John - యోహాను సువార్త 21 | View All

1. అటుతరువాత యేసు తిబెరియ సముద్రతీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా

“తిబెరియ”– గలలీ సరస్సు. యేసు తన శిష్యులను గలలీ వెళ్ళాలని చెప్పాడు (మత్తయి 28:7, మత్తయి 28:10). చనిపోయి సజీవంగా లేచిన తరువాత యేసు నలభై రోజులు తన శిష్యులతో ఆయా ప్రదేశాల్లో గడిపాడు (అపో. కార్యములు 1:3).

2. సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అనుఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి యుండిరి.

జెబెదయి కొడుకులు యాకోబు, యోహాను (మత్తయి 10:2).

3. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారుమేమును నీతో కూడ వచ్చెదమనిరి. వారు వెళ్లి దోనె ఎక్కిరి కాని ఆ రాత్రి యేమియు పట్టలేదు.

ఆ రోజుల్లో యేసు శరీరంతో అస్తమానం వారితో లేడు. శిష్యులు పని చేసి పొట్టపోసుకోవలసిన పేదలు (మత్తయి 4:18-22; అపో. కార్యములు 3:6). యేసుప్రభువు తమకు కనిపించాలని ఎదురుచూస్తున్న సమయంలో తమ ఖర్చుల నిమిత్తం కొంచెం డబ్బు సంపాదించడం పేతురు ఉద్దేశం కావచ్చు. ప్రభువు అప్పగించిన పనిని విడిచి పెట్టెయ్యాలన్న తలంపు వీరిలో ఎవరికైనా ఉన్నట్టు ఎలాంటి ఆధారమూ ఈ వచనాల్లో కనిపించదు. శుభవార్త ప్రకటించేవారు తమ పోషణకోసం వేరే పని చేసుకోవడం పొరపాటేమీ కాదు. అసలు, అది మంచి పద్ధతే (అపో. కార్యములు 18:3; అపో. కార్యములు 20:34-35; 2 థెస్సలొనీకయులకు 3:7-10).

4. సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు.

యోహాను 20:15; లూకా 24:17.

5. యేసు పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా? అని వారిని అడుగగా,

“అబ్బాయిలూ”– యోహాను 13:33 పోల్చి చూడండి.

6. లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడాయనదోనె కుడిప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి.

ఇలాంటి అద్భుతమే లూకా 5:4-10 లో ఉంది. సముద్రంలో ప్రతి చేప ఎక్కడుందో, ఆకాశంలో ప్రతి నక్షత్రం ఎక్కడుందో యేసుప్రభువుకు తెలుసు (యెషయా 40:26). మనుషుల్ని పట్టే జాలరులకు (మత్తయి 4:19) ఇక్కడొక మంచి పాఠం ఉంది. క్రీస్తు వారి ప్రయత్నాలకు మార్గదర్శకుడుగా ఉంటూ దీవించకపోతే వారి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే. రాబోయే కాలంలో విశ్వాసులయ్యే వారంతా ఎక్కడున్నారో వారిని చేరుకోవడమెలాగో ఆయనకు తెలుసు.

7. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్త్రహీనుడై యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికెను.

గతంలో జరిగిన ఆ అద్భుతం తరువాత పేతురులో కనిపించిన మనస్తత్వానికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది (లూకా 5:8). ఈ మధ్య కాలంలో తన గురించీ యేసుప్రభువు గురించీ అతడెన్నో సంగతులు నేర్చుకున్నాడు.

8. దరి యించుమించు ఇన్నూరు మూరల దూర మున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వల లాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి.

9. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను.

పరలోకంనుంచి వచ్చిన ప్రభువు తన శిష్యుల కోసం ఆహారం సిద్ధం చేశాడు. యోహాను 13:3-5; మత్తయి 20:28 పోల్చి చూడండి. లూకా 12:35-37 కూడా చూడండి.

10. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా

11. సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను;

శిష్యులు ఆ చేపలను అమ్మి ఖర్చులకు డబ్బు సంపాదించుకోగలిగేవారు. ప్రభువు ఆ వల పిగిలిపోకుండా చేశాడు కూడా. అప్పటినుంచి అన్ని తరాల్లోనూ, అద్భుతమైన రీతుల్లో ప్రభువు తన సేవకులను పోషించాడు. మత్తయి 6:31-33; ఫిలిప్పీయులకు 4:19 ఎప్పటికీ నిలిచివుండే సత్యాన్ని తెలియజేస్తున్నాయి. 1 రాజులు 17:3-9 కూడా చూడండి.

12. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసురండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందుననీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు.

“భోం చేయండి”– ప్రకటన గ్రంథం 3:20 పోల్చి చూడండి. చనిపోయి సజీవంగా లేచిన దేవుని కుమారుని సమక్షంలో శిష్యులు అద్భుతాశ్చర్యాలతో తల మునకలైపోతూ, ఏమి మాట్లాడాలో తోచక మిన్నకుండి ఉంటారు.

13. యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలనుకూడ పంచిపెట్టెను.

ప్రభువు భోజనం వండడమే కాదు, వారికి వడ్డించాడు కూడా. మనుషులకు పరిచర్య చేయాలన్న ఆయన అభిలాష ఆయన మరణించి సజీవంగా లేవడంతో అంతమైపోలేదు (హెబ్రీయులకు 13:8).

14. యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది యిది మూడవసారి.

“మూడో సారి”– తన ఆది శిష్యుల గుంపుకు కనిపించాడన్నమాట. స్త్రీలకు, ఇతరులకు కనిపించిన సందర్భాలు ఇంకా కొన్ని ఉన్నాయి.

15. వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచియెహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసునా గొఱ్ఱె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను.

పేతురు ప్రభువును మూడుసార్లు ఎరగనని అబద్ధం చెప్పాడు (యోహాను 18:17, యోహాను 18:25, యోహాను 18:27). అందుకు అతడెంత వేదనపడ్డాడో మత్తయి 26:75ను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అతని ప్రేమను గురించి మూడుసార్లు అతణ్ణి యేసు ప్రశ్నిస్తున్నాడు. తాను యేసెవరో తెలియదని చెప్పిన మూడుసార్లు పేతురుకు గుర్తుకు వచ్చి ఉండాలి. అతడు తనను తాను ఎదుర్కొని తన బలహీనతను, అజ్ఞానాన్ని, పాపాన్ని గుర్తించగలిగితే అతనికి మంచిది. సైతాను “జల్లించినది” ప్రత్యేకంగా పేతురునే (లూకా 22:31). అందువల్ల ప్రభువు ప్రత్యేకంగా పేతురు సంగతి చూస్తున్నాడు. పేతురుతో ఇలా మాట్లాడ్డం ద్వారా ఆయన ఇతర శిష్యులకు (మనకు కూడా) చాలా ప్రాముఖ్య సత్యాన్ని నేర్పిస్తున్నాడు. పేతురు దుఃఖాన్ని ప్రభువు తిరిగి మేల్కొల్పినప్పటికి అది ఆయన ముఖ్యోద్దేశం కాదు. ఆయన ముఖ్యోద్దేశం పేతురును బలపరచి తిరిగి అతనికి తన పనిని అప్పగించడం. “వీరికంటే”– గ్రీకులో (ఇంగ్లీషులో కూడా) ఈ మాటను బట్టి యేసు “వీరికంటే” అంటున్నాడా “వీటికంటే” అంటున్నాడా అని తెలుసుకోవడం కష్టం. కాబట్టి ఈ మాటను మూడు విధాలుగా వివరించవచ్చు. “ఈ శిష్యులు ప్రేమించినంతకంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా?”, లేక “ఈ శిష్యులను నీవు ప్రేమించినదానికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా”, లేక “చేపలు, చేపలు పట్టడం కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా?” ఈ మూడింటిలో మొదటిది సరైన వివరణ అనుకునే అవకాశం ఉంది. క్రీస్తు పట్ల తనకున్న ప్రేమానురాగాలను ఇతరులందరికంటే పేతురే ఎక్కువగా చెప్పాడు (యోహాను 13:37), ఇతర శిష్యులకంటే తాను గొప్పవాణ్ణి అన్నట్టు పోలిక చెప్పాడు (మత్తయి 26:33). “సరే, నీ చేదు అనుభవం తరువాత, నీ బలహీనత నీకు తెలిసివచ్చిన తరువాత ఇప్పుడు వీరందరికంటే నీవే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని చెప్పగలవా?” అని ఈ ప్రశ్నకు అర్థం అన్నట్టుంది. రెండో వివరణకు అంత అవకాశం కనిపించదు. కానీ మత్తయి 10:37-38 పోల్చి చూడండి. పరలోకం ప్రభువును ప్రేమించినదానికంటే ఇహలోకంలో స్నేహితులను ఎక్కువగా ప్రేమించడం కూడా సాధ్యమే. పైన ఇచ్చిన మూడో వివరణను తీసుకుంటే ఇలా చెప్పుకోవచ్చు: “నాకంటే, నా విధానాల కంటే నీ పాత జీవితం, దాని విధానాలే నీకెక్కువ ఇష్టమా?” (వ 19; మత్తయి 4:18-20; మత్తయి 19:27). ఏ అర్థం మనం తీసుకున్నా ఒకటి మాత్రం స్పష్టమే. యేసుప్రభువుతో ఒక శిష్యునికి ఉండే సంబంధంలో ఒకటి మాత్రం అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యం – ఆయనపట్ల ప్రేమ. 1 కోరింథీయులకు 13:1-3; 1 కోరింథీయులకు 16:22 పోల్చిచూడండి. ఆయనపై మనకున్న ప్రేమకు అనుగుణంగానే మనం ఆయనకిష్టమైన రీతిలో ఆయన్ను సేవించగలం “మేపు”– దేవుని వాక్కుతో పేతురు కొత్తగా విశ్వాసులైన వారిని, అనుభవం లేనివారిని పోషించాలన్నమాట. ప్రేమ కార్యరూపంలో బయట పడాలి. యోహాను 14:15, యోహాను 14:23 చూడండి. మనం క్రీస్తును ప్రేమిస్తే ఆయన ప్రజలను కూడా ప్రేమిస్తాం (1 యోహాను 4:20).

16. మరల ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన నా గొఱ్ఱెలను కాయుమని చెప్పెను.

“కాపరిగా ఉండు”– కేవలం “మేపడం” కంటే మరింత ఎక్కువ అర్థం ఇందులో ఉంది. క్రీస్తు ప్రజలను ప్రేమగల కాపరిగా ఉండి, అన్నివిధాలా వారి సంక్షేమాన్ని, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో చూచుకుంటూ ఉండాలని దీని అర్థం. ఇలా చెప్పడంలో యేసు పేతురును ఇతర శిష్యులకంటే అధికంగా హెచ్చిస్తున్నాడా? లేదు. వారు, ఇంకా అనేకమంది కూడా, ఉపదేశకులుగా కాపరులుగా దేవుని మందను మేపేవారుగా ఉండాలి – అపో. కార్యములు 20:28; ఎఫెసీయులకు 4:11-13; 1 పేతురు 5:1-4. క్రీస్తు ఒక్కడే ప్రముఖుడైన కాపరి.

17. మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడిప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.

“మూడో సారి”– ప్రభువును మూడుసార్లు ఎరగననడం గుర్తుకు వచ్చి పేతురు ఇలా నొచ్చుకొన్నాడనడంలో మనకు సందేహం ఉందా? “అంతా నీకు తెలుసు”– యోహాను 2:24-25; హెబ్రీయులకు 4:13 పోల్చి చూడండి. ఇలా అనడంలో యేసు దేవుని అవతారమని పేతురు పూర్తిగా నమ్మి ఉండాలి. దేవుడు తప్ప అంతా తెలిసిన వారెవరున్నారు? “గొర్రెలను”– వ 15తో సరిచూడండి. వీరు అనుభవం ఉన్న విశ్వాసులు కావచ్చు. ఆహారం అవసరం లేనంతగా ఏ విశ్వాసీ ఎదిగిపోడు.

18. యేసు నా గొఱ్ఱెలను మేపుము. నీవు ¸యౌవనుడవై యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను.

పేతురు ముసలివాడైపోయి చనిపోతాడని ప్రభువు సూచిస్తున్నాడు. ఆ ఆది శిష్యులు బ్రతికివున్న కాలంలోనే ఏ క్షణంలోనైనా క్రీస్తు తిరిగి రాగలిగేవాడని కొంతమంది బోధించే సిద్ధాంతంతో దీన్నీ పొసగేలా చెయ్యడం తేలిక కాదు. ఈ భవిష్యద్వాక్కు పలికిన తరువాత ప్రభువు పేతురు వృద్ధుడై చనిపోకముందే తిరిగి రాగలిగేవాడా? “దేవునికి మహిమ”– ఇంతకు ముందు యేసును తానెరుగనన్నాడు పేతురు. కానీ మరణంలో అతడు స్థిరంగా ఉండి చివరికి తన మాట నిలుపుకుంటాడు (యోహాను 13:37). పారంపర్యంగా వచ్చిన విషయాన్ని బట్టి పేతురు సిలువ మరణం పొందాడంటారు. ఇక్కడ క్రీస్తు పేతురుతో చెప్పిన చివరి మాట అతనితో చెప్పిన మొదటి మాటలాగానే ఉంది (మత్తయి 4:18-19). శిష్యుడుగా అతణ్ణి పిలిచిన సత్యాన్ని ఇది స్థిరపరచింది.

