Matthew - మత్తయి సువార్త 11 | View All

1. యేసు తన పండ్రెండుమంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడనుండి వెళ్లిపోయెను.

2. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా, మేము మరి యొకనికొరకు కనిపెట్టవలెనా?

గలలీ పెరయ ప్రాంతాల పరిపాలకుడైన హేరోదు బాప్తిసం ఇచ్చే యోహానును చెరసాలలో పెట్టించాడు.

3. అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను.
మలాకీ 3:1

“రావలసినవాడవు”– అంటే యూదులు ఎదురు చూస్తున్న అభిషిక్తుడు (మత్తయి 1:1) అని అర్థం. యోహాను నమ్మకం స్థిరమైనది, పటిష్ఠమైనది (యోహాను 1:26-34; యోహాను 3:27-36). అయితే నెలల తరబడి అతడు చెరసాలలో ఉన్నాడు. అభిషిక్తుడు ఎలాంటి చర్యలు తీసుకుంటాడని చాలామంది భావించారో ఆ విధంగా యేసు ప్రవర్తించలేదు. యేసు ఇస్రాయేల్ సింహాసనం ఎక్కలేదు, రోమ్ వారిని తరిమికొట్టి, యూదులకు స్వేచ్ఛనూ, శాంతి సౌభాగ్యాలనూ సమకూర్చలేదు. అభిషిక్తుడు ఇలాంటి పనులు చేస్తాడన్నది యూదుల్లో సాధారణంగా ఉన్న నమ్మకం. యెషయా 9:6-7; యెషయా 11:1-16 మొ।। పోల్చి చూడండి. యోహాను 3:11-15 లో యోహాను స్వయంగా చెప్పిన మాటలు చూడండి. యోహానుకు (లేక బహుశా యోహాను శిష్యులకు మాత్రమే) ప్రోత్సాహాన్నీ, నమ్మకాన్నీ బలపరచడం అవసరమేమో. తరువాతి వచనాల్లో యేసుప్రభువు తన మాటల ద్వారా అలా చేస్తున్నాడు.

4. యేసు వారిని చూచి మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి.

వాగ్దానం చేయబడిన అభిషిక్తుడు చేయవలసిన పనులు తాను చేస్తున్నానని యేసు అంటున్నాడు (యెషయా 29:18; యెషయా 35:5-6; యెషయా 61:1). యోహాను ఊహించిన విధంగా కార్యక్రమం జరగడం లేదన్న కారణం వల్ల అతడు యేసును సందేహించకూడదని అంటున్నాడు. యోహాను ఈ మాటలు చక్కగా అర్థం చేసుకుని ఉండివుంటాడు.

5. గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.
యెషయా 29:18, యెషయా 35:5-6, యెషయా 42:18, యెషయా 61:1

6. మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తర మిచ్చెను.

మత్తయి 5:3-11 లో ఉన్నవాటికి జత చేసేందుకు ఇక్కడ మరో “ధన్యత” ఉంది. మత్తయి 13:16; మత్తయి 16:17; మత్తయి 24:46; మత్తయి 25:34; లూకా 1:45; లూకా 11:28; యోహాను 20:29; ప్రకటన గ్రంథం 1:3; ప్రకటన గ్రంథం 14:13; ప్రకటన గ్రంథం 16:15; ప్రకటన గ్రంథం 19:9; ప్రకటన గ్రంథం 20:6; ప్రకటన గ్రంథం 22:7, ప్రకటన గ్రంథం 22:14 కూడా చూడండి. “ధన్యులు” అనే విషయంపై పాత ఒడంబడికలో నోట్స్ ఆదికాండము 12:1-3; సంఖ్యాకాండము 6:22-27; కీర్తనల గ్రంథము 1:1; కీర్తనల గ్రంథము 119:1 చూడండి. “అభ్యంతరం లేనివాడు”– తడబాటు చెందనివాడు అని కూడా అనువదించవచ్చు.

7. వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహానునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలు చున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి?

8. సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా.

9. మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.

“ప్రవక్త” ను గురించి ఆదికాండము 20:11 నోట్ చూడండి.

10. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధ పరచును.
నిర్గమకాండము 23:20, మలాకీ 3:1

మలాకీ 3:1. యెషయా 40:3 కూడా చూడండి.

11. స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైన వాడు అతనికంటె గొప్పవాడు.

