హెబ్రీయులకు వ్రాసిన పత్రిక


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

పాలస్తీనాలోని అధికమైన యూదులు క్రైస్తవ విశ్వాసమునకు వచ్చిన పిదప క్రైస్తవులకు ఆ రోజులలో అధికముగా వచ్చిన ఉపద్రవము నుండి తప్పించుకొను నిమిత్తము యూదమతమునకు తిరిగి వెళ్ళుటకైన అభిప్రాయమును విలువరచిరి. ఈ విధముగా దిగజారిపోక ముందుకు సాగుటకును, పూర్ణజ్నామును పొందుటకయును ఈ గ్రంథ రచయిత వారికి బోధించెను. యూద మతముకన్నను క్రీస్తు ఎంతో నిజమైన వాడను సత్యమే అతడు చెప్పునట్టి బోధ యొక్క అంతర్భావము. క్రీస్తు ఆరాధనకు పాత్రుడైనందున దూతలకన్నను ప్రభావము గలవాడు. సమస్తమును సృజించినవాడగుటచే మోషే కన్నను శ్రేష్టుడు. అహరోను యొక్క యాజకత్వము కన్నను క్రీస్తు యొక్క యాజకత్వము శ్రేష్ఠమైనది. ఎందుకనగా క్రీస్తు నిత్యమైన ఒకే బలిని చెల్లించెను. ఆయన మిక్కిలి మహిమకరమైన ఒక నిబంధనకు మధ్యవర్తియైనందున ధర్మశాస్త్రము కన్నను శ్రేష్టమైనవాడు. క్లుప్తముగా చెప్పవలయునంటే యూదమతములో వారికేర్పడిన నష్టము కంటెను అనేకరెట్లు క్రీస్తు మూలముగా ఈ విశ్వాసుల ద్వారా పొందగలము. క్రీస్తులో ముందుకు సాగునపుడు శోధింపబడిన ఒక విశ్వాసమును, ఆత్మీయబోధనలు సత్క్రియలకైన పట్టుదల వారికి ప్రతిఫలములగుచున్నవి. ఇదే హెబ్రీ పత్రిక యొక్క వాదము.

ఉద్దేశము: - ప్రభువు యొక్క పరిపూర్ణత్వమును, ఔన్నత్యమును బయలుపరచుట.

రచయిత:- పౌలు

ఎవరికి వ్రాసెను?: - పాలస్తీనాలోని హెబ్రీ (యూద) క్రైస్తవులకు.

వ్రాసిన కాలము:- సామాన్యముగా యేరుశలేము దేవాలయము ధ్వంసము చేసిన క్రీ. పూ. 70కు ముందుగా నుండవచ్చును. ఎందుకనగా దేవాలయ పరిచర్యలను, బలులను మత ఆచారములను గూర్చి ఇందు చెప్పబడుచున్నది. దేవాలయము నాశనము చేయబడిన దానిని గూర్చిన సందర్భములిందు లేవు. సుమారు క్రీ.పూ. 67 లో ఇది వ్రాయబడినట్లుగా భావింపబడుచున్నది.

అంతర్యము: - యూదుల చేతను, రోమా సామ్రాజ్యము చేతను ఈ యూద క్రైస్తవులు సముదాయ స్థితిలోను, శరీర స్థితిలోను, ఎక్కువ శ్రమననుభవించుచుండిరి. ప్రభువు యొక్క రెండవ రాకడను క్రైస్తవులుపేక్షతో ఎదురు చూచుచుండిరి. వారి రాజ్యము స్థాపించుకాలము ఇంకను రాలేదు. క్రైస్తవ విశ్వాసము నిజమైనదనియు, క్రీస్తే మెస్సీయ యనియు క్రైస్తవులకు మరల దృఢత్వము కలుగవలసినదిగా నుండెను.

ముఖ్య వ్యక్తులు: - పాత నిబంధన యొక్క విశ్వాసవీరులు.

ముఖ్యమైన పలుకులు:- క్రీస్తు యొక్క ఔన్నత్యము

ముఖ్య వచనములు:- హెబ్రీయులకు 1:3.

ముఖ్య వచనములు: హెబ్రీయులకు 4:14-16; హెబ్రీయులకు 12:1-2.

గ్రంథ శ్రేష్టత:- ఇది ఒక పత్రికగా పిలువబడినప్పటికిని (హెబ్రీయులకు 13:22) శ్రద్ధగా వడియ కట్టబడిన ఒక ప్రసంగము యొక్క రీతిలో అమరియున్నది.

ముఖ్య అధ్యాయము: - అధ్యాయము 11. గ్రంథవచనముల యొక్క ముఖ్యత్వమును శాశ్వతముగా స్థిరపరచబడిన అధ్యాయములలో ఇది ఒకటి. దేవుని వాగ్దానము కాక మరేమియు లేకుండ ఉండినపుడు దేవునిని ఆయన వచనము యొక్క శక్తి ద్వారా మాత్రమేనని అనుకొను వారి యొక్క జాబితా ఇదియైయున్నది. “విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా” ఇవియే ఈ విశబ్వూసవీరుని జీవితమార్గగా బయలుపరుచబడినట్టి సత్యములు.

గ్రంథ విభజన:- క్రైస్తవ యూద మతము కన్నను ఔన్నత్యముగల వాడు అని నిరూపించుటయే ఈ పత్రికను ఏర్పరచిన ఉద్దేశము. ఈ గురిని చేరుటకు గ్రంథకర్త వ్రాసిన కార్యములను మూడు భాగములుగా విభజింపవచ్చును.

  1. క్రీస్తు యొక్క పరిపాలనలోనున్న గొప్పతనము. Heb,1,1-4,13.
  2. క్రీస్తు చేసిన క్రియలలోని గొప్పతనము Heb,4,14-10,18.
  3. క్రీస్తు నందున విశ్వాసము, జీవితము మొదలగు వాటి గొప్పతనము. Heb,10,19-13,25.

కొన్ని గుర్తింపు వివరములు:- గ్రంథములోని 58వ పుస్తకము. అధ్యాయములు 13, వచనములు 303, ప్రశ్నలు 17, చారిత్రక వచనములు 270, నెరవేరిన ప్రవచనములు 9, నెరవేరని ప్రవచనములు 24.