11. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; అయినను వారు, యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా, యే కీడును మనకు రానేరదని యనుకొందురు.
అధికారులు, యాజులు, ప్రవక్తలు కేవలం ధనాన్నే ఆశించారు. ప్రజలంటే, మంచితనం, న్యాయం అంటే వారికి లెక్కలేదు. అంటే నేడు మనం చూస్తున్న భ్రష్ట పరిస్థితులలాగే అప్పుడూ ఉండేదన్నమాట.