19. అతడు ఎట్టి మరణమువలన దేవుని మహిమపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పినన్ను వెంబడించుమని అతనితో అనెను.

20. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును, భోజనపంక్తిని ఆయన రొమ్మున ఆనుకొనిప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను.

యోహాను 13:23. “యేసు ప్రేమించిన శిష్యుడు” కూడా చేపలు పట్టేందుకు వెళ్ళిన ఏడుగురిలో ఉన్నాడు (వ 2,3). ఇతడు పేతురు కాదని మనకు తెలుసు. యోహాను తప్ప ఇతడు వేరే ఎవరైనా అయి ఉండే అవకాశం ఉన్నట్టు లేదు.

21. పేతురు అతనిని చూచి ప్రభువా, యితని సంగతి ఏమగునని యేసును అడిగెను.

22. యేసు నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు మనెను.

దేవుని సేవకులందరికీ హెచ్చరికగా ఉండవలసిన మందలింపు మాటలివి. ప్రభువుపట్ల పేతురుకు ఉన్న ఇప్పటి బాధ్యతే అతడు చూచుకోవాలి గాని వేరొకరి భవిష్యత్తు సంగతి కాదు. సహ విశ్వాసుల పట్ల ప్రేమపూర్వకమైన ఆసక్తి మనకు ఉండకూడదని యేసు చెప్పడం లేదు (యోహాను 13:34; 1 కోరింథీయులకు 12:25-26; గలతియులకు 6:2 పోల్చి చూడండి). అయితే ఇతరుల పట్ల క్రీస్తుకున్న ఉద్దేశాలను తెలుసుకోవాలని మనకు తగని ఆశ కలగవచ్చు. ఇతరులు ఏమి చేస్తున్నారో చూడడంతోనే పొద్దుపుచ్చుతూ, కేవలం ప్రభువునే అనుసరించాలన్న మన బాధ్యత నిర్లక్ష్యం చేసే అవకాశం లేకపోలేదు.

23. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గానినేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను.

“అన్నాడు”– యేసు మాటలకు అర్థం చెప్పడంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో గదా! యేసుప్రభువు మామూలుగా చెప్పిన ఒక మాటను కొందరు ఎంతగా అపార్థం చేసుకుంటారో, అక్కడ లేని తలంపులు దానికి కలిపి దాని అర్థాన్ని ఎలా తప్పుదారి పట్టిస్తారో ఇదొక మంచి ఉదాహరణ. సరిగ్గా యేసు పలికిన మాటనే యోహాను ఎలా నొక్కి చెప్తున్నాడో గమనించండి. సామెతలు 30:5-6 పోల్చి చూడండి.

24. ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే; ఇతని సాక్ష్యము సత్యమని యెరుగుదుము.

యేసు ప్రేమించిన శిష్యుడెవరో (వ 20) ఇక్కడ మనకు తెలిసిపోతున్నది. అతడు ఈ శుభవార్త రచయిత. ఇతడు క్రీస్తురాయబారి యోహాను అనేందుకు సాక్ష్యాధారాలున్నాయి గానీ మరి ఏ ఇతర శిష్యుడనుకునేందుకూ ఆధారాలు లేవు. “మాకు”– ఇక్కడ బహువచనంలోకి ఎందుకు దిగవలసి వచ్చిందో చెప్పలేము. యోహాను రాసినదానికి మరో శిష్యుడు ఈ వాక్యాన్ని గనుక కలిపి ఉంటే ఆ శిష్యుడెవరో మనకు తెలియదు. అదెలాగైనా ఇది కూడా దేవుని వాక్కే అని మా నమ్మకం.

25. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.

“ఇతర కార్యకలాపాలు”– యోహాను 20:30; మత్తయి 8:16; మత్తయి 9:35; మొ।। “పుస్తకాలు” – అలాంటివి ఎంతో విలువగలవి అయినా, అవన్నీ మనకు అవసరం లేదని దేవునికి తెలుసు. మనకేది అవసరమని ఆయన భావించాడో అదంతా మనకు ఉంది. ఆయన మనసులో ఉన్న ఉద్దేశానికి ఆయన మనకిచ్చినది సరిపోతుంది. ఆయన ఇచ్చినదాని కోసం ఆయనకు కృతజ్ఞతలు చెప్పి మన జీవిత కాలమంతా మన పఠనంలో దాన్ని ముఖ్య భాగంగా చేసుకుని ఆయన కృపవల్ల దాన్ని ఆచరణలో పెట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుంటే చాలు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 21 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

క్రీస్తు తన శిష్యులకు కనిపిస్తాడు. (1-14) 
క్రీస్తు సాధారణంగా తన అనుచరులకు తనను తాను బహిర్గతం చేసుకుంటాడు, తరచుగా శాసనాల వంటి స్థిరమైన అభ్యాసాల ద్వారా. అయినప్పటికీ, కొన్నిసార్లు, అతను వారి రోజువారీ కార్యకలాపాల మధ్య కూడా తన ఆత్మ ద్వారా వారిని సందర్శించడానికి ఎంచుకుంటాడు. క్రీస్తు శిష్యులు కలిసి సాధారణ సంభాషణలు మరియు వ్యాపారాలలో పాల్గొనడం ప్రయోజనకరం. వారిపై చర్యలు తీసుకోవాల్సిన తరుణం ఇంకా రాలేదు. ఎవరికీ భారం కాకూడదని తమను తాము పోషించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రీస్తు తన ప్రజలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు, వారి తాత్కాలిక అవసరాలను అర్థం చేసుకున్నప్పుడు మరియు తగినంత దయ మరియు అవసరమైన ఏర్పాట్లను వాగ్దానం చేస్తున్నప్పుడు వారికి తనను తాను బహిర్గతం చేస్తాడు. దైవిక ప్రావిడెన్స్ అతిచిన్న వివరాలకు విస్తరించింది మరియు వారి అన్ని మార్గాల్లో దేవుణ్ణి అంగీకరించే వారు ధన్యులు. వినయపూర్వకమైన, శ్రద్ధగల మరియు సహనం గల వ్యక్తులు, అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ, చివరికి వారి పరిస్థితులలో సానుకూల మార్పును అనుభవిస్తారు. క్రీస్తు సూచనలను అనుసరించడం ఎప్పుడూ నష్టానికి దారితీయదు; అది ఓడకు కుడి వైపున వల వేయడం లాంటిది.
యేసు తన అనుచరులకు మరెవరూ చేయలేని వాటిని సాధించడం ద్వారా వారికి తనను తాను తెలియజేస్తాడు, తరచుగా ఊహించని ఆశీర్వాదాలతో వారిని ఆశ్చర్యపరుస్తాడు. తన కోసం సర్వస్వం త్యజించే వారికి మంచి ఏమీ ఉండదని ఆయన నిర్ధారిస్తాడు. గత ఆశీర్వాదాల గురించి ఆలోచించడం దేవుని ప్రావిడెన్స్ యొక్క మతిమరుపును నిరోధించడంలో సహాయపడుతుంది. యేసు ప్రేమించిన శిష్యుడు అతనిని మొదటిగా గుర్తించాడు, బాధలో ఆయనను దగ్గరగా అనుసరించాడు. పీటర్, ఉత్సాహంతో నడిచేవాడు, మొదట క్రీస్తును చేరుకున్నాడు. విశ్వాసులు క్రీస్తును ఎలా గౌరవిస్తారనే విషయంలో వైవిధ్యాలు ఉన్నప్పటికీ, అన్నింటినీ ఆయన అంగీకరించవచ్చు. ఓడలో ఉంటూ, పని చేస్తూనే, పట్టుకుని తీసుకొచ్చే వాళ్ళు లోకస్థులని విమర్శించకూడదు; వారు తమ పాత్రలలో క్రీస్తును యథార్థంగా సేవిస్తున్నారు. యేసుప్రభువు తన శిష్యులపట్ల తనకున్న శ్రద్ధను ప్రదర్శిస్తూ, వారి కోసం ఏర్పాట్లు సిద్ధం చేశాడు. ఈ నిబంధనల మూలం స్పష్టంగా తెలియకపోవచ్చు, కానీ క్రీస్తు తన అనుచరుల పట్ల చూపుతున్న శ్రద్ధను చూడడం ఓదార్పునిస్తుంది. పెద్ద చేపలు సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఏదీ కోల్పోలేదు లేదా వల దెబ్బతినలేదు, ఇది ఆత్మలను దేవుని వద్దకు తీసుకురావడానికి సువార్త యొక్క శాశ్వత శక్తిని సూచిస్తుంది.

పీటర్‌తో అతని ఉపన్యాసం. (15-19) 
మన ప్రభువు తన అసలు పేరును ఉపయోగించి పేతురును సంబోధించాడు, పీటర్ తన మునుపటి తిరస్కరణ ద్వారా "పీటర్" అనే పేరును కోల్పోయినట్లుగా. ప్రతిస్పందనగా, పేతురు యేసు పట్ల తనకున్న ప్రేమను ధృవీకరించాడు కానీ ఇతరులకన్నా గొప్ప ప్రేమను ప్రకటించుకోలేదు. మన చిత్తశుద్ధిపై అనుమానం కలిగించే చర్యలలో మనం నిమగ్నమైనప్పుడు, మన ప్రామాణికతను ప్రశ్నించడంలో ఆశ్చర్యం లేదు. గత పాపాలను స్మరించుకోవడం, క్షమించబడినవి కూడా, నిజమైన పశ్చాత్తాపానికి గురైన వ్యక్తిలో మళ్లీ దుఃఖాన్ని రేకెత్తిస్తాయి.
తన స్వంత చిత్తశుద్ధి గురించి తెలుసుకున్న పీటర్, తన హృదయ రహస్యాల గురించి కూడా క్రీస్తుకున్న జ్ఞానాన్ని గుర్తించి, క్రీస్తుకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశాడు. మన తప్పులు మరియు పొరపాట్లు మనల్ని మరింత వినయం మరియు జాగరూకత వైపు నడిపించినప్పుడు అది ప్రయోజనకరంగా ఉంటుంది. హృదయాలను శోధించే దేవుని నుండి పరీక్ష మరియు ధృవీకరణ కోసం ప్రార్థన ద్వారా మనస్ఫూర్తిగా వెతకడానికి మనల్ని ప్రేరేపిస్తూ, దేవుని పట్ల మనకున్న ప్రేమ యొక్క నిష్కపటత పరిశీలనకు లోబడి ఉండాలి.
గొఱ్ఱెలు మరియు గొఱ్ఱెలు రెండింటినీ, క్రీస్తు మందను చూసుకోవడానికి అర్హులైనవారు, ఏదైనా భూసంబంధమైన లాభం లేదా వస్తువు కంటే మంచి కాపరిని ఎక్కువగా ప్రేమించాలి. ప్రతి నీతిమంతుడైన వ్యక్తికి, వారి మరణం యొక్క స్వభావంతో సంబంధం లేకుండా, దానిలో దేవుణ్ణి మహిమపరచడం. అన్నింటికంటే, మన ప్రధాన ఉద్దేశ్యం ప్రభువు మాటకు అనుగుణంగా ప్రభువు కోసం చనిపోవడమే.

యోహాను గురించి క్రీస్తు ప్రకటన. (20-24) 
అనుభవజ్ఞుడైన క్రైస్తవునికి కూడా బాధలు, నొప్పులు మరియు మరణ నిరీక్షణ భయంకరంగా అనిపించవచ్చు. ఏది ఏమైనప్పటికీ, దేవుణ్ణి మహిమపరచాలనే కోరికతో, పాపభరిత ప్రపంచం నుండి బయలుదేరి, ప్రభువు సన్నిధిలో ఉండాలనే కోరికతో, అనుభవజ్ఞుడైన విశ్వాసి విమోచకుని పిలుపుని వినడానికి మరియు కీర్తిని చేరుకోవడానికి మరణాన్ని దాటడానికి సిద్ధంగా ఉంటాడు. తన అనుచరులు తమకు లేదా ఇతరులకు సంబంధించిన భవిష్యత్తు సంఘటనల గురించి ఉత్సుకతతో మునిగిపోకుండా తమ స్వంత బాధ్యతలపై దృష్టి పెట్టాలని క్రీస్తు కోరుకుంటున్నాడు. మన ఆలోచనలను ఆక్రమించే అనేక ఆందోళనలు అంతిమంగా అసంభవం.
ఇతరుల విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా శిష్యులు తమ స్వంత పనులకు శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. బదులుగా, వారు శ్రద్ధగా పని చేయాలి మరియు వారి స్వంత వ్యాపారంపై దృష్టి పెట్టాలి. దేవుని ప్రణాళికలు మరియు కనిపించని ప్రపంచం గురించి అనేక ఊహాజనిత ప్రశ్నలు తలెత్తుతాయి, కానీ మనం సరిగ్గానే, "ఇది మనకు ఏమిటి?" క్రీస్తును అనుసరించడానికి మనల్ని మనం అంకితం చేసుకోవడం ద్వారా, మన పరిధికి మించిన విషయాలలో మనల్ని మనం ఇన్వాల్వ్ చేసుకోవడానికి మనకు మొగ్గు లేదా సమయం లేదని తెలుసుకుంటాము.
అలిఖిత సంప్రదాయాల విశ్వసనీయత ప్రశ్నార్థకం. స్క్రిప్చర్ దాని స్వంత వ్యాఖ్యాతగా ఉండాలి, దాని గురించి వివరిస్తుంది. గ్రంథం, గణనీయమైన స్థాయిలో, దాని స్వంత సాక్ష్యంగా పనిచేస్తుంది మరియు తనను తాను కాంతిగా ధృవీకరించుకుంటుంది. అపోహలను సరిదిద్దడం అనేది స్క్రిప్చర్లో కనిపించే క్రీస్తు మాటల ద్వారా సులభంగా సాధించబడుతుంది. 1cor 2:13లో అందించబడిన పదాల ద్వారా పరిశుద్ధాత్మ బోధిస్తున్నట్లుగా, లేఖనాల భాషను ఉపయోగించడం దాని సత్యాలను తెలియజేయడానికి సురక్షితమైన మార్గం. వ్యక్తులు వారు ఉపయోగించే సాంకేతిక పదాలు మరియు వాటిని ఎలా అన్వయించాలనే విషయంలో విభేదాలు ఉన్నప్పటికీ, వారు ఇప్పటికీ స్క్రిప్చర్ భాషలో మరియు ఒకరినొకరు ప్రేమించాలనే ఉమ్మడి నిబద్ధతను కనుగొనగలరు.

ముగింపు. (25)
యేసు చర్యలలో కొంత భాగం మాత్రమే నమోదు చేయబడింది, అయినప్పటికీ అటువంటి సంక్షిప్త ప్రదేశంలో ఉన్న సమృద్ధిని మెచ్చుకుంటూ, లేఖనాలలోని గొప్పతనానికి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాము. రికార్డ్ చేయబడిన కంటెంట్ మన విశ్వాసానికి మార్గనిర్దేశం చేయడానికి మరియు మన ప్రవర్తనను నియంత్రించడానికి సరిపోతుంది; అదనపు సమాచారం నిరుపయోగంగా ఉండేది. దురదృష్టవశాత్తు, వ్రాతపూర్వక రికార్డులోని అనేక అంశాలు గుర్తించబడవు, మరచిపోతాయి లేదా వివాదాస్పద వివాదాలకు సంబంధించినవిగా మారాయి.
ఏది ఏమైనప్పటికీ, పరలోకంలో మనకు ఎదురుచూసే ఆనందాన్ని మనం ఊహించవచ్చు, అక్కడ మన వ్యక్తిగత అనుభవాలలో వ్యక్తమయ్యే ప్రొవిడెన్స్ మరియు దయ గురించి లోతైన అంతర్దృష్టితో పాటు, యేసు చేసిన మరియు చెప్పిన ప్రతిదాని గురించి మనం మరింత సమగ్రమైన అవగాహనను పొందుతాము. ఈ నిరీక్షణ మన సంతోషానికి దోహదపడుతుంది. ఈ లేఖనాల ఉద్దేశ్యం ఏమిటంటే, యేసును దేవుని కుమారుడైన క్రీస్తుగా విశ్వసించడం. ఈ విశ్వాసం ద్వారా, ఒక వ్యక్తి తన పేరు ద్వారా జీవితాన్ని పొందవచ్చని ఉద్దేశించబడింది యోహాను 20:31



Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |