Luke - లూకా సువార్త 9 | View All

1. ఆయన తన పండ్రెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి

1. రోగాలను నయం చేయటానికి వాళ్ళకు శక్తి, అధికారము ఇచ్చాడు.

2. దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను.

2. వాళ్ళను ప్రపంచంలోకి పంపుతూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించుమని, రోగాలున్న వాళ్ళకు నయం చెయ్యమని వాళ్ళతో చెప్పాడు.

3. మరియు ఆయనమీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొని పోవద్దు; రెండు అంగీలు ఉంచు కొనవద్దు.

3. వాళ్ళతో, “ప్రయాణం చేస్తున్నప్పుడు మీ వెంట చేతి కర్రకాని, సంచికాని, ఆహారంకాని, ధనంకాని, మారు దుస్తులు కాని, యితర వస్తువులు కాని తీసుకు వెళ్ళకండి.

4. మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలుదేరుడి.

4. ఒక యింటికి వెళ్తే ఆ గ్రామం వదిలే దాకా ఆ యిల్లు విడిచి వెళ్ళకండి.

5. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములోనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను.

5. ప్రజలు మీకు స్వాగతం ఇవ్వకుంటే ఆ ఊరు వదిలి వెళ్ళే ముందు వాళ్ళు చేసిన పొరపాటు చూపటానికి మీ కాలి ధూళి దులపండి” అని అన్నాడు.

6. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, (రోగులను) స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి.

6. ఆ తర్వాత వాళ్ళు బయలు దేరి ప్రతి గ్రామానికి వెళ్ళారు. ప్రతిచోటా దైవ సందేశాన్ని ప్రకటించారు. రోగాలున్న వాళ్ళకు నయం చేసారు.

7. చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యము లన్నిటిని గూర్చి విని, యెటుతోచక యుండెను. ఏలయనగా కొందరు యోహాను మృతులలోనుండి లేచెననియు,

7. సామంతరాజైన హేరోదు జరుగుతున్న వాటిని గురించి విని చాలా కంగారు పడ్డాడు. యోహాను బ్రతికి వచ్చాడని కొందరన్నారు.

8. కొందరు ఏలీయా కనబడెననియు; కొందరు పూర్వ కాలపు ప్రవక్తయొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి.

8. ఏలీయా కనిపించాడని కొందరన్నారు. మరికొందరు పూర్వకాలం నాటి ప్రవక్తల్లో ఒకడు బ్రతికి వచ్చాడని అన్నారు.

9. అప్పుడు హేరోదు నేను యోహానును తల గొట్టించితిని గదా; యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను.

9.

10. అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నియు ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంట బెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్లెను.

10. అపొస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ యేసుతో చెప్పారు. ఆ తర్వాత యేసు అపొస్తలులను ప్రజలకు దూరంగా బేత్సయిదా అనే పట్టణానికి తన వెంట తీసుకు వెళ్ళాడు.

11. జన సమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమునుగూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసినవారిని స్వస్థ పరచెను.

11. ప్రజలకు ఈ విషయం తెలిసింది. వాళ్ళు యేసును చూడటానికి అక్కడికి కూడా వెళ్ళారు. ఆయన వాళ్ళను ఆహ్వానించి దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి రోగాలున్న వాళ్ళకు నయం చేశాడు.

12. ప్రొద్దు గ్రుంక నారంభించినప్పుడు పండ్రెండుగురు శిష్యులు వచ్చి మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని, ఆహారము సంపాదించు కొనునట్లు జనసమూహ మును పంపివేయుమని ఆయనతో చెప్పిరి.

12. సూర్యాస్తమయమౌతుండగా ఆయన వద్దకు పన్నెండు మంది అపొస్తలులు వచ్చి, “మనం ఏ మూలో ఉన్నాం. ప్రజల్ని వెళ్ళమనండి. చుట్టూ ఉన్న పల్లెలకు, గ్రామాలకు వెళ్ళి ఆహారము, విశ్రమించటానికి స్థలం చూసుకొంటారు” అని అన్నారు.

13. ఆయనమీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారుమనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదు; మేము వెళ్లి యీ ప్రజలందరికొరకు భోజనపదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి.