యోహాను గొప్పవాడు అయినప్పటికీ ధర్మశాస్త్రం కింద పాత క్రమానికే కట్టుబడి ఉన్నాడు. యేసుప్రభువు దేవుని ఆధ్యాత్మిక రాజ్యమైన ఒక నూతన క్రమాన్ని తెచ్చాడు. ఈ రాజ్యంలోని అత్యల్పుడు యోహానుకన్నా అంటే గుణంలోనూ, చర్యల్లోనూ గొప్పవాడు కాకపోయినా, స్థితి, స్థానాల్లోనూ, విశేషమైన అవకాశాల్లోనూ అధికుడే. యోహాను 3:28-30 పోల్చి చూడండి. అక్కడ యోహాను వరుణ్ణి గురించి (క్రీస్తు), వధువు గురించి (దేవుని రాజ్యంలోనివారు), వరుని స్నేహితుని గురించి (తాను) మాట్లాడాడు. స్నేహితుడి కన్నా వధువుకే ఎక్కువ ఆధిక్యతలున్నాయి అనేది స్పష్టమే కదా.

12. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు.

మనుషులు పశ్చాత్తాపపడి, దేవుని రాజ్యంలో ప్రవేశించేందుకు ఆసక్తితో ప్రయత్నించడానికి వారిని పురికొల్పేందుకు బాప్తిసమిచ్చే యోహాను తన జీవితం, ఉపదేశాల మూలంగా దేవునికి ఉపయోగపడిన శక్తిగల పరికరం. ఎన్ని కష్టనష్టాలకు ఓర్చి అయినా అందులో ప్రవేశించడానికి గట్టి నిశ్చయం గలవారే అలా ప్రవేశించగలిగారు. ఇప్పటికీ ఈ పరిస్థితిలో తేడా ఏమైనా ఉందా? అజాగ్రత్తగా ఉన్నవారు, కేవలం బయటి మతాచారాలతో తృప్తిపడి ఊరుకునేవారు, దేవుని రాజ్యం గురించి బలవంతమైన పట్టుదల లేనివారు దాన్లోకి ఎన్నడూ ప్రవేశించలేరు. దేవుడు మనుషులను తన రాజ్యంలోకి తీసుకువచ్చినప్పుడు వారు దాన్ని ప్రాణప్రదంగా కోరుకునేలా చేస్తాడాయన.

13. యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుం డెను.

“ధర్మశాస్త్రమూ, ప్రవక్తలందరూ”అంటే పాత ఒడంబడిక గ్రంథం మొత్తం. సుదీర్ఘమైన అలాంటి ప్రవక్తల పరంపరలో యోహాను ఆఖరువాడు, కొత్త యుగానికి దేవుని రాయబారి.

14. ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.
మలాకీ 4:5

యోహాను ఏలీయా కాదు (యోహాను 1:19-21) గానీ ఏలీయా మనసుతో, బలప్రభావాలతో వచ్చాడు (లూకా 1:17). ఈ వచనంలోని మాటలను జాగ్రత్తగా పరిశీలించండి. అంగీకరించాలనే మనసు వారికుంటేనే రావలసిన ఏలీయాయే ఈ యోహాను (మలాకీ 4:5). అయితే మొత్తం మీద ప్రజలకు దీన్ని అంగీకరించాలని లేదు. దీన్ని యేసు 16-19 వచనాల్లో స్పష్టంగా చెప్పాడు. అందువల్ల రావలసిన ఏలీయా యోహాను కాదు. మత్తయి 17:11 లో ఏలీయా ఇంకా రావలసి ఉందనీ, వచ్చి అన్నిటినీ చక్కపరుస్తాడనీ చెప్పాడు. అయితే అన్నీ చక్కబడాలని ప్రజలకు, వారి నాయకులకు ఇష్టం లేకపోవడంవల్ల యోహాను అలా చేయలేకపోయాడు.

15. వినుటకు చెవులుగలవాడు వినుగాక.

మత్తయి 13:9 చూడండి.

16. ఈ తరమువారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి

ఆ కాలంలో మనుషులు (యేసు బహుశా పరిసయ్యులు, సద్దూకయ్యుల గురించి మాట్లాడుతున్నాడు) పెళ్ళి, భూస్థాపన ఆటలు ఆడుకునే చిలిపి పిల్లల్లాగా ఉన్నారు. వారి పాటకు యోహాను నాట్యం చేయడనీ, తాము కోరితే యేసు ఏడవడనీ వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు. వారు దేవుని సందేశాన్ని, దాన్ని తెచ్చినవారిని స్వీకరించలేదు. ప్రతిదాన్నీ వారు నిరాకరించారు. ఏదీ వారికి సంతోషం కలిగించలేదు. ఇలాంటివారు మతాన్ని ఆట వస్తువుగా భావిస్తారు. వారి అంతరంగంలో యథార్థత లేదు. దేవుని మనిషి భోజనం చేస్తే అది వారికి ఆనందం కలిగించదు. చెయ్యక పోయినా వారికి ఆనందం లేదు. మనుషులందరిలోకీ మహనీయుడని యేసు వర్ణించిన వ్యక్తిని గురించి, అసలు ప్రభువును గురించీ వాళ్ళు ఎలాంటి మాటలన్నారో చూడండి.

17. మీకు పిల్లనగ్రోవి ఊదితివిుగాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్ల కాయలను పోలియున్నారు.

18. యోహాను తినకయు త్రాగకయువచ్చెను. గనుకవీడు దయ్యముపట్టిన వాడని వారనుచున్నారు.

తరువాత యేసుప్రభువు విషయంలో కూడా ఇదే మాట అన్నారు (యోహాను 8:48).

19. మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్య పానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందుననెను.

మత్తయి 9:11-13; రోమీయులకు 5:8 చూడండి. పాపంలో మునిగి నశించినవారి పట్ల యేసుప్రభువు ప్రేమ చూపకపోతే ఎవరికీ ఆశాభావానికి ఎలాంటి నిజమైన ఆధారం ఉండేది కాదు. వీరి నేరారోపణను సరైన రీతిలో గనుక అర్థం చేసుకుంటే అది పాపుల పాలిట రక్షకుడుగా యేసుప్రభువును అమితంగా మెచ్చుకున్నట్టు లెక్కలోకి వస్తుంది. యోహానును, యేసు ప్రభువును పంపడంలో దేవుని జ్ఞానమూ, వీరిద్దరూ తమ పరిచర్యలో కనపరచిన జ్ఞానమూ, వారు సాధించిన ఫలితాలను బట్టే అర్థం అవుతున్నది. బుద్ధిలేని మనుషుల ఫిర్యాదులెన్నైనా దాన్ని మార్చలేవు.

20. పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను.

యేసుప్రభువు ఉపదేశాల్లోని ఒక మూలాంశం, ఆయన సాధించదలచుకున్న ఫలితం పశ్చాత్తాపమే – మత్తయి 4:17. మత్తయి 3:2; లూకా 13:1-5 చూడండి. అది లేకపోతే ఆయన చేసిన అద్భుతాలూ, ఉపదేశాలూ ప్రజలపై ఎలాంటి శాశ్వత ప్రభావమూ చూపలేకపోయేవి. భయంకరమైన వ్యాధిని వదిలించుకోగలగడం మంచిదే గానీ క్రీస్తు పాదాల చెంత పశ్చాత్తాప పడడం మరింత మంచిది. దేవుని మహిమాన్విత బలప్రభావాల ప్రదర్శనాన్ని చూడగలగడం మంచిదే గానీ పాపంనుంచి మళ్ళుకుని ఆయనిచ్చే విముక్తిని పొందడం మరింత మేలు.

21. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొంది యుందురు.
Ester 4 1:1, యెషయా 23:1-8, యోవేలు 3:4-8, ఆమోసు 1:9-10, యోనా 3:6, జెకర్యా 9:2-4

కొరజీను, బేత్‌సయిదా అనే ఊళ్ళు గలలీ ప్రాంతంలో కపెర్నెహూం దగ్గర ఉన్నాయి. తూరు, సీదోను ఇస్రాయేల్‌కు ఉత్తరాన మధ్యధరా సముద్ర తీరాన ప్రఖ్యాతి చెందిన పురాతన నగరాలు. అవి విగ్రహ పూజ, అత్యాశ నిండివున్న ఇతర జాతులవారి నగరాలు. దేవుడు వాటిని శిక్షించాడు. యెషయా 23:1-5; యెహెఙ్కేలు 26:1-21; ఆమోసు 1:9-10 చూడండి. “గోనెపట్టలు, బూడిద”– వారు తీవ్ర శోకంతో పశ్చాత్తాపపడి ఉండేవారని సూచించేందుకు చెప్పిన మాటలు. యేసుప్రభువు స్వంత ప్రజలైన ఇస్రాయేల్‌వారి ఊళ్ళకంటే విగ్రహ పూజ చేసే ఇతర జనాలుండే నగరాలే ఆయన్ను మరింత బాగా స్వీకరించి ఉంటాయి. యోహాను 1:11 పోల్చిచూడండి.

22. విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
యెషయా 23:1-8, ఆమోసు 1:9-10, జెకర్యా 9:2-4

మత్తయి 10:15 నోట్.

23. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును.
ఆదికాండము 19:24-28, యెషయా 14:13, యెషయా 14:15

“కపెర్‌నహూం”– మత్తయి 4:13. వారికి గొప్ప అవకాశాలున్నాయి. సాక్షాత్తూ దేవుని కుమారుడే అక్కడ నివసించాడు. “సొదొమ”– మత్తయి 10:15. ఎక్కువ భాగం యేసు పరిచర్య చేసిన పట్టణాల్లోని ప్రజలే దుర్మార్గతకు మారుపేరైన వెనుకటి భ్రష్ట నగరవాసుల కన్న కఠిన హృదయులు.

24. విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.

25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.

మనుషులు యేసుప్రభువును చులకనగా చూచి నిరాకరించినప్పటికీ దేవుణ్ణి ప్రస్తుతించడానికి ఆయనకు కారణాలెన్నో దొరికాయి. ఇక్కడ మనుషుల పట్ల ఆయన జ్ఞాన యుక్తంగా వ్యవహరించిన సంగతిని బట్టి ఆయన్ను కీర్తిస్తున్నాడు. లోకం విద్యావంతులుగా జ్ఞానవంతులుగా ఎంచే వారిని (లేక తాము జ్ఞానవంతులం అనుకునే వారిని), అంటే పరిసయ్యులు, ధర్మశాస్త్రుల లాంటివారిని దేవుడు పట్టించుకోడు. వినయం గలవారిని, చిన్న పిల్లల్లాంటి సామాన్యులను, అనామకులను ఆయన ఎన్నుకుని తన సత్యాన్ని వారికి వెల్లడిస్తాడు. మత్తయి 18:3; 1 కోరింథీయులకు 1:19-29; యాకోబు 2:5 పోల్చి చూడండి. నేర్పడానికి అనువైన పిల్ల, అణకువ గల పిల్లవాడు, తమ బుద్ధిని గురించి గర్వించే గొప్ప మేధావుల కన్నా క్రీస్తు సత్యాన్ని మరింత బాగా నేర్చుకోగలరు. దేవుని సత్యాన్ని నేర్చుకోవాలంటే దేవుడు మన మనస్సులను వెలిగించి మన హృదయాల్లో దాన్ని ప్రకాశింపజేయాలి. లూకా 24:45; యోహాను 16:13; 2 కోరింథీయులకు 4:5; ఎఫెసీయులకు 1:17-18 పోల్చి చూడండి.

26. అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.

దేనికైనా సరే చక్కగా సరిపోయే మంచి కారణం ఇదే. రోమీయులకు 11:36; రోమీయులకు 12:2; ఎఫెసీయులకు 1:9, ఎఫెసీయులకు 1:11 పోల్చి చూడండి.

27. సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారు డెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
సామెతలు 30:4

మానవ మాత్రుడు, కేవలం ప్రవక్త అయినవాడు ఎవరూ నిజంగా ఇలాంటి మాటలు పలకలేరు. యేసు తాను మానవ రూపంలో ఉన్న దేవుణ్ణని చెప్పిన అతి స్పష్టమైన రుజువు ఇది. దీన్ని గురించి ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీయులకు 2:6; లూకా 2:11 నోట్స్‌లో చూడండి. “అప్ప చెప్పాడు”– మత్తయి 28:18; యోహాను 3:35; యోహాను 5:19-27. “కుమారుడు”– మత్తయి 3:16-17; యోహాను 3:16; యోహాను 5:18-23. “తెలుసు”– దేవునికి ఉన్న జ్ఞానం గురించి యేసు చెప్తున్న దాన్ని శ్రద్ధతో గమనించండి. యేసుప్రభువును పూర్తిగా ఎరిగినది తండ్రి అయిన దేవుడొక్కడే. ఆయన మార్గాలన్నీ, ఆయన స్వభావం, లక్షణాలు పూర్తిగా తెలిసి ఉన్నది ఒక్క తండ్రికే. ఏ మనిషీ యేసుప్రభువును పూర్తిగా అర్థం చేసుకోలేడు. అలాగే ఒక్క యేసుప్రభువుకే తండ్రి అయిన దేవుడు పూర్తిగా తెలుసు. అమితుడూ శాశ్వతుడూ అయిన దేవుడు ఆయనకు మాత్రమే పరిపూర్ణంగా, మొత్తంగా తెలుసు. ఎందుకంటే వారిద్దరూ అనంత కాలం నుంచి ఒకే స్వభావంలో భాగస్వాములు (యోహాను 1:1, యోహాను 1:14; యోహాను 10:30; యోహాను 14:9; యోహాను 17:5; ఫిలిప్పీయులకు 2:6; హెబ్రీయులకు 1:3). దేవుణ్ణి మనుషులకు వెల్లడి చేయగలవాడు యేసుప్రభువొక్కడే. కొంతవరకైనా అలాంటి జ్ఞానాన్ని మనుషులు సంపాదించుకోగలిగేది ఆయనద్వారా మాత్రమే (యోహాను 14:6; యోహాను 17:2-3; 1 యోహాను 5:20). యేసు మనస్సుకూ, హృదయానికీ కలిగే నిజమైన గ్రహింపు గురించి మాట్లాడుతున్నాడు (వ 25). ఇది దేవుణ్ణి నేరుగా వ్యక్తిగతంగా తెలుసుకోవడం. యేసు పైన చెప్పినదంతా సత్యమన్నా అయి ఉండాలి. లేదా అహంకార పూరితమైన వట్టి మాటలు, లేక భయంకరమైన ఆత్మ వంచనన్నా అయి ఉండాలి. సాక్ష్యాధారాలన్నీ రుజువులన్నీ యేసు సత్యమే చెప్పాడని తెలియజేస్తున్నాయి. ఈ వచనం కన్నా మరింత స్పష్టంగా యేసుప్రభువు యొక్క పరిపూర్ణ దేవత్వాన్ని సూచించే వచనం బైబిలంతటిలో వేరొకటి లేదు. యేసు ఇక్కడ దేవుని విషయమైన జ్ఞానం గురించి చెప్పినదానికీ అద్వైత వేదాంతానికి ఎలాంటి సంబంధమూ లేదని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి ఈ రెండూ ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం.

28. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
యిర్మియా 31:25

యేసు తాను తండ్రిని ఎవరికి, ఎలా వెల్లడి చేస్తాడో ఇక్కడ చెప్తున్నాడు. తమ భారాలను, ముఖ్యంగా తమ పాపాల బరువును అనుభవిస్తూ ఆయన దగ్గరికి వచ్చినవారికి, ఆయనతో ఏకం అయ్యేందుకు సమ్మతించినవారికి, ఆయన ఉపదేశాన్ని వినయంగా, సాధుగుణంతో నేర్చుకోవాలని ఉన్నవారికి ఆయన తండ్రిని వెల్లడి చేస్తాడు. కేవలం ఇలాంటివారు మాత్రమే ఏకైక సత్య దేవుణ్ణి తెలుసుకో గలుగుతారు. ఆయన అలాంటివారికి వాగ్దానం చేసేదేమిటో చూడండి – విశ్రాంతి, స్వంత ప్రయత్నాల నుంచీ, వ్యర్థంగా వెదకులాడడం నుంచీ, ఆశాభావం కరువైన, పాపం నిండిన శూన్య జీవితం నుంచీ విశ్రాంతినిస్తాడు. ఇది కష్టాలనుంచి విశ్రాంతి కాదు గాని కష్టాల్లో విశ్రాంతి. యోహాను 16:33 పోల్చి చూడండి.

29. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
యిర్మియా 6:16

30. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

యోహాను 5:3 పోల్చి చూడండి. నమ్మకం, విధేయత, ప్రేమ, మనతో ఆయన సన్నిధి ఇవే ఆయన కాడిని మృదువుగా, ఆయన భారాన్ని తేలికగా చేసేవి. ధర్మశాస్త్రంలోని నియమాలను, శాసనాలను గురించి చెప్తున్న అపో. కార్యములు 15:10 పోల్చి చూడండి. క్రీస్తుతో కలిసి కాడిని భుజానికి ఎత్తుకుంటే మనకు విడుదల, విముక్తి, శాంతి లభిస్తాయి. ఆయన కాడి కృపే గాని ధర్మశాస్త్రం కాదు, ఆయన బలప్రభావాలే గాని మన స్వప్రయత్నాలు కాదు. ఆయన దగ్గర వినయంతో నేర్చుకుంటూ ఉంటే దేవుణ్ణి గురించి క్రమంగా మరింత వివరంగా నేర్చుకోగలం. ఉపదేశకుడూ, ఉపదేశం రెండూ క్రీస్తే. క్రీస్తుతో కలిసి కాడి మోయడమంటే పరిపూర్ణమైన సానుభూతి, దయ, కృప, ప్రేమ ఉన్నవాడితో ఐక్యం కావడమే. ఇలాంటిది భారం ఎలా అవుతుంది?



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 11 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

క్రీస్తు బోధ. (1) 
మన దైవిక విమోచకుడు తన ప్రేమపూర్వకమైన పనితో ఎన్నడూ విసిగిపోలేదు మరియు మనం కూడా మంచి చేయడంలో పట్టుదలతో ఉండాలి, మనం హృదయాన్ని కోల్పోకపోతే తగిన సమయంలో ప్రతిఫలాన్ని పొందుతాము.

యోహాను శిష్యులకు క్రీస్తు సమాధానం. (2-6) 
యోహాను తన స్వంత హామీ కోసం ఈ విచారణను పంపాడని కొందరు నమ్ముతారు. నిజమైన విశ్వాసం ఉన్నప్పటికీ, సందేహం అప్పుడప్పుడు లోపలికి రావచ్చు. మంచి వ్యక్తుల హృదయాలలో ఉండే సందేహం, కొన్ని సమయాల్లో, చాలా ముఖ్యమైన సత్యాలపై సందేహాన్ని కలిగిస్తుంది, ముఖ్యంగా ప్రలోభాల సమయంలో. ఏది ఏమైనప్పటికీ, ఈ సందర్భంలో యోహాను యొక్క నమ్మకం వమ్ము కాలేదని మాకు నమ్మకం ఉంది; బదులుగా, అతను దానిని బలపరిచి, ధృవీకరించాలని కోరుకున్నాడు.
మరికొందరు యోహాను తన శిష్యులకు భరోసా ఇవ్వడానికి క్రీస్తు వద్దకు పంపించాడని ఊహిస్తారు. క్రీస్తు వారు సాక్ష్యమిచ్చిన మరియు విన్న వాటిపై వారి దృష్టిని మళ్లించాడు. తక్కువ అదృష్టవంతుల పట్ల క్రీస్తు కనికరం మరియు దయ మన దేవుని దయను ప్రపంచానికి తీసుకురావడానికి ఉద్దేశించబడిన వ్యక్తి అని నిరూపిస్తుంది. ప్రజలు విషయాలను గమనించి, విన్నప్పుడు మరియు వాటిని లేఖనాలతో పోల్చినప్పుడు, అది వారిని మోక్ష మార్గంలో నడిపిస్తుంది. పక్షపాతాలను అధిగమించడం సవాలుగా ఉంటుంది మరియు అలా చేయడంలో విఫలమవడం ప్రమాదకరం. అయినప్పటికీ, క్రీస్తుపై విశ్వాసం ఉన్నవారు తమ విశ్వాసం మరింత ప్రశంసలు, గౌరవం మరియు కీర్తిని తెస్తుందని తెలుసుకుంటారు.

యోహాను బాప్టిస్ట్‌కు క్రీస్తు సాక్ష్యం. (7-15) 
యోహాను గురించి క్రీస్తు చేసిన వ్యాఖ్యలు ఆయనను మెచ్చుకోవడానికే కాకుండా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేవిగా ఉన్నాయి. వాక్య బోధలను శ్రద్ధగా వినే వారు తమ ఎదుగుదల మరియు పురోగమనాల గురించి తెలియజేయడానికి పిలవబడతారు. ఉపన్యాసం ముగిసిన తర్వాత, మన బాధ్యత ముగిసిపోతుందని మనం నమ్ముతున్నామా? దీనికి విరుద్ధంగా, మన గొప్ప బాధ్యతలు ప్రారంభమవుతాయి. యోహాను స్వీయ-తిరస్కరణకు ఉదాహరణగా నిలిచాడు, ప్రాపంచిక వైభవం మరియు ఇంద్రియ సుఖాల ఆకర్షణ ద్వారా ప్రభావితం కాలేదు. వ్యక్తులు తమ బాహ్య రూపాలు మరియు వారి పాత్ర మరియు పరిస్థితుల మధ్య స్థిరత్వాన్ని కొనసాగించడం అత్యవసరం.
యోహాను నిస్సందేహంగా గొప్ప మరియు సద్గురువు, అయినప్పటికీ అతను మహిమాన్వితమైన సాధువుల కంటే తక్కువగా ఉన్నందున అసంపూర్ణతలు లేకుండా ఉండలేదు. స్వర్గంలో నివసించే అతి వినయస్థుడు కూడా దేవుని స్తుతించడంలో గొప్ప జ్ఞానం, ప్రేమ మరియు భక్తిని కలిగి ఉంటాడు మరియు ఈ ప్రపంచంలో అత్యంత ప్రముఖ వ్యక్తి కంటే ఎక్కువ దైవిక ఆశీర్వాదాలను పొందుతాడు. ఈ సందర్భంలో "పరలోక రాజ్యాన్ని" ప్రస్తావిస్తున్నప్పుడు, అది దయ యొక్క రాజ్యాన్ని, దాని పూర్తి శక్తి మరియు స్వచ్ఛతలో సువార్త పంపిణీని ఎక్కువగా సూచిస్తుంది. మనము పరలోక రాజ్య దినాలలో వెలుగు మరియు ప్రేమ యొక్క ప్రయోజనాలను అనుభవిస్తూ జీవిస్తున్నామని కృతజ్ఞతలు తెలియజేయడానికి మనకు తగినంత కారణం ఉంది.
అనేకమంది ప్రజలు యోహాను పరిచర్యచే ప్రభావితులయ్యారు మరియు అతని అనుచరులయ్యారు. కొంతమంది ఈ రాజ్యంలో స్థానం సంపాదించడానికి కూడా పోరాడారు, అకారణంగా అక్రమ చొరబాటుదారులు. ఇది లోపల ఒక స్థలాన్ని కోరుకునే వారందరి యొక్క ఉత్సాహం మరియు ఉత్సాహాన్ని వివరిస్తుంది. స్వయాన్ని త్యజించాలి మరియు మొగ్గు, స్వభావం మరియు మనస్తత్వం మార్చబడాలి. మహా మోక్షంలో భాగస్వామ్యాన్ని కోరుకునే వారు ఏ నిబంధనలపైనైనా అంగీకరిస్తారు, వాటిని చాలా భారంగా భావించరు మరియు వారు ఆశీర్వాదం పొందే వరకు వదిలిపెట్టరు.
దేవుని విషయాలు మానవాళి అందరికీ ఎంతో ఆందోళన కలిగిస్తాయి. దేవుడు మనకు ప్రసాదించిన సామర్థ్యాలను సక్రమంగా వినియోగించుకోవడం తప్ప మరేమీ ఆశించడు. ప్రజలు జ్ఞానాన్ని కోరుకోకూడదని నిర్ణయించుకున్నందున వారు అజ్ఞానంలో ఉంటారు.

యూదుల వక్రబుద్ధి. (16-24) 
క్రీస్తు శాస్త్రులు మరియు పరిసయ్యుల గురించి ఆలోచిస్తాడు, వారు తమను తాము గర్వించేవారు. అతను వారి ప్రవర్తనను ఆటలో ఉన్న పిల్లలతో పోల్చాడు, వారు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా, ఇతరులను సంతోషపెట్టడానికి చేసే ప్రయత్నాలతో గొడవ పడ్డారు లేదా వారు ఒకప్పుడు కలిసి ఆనందించే కార్యకలాపాలలో పాల్గొంటారు. లౌకిక వ్యక్తులు లేవనెత్తే అభ్యంతరాలు తరచుగా అల్పమైనవి, లోతైన ద్వేషాన్ని వెల్లడిస్తాయి. వారు ప్రతి ఒక్కరిలో తప్పులు కనుగొంటారు, సద్గురువులు మరియు పవిత్రులు కూడా. ఈ ప్రకరణంలో, పవిత్రుడు మరియు పాపుల నుండి వేరు చేయబడిన క్రీస్తు, వారితో సంబంధం కలిగి ఉన్నట్లు మరియు వారి ప్రభావంతో కళంకం కలిగి ఉన్నట్లు చిత్రీకరించబడింది. అత్యంత సహజమైన అమాయకత్వం కూడా ఎప్పుడూ విమర్శల నుండి ఒకరిని రక్షించకపోవచ్చు. టైర్ మరియు సిడోన్‌లలో ఉన్న ప్రజల హృదయాల కంటే యూదుల హృదయాలు అతని అద్భుతాలు మరియు బోధనలకు మరింత కోపంగా మరియు నిరోధకతను కలిగి ఉన్నాయని క్రీస్తు అర్థం చేసుకున్నాడు. తత్ఫలితంగా, వారి ఖండించడం మరింత తీవ్రంగా ఉంటుంది. ప్రభువు, తన సర్వశక్తిమంతమైన శక్తిని ప్రయోగిస్తూ, వ్యక్తులను వారి అర్హతకు అనుగుణంగా శిక్షిస్తాడు, సత్యాన్ని ఆసక్తిగా కోరుకునే వారికి ఎన్నడూ దాచడు.

సువార్త సామాన్యులకు వెల్లడి చేయబడింది. భారంగా ఆహ్వానించారు. (25-30)
పిల్లలు కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోవాలి. మనము మన తండ్రిగా దేవుణ్ణి సంప్రదించినప్పుడు, స్వర్గం మరియు భూమిపై ఆయన సార్వభౌమాధికారాన్ని మనం అంగీకరించాలి, ఇది ఆయన సర్వోన్నత అధికారం పట్ల గౌరవం మరియు హాని నుండి మనలను రక్షించే మరియు మనకు మంచిని అందించగల సామర్థ్యంపై విశ్వాసంతో ఆయన ముందుకు రావడానికి మనల్ని బలవంతం చేస్తుంది. . మన ఆశీర్వాద ప్రభువు కూడా ఒక ముఖ్యమైన ప్రకటన చేసాడు, తండ్రి తనకు అన్ని శక్తి, అధికారం మరియు తీర్పును అప్పగించాడని పేర్కొన్నాడు. ఆడమ్ పతనం నుండి తండ్రి చిత్తం మరియు ప్రేమ గురించి మనకు లభించిన అన్ని వెల్లడి కోసం మేము క్రీస్తుకు రుణపడి ఉంటాము.
మన రక్షకుడు తన వద్దకు రావాలని శ్రమించే మరియు భారాన్ని మోస్తున్న వారందరికీ బహిరంగ ఆహ్వానం పంపాడు. ఏదో ఒక రకంగా ప్రజలందరికీ భారం. ప్రాపంచిక వ్యక్తులు సంపద మరియు ప్రతిష్ట గురించి పనికిరాని ఆందోళనలతో తమను తాము తగ్గించుకుంటారు. ఆనందాన్వేషకులు ప్రాపంచిక సుఖాల కోసం తమను తాము అలసిపోతారు. సాతాను మరియు వారి స్వంత పాపపు కోరికలచే బానిసలుగా ఉన్నవారు భూమిపై అత్యంత శ్రమతో కూడిన జీవులు. తమ స్వంత ధర్మాన్ని స్థాపించడానికి ప్రయత్నించే వారు కూడా వ్యర్థంగా శ్రమిస్తారు. దోషిగా నిర్ధారించబడిన పాపి అపరాధం మరియు భయంతో భారం పడతాడు మరియు శోదించబడిన మరియు బాధింపబడిన విశ్వాసి వారి స్వంత భారాలను మోస్తారు.
తమ ఆత్మల కొరకు విశ్రాంతి కొరకు తనను చేరుకోమని క్రీస్తు అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానం ఆయన నుండి మాత్రమే వస్తుంది. ప్రజలు తమ అపరాధం మరియు కష్టాలను గుర్తించినప్పుడు ఆయన వద్దకు వస్తారు, మరియు సహాయం అందించే అతని ప్రేమ మరియు శక్తిని వారు విశ్వసించినప్పుడు, వారు ప్రార్థనలో ఆయనను హృదయపూర్వకంగా కోరుకుంటారు. కాబట్టి అలసిపోయిన మరియు భారమైన పాపులు యేసుక్రీస్తు వద్దకు రావడం విధి మరియు ఉత్తమ ప్రయోజనాల కోసం. ఇది సువార్త కాల్ యొక్క సారాంశం: "ఎవరైతే, అతను రావాలి." ఈ పిలుపుకు ప్రతిస్పందించే వారందరూ క్రీస్తు నుండి బహుమతిగా విశ్రాంతి పొందుతారు మరియు వారి హృదయాలలో శాంతి మరియు సౌకర్యాన్ని పొందుతారు. అయితే, ఆయన వద్దకు వచ్చినప్పుడు, వారు అతని కాడిని అంగీకరించాలి మరియు ఆయన అధికారానికి లోబడి ఉండాలి. వారు తమ శ్రేయస్సు మరియు విధేయతకు సంబంధించిన అన్ని విషయాలలో ఆయన నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వారి సేవ యొక్క అసంపూర్ణతతో సంబంధం లేకుండా, సిద్ధంగా ఉన్న సేవకుని క్రీస్తు స్వాగతిస్తాడు.
ఆయనలో, మన ఆత్మలకు విశ్రాంతిని కనుగొనవచ్చు మరియు ఇది ఆయనలో మాత్రమే కనుగొనబడుతుంది. ఆయన ఆజ్ఞలు పవిత్రమైనవి, న్యాయమైనవి మరియు మంచివి కాబట్టి మనం ఆయన కాడికి భయపడాల్సిన అవసరం లేదు. వారికి స్వీయ-తిరస్కరణ అవసరం మరియు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఈ ప్రపంచంలో కూడా అంతర్గత శాంతి మరియు ఆనందంతో బహుమతులు పుష్కలంగా ఉంటాయి. అతని కాడి ప్రేమతో కప్పబడి ఉంది. అతను అందించే మద్దతు, మన అవసరాలకు తగిన ప్రోత్సాహం మరియు విధి మార్గంలో లభించే సౌలభ్యం దానిని నిజంగా ఆహ్లాదకరమైన యోక్‌గా మారుస్తాయి. విధి మార్గం విశ్రాంతికి మార్గం. క్రీస్తు బోధించిన సత్యాలు మనం సురక్షితంగా ఆధారపడగల సత్యాలు. ఇది మన విమోచకుని దయ. శ్రమించి, భారంగా ఉన్న పాపాత్ముడు ఇతర మూలాల నుండి ఎందుకు విశ్రాంతి పొందాలి? కోపం మరియు అపరాధం నుండి, పాపం మరియు సాతాను నుండి, మన చింతలు, భయాలు మరియు దుఃఖాల నుండి విముక్తి కోసం ప్రతిరోజూ ఆయన వద్దకు రండి.
అయితే, బలవంతంగా విధేయత చూపడం, తేలికగా మరియు తేలికగా ఉండకుండా, భారీ భారం. హృదయం దూరంగా ఉండగా యేసుకు పెదవి సేవ చేయడం వ్యర్థం. బదులుగా, మీ ఆత్మకు నిజమైన విశ్రాంతిని కనుగొనడానికి హృదయపూర్వకంగా యేసు వద్దకు రండి.



Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |