Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీ యులమీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసినీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.
1 దినవృత్తాంతములు 21:1-27. “కోపం”– సంఖ్యాకాండము 25:3; కీర్తనల గ్రంథము 90:7-11 నోట్స్. దేవుని కోపం రావడానికి గల కారణం ఖచ్చితంగా ఏమిటో ఇక్కడ రాసి లేదు. అయితే సరైన కారణమేమిటో ఉందన్న విషయంలో మనకు ఏ సందేహమూ అక్కరలేదు. కారణం లేకుండా దేవునికి కోపం రాదు. “పురిగొలిపాడు”– 1 దినవృత్తాంతములు 21:1 లో ఇస్రాయేల్ జనసంఖ్య చూడాలని సైతాను దావీదును రేపాడు అని రాసి ఉంది. దీనికి మూల కారణం దేవుని సంకల్పమైతే, దావీదు మనస్సులో సైతాను చేసినది సమీప కారణం. సైతాను పురిగొల్పడం వెనుక తీర్పుకు సంబంధించిన దేవుని ఉద్దేశం ఉంది. ఎవరినైనా దేవుడు పరీక్షకు గానీ శిక్షకు గానీ గురి చెయ్యదలచినప్పుడు, తనకిష్టం వచ్చినట్టు ఏ సాధనాన్నైనా ఆయన వాడుకుంటాడు. 1 రాజులు 22:19-23; యోబు 1:6-12; యోబు 2:6; యెషయా 10:5-6; యిర్మియా 51:20-23; హబక్కూకు 1:6; అపో. కార్యములు 2:23; అపో. కార్యములు 4:28; ప్రకటన గ్రంథం 17:17 చూడండి. దేవుడు సకల విశ్వానికీ సర్వాధిపతి. అన్ని జనాలనూ ఆయన నీతిన్యాయాలతో పరిపాలిస్తాడు (కీర్తనల గ్రంథము 22:28; కీర్తనల గ్రంథము 47:2; కీర్తనల గ్రంథము 93:1; కీర్తనల గ్రంథము 97:1). దుష్టత్వం చేసేలా దేవుడెవరినీ ప్రేరేపించడు (యాకోబు 1:13-14). జనాభా లెక్కలు సేకరించడం దోషం కాదు (సంఖ్యాకాండము 1:1-3 లో జనసంఖ్యను లెక్కించుమని దేవుడే ఆజ్ఞాపించాడు). అయితే దేవుడు తన జ్ఞానయుక్తమైన సంకల్పం ప్రకారం మనుషులకు దుష్ప్రేరేపణ కలిగించేందుకు సైతానుకు అనుమతి ఇస్తాడు. దుష్ట తలంపుతో జనసంఖ్యను చూడడం దోషం. తరువాతి వచనాలను బట్టి జనసంఖ్య చూడడంలో దావీదు ఉద్దేశం మంచిది కాదని అర్థం అవుతున్నది.
2. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతియైన యోవాబును పిలిచిజనసంఖ్య యెంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబావరకు ఇశ్రాయేలు గోత్ర ములలో నీవు సంచారముచేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా
“తెలుసుకోవాలి”– తనకు ఉన్న యుద్ధ సైనికుల సంఖ్యను బట్టి గర్వించాలని దావీదు అభిప్రాయం అయినట్టు సూచిస్తున్నది. లేక తన విజయాల కోసం దేవునిపై గాక సైనిక బలంపై అతడు ఆధారపడడం ఆరంభించి ఉండవచ్చు. ఇస్రాయేల్వారి శక్తి, భద్రత ఆయుధాలు, సైనికుల పై గాక దేవునిలోనే ఉన్నదన్న సత్యాన్ని అతడు తాత్కాలికంగా మరచినట్టుంది. ఇంతకుముందు ఒకటికంటే ఎక్కువ సార్లు అతడే భావించినదానికే ఇది వ్యతిరేకంగా ఉంది – 2 సమూయేలు 22:2-4 2 సమూయేలు 22:47-51; 1 సమూయేలు 17:26 1 సమూయేలు 17:37 1 సమూయేలు 17:45-47; కీర్తనల గ్రంథము 33:16-20. “దానునుంచి బేర్షెబా వరకు”– దేశం ఒక సరిహద్దునుంచి మరో సరిహద్దు వరకు అని తెలియజేసే మాటలు. “కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు” అన్నట్టుగా అన్నమాట.
3. యోవాబుజనుల సంఖ్య యెంత యున్నను నా యేలినవాడవును రాజవునగు నీవు బ్రదికి యుండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక; నా యేలిన వాడవును రాజవునగు నీకు ఈ కోరిక ఏలపుట్టెననెను.
యోవాబు ఆధ్యాత్మికమైన వ్యక్తి కానప్పటికీ దావీదు ఉద్దేశించినది బుద్ధితక్కువ పని అని గుర్తించాడు.
4. అయినను రాజు యోవా బునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుటచేత యోవాబును సైన్యాధిపతులును ఇశ్రాయేలీయుల సంఖ్య చూచుటకై రాజుసముఖమునుండి బయలు వెళ్లి
జనసంఖ్యను కోరడానికి దావీదు ఏ కారణమూ చెప్పలేదు. తన ఉద్దేశాలు మంచివి కావని అసలు తాను గుర్తించాడా? ఏది ఏమైనా అతడు యోవాబు హెచ్చరికను తిరస్కరించాడు. తన పంతమే నెగ్గాలని పట్టుబట్టాడు. దేవుని సేవకులు తమ చర్యల గురించి వచ్చే విమర్శలను వినయంగా జాగ్రత్తగా పరిశీలించడం నేర్చుకోవాలి. అందువల్ల చాలా ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు.
5. యొర్దాను నది దాటి యాజేరుతట్టున గాదు లోయ మధ్య నుండు పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి
6. అక్కడనుండి గిలాదునకును తహ్తింహోద్షీ దేశమునకును వచ్చిరి; తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి.
7. అక్కడనుండి బురుజులుగల తూరు పట్టణ మునకును హివ్వీయులయొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికిని వచ్చి యూదాదేశపు దక్షిణదిక్కుననున్న బెయేర్షెబావరకు సంచరించిరి.
8. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి తొమ్మిదినెలల ఇరువది దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి.
9. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్ప గించెను; ఇశ్రాయేలువారిలో కత్తి దూయగల యెనిమిది లక్షలమంది యోధులుండిరి; యూదా వారిలో అయిదు లక్షలమంది యుండిరి.
10. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టు కొనగా అతడునేను చేసిన పనివలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసితిని; యెహోవా, కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా
“పాపం”– జనసంఖ్యను కోరడంలో తన ఉద్దేశాలు పాపంతో కూడినవని ఇప్పుడు గ్రహిస్తున్నాడు. పశ్చాత్తాప పడ్డాడు. అతనికి క్షమాపణ దొరికింది అనడంలో సందేహం లేదు. అయితే అతని పాపంవల్ల కలిగిన ఫలితాలు విచారకరంగా ఉన్నాయి.
11. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
“దీర్ఘదర్శి”– 1 సమూయేలు 9:9 నోట్. “గాదు”– 1 సమూయేలు 9:9; 1 సమూయేలు 22:5.
12. నీవు పోయి దావీదుతో ఇట్లనుముయెహోవా సెలవిచ్చునదేమనగా మూడు విషయములను నీ యెదుట పెట్టుచున్నాను; వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన యెడల నేనది నీమీదికి రప్పించెదను.
2 సమూయేలు 12:9-14 పోల్చిచూడండి. పాపాన్ని ఒప్పుకుని క్షమాపణ పొందడంవల్ల దేవుని నుంచి కలిగే శిక్ష ఆగిపోతుందని కాదు. కరవు, శత్రువుల చేతిలో ఓటమి, ఘోర వ్యాధి – ఇవి అవిధేయులైన ప్రజల్ని శిక్షించేందుకు దేవుడు ఉపయోగిస్తానన్న సాధనాలలో మూడు (ద్వితీయోపదేశకాండము 28:15-25; యిర్మియా 14:12; యెహెఙ్కేలు 14:21). తననూ ప్రజలనూ కరవు, శత్రువుల మూలంగా కాక దేవుడు తానే నేరుగా శిక్షించడం దావీదు కోరుకున్నాడు.
13. కావున గాదు దావీదునొద్దకు వచ్చి యిట్లని సంగతి తెలియజెప్పెనునీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల యెదుట నిలువలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచనచేసి నన్ను పంపినవానికి నేనియ్యవలసిన యుత్తము నిశ్చయించి తెలియజెప్పుమనెను.
14. అందుకు దావీదు నా కేమియు తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యతగలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండ యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను.
“కరుణాసంపద”– నిర్గమకాండము 34:6; కీర్తనల గ్రంథము 103:8-13. కీర్తనల గ్రంథము 24:15
15. అందుకు యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజకూటపు వేళ వరకు అది జరుగుచుండెను; అందుచేత దానునుండి బెయే ర్షెబావరకు డెబ్బది వేలమంది మృతి నొందిరి.
“డెబ్భైయివేల మంది”– జాతి మొత్తం మీదా దేవుని కోపాగ్ని రగులుకున్న విషయం గుర్తుంచుకోండి (వ 1).
16. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు, యెహోవా ఆ కీడునుగూర్చి సంతాపమొంది అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనముచేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను.యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లము దగ్గర ఉండగా
“దేవదూత”– నిర్గమకాండము 12:23; నిర్గమకాండము 33:2; 2 రాజులు 19:35; కీర్తనల గ్రంథము 35:5-6; కీర్తనల గ్రంథము 78:49. “పరితపించాడు”– తననూ ప్రజలనూ దేవుని చేతుల్లోనే పెట్టాలన్న దావీదు నిర్ణయం సరైనదే. ఇందుమూలంగా దేవుని జాలి మరో సారి బయలు దేరింది.
17. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెనుచిత్తగించుము; పాపము చేసినవాడను నేనే; దుర్మార్గ ముగా ప్రవర్తించినవాడను నేనే; గొఱ్ఱెలవంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి యింటివారిని శిక్షించుము.
“గొర్రెల లాంటివాళ్ళు”– జాతి నంతటిపైనా దేవుని కోపం వచ్చిన విషయం దావీదుకు తెలియకపోవచ్చు. ఏది ఏమైనా ప్రజల పైనుంచి గనుక ఆ శిక్ష తొలగిపోతే ఆ విపత్తు అంతటికీ బాధ్యత తనపైనే వేసుకోవడానికి సిద్ధమయ్యాడు. పాపం చేసినప్పటికీ అతడు నిజమైన కాపరి (కీర్తనల గ్రంథము 78:71-72).
18. ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చినీవు పోయి యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా
“గాదు”– యెహోవా దూత అతణ్ణి పంపాడు. 1 దినవృత్తాంతములు 21:18 చూడండి. “యోబూసివాడు”– 2 సమూయేలు 5:6. “బలిపీఠం”– దేవుడు నియమించిన అర్పణలు అర్పించేందుకు అన్నమాట.
19. దావీదు గాదుచేత యెహోవా యిచ్చిన ఆజ్ఞచొప్పున పోయెను.
20. అరౌనా రాజును అతని సేవకులును తన దాపునకు వచ్చుటచూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారముచేసినా యేలినవాడవును రాజవునగు నీవు నీ దాసుడనైన నాయొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా
21. దావీదు ఈ తెగులు మనుష్యులకు తగలకుండ నిలిచిపోవు నట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీయొద్ద ఈ కళ్లమును కొనవలెనని వచ్చితిననెను,
“నిలిపివేయడానికి”– సంఖ్యాకాండము 16:44-50 పోల్చిచూడండి. ధర్మశాస్త్రం కింద అర్పణలకున్న అర్థం గురించి లేవీయకాండము 1:2 చూడండి.
22. అందుకు అరౌనానా యేలినవాడవగు నీవు చూచి యేది నీకు అనుకూలమో దాని తీసికొని బలి అర్పించుము; చిత్త గించుము, దహనబలికి ఎడ్లున్నవి, నూర్చుకఱ్ఱ సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును.
23. రాజా, యివన్నియు అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పినీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా
24. రాజునేను ఆలాగు తీసికొనను, వెలయిచ్చి నీయొద్ద కొందును, వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్లమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను.
అయ్యో! ఎంతమంది దేవుని ప్రజలు తమకున్న హీనమైనవాటిని, తాము తక్కువ ఖర్చుపెట్టినవాటిని దేవునికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు (మలాకీ 1:13-14)! ఆయన పట్ల తమ ప్రేమ ఎంత అల్పమైనదో అలా కనపరుస్తున్నారు. ఇవ్వడం గురించి 2 కోరింథీయులకు 9:15 దగ్గర నోట్, రిఫరెన్సులు చూడండి. దావీదు 50 తులాల వెండి ఇచ్చి కళ్ళాన్నీ ఎద్దులనూ కొన్నాడు. ఆ కళ్ళం చుట్టూ ఉన్న విశాల స్థలాన్ని ఆరు వందల తులాల బంగారం ఇచ్చి కొన్నాడు (1 దినవృత్తాంతములు 21:25; 1 దినవృత్తాంతములు 22:1).
25. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను; యెహోవా దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచి పోయెను.
ఈ అర్పణలు దేవునికి ప్రతిష్ఠ చెయడానికీ, ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసి తిరిగి ఆయన అనుగ్రహం పొందడానికీ సూచనలుగా ఉన్నాయి. లేవీ 1,3 అధ్యాయాల నోట్స్. ఈ అధ్యాయంలోని సంభవాల తరువాత ప్రజలు చేయతగిన ప్రార్థన మోషే ప్రార్థన (కీర్తనల గ్రంథము 90:1-17). అది ఈ అధ్యాయానికి సరైన వ్యాఖ్యానం.