13. యేసు వాళ్ళతో, “వాళ్ళు తినటానికి మీరేదైనా ఆహారం ఇవ్వండి” అని అన్నాడు. వాళ్ళు, “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి. మేము వెళ్ళి వీళ్ళందరికోసం ఆహారం కోనుక్కు రావాలని మీ ఉద్దేశ్యమా?” అని అన్నారు.

14. వచ్చినవారు ఇంచుమించు అయిదువేల మంది పురుషులు. ఆయనవారిని ఏబదేసిమంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా,

14. సుమారు ఐదువేలమంది పురుషులు అక్కడ ఉన్నారు. కాని యేసు తన శిష్యులతో, “పంక్తికి యాభైమంది చొప్పున వాళ్ళను కూర్చో బెట్టండి” అని అన్నాడు.

15. వారాలాగు చేసి అందరిని కూర్చుండబెట్టిరి.

15. శిష్యులు ఆయన చెప్పినట్లు చేసారు. వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారు.

16. అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశము వైపు కన్ను లెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జనసమూహము నకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను.

16. యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు తీసుకొని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని భాగాలు చేశాడు. వాటిని తన శిష్యులకిచ్చి ప్రజలకు పంచమన్నాడు.

17. వారందరు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపెళ్లెత్తిరి.
2 రాజులు 4:44

17. అందరూ కడుపు నిండుగా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ఆహారాన్ని పండ్రెండు గంపల నిండా నింపారు.

18. ఒకప్పుడాయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయనయొద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారి నడుగగా

18. ఒకరోజు యేసు ఏకాంతంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ప్రార్థించటం ముగించాక వాళ్ళతో, “ప్రజలు నేను ఎవర్నని అంటున్నారు?” అని అడిగాడు.

19. వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయాయనియు, కొందరుపూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పు కొనుచున్నారనిరి.

19. వాళ్ళు, “కొందరు బాప్తిస్మము నిచ్చే యోహాను అని అంటున్నారు. మరికొందరు పూర్వకాలం నాటి ప్రవక్త బ్రతికి వచ్చాడు అని అంటున్నారు” అని సమాధానం చెప్పారు.

20. అందుకాయన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడుగగా పేతురునీవు దేవుని క్రీస్తువనెను.

20. “మీ సంగతేమిటి? మీరేమంటారు?” అని ఆయన అడిగాడు. పేతురు, “మీరు దేవుడు పంపిన క్రీస్తు” అని సమాధానం చెప్పాడు.

21. ఆయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి

21. “ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు” అని యేసు ఖండితంగా చెప్పాడు.

22. మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దల చేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్య మని చెప్పెను.

22. ఆయన వాళ్ళతో, “మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన్ని తిరస్కరిస్తారు. ఆయన చంపబడి మూడవ రోజున బ్రతికింపబడతాడు” అని అన్నాడు.

23. మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.

23. ఆ తర్వాత వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా వెంట రావాలనుకొన్నవాడు తన కోరికల్ని చంపుకొని, తన సిలువను ప్రతిరోజు మోసుకొంటూ నన్ను అనుసరించాలి.

24. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించు కొనును.

24. తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకొన్నవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. కాని నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొంటాడు.

25. ఒకడు లోకమంతయు సంపాదించి, తన్ను తాను పోగొట్టు కొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము?

25. ప్రపంచాన్నంతా జయించి తనను పోగొట్టుకొని, తన జీవితాన్ని నాశనం చేసుకొంటే దానివల్ల కలిగే లాభమేమిటి?

26. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ద దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును.

26. నన్ను, నా సందేశాన్ని అంగీకరించటానికి సిగ్గుపడిన వాళ్ళ విషయంలో, మనుష్యకుమారుడు తన తేజస్సుతో, తండ్రి తేజస్సుతో, పవిత్రమైన దేవదూతల తేజస్సుతో వచ్చినప్పుడు సిగ్గుపడతాడు.

27. ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచిచూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాననెను.

27. ఇది నిజం. ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు దేవుని రాజ్యాన్ని చూడకుండా మరణించరు. “

28. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెని మిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను.

28. ఈ విధంగా చెప్పిన ఎనిమిది రోజులకు పేతురు, యోహాను, యాకోబును తన వెంట తీసుకొని ఒక కొండ మీదికి యేసు ప్రార్థించటానికి వెళ్ళాడు.

29. ఆయన ప్రార్థించు చుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను.

29. ఆయన ప్రార్థిస్తుండగా ఆయన ముఖతేజస్సు మారింది. ఆయన దుస్తులు తెల్లగా ప్రకాశించటం మొదలు పెట్టాయి.

30. మరియు ఇద్దరు పురుషులు ఆయ నతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అను వారు.

30. అకస్మాత్తుగా యిద్దరు వ్యక్తులు తేజస్సుతో యేసు ముందు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళు మోషే, ఏలీయాలు.

31. వారు మహిమతో అగపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడు చుండిరి.

31. యెరూషలేములో నెరవేర్చబడనున్న దైవేచ్ఛను గురించి, అంటే ఆయన మరణాన్ని గురించి, మాట్లాడారు.

32. పేతురును అతనితో కూడ ఉన్నవారును నిద్ర మత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను ఆయనతో కూడ నిలిచియున్న యిద్దరు పురు షులను చూచిరి.

32. పేతురు, అతని వెంటనున్న వాళ్ళు మంచి నిద్రమత్తులో ఉన్నారు. వాళ్ళకు మెలకువ వచ్చింది. వాళ్ళు లేచి యేసు తేజస్సును, ఆయనతో నిలుచొని ఉన్న ఆ యిద్దరి పురుషుల తేజస్సును చూసారు.

33. (ఆ యిద్దరు పురుషులు) ఆయనయొద్ద నుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణ శాలలు మేముకట్టుదుమని, తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను.

33. మోషే, ఏలీయాలు వెళ్తుండగా పేతురు యేసుతో, “ప్రభూ! మనము యిక్కడ ఉండటం మంచిది. మీకొకటి, మోషేకొకటి, ఏలీయా కొకటి మూడు పర్ణశాలలు వేయమంటారా? అని అడిగాడు. పరిస్థితి అర్థం చేసుకోకుండా అతడు ఈ మాటలు అన్నాడు.

34. అతడీలాగు మాటలాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను; వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి.

34. పేతురు ఈ మాట అంటుడగానే ఒక మేఘం వచ్చి వాళ్ళను కప్పివేసింది. వాళ్ళను ఆ మేఘం కప్పివేస్తుండగా పేతురుకు, అతనితో ఉన్న వాళ్ళకు భయం వేసింది.

35. మరియు ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.
ద్వితీయోపదేశకాండము 18:15, కీర్తనల గ్రంథము 2:7, యెషయా 42:1

35. ఆ మేఘం నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఎన్నుకొన్నవాడు. ఆయన చెప్పినట్లు చెయ్యండి” అని వినబడింది.

36. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియ జేయక వారు ఊరకుండిరి.

36. ఆ స్వరం మాట్లాడటం ముగించాక వాళ్ళకు అక్కడ యేసు మాత్రమే కనిపించాడు. చాలా కాలందాకా శిష్యులు తాము చూసిన దాన్ని ఎవ్వరికి చెప్పలేదు.

37. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను.

37. మరుసటి రోజు వాళ్ళు కొండ దిగగానే పెద్ద ప్రజల గుంపు ఒకటి యేసును చూడటానికి అక్కడ సమావేశమైంది.

38. ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నా కొక్కడే కుమారుడు.

38. ఆ గుంపులో నుండి ఒకడు, “అయ్యా! వచ్చి నా కుమారుణ్ణి కటాక్షించుమని వేడు కుంటున్నాను. నాకు ఒక్కడే కుమారుడు.

39. ఇదిగో ఒక దయ్యము వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును; నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడిం చుచు గాయపరచుచు వానిని వదలి వదల కుండును.

39. ఒక దయ్యం అతణ్ణి ఆవరిస్తుంది. అది మీదికి రాగానే అతడు బిగ్గరగా కేకలు వేస్తాడు. అది ఆతణ్ణి క్రింద పడవేస్తుంది. అతడు వణుకుతూ నోటినుండి నురుగులు కక్కుతాడు. అది అతణ్ణి వదలటం లేదు. అతణ్ణి పూర్తిగా నాశనం చేస్తొంది.

40. దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొఱ్ఱపెట్టుకొనెను.

40. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని మీ శిష్యుల్ని వేడుకున్నాను. కాని వాళ్ళు ఆ పని చెయ్యలేక పొయ్యారు” అని అన్నాడు.

41. అందుకు యేసు విశ్వాసములేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడ ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసికొని రమ్మని చెప్పెను.

41. యేసు, “మూర్ఖతరం వారలారా! విశ్వాస హీనులారా! మీతో ఉండి ఎన్ని రోజులు సహించాలి? నీ కుమారుణ్ణి పిలుచుకురా!” అని అన్నాడు.

42. వాడు వచ్చు చుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి, విలవిలలాడిం చెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థ పరచి వాని తండ్రి కప్పగించెను.

42. ఆ దయ్యం పట్టినవాడు వస్తూవుంటే అది అతణ్ణి నేల మీద పడవేసింది. యేసు ఆ దయ్యాన్ని వెళ్ళిపొమ్మని గద్దించి ఆ బాలునికి నయం చేశాడు. తదుపరి అతణ్ణి అతని తండ్రికి అప్పగించాడు.

43. గనుక అందరు దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి.

43. దేవుని మహిమ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. యేసు చేసింది చూసి వాళ్ళు తమ ఆశ్చర్యం నుండి కోలుకోక ముందే యేసు తన శిష్యులతో ఈ విధంగా అన్నాడు:

44. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్య పడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను.

44. “నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. మనుష్యకుమారుణ్ణి ఒక ద్రోహి యితర్లకు అప్పగిస్తాడు.”

45. అయితే వారామాట గ్రహింప కుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి.

45. వాళ్ళకు దీని అర్థం తెలియలేదు. వాళ్ళకు అర్థం కాకుండునట్లు రహస్యంగా ఉంచబడింది. దాన్ని గురించి అడగటానికి వాళ్ళకు ధైర్యం చాలలేదు.

46. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా

46. తమలో అందరికన్నా ఎవరు గొప్ప అన్న అంశంపై శిష్యుల మధ్య ఒక వాదం మొదలైంది.

47. యేసు వారి హృదయాలోచన ఎరిగి, ఒక చిన్న బిడ్డను తీసికొని తనయొద్ద నిలువబెట్టి.

47. యేసుకు వాళ్ళ ఆలోచనలు తెలిసిపోయాయి. ఆయన ఒక చిన్న పిల్లవాణ్ణి తీసుకొని తన ప్రక్కన నిలబెట్టుకొని

48. ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్ప వాడని వారితో చెప్పెను

48. వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా పేరిట ఈ పసివానిని అంగీకరిస్తే నన్ను అంగీకరించిన దానితో సమానము. నన్ను అంగీకరిస్తే నన్ను పంపిన వానిని అంగీకరించిన దానితో సమానము. మీలో అందరికన్నా తక్కువవాడు అందరికన్నా గొప్పవానితో సమానము”

49. యోహానుఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితివిు; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని చెప్పెను.

49. యోహాను, “అయ్యా! మీ పేరుతో ఒకడు దయ్యాల్ని వదిలిస్తున్నాడు. అతడు మన వాడు కాదు. కనుక అలా చెయ్యవద్దని అడ్డగించాము” అని అన్నాడు.

50. అందుకు యేసు మీరు వాని నాటంకపరచకుడి? మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను.

50. యేసు, “అతణ్ణి ఆపకండి. నాకు వ్యతిరేకంగా ఉండని వాడు నాకు అనుకూలంగా ఉన్న వానితో సమానము” అని అన్నాడు.

51. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు

51. ఆయన పరలోకానికి వెళ్ళే సమయం దగ్గర పడసాగింది. యేసు యెరూషలేము వెళ్ళాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు.

52. ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలె నని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని

52. తన దూతల్ని తనకన్నా ముందు పంపాడు. వాళ్ళు ఆయన కోసం అన్నీ సిద్దం చెయ్యాలని ఒక సమరయ పల్లెకు వెళా?్ళరు.

53. ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వా రాయనను చేర్చుకొనలేదు.

53. ఆ వూరి వాళ్ళు ఆయన యెరూషలేము వెళ్తుండటం వలన ఆయనకు స్వాగతమివ్వలేదు.

54. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా,
2 రాజులు 1:10

54. ఆయన శిష్యులలో యాకోబు, యోహాను యిది చూసి యేసుతో, “ప్రభూ! వాళ్ళను నాశనం చేయటానికి ఆకాశం నుండి అగ్ని రప్పించమంటారా?”‘ అని అడిగారు.

55. ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.

55. యేసు వాళ్ళవైపు చూసి వాళ్ళను గద్దించాడు.

56. అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి.

56. అక్కడి నుండి వాళ్ళంతా మరొక గ్రామానికి వెళా?్ళరు.

57. వారు మార్గమున వెళ్లుచుండగా ఒకడునీ వెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను.

57. వాళ్ళు దారిమీద నడుస్తుండగా ఒకడు యేసుతో, “మీరు ఎక్కడికి వెళ్తే నేనక్కడికి వస్తాను” అని అన్నాడు.

58. అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను.

58. యేసు, “నక్కలు నివసించటానికి బొరియలు ఉన్నాయి. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. కాని మనుష్యకుమారుడు తల వాల్చటానికి కూడా స్థలం లేదు” అని అన్నాడు.

59. ఆయన మరియొకనితో నా వెంటరమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను

59. యేసు యింకొకనితో, “నా వెంట రా!” అని అన్నాడు. కాని అతడు, “ప్రభూ! నేను వెళ్ళి ముందు నా తండ్రిని సమాధి చేసి రానివ్వండి!” అని అన్నాడు.

60. అందుకాయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్య మును ప్రకటించుమని వానితో చెప్పెను.

60. యేసు అతనితో, “చనిపోయిన వాళ్ళ సంగతి చనిపోయినవాళ్ళు చూసుకోనీ. నీవు వెళ్ళి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించు” అని అన్నాడు.

61. మరియొకడు ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా యింట నున్న వారియొద్ద సెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా
1 రాజులు 19:20

61. ఇంకొకడు, “ప్రభూ! నేను మిమ్మల్ని అనుసరిస్తాను. కాని ముందు వెళ్ళి నాయింటి వాళ్ళకు చెప్పి రానివ్వండి” అని అన్నాడు.

62. యేసునాగటి మీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పెను.

62. అందుకు యేసు, “దున్నుటకు నాగల్ని పట్టుకొని వెనక్కి తిరిగేవాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాడు” అని అతనితో చెప్పాడు. ఆ తర్వాత యేసు మరొక డెబ్బది మందిని నియమించాడు. వాళ్ళను జతలు



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Luke - లూకా సువార్త 9 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అపొస్తలులు పంపారు. (1-9) 
క్రీస్తు తన పన్నెండు మంది శిష్యులను ఒక మిషన్‌కు పంపాడు, ప్రభువు నుండి వారు పొందిన బోధనలను ఇతరులతో పంచుకోవడానికి వారిని సిద్ధం చేశాడు. వారు తమ బాహ్య రూపాలతో ప్రజలను ఆకట్టుకోవడంపై దృష్టి పెట్టకూడదని, వారు ఉన్నట్లుగా ముందుకు సాగాలని ఆయన ఉద్ఘాటించారు. శక్తి మరియు అధికారం యొక్క అంతిమ మూలం ప్రభువైన యేసు, మరియు అన్ని జీవులు, ఒక విధంగా లేదా మరొక విధంగా, ఆయనకు సమర్పించాలి. పాపులను సాతాను బారి నుండి విడిపించడానికి ఆయన తన దైవిక అధికారంతో తన పరిచారకులతో కలిసి వచ్చినప్పుడు, ఆయన వారి అవసరాలను తీరుస్తాడని వారు నమ్మకంతో ఉండవచ్చు. సత్యం మరియు ప్రేమ వారి సందేశంలో పెనవేసుకుని, ఇంకా దేవుని వాక్యం తిరస్కరించబడినప్పుడు మరియు అపహాస్యం చేయబడినప్పుడు, దానిని తిరస్కరించేవారికి వ్యతిరేకంగా సాక్ష్యంగా పనిచేస్తుంది మరియు వారిని క్షమించకుండా వదిలివేస్తుంది.
హేరోదు, తన అపరాధ మనస్సాక్షితో బాధపడుతూ, యోహాను మృతులలోనుండి లేచి ఉండవచ్చని కూడా ఊహించాడు. అతను యేసును చూడాలనుకున్నాడు కానీ గర్వం కారణంగా లేదా అతని పాపాలకు మరింత మందలించకుండా ఉండాలనే కోరిక కారణంగా అలా చేయడం మానేశాడు. అతను ఆలస్యం చేయడంతో, అతని హృదయం గట్టిపడింది, చివరకు అతను యేసును ఎదుర్కొన్నప్పుడు, లూకా 23:11లో చూసినట్లుగా, ఇతరులవలే ఆయన పట్ల పక్షపాతంతో ఉన్నాడు.

సమూహం అద్భుతంగా తినిపించింది. (10-17) 
జనసమూహం యేసును వెంబడించారు, అసౌకర్య సమయంలో వచ్చారు, అయినప్పటికీ వారు కోరిన వాటిని ఆయన దయతో వారికి అందించాడు. అతను దేవుని రాజ్యం గురించి వారితో మాట్లాడాడు మరియు స్వస్థత అవసరమైన వారిని స్వస్థపరిచాడు. కేవలం ఐదు రొట్టెలు మరియు రెండు చేపలతో, క్రీస్తు అద్భుతంగా ఐదు వేల మందికి ఆహారం ఇచ్చాడు. తనకు భయపడి, నమ్మకంగా సేవించే వారికి ఏమీ లోటు లేకుండా చూస్తాడు. మనం భౌతిక సుఖాలను పొందినప్పుడు, మనం దేవుడిని మూలంగా గుర్తించాలి మరియు మన అనర్హతను గుర్తించాలి. మేము ఆయనకు ప్రతిదానికీ రుణపడి ఉంటాము మరియు శాపాన్ని తొలగించే క్రీస్తు మధ్యవర్తిత్వానికి మన సౌలభ్యం ఆపాదించబడింది. క్రీస్తు ఆశీర్వాదం కొంచెం దూరం వెళ్ళేలా చేస్తుంది, ఆకలితో ఉన్న ప్రతి ఆత్మను అతని ఇంటి మంచితనంతో సంతృప్తిపరుస్తుంది. మా నాన్న ఇంట్లో ఉన్న సమృద్ధిని వివరిస్తూ మిగిలిపోయినవి కూడా సేకరించబడ్డాయి. క్రీస్తులో, మనం ఎన్నటికీ పరిమితం కాదు లేదా లోపము లేదు.

క్రీస్తుకు పీటర్ యొక్క సాక్ష్యం, స్వీయ-తిరస్కరణ ఆజ్ఞాపించింది. (18-27) 
అపారమైన ఓదార్పు మన ప్రభువైన యేసు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అనే వాస్తవంలో ఉంది. అతను మెస్సీయగా మాత్రమే కాకుండా ఈ పాత్రకు పూర్తిగా సన్నద్ధమయ్యాడని ఇది సూచిస్తుంది. యేసు తన స్వంత బాధలను మరియు మరణాన్ని చర్చిస్తున్నాడు. అతని బాధలను నివారించడానికి మార్గాల గురించి ఆలోచించే బదులు, అతని శిష్యులు వారి స్వంత సవాళ్లకు సిద్ధంగా ఉండాలి. మన విధులను నిర్వర్తించేటప్పుడు మనం తరచుగా పరీక్షలను ఎదుర్కొంటాము మరియు మనం వాటిని ఉద్దేశపూర్వకంగా వెతకకూడదు, అవి మనకు అందించబడినప్పుడు, మనం వాటిని భరించాలి మరియు క్రీస్తు అడుగుజాడల్లో నడవాలి. మన శ్రేయస్సు మన ఆత్మల స్థితి ద్వారా నిర్ణయించబడుతుంది; మరణానంతర జీవితంలో ఒక దయనీయమైన ఆత్మ ఈ ప్రపంచంలో ఆరోగ్యకరమైన శరీరంలో ఆనందాన్ని పొందదు. ఏది ఏమయినప్పటికీ, శరీరం చాలా భారంగా మరియు బాధలో ఉన్నప్పుడు కూడా సంతోషకరమైన ఆత్మ ఇంకా వృద్ధి చెందుతుంది. క్రీస్తు మరియు అతని సువార్త కొరకు నిలబడటానికి మనం ఎన్నటికీ వెనుకాడకూడదు.

రూపాంతరం. (28-36) 
క్రీస్తు రూపాంతరం ప్రపంచాన్ని తీర్పు తీర్చడానికి తిరిగి వచ్చే మహిమ యొక్క సంగ్రహావలోకనం అందించింది. ఇది అతని శిష్యులకు అతని కొరకు బాధలను భరించడానికి ప్రోత్సాహకరంగా పనిచేసింది. ప్రార్థన అనేది ఒక ప్రకాశవంతమైన ముఖాన్ని ప్రసరింపజేసే పరివర్తన, రూపాంతరం చేసే విధి. తన రూపాంతరం సమయంలో కూడా, మన ప్రభువైన యేసు తన రాబోయే మరణం మరియు బాధలను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన గొప్ప భూసంబంధమైన విజయాలను అనుభవించినప్పుడు, ఈ ప్రపంచంలో మనకు శాశ్వత నివాసం లేదని గుర్తుంచుకోండి. మన ఆత్మలను పునరుజ్జీవింపజేసే మరియు మనల్ని సజీవంగా చేసే కృప కోసం మనం హృదయపూర్వకంగా ప్రార్థించాలి. శిష్యులు చివరికి ఈ స్వర్గపు చిహ్నాన్ని చూసేందుకు మేల్కొన్నారు, సంఘటనల యొక్క వివరణాత్మక ఖాతాను అందించడానికి వారిని అనుమతించారు. అయితే, పరలోకంలో మహిమపరచబడిన పరిశుద్ధుల కోసం భూసంబంధమైన గుడారాలను నిర్మించడం గురించి చర్చించే వారు వారి మాటల పరిమాణాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు.

ఒక దుష్టాత్మ తరిమివేయబడింది. (37-42) 
ఈ పిల్లవాడి పరిస్థితి ఎంత బాధాకరమో! అతను దుష్టశక్తితో బాధపడ్డాడు మరియు ఈ రకమైన అనారోగ్యాలు పూర్తిగా సహజ కారణాల వల్ల వచ్చే వాటి కంటే చాలా భయంకరమైనవి. సాతాను తన నియంత్రణను పొందినప్పుడు నాశనం చేయగల నాశనాన్ని చూడటం నిజంగా ఆందోళనకరం. అయితే, క్రీస్తును సమీపించే అవకాశం ఉన్నవారు నిజంగా అదృష్టవంతులు. తన శిష్యులు కూడా చేయలేని వాటిని ఆయన మనకోసం సాధించగలడు. క్రీస్తు నుండి వచ్చిన ఒక్క మాట బిడ్డకు స్వస్థత చేకూర్చింది మరియు మన స్వంత పిల్లలు అనారోగ్యం నుండి కోలుకున్నప్పుడు, వారు క్రీస్తు హస్త స్పర్శతో స్వస్థత పొందినట్లు వారిని స్వీకరించడం గొప్ప ఓదార్పునిస్తుంది.

క్రీస్తు తన శిష్యుల ఆశయాన్ని తనిఖీ చేస్తాడు. (43-50) 
క్రీస్తు రాబోయే బాధల అంచనా చాలా స్పష్టంగా ఉంది, కానీ శిష్యులు దానిని గ్రహించడంలో విఫలమయ్యారు ఎందుకంటే అది వారి ముందస్తు ఆలోచనలతో సరిపెట్టలేదు. సరళత మరియు వినయం యొక్క సూత్రాలను వివరించడానికి క్రీస్తు చిన్న పిల్లల చిత్రాన్ని ఉపయోగించాడు. దేవుడు మరియు క్రీస్తు యొక్క దూతగా ప్రజలచే గుర్తించబడటం మరియు దేవుడు మరియు క్రీస్తు తమను తాము స్వీకరించినట్లు మరియు వారి ద్వారా స్వాగతించబడినట్లు గుర్తించడం కంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఏ గొప్ప గౌరవాన్ని సాధించగలరు! ఈ భూమ్మీద ఉన్న క్రైస్తవులలో ఏదైనా సమూహం తమ స్వంత విశ్వాసం లేని వారిని మినహాయించడానికి ఎప్పుడైనా కారణం ఉన్నప్పటికీ, పన్నెండు మంది శిష్యులు, ఆ సమయంలో, బలవంతపు ఒకదాన్ని కలిగి ఉన్నారు. అయినప్పటికీ, అలాంటి చర్యలను పునరావృతం చేయవద్దని క్రీస్తు వారిని హెచ్చరించాడు. క్రీస్తుకు నమ్మకమైన అనుచరులమని నిరూపించుకుని, ఆయన అంగీకారాన్ని పొందే వారు మనలాగే అదే మార్గంలో నడవాల్సిన అవసరం లేదు.

అతను వారి తప్పు ఉత్సాహాన్ని ఖండించాడు. (51-56) 
సమరయుల ప్రవర్తన ప్రాథమికంగా జాతీయ పక్షపాతాలు మరియు దేవుని పదం మరియు ఆరాధన పట్ల ప్రత్యక్ష శత్రుత్వం కంటే అసహనంతో ముడిపడి ఉందని శిష్యులు గుర్తించలేకపోయారు. క్రీస్తును మరియు ఆయన శిష్యులను స్వీకరించడానికి వారు నిరాకరించినప్పటికీ, వారు వారితో దుర్మార్గంగా ప్రవర్తించలేదు లేదా హాని చేయలేదు, వారి పరిస్థితిని అహజ్యా మరియు ఎలిజాల నుండి భిన్నంగా చేసింది. ఇంకా, సువార్త యుగం దయగల అద్భుతాల ద్వారా వర్గీకరించబడిందని వారికి తెలియదు. చాలా ముఖ్యమైనది, వారు తమ స్వంత హృదయాలలో ఉన్న ఆధిపత్య ప్రేరణలను విస్మరించారు, అవి గర్వం మరియు ప్రాపంచిక ఆశయం. దీని గురించి యేసు వారిని హెచ్చరించాడు. "ప్రభువు కోసం మన ఉత్సాహాన్ని చూసి రండి!" అని ప్రకటించడం మనకు చాలా సులభం. వాస్తవానికి, మనం మన వ్యక్తిగత ప్రయోజనాలను అనుసరిస్తూ మరియు అనుకోకుండా మంచి చేయడానికి బదులుగా ఇతరులకు హాని కలిగిస్తున్నప్పుడు మనం అతని కారణానికి అనూహ్యంగా నమ్మకంగా ఉన్నామని పొరపాటుగా నమ్ముతున్నాము.

క్రీస్తు కొరకు ప్రతి వస్తువును వదులుకోవాలి. (57-62)
ఇక్కడ మనకు ఒక వ్యక్తి క్రీస్తుని అనుసరించడానికి ఆసక్తిని కలిగి ఉన్నాడు, కానీ పూర్తి చిక్కులను పరిగణనలోకి తీసుకోకుండా తొందరపాటుతో వ్యవహరించినట్లు కనిపిస్తాడు. మనం క్రీస్తుని అనుసరించాలని అనుకుంటే, ప్రాపంచిక విజయం కోసం ఆశయాలను పక్కన పెట్టాలి. మన క్రైస్తవ విశ్వాసాన్ని భౌతిక లాభాల సాధనతో కలపడానికి మనం ప్రయత్నించకూడదు. అప్పుడు, క్రీస్తును అనుసరించాలని నిశ్చయించుకున్న మరొక వ్యక్తిని మనం కలుస్తాము, కానీ కొద్దిసేపు ఆలస్యం చేయమని కోరతాడు. క్రీస్తు మొదట్లో ఈ వ్యక్తికి పిలుపునిచ్చాడు, "నన్ను అనుసరించు" అని చెప్పాడు. మతం మనకు దయగా మరియు సద్గుణంగా ఉండాలని, మన ఇళ్లలో భక్తిని ప్రదర్శించాలని మరియు మన తల్లిదండ్రులను గౌరవించాలని బోధిస్తున్నప్పటికీ, దేవుని పట్ల మన కర్తవ్యాన్ని విస్మరించడానికి వీటిని సాకులుగా ఉపయోగించకూడదు.
తరువాతి సందర్భంలో, క్రీస్తును అనుసరించడానికి ఇష్టపడే వ్యక్తిని మనం చూస్తాము, అయితే కుటుంబ సభ్యులతో సంప్రదించి ఇంటి వ్యవహారాలను నిర్వహించడానికి కొంత సమయం కోరుతుంది. అతను ప్రాపంచిక ఆందోళనలతో ఎక్కువగా నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తుంది, క్రీస్తును అనుసరించాలనే అతని నిబద్ధత నుండి అతన్ని మళ్లించే అవకాశం ఉంది. ఇతర విషయాలలో పరధ్యానంలో ఉంటే దేవుని పనిని సమర్థవంతంగా నిర్వహించలేరు. దేవుణ్ణి సేవించే మార్గాన్ని ప్రారంభించేవారు పట్టుదలతో ఉండాలని నిర్ణయించుకోవాలి, ఎందుకంటే వెనక్కి తిరిగి చూడటం తిరోగమనానికి దారితీస్తుంది మరియు తిరోగమనం ఆధ్యాత్మిక నాశనానికి దారితీస్తుంది. చివరి వరకు సహించే వారికే మోక్షం లభిస్తుంది.



Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |