ప్రదర్శిస్తారు. మానవులు ఎగతాళి చేసేవాటిని దేవుని జ్ఞానము తరచుగా ఎంపిక చేసినట్లే, మానవ మూర్ఖత్వం సాధారణంగా దేవుడు ఎన్నుకున్న వారిని తొలగిస్తుంది. ప్రభువు తరచుగా తన వెనుకబడిన మరియు అకారణంగా శక్తిలేని శిష్యులను ముందుకు తీసుకువస్తాడు, తన శత్రువుల ప్రణాళికలను అడ్డుకోవడానికి వారిని ఉపయోగించుకుంటాడు.



Